టాలీవుడ్ డైరెక్టర్ లలో సినిమా మేకింగ్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉంటుంది. కానీ పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక శైలి పాటిస్తుంటాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్.
ఈయన సినిమాల్లో ఫైట్స్ చూస్తుంటే.. ఆయన శైలి మనకి అర్ధం అవుతుంది. ఆయనకి ఎంతో పేరు తెచ్చిన అతడు సినిమా నుండి ఆయన ఆ పంథా కొనసాగిస్తున్నారు. అదేంటి అంటే త్రివిక్రమ్ హీరో విలన్ ని డైరెక్ట్ గా కొట్టడు. విలన్ తో ఉండే వాళ్ళని కొట్టడం ద్వారా విలన్ లో భయం పుట్టించి.. హీరో ఇజాన్ని ఎలివేట్ చేస్తూ ఉంటారు.

అతడు సినిమాలో చూస్తే.. పొలం దగ్గర ఫైట్ సీన్ ఎవరు మర్చిపోలేము. అక్కడ మహేష్ మిగిలిన వాళ్ళని కొట్టడం ద్వారా, తనికెళ్ళ భరణిలో భయం పుట్టించి అతనిపై విజయం సాధిస్తాడు. తర్వాత సినిమా జల్సాలో కూడా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్, విలన్ ముఖేష్ రిషి ని కొట్టకుండా అతని అనుచరులతో ఫైట్ చేసి ముఖేష్ రిషిని కోట్టకుండానే కోమాలోకి పంపిస్తాడు.

ఖలేజా సినిమా క్లైమాక్స్ లోను,అనుష్కని వాళ్ళ నాన్న తనికెళ్ళ భరణికి అప్పగించే ఫైట్ సీక్వెన్స్ కూడా గమనిస్తే ఇదే ఫార్ములా ప్రకారం ఉంటాయి. తర్వాత వచ్చిన జులాయి క్లైమాక్స్ లో కూడా అల్లు అర్జున్, విలన్ సోనూ సూద్ అనుచరులు అందర్నీ చావగొట్టి సోనూ సూద్ ని భయంతో పరుగులు పెట్టించేలా చేస్తాడు.
అంతేగాక త్రివిక్రమ్ తన కెరీర్ లో అల్ టైమ్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది లో పవన్ తన అత్త నదియా ని పోసాని భారి నుండి కాపాడే సన్నివేషం లో కూడా పోసాని ని కొట్టకుండా కేవలం ఒక దెబ్బ తోనే భయపెడతాడు. ఆ సినిమా క్లైమాక్స్ లో అయితే విలన్ కోట శ్రీనివాసరావు అనుచరుల్ని రైల్వె స్టేషన్ లో చావగొట్టి, కోట అతని కొడుకు భయం తో న్యూస్ పేపర్ లో తల దాచుకునేలా చేస్తాడు.
ఇంకా గురూజీ ఇదే ఫార్ములా తన తర్వాత సినిమాలు అ ఆ, అల వైకుంఠపురంలో, అరవింద సమేతలో కూడా సందర్భాను సారంగా వాడడం జరుగుతుంది. త్రివిక్రమ్ నమ్మేది హింసించడం కన్నా భయపెట్టడమే హీరోయిజం అని, అందుకే తన ప్రతి సినిమాలో హీరో విలన్ ని భయపెట్టే విధంగా తన యాక్షన్ సీక్వెన్స్ ని రూపొందిస్తున్నారు. స్టంట్ మాస్టర్ ఎవరైనా యాక్షన్ సీన్ ఏదైనా గురూజీ తన మార్క్ మాత్రం పాటిస్తుంటారు. అందుకే తెలుగు సినీ ప్రేక్షకులు “ఫైట్స్ నందు గురూజీ సినిమా ఫైట్స్ వేరయా”… అంటున్నారు మూవీ లవర్స్.



