ఎన్నో హిట్ పాటలు పాడి గుర్తింపు సంపాదించుకున్న గాయకుడు శ్రీరామ చంద్ర. శ్రీరామ చంద్ర ఒక నటుడు కూడా. అంతకుముందు ఒక సినిమాలో నటించిన శ్రీరామ చంద్ర, ఇప్పుడు పాపం పసివాడు అనే ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లో ఐదు ఎపిసోడ్స్ ఉన్నాయి. కథ విషయానికి వస్తే, క్రాంతి (శ్రీరామ చంద్ర), డింపీ (గాయత్రి చాగంటి) అని అమ్మాయితో ఆరేళ్లు ప్రేమలో ఉంటాడు. తర్వాత పెళ్లి చేసుకుందాం అని క్రాంతి అడిగిన తర్వాత డింపీ రిజెక్ట్ చేస్తుంది.

బ్రేకప్ అవ్వడంతో క్రాంతి చాలా బాధపడి దేవదాసులాగా మారిపోతాడు. ఇంట్లో పెళ్లి గోల పెరిగిపోతుంది. ఇది తట్టుకోలేక క్రాంతి ఇల్లు వదిలేసి బయట తన స్నేహితులతో ఉంటాడు. ఒక రోజు పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ చారు (రాశి సింగ్) ని చూస్తాడు. చారుని వెతుకుతూ ఉంటాడు. కానీ ఇంట్లో పెళ్లి ఒత్తిడి పెరగడంతో అనూష (శ్రీవిద్య) తో క్రాంతికి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో చారు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ వెబ్ సిరీస్ కథ.

సరదాగా సాగిపోయే ఈ సిరీస్ కి లలిత్ కుమార్ దర్శకత్వం వహించారు. సిరీస్ కథ చాలా సింపుల్ గా ఉంటుంది. తెలిసిన కథ. కానీ టేకింగ్ బాగుంది. సిరీస్ మొత్తం కామెడీతో నడుస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. టెక్నికల్ గా కూడా సిరీస్ బాగుంది. ఒక్కొక్క ఎపిసోడ్ కూడా 30 నిమిషాల కంటే తక్కువే ఉంటుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు.

ముఖ్యంగా హీరోకి, హీరో తల్లికి మధ్య వచ్చే సీన్స్ కామెడీగా రాసుకున్నారు. శ్రీరామ చంద్ర కూడా క్రాంతి పాత్రలో చాలా బాగా చేశారు. అక్కడక్కడ ఒకటి, రెండు సీన్స్ కట్ చేస్తే సిరీస్ అంతా కూడా కుటుంబంతో కలిసి చూడదగ్గ విధంగానే ఉంది. ముఖ్యంగా యువతరాన్ని, వారు ఎదుర్కొనే సంఘటనలని, సమస్యలను ఇందులో చూపించారు కాబట్టి ఈ సిరీస్ ఎక్కువగా యూత్ ని ఆకట్టుకుంటుంది.
watch trailer :
ALSO READ : “మ్యాడ్” మూవీలో “DD” క్యారెక్టర్ లో నటించిన హీరో ఎవరో తెలుసా..?




టాలీవుడ్ లో ఇప్పటివరకు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. యువతను ఫిదా చేశాయి. అలాంటి సినిమానే మ్యాడ్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంది. కాలేజీలో గ్యాంగ్స్, సీనియర్లు, జూనియర్లు, ర్యాగింగ్, గొడవలు. ప్రేమలు వంటివాటిని ట్రైలర్ చూపించారు.
నేడు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో నటించిన ముగ్గురి హీరోలలో డీడీగా నటించిన యాక్టర్ తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడని టాక్. మూవీ చూసిన ఆడియెన్స్ సైతం అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రివ్యూయర్స్ సైతం ఆ కుర్రాడి స్టైల్, కామిడి టైమింగ్, డైలాగ్ డెలివరీ ని మెచ్చుకుంటున్నారు.
ఆ నటుడి పేరు సంగీత్ శోభన్. అతను ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించి అలరించాడు. మ్యాడ్ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో తెలుగు ఇండస్ట్రీకి మంచి కామెడీ హీరో లభించాడు అనుకునేలా నటించాడు. సంగీత్ శోభన్ మరేవరో కాదు యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు మరియు దివంగత డైరెక్టర్ శోభన్ రెండవ కుమారుడు. అన్నయ్య సంతోష్ హీరోగా సీరిస్, సినిమాలలో నటిస్తుంటే, తమ్ముడు సంగీత్ కామెడీ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తున్నాడు.
కలర్స్ స్వాతి యాంకర్, హీరోయిన్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో స్వాతి వికాస్ అనే వ్యక్తిని ఆగస్టు పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత మంత్ ఆఫ్ మధు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, వైజాగ్ లో నివసించే మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) తన గవర్నమెంట్ జాబ్ ను పోగొట్టుకుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేఖ (స్వాతి రెడ్డి) విడాకుల కోసం కోర్టుకు వెళ్తుంది. అయితే మధుసూధన్ తన భార్య ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో వెయిట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిస అవుతాడు. ఇది ఇలా ఉంటే, యూఎస్ లో సెటిల్ అయిన మధుమతి(శ్రియ నవిలే) అనే అమ్మాయి బంధువుల ఇంట్లో వివాహానికి వైజాగ్ వస్తుంది.
అయితే ఒక సందర్భంలో మధుమతికి మధుసూధన్ తో పరిచయం అవుతుంది. ఒకసారి మాటల సందర్భంలో మధుసూధన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆమెకు తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? లేఖ ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంది? ఆఖరికి లేఖ మధుసూదన్ కలిశారా? అనేది మిగిలిన కథ. మంత్ ఆఫ్ మధు సినిమా అనేది అమెరికా నుంచి వైజాగ్ కి వచ్చిన మధుమతి నెల రోజుల్లో ఎదుర్కొన్న అనుభవాలే ఈ మూవీ.
“అఖండ” బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన మరో మాస్ ఎంటర్ టైనర్ స్కంద. బోయపాటి శ్రీను మూవీ అంటే తప్పకుండా మాస్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. ఊహకు అందని రీతిలో బోయపాటి తన చిత్రాలలో ఫిక్షన్ను జోడిస్తారు. కానీ, స్కంద మూవీలో అది అతి అయ్యిందని ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.
రొటీన్ స్టోరీని కూడా విపరీతమైన వయొలెన్స్తో చూపించారని, మూవీలో పెద్దగా ఏమీ లేదని నెటిజెన్లతో పాటు విమర్శకులు కూడా అంటున్నారని టాక్. స్కంద మూవీలో హీరో రామ్ రెండు పాత్రలు చేసినట్టు తెలుస్తోంది. ఒక పాత్ర కాలేజీలో చదువుకునే యువకుడిగా నటిస్తే, మరో పాత్ర మొరాకోలో పేరుగాంచిన హంతకుడు. కాలేజీ స్టూడెంట్ గా నటించిన పాత్ర పేరు భాస్కర్ రాజు.
తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె శ్రీలీలా రెడ్డిని ప్రేమిస్తాడు. ఇక మొరాకో నుండి వచ్చిన రామ్ క్యారెక్టర్ పేరు మణికంఠ స్కందరాజు. శ్రీలీలా రెడ్డి క్యారెక్టర్ లో హీరోయిన్ శ్రీలీల నటించింది. ఈ మూవీ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 47 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.





