సినీ ఇండస్ట్రీలో విశ్వక్ సేన్ అంటే యాటిట్యూడ్ హీరో అనే పేరుంది. దానికి తగ్గట్టే తన మాటలు కూడా ఉంటాయి. అయినా కూడా తనకి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువనే చెప్పాలి. అయితే విశ్వక్ తాజాగా తన ‘పేక మేడలు’ సినిమా టీజర్ లాంచ్ కు హాజరుకాగా… బేబీ డైరెక్టర్ ను ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం విశ్వక్ మాటలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అయితే విశ్వక్ సేన్ కి యాటిట్యూడ్ ఎక్కువ అనే ప్రచారం ఉన్నప్పటికీ… డైరెక్షన్, యాక్టింగ్ ఏకకాలంలో చెయ్యగలిగే సత్తా ఉన్న హీరో అనే పేరు కూడా ఉంది.

దానికి “ఫలుక్ నామా దాస్” , “దాస్ కా ధమ్ కీ” సినిమాలే పెద్ద ఉదాహరణ. ఇక పక్కా హైదరాబాదీ పోరడు, తెలంగాణ బిడ్డ అయినందు వల్ల తన బాడీ లాంగ్వేజ్, మాట తీరుకి పెద్ద ఫ్యాన్ బెస్ ఏర్పడింది. అయితే తన సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా చేసే కార్యక్రమాలతో విశ్వక్ పెద్ద పెద్ద కాంట్రవర్సీల్లో ఉంటాడు. అయినా అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు తాజాగా బేబీ మూవీ డైరెక్టర్ తో జరిగిన ఓ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు.

అయితే నిజానికి బేబీ మూవీకి మొదట విశ్వక్ సేన్ ని హీరోగా అనుకున్నారని… కానీ విశ్వక్ తన యాటిట్యూడ్ తో అసలు కథ వినడానికి కూడా ఇష్టపడలేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విశ్వక్ సోషల్ మీడియా వేదికగా… ఒక వ్యక్తి నో అంటే నో. ఇది మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది అంటూ ట్వీట్ చేశాడు. దీంతో విశ్వక్ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కే ట్వీట్ చేశాడని నెటిజన్లు అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు పేక మేడలు టీజర్ లాంచ్ లో కూడా విశ్వక్ దీనికి సంబంధించి మాట్లాడుతూ…

నేను పెద్ద హీరో కాకపోయినా నా వరకు నేను బిజీగానే ఉన్నాను. లైఫ్ లో ఏమ్ చెయ్యాలో చాలా క్లారిటీ ఉన్నప్పుడు వేరే వాళ్ళ టైం వేస్ట్ చెయ్యడానికి ఇష్టపడను. అలాంటప్పుడే కథలు వినను అని తిప్పించుకోకుండా డైరెక్ట్ గా నో చెప్పేస్తాను. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. అందరికీ నచ్చేలా హ్యాపీగా ఉంచడానికి నేను బిర్యానీ కాదు కదా అంటూ మాట్లాడారు.

అయినా నేనేదో కావాలని పర్సనల్ గ చేసింది కాదు అంటూ వివరించారు. ఆ సినిమా హిట్ అయినందుకు కంగ్రాజ్యులేషన్స్…సినిమా బాగుంటే తలెత్తుకోడంలో తప్పు లేదు కానీ పక్కనోల్లను కించపరచొద్దు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో విశ్వక్ చెప్పీ చెప్పకనే బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ని ఉద్దేశించి మాట్లాడారని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ vs 11 లో నటిస్తుండగా… ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆగస్ట్ 13న రిలీజ్ అయ్యే ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై… సంయుక్తంగా కలిసి నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ALSO READ : ఇక కోలీవుడ్ లో అంతా లోకల్ స్టార్స్….వైరల్ అవుతున్న ఫెఫ్సీ నిబంధనలు..!

1. స్పైడర్:
2. డియర్ కామ్రేడ్:
3. నాని వి:
4. అమిగోస్:
5. డిస్కో రాజా:
6. సవ్యసాచి:
7. నా పేరు సూర్య:
8. ఎంత మంచివాడవురా:
9. అంతరిక్షం:
10. ఆరెంజ్:
ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో వస్తే చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.


