బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించారు. సినిమా సెన్సేషనల్ విజయం సాధించింది. బాలకృష్ణకి మళ్లీ మరొక ఇన్నింగ్స్ మొదలయ్యింది ఈ సినిమాతోనే.
ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. సినిమాలో బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ చాలానే ఉంటాయి. అలాగే బాలయ్య మార్క్ డైలాగ్స్, డాన్స్ కూడా ఉంది. ఈ సినిమాకి చాలా విషయాలు ప్లస్ అయ్యాయి. దాంతో సినిమా అంత పెద్ద విజయం సాధించింది.

అయితే సినిమాకి ఒక హీరో బాలకృష్ణ అయితే, మరొక హీరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని అప్పట్లో చాలా మంది అన్నారు. ఈ సినిమాకి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల థియేటర్లలో సౌండ్ సిస్టం పగిలిపోతుంది అని ఒక థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు చేశారు అంటే అది ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసు. ఈ సినిమా వచ్చిన తర్వాత తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అని ఒక టైటిల్ కూడా వచ్చేసింది.

అయితే ఈ విషయంలో ఇటీవల బోయపాటి శ్రీను మాట్లాడుతూ మరొక విధంగా చెప్పారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ విషయంపై బోయపాటి శ్రీను మాట్లాడుతూ, “అఖండ సినిమాకి తమన్ ఏం ప్రాణం పోయలేదు. సౌండ్ లేకుండా చూసినా కూడా ఈ సినిమా అలాగే ఉంటుంది. దానికి అంత దమ్ము ఉంది. చాలా గర్వంగానే ఫీల్ అవుతాను” అని అన్నారు. ఈ విషయం మీద సోషల్ మీడియా అంతటా కామెంట్స్ వస్తున్నాయి.

“అసలు అఖండ సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ విషయాన్ని మర్చిపోయి అలా ఎలా మాట్లాడుతున్నారు?” అని అంటున్నారు. ఇటీవల వచ్చిన స్కంద సినిమాకి కూడా తమన్ ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. కానీ అలాంటి టైప్ మ్యూజిక్ విని విని మనకి అలవాటు అయిపోవడంతో సినిమా, అందులోని మ్యూజిక్ అంత పెద్దగా ఎక్కలేదు. కానీ అఖండ సినిమాకి మాత్రం తమన్ కి సగం క్రెడిట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు బోయపాటి శ్రీను మాత్రం ఇలా మాట్లాడడంతో ఇలా అంటున్నారు ఏంటి అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
watch video :
ALSO READ : “శ్రీరామ చంద్ర” నటించిన పాపం పసివాడు చూశారా..? ఎలా ఉందంటే..?

















టాలీవుడ్ లో ఇప్పటివరకు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. యువతను ఫిదా చేశాయి. అలాంటి సినిమానే మ్యాడ్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంది. కాలేజీలో గ్యాంగ్స్, సీనియర్లు, జూనియర్లు, ర్యాగింగ్, గొడవలు. ప్రేమలు వంటివాటిని ట్రైలర్ చూపించారు.
నేడు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో నటించిన ముగ్గురి హీరోలలో డీడీగా నటించిన యాక్టర్ తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడని టాక్. మూవీ చూసిన ఆడియెన్స్ సైతం అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రివ్యూయర్స్ సైతం ఆ కుర్రాడి స్టైల్, కామిడి టైమింగ్, డైలాగ్ డెలివరీ ని మెచ్చుకుంటున్నారు.
ఆ నటుడి పేరు సంగీత్ శోభన్. అతను ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించి అలరించాడు. మ్యాడ్ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో తెలుగు ఇండస్ట్రీకి మంచి కామెడీ హీరో లభించాడు అనుకునేలా నటించాడు. సంగీత్ శోభన్ మరేవరో కాదు యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు మరియు దివంగత డైరెక్టర్ శోభన్ రెండవ కుమారుడు. అన్నయ్య సంతోష్ హీరోగా సీరిస్, సినిమాలలో నటిస్తుంటే, తమ్ముడు సంగీత్ కామెడీ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తున్నాడు.
కలర్స్ స్వాతి యాంకర్, హీరోయిన్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో స్వాతి వికాస్ అనే వ్యక్తిని ఆగస్టు పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత మంత్ ఆఫ్ మధు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, వైజాగ్ లో నివసించే మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) తన గవర్నమెంట్ జాబ్ ను పోగొట్టుకుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేఖ (స్వాతి రెడ్డి) విడాకుల కోసం కోర్టుకు వెళ్తుంది. అయితే మధుసూధన్ తన భార్య ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో వెయిట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిస అవుతాడు. ఇది ఇలా ఉంటే, యూఎస్ లో సెటిల్ అయిన మధుమతి(శ్రియ నవిలే) అనే అమ్మాయి బంధువుల ఇంట్లో వివాహానికి వైజాగ్ వస్తుంది.
అయితే ఒక సందర్భంలో మధుమతికి మధుసూధన్ తో పరిచయం అవుతుంది. ఒకసారి మాటల సందర్భంలో మధుసూధన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆమెకు తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? లేఖ ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంది? ఆఖరికి లేఖ మధుసూదన్ కలిశారా? అనేది మిగిలిన కథ. మంత్ ఆఫ్ మధు సినిమా అనేది అమెరికా నుంచి వైజాగ్ కి వచ్చిన మధుమతి నెల రోజుల్లో ఎదుర్కొన్న అనుభవాలే ఈ మూవీ.
“అఖండ” బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన మరో మాస్ ఎంటర్ టైనర్ స్కంద. బోయపాటి శ్రీను మూవీ అంటే తప్పకుండా మాస్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. ఊహకు అందని రీతిలో బోయపాటి తన చిత్రాలలో ఫిక్షన్ను జోడిస్తారు. కానీ, స్కంద మూవీలో అది అతి అయ్యిందని ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.
రొటీన్ స్టోరీని కూడా విపరీతమైన వయొలెన్స్తో చూపించారని, మూవీలో పెద్దగా ఏమీ లేదని నెటిజెన్లతో పాటు విమర్శకులు కూడా అంటున్నారని టాక్. స్కంద మూవీలో హీరో రామ్ రెండు పాత్రలు చేసినట్టు తెలుస్తోంది. ఒక పాత్ర కాలేజీలో చదువుకునే యువకుడిగా నటిస్తే, మరో పాత్ర మొరాకోలో పేరుగాంచిన హంతకుడు. కాలేజీ స్టూడెంట్ గా నటించిన పాత్ర పేరు భాస్కర్ రాజు.
తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె శ్రీలీలా రెడ్డిని ప్రేమిస్తాడు. ఇక మొరాకో నుండి వచ్చిన రామ్ క్యారెక్టర్ పేరు మణికంఠ స్కందరాజు. శ్రీలీలా రెడ్డి క్యారెక్టర్ లో హీరోయిన్ శ్రీలీల నటించింది. ఈ మూవీ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 47 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.