గుప్పెడంత మనసు స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రిషి, వసు లవ్ స్టోరీ, తల్లీకొడుకుల సెంటిమెంట్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సీరియల్ కు వంద ఎపిసోడ్స్ వరకు కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర తెరకెక్కించారు. ఆ తరువాత కుమార్ పంతం డైరెక్ట్ చేస్తున్నారు.
అప్పటి నుంచి ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్కి చాలా పోటీ ఇచ్చింది. ఒకానొక సమయంలో గుప్పెడంత మనసు ‘కార్తీక దీపం’ సీరియల్ ను మించుతుందేమో అనేట్టుగా కుమార్ పనిచేశారు. కార్తీక దీపం సీరియల్ కి ఎండ్ కార్డు పడిన తరువాత. అదే టైమ్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ను అద్భుతంగా కుమార్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సీరియల్ గత కొన్ని నెలలుగా టీఆర్పీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. కార్తీక దీపం సీరియల్ ను ఆడియెన్స్ ఎంతగా ఆదరించారో తెలిసిందే. ఆ సీరియల్ ను ప్రేక్షకులకు గుర్తు రాకుండా ఇంట్రెస్టింగ్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ బ్రహ్మముడి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతను ప్రముఖ సీరియల్ నటి కిరణ్మయి భర్త. ఆమె ఎన్నో సీరియల్స్ లో నటించింది.







ఈ ఏడాది విజయ్ దళపతి నటించిన వారసుడు వంటి రొటీన్ కంటెంట్ మూవీ అయినా తెలుగులో మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్ కాబోయే లియో మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ రైట్స్ కోసం సితార సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. తమిళ స్టార్ విజయ్ దళపతి, లోకేష్ కనకరాజ్ కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది.
తాజాగా రిలీజ్ అయిన లియో ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్ లో అర్జున్ సర్జా, సంజయ్ దత్, హీరోయిన్ త్రిషతో పాటు కనిపించిన ఈ వ్యక్తి మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ మరియు నటుడు శాండీ మాస్టర్. అతను తమిళ సినీ ఇండస్ట్రీలో మరియు టెలివిజన్ లో కూడా పనిచేస్తున్నాడు. శాండీ 2005 లో కలైంజర్ టీవీలో ప్రసారమైన పాపులర్ డ్యాన్స్ షో ‘మానాడ మయిలాడ’ సీజన్ 1లో కొరియోగ్రాఫర్గా కెరీర్ను ప్రారంభించాడు.
ఆ షోలో విజేతగా నిలిచాడు. ఆ తరువాత ‘మానాడ మయిలాడ’ వివిధ సీజన్లలో న్యాయనిర్ణేతల ప్యానెల్లో ఒకరిగా పనిచేశారు. 2019లో జరిగిన బిగ్ బాస్ తమిళ వెర్షన్లో కంటెస్టెంట్గా పాల్గొన్న తర్వాత శాండీ మాస్టర్ బాగా పాపులర్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రాఫర్ చేస్తూనే సినిమాలలో కూడా నటించడం ప్రారంభించాడు. ‘ఇవనుకు తన్నిల గండం’ అనే తమిళ చిత్రంతో నటుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. పలు సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించిన శాండీ మాస్టర్ లియో మూవీలో నటించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శాండీ మాస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.