దేవుళ్ల పై చిత్రాలు తెరకెక్కించేటపుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏం జరుగుతుందో ‘ఆదిపురుష్’ సినిమా ఫలితాన్ని చూస్తే తెలుస్తుంది. ఆ మూవీ ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య డిజాస్టర్ గా నిలిచింది. ఆ మూవీ పై పీటీషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఆ ఎఫెక్ట్ వల్ల అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తోన్న ‘ఓఎంజీ 2’ సినిమా పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు తెలిపినట్లు టాక్. ఆదిపురుష్ సినిమా సమయంలో చేసిన మిస్టేక్ ను ఈ మూవీ విషయంలో రిపీట్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే సెన్సార్ కన్నా ముందు, ఈ సినిమాలో ఆడియెన్స్ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఏమైనా డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయో పరిశీలించాలని సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీకి సూచించినట్లు సమాచారం. ఆ కమిటీ డిసిషన్ తర్వాత ఈ సినిమాకి సర్టిపికెట్ మంజూరు చేయడం కానీ, ఏమైనా మార్పులు సూచించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ పరిశీలించిన ఆనంతరమే సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. మూవీ రిలీజ్ ను అప్పటి వరకు నిలిపివేయాలని కోరినట్లు టాక్ వినిపిస్తోంది.
కానీ చిత్రబృందం మాత్రం ఈ విషయన్ని కొట్టిపడేశారు. ఓఎంజీ 2 సెన్సార్ రిపోర్ట్ విషయంలో CBFC ఇంతవరకు తమకు ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదని వెల్లడించారు. ఓఎంజీ 2 సినిమాలో అక్షయ్ కుమార్తో పాటుగా పంజక్ త్రిపాఠి, అరుణ్ గోవిల్, యామీ గౌతమ్, గోవింద్ నమ్దేవ్ కీలక పాత్రలలో నటించారు. అమిత్ రాయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం మంగేశ్ దక్డే అందిస్తున్నాడు.
తాజాగా జరిగిన ‘బ్రో’ ప్రి రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ ప్రసంగిస్తూ ఫ్యాన్స్ కు థ్యాంక్ యు చెప్పబోతుండగా, సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఇది చూసిన కొందరు తేజ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మందు కొట్టి వచ్చడేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత సాయిధరమ్ తేజ్ మాట్లాడే విషయంలో ఇబ్బంది పడుతున్నాడు.
ఇంతకుముందులా అతను క్లారిటీగా, గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. రెండేళ్ల క్రితం సాయిధరమ్ తేజ్ రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. కోమలోకి వెళ్ళినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని నెలల పాటు హాస్పటల్ లో ఉన్నాడు. తర్వాత ఇంటికి వచ్చినా కొన్ని నెలల పాటు బయటికి రాలేదు. ఆ తర్వాత కోలుకుని చిత్రాలు చేస్తున్నప్పటికీ తేజులో మునపటి జోష్ లేదు.
స్వయంగా సాయిధరమ్ తేజ్ మునపటిలా, పూర్తి ఆరోగ్యంతో లేనని పలు ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెప్పాడు. ఆ విషయం తెలిసినప్పటికి కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు సాయిధరమ్ తేజ్ సపోర్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీస్ ఫర్ యూ అనే ఇన్ స్టా పేజీలో ఒక క్లిపింగ్ షేర్ చేసి, ‘అన్నకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి సరిగ్గా మాట్లాడలేక పోతున్నాడు. దాన్ని పట్టుకుని తాగేసివచ్చాడు అని అంటారెంటిరా?’ అని రాసుకొచ్చారు.
ఇటీవలే ఏడవ సీజన్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ షో అభిమానులు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో మొదట్లో వచ్చిన సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. కానీ ఆ తర్వాత ఈ రియాల్టీ షో పై విమర్శలు ఎక్కువయ్యాయి.
సీపీఐ లీడర్ నారాయణ ‘బిగ్ బాస్’ షో పై పలుమార్లు కౌంటర్స్ కూడా వేశారు. ఈ షో వల్ల యువత, పిల్లలు, చెడిపోతున్నారని ఆరోపించారు. హౌస్ లో పోటీదారుల మధ్య అశ్లీలత, అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని కోర్టులో నారాయణ పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ తో హైకోర్టు బిగ్ బాస్ షోని ఆపేయాలని తీర్పు ఇచ్చింది.
గతంలో వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే హోస్ట్ నాగార్జునకు మరియు షో ప్రసారం అవుతున్న ఛానెల్కి కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే ఈ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని వెల్లడించింది. ఈ కేసు నెక్స్ట్ విచారణని నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే గతంలో చాలాసార్లు ఈ షో పై ఇటువంటి పిటిషన్స్ కోర్టులో దాఖలు అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి అడ్డంకి లేకుండా బిగ్ బాస్ షో కొనసాగింది.







తరుణ్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘అశ్విన్స్’. ఈ మూవీని విరూపాక్ష ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై నిర్మించాడు. ఈ మూవీ కథ విషయానికి వస్తే అర్జున్ (వసంత్ రవి), రీతూ (సరస్వతి మీనన్) ఇద్దరు భార్యభర్తలు. వీరు ముగ్గురు ఫ్రెండ్స్ రాహుల్, వరుణ్, గ్రేస్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటారు. ఈ ఐదుగురు యూట్యూబర్స్ డార్క్ టూరిజం పైన ఒక ఎపిసోడ్ను షూట్ చేయడం కోసం లండన్లో ఒక దీవిలో ఉండే బంగ్లాలోకి వెళ్తారు.
ఆ బంగ్లాలో ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అయిన ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ ఉందని, అక్కడి వెళ్లిన 15 మందిని చంపిందనే ప్రచారం ఉంటుంది. అర్జున్ టీమ్, ఆ బంగ్లాలో తిరిగే ఆత్మలను, అరుపులను కెమెరాలో బంధించడానికి ప్రయత్నిస్తారు. వారికి ఆ బంగ్లాలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు ఏంటి? ఆర్తి రాజగోపాల్ ఎలా మరణించింది? అసలు ఆ బంగ్లాలో ఏముంది? అశ్వినీ దేవతలు ప్రసాదించిన బొమ్మలు కనుగొన్న ఆర్తి రాజగోపాల్ కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనవాళ్లను రక్షించుకోవడం కోసం అర్జున్ ఏం చేశాడు? అనేది ‘ఆశ్విన్స్’ కథ.
మంచి, చెడు రెండింటినీ నియంత్రించే శక్తి మనిషికి మాత్రమే ఉందనే మెసేజ్ ను ఈ మూవీ ద్వారా దర్శకుడు చూపించారు. దర్శకుడు తరుణ్ తేజ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, దానిని స్క్రీన్ పై చూపించడంలో కాస్త తడబడ్డాడు. అశ్విన్స్ మూవీ హారర్ మరియు మైథాలజీ కలిపి తెరకెక్కించిన ఒక డిఫరెంట్ సినిమా. హారర్ సినిమాలను ఇష్టపడేవారిని ఈ మూవీ ఆకట్టుకుంటుంది.