రాకేష్ మాస్టర్ తనకు కెరీర్ ను ఇచ్చిన హీరో గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆయన ఇండస్ట్రీలో ఛాన్స్ కోసం వెతుకుతున్న టైంలో ఒక హీరో వల్ల కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుందని, ఆయన లేకపోతే తనకు లైఫ్ ఉండేది కాదని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. ఆ హీరో వేణు తొట్టెంపూడి. ఒక ఇంటర్వ్యూ లో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ “నా లైఫ్ లో చాలా కష్టాలు పడ్డానని, ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎందరి దగ్గరికో తిరిగానని, అలాంటి టైంలో వేణు సార్ పిలిచి మరీ నాకు ఛాన్స్ ఇచ్చారు” అని అన్నారు.
వేణు హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ మూవీలో “నిన్నలా మొన్నలా లేదురా” అనే సాంగ్ కు కొరియోగ్రఫర్ గా పని చేశానని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. చిరునవ్వుతో సినిమానే రాకేష్ మాస్టర్ కు కొరియోగ్రఫర్ గా తొలి సినిమా. వేణు సార్ వల్లే తన లైఫ్ గొప్పగా మారిందని రాకేష్ మాస్టర్ అన్నారు. కాగా రాకేష్ మాస్టర్ సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏడవ సీజన్ లో భాగంగా సరికొత్త టాస్కులను పోటీదారులకు ఇస్తారని సమాచారం. ఈసారి కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి, పాపులర్ అయిన సెలెబ్రెటీలను బిగ్ బాస్ ఏడవ సీజన్ కు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోకు ఈసారి కొత్త దంపతులతో పాటుగా డైవర్స్ తీసుకున్న సినీ సెలబ్రిటీలను తీసుకువస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఏడవ సీజన్ కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున కాకుండా హీరో రానా దగ్గుబాటి వ్యవహరిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ 7 లో పాల్గొనే పోటీదారులు వీళ్లే అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..
1. అమర్ దీప్- జానకి కలగనలేదు సీరియల్ నటుడు.
5.హేమచంద్ర – సింగర్.
9. విష్ణు ప్రియ – యాంకర్.
13. ఐశ్వర్య – సీరియల్ హీరోయిన్.
17. పండు – కొరియోగ్రాఫర్
21. పల్లవి ప్రశాంత్- కామన్ మ్యాన్ క్యాటగిరి
రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్. రామారావు అని అంటున్నారు. కానీ ఆయన అసలు పేరు రామిరెడ్డి అని, నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలోని జమ్మిపాడు ఆయన స్వస్థలమని రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ చిట్టిబాబు తెలిపారు. రాకేష్ మాస్టర్ తండ్రి పేరు బాలిరెడ్డి. ఆయన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి . కమ్యూనిస్ట్ లీడర్ పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు బాలిరెడ్డి ఆయనకు అనుచరుడుగా ఉన్నారు. కుల వివక్ష ఉండకూదని సుందరయ్య తన పేరులోని రెడ్డిని తొలగించుకున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కొరియోగ్రాఫర్లకు రాకేష్ మాస్టర్ గురువు. తర్వాత హైదరాబాద్ కి వచ్చి పలు టెలివిజన్ డాన్స్ షోలలో పాల్గొన్నారు. ఆ తరవాత ఇండస్ట్రీలో అడుగు పెట్టి, దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రాఫర్గా చేశారు. రాకేష్ మాస్టర్ మద్యానికి అలవాటుపడి, తాగిన మైకంలో మూర్ఖంగా మాట్లాడేవారని, ఈ ప్రవర్తనే ఆయనను సినీ పరిశ్రమకు దూరం చేసిందని సన్నిహితులు చెబుతున్నారు.
ఇక రాకేష్ మాస్టర్ పర్సనల్ లైఫ్ విషయనికి వస్తే, ఆయన ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య విద్యావంతురాలని, ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నారని ఆలేటి ఆటమ్ అన్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కానీ రాకేష్ మాస్టర్ ప్రవర్తన వల్ల భార్యకు దూరమయ్యారు. ఆ తరవాత రెండవ వివాహం చేసుకున్నారు. ఇటీవల మరో అమ్మాయితో సహజీవనం చేశారు.
సునీల్ లహరి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కించామని డిస్క్లెయిమర్లో క్లియర్ గా చెప్పారు. రామాయణంలో ఇలాంటి డైలాగ్స్ ఉపయోగించడం సిగ్గు చేటు అని అన్నారు. రావణుడిని పుష్పక విమానంతో చూపించలేదని, లక్ష్మణుడు, మేఘనాథ్ యుద్ధాన్ని నీటిలో చూపించారని’ అన్నారు.
‘ఏ పాత్రకు కూడా క్యారెక్టరైజేషన్ స్పష్టంగా లేదు. డైరెక్టర్ ఈ చిత్రం ఎందుకు తీశాడో, విఎఫ్ఎక్స్తో మూవీని నిలబెట్టలేరు. రామాయణాన్ని సింపుల్గా చెప్పాలి. హనుమంతుడితో అలాంటి సంభాషణలు ఎలా చెప్పించారో అర్థం కావట్లేదు’ అని అన్నారు. ఆదిపురుష్ సినిమాలోని క్యారెక్టర్లను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. రావణుడు చాలా అందమైన దేశానికి రాజు. ఈ మూవీలో అలా ఎందుకు చూపించారో, నకిలీ సీతను చూపించాల్సిన అవసరం ఏం వచ్చిందని అన్నారు.
‘మూవీలో స్టోరీని సరళంగా చెప్తే, పరిస్థితి వేరేలా ఉండేది. ఈ మూవీలోని పాత్రలన్ని అయోమయంగా ఉన్నాయని, ఇది నటినటుల మిస్టేక్ కాదు. పాత్రలు స్పష్టంగా లేకపోవడం వల్ల అలా జరిగింది. డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రం తెరకెక్కించడంలో ఇంకాస్త తెలివిగా వ్యవహరించాల్సింది.’ అని సునీల్ లహరి అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు.
దంగల్, చిచోరే వంటి బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు నితేశ్ తివారి రామాయణం తెరకెక్కిస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సీతగా అలియా భట్ నటిస్తున్నారని ప్రకటించారు. మిగతా పాత్రల కోసం దక్షిణాది నటినటులను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ ని నితీశ్ తివారి తెరకెక్కించే రామాయణం గురించి అడిగారు. ఓం రౌత్ ఇలా చెప్పుకొచ్చాడు. నితేశ్ తివారి గ్రేట్ డైరెక్టర్. తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. నితీశ్ తివారి తీసిన దంగల్ మూవీ భారతీయ అత్యుత్తమ సినిమాలలో ఒకటి అన్నారు.
నితేశ్ తివారి రచనలు, డైరెక్షన్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. నితేశ్ తీయబోయే రామాయణం పై రామ భక్తుల అందరిలాగే తాను కూడా ఆ మూవీ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. శ్రీ రాముడి గురించి ఎవరైనా, ఎన్ని చిత్రాలయినా రూపొందించవచ్చు. శ్రీ రాముడి గాధను ఎంత ఎక్కువ మంది చెప్తే అంత మంచిదని అన్నారు.
ఆదిపురుష్ సినిమాను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ పీఎం మోదీకి లేఖ రాశారు. అందులో ఈ సినిమా ప్రదర్శనను థియేటర్లు మరియు ఓటీటీలో బ్యాన్ చేసేట్టు ఆదేశించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ మోదీని అభ్యర్థించింది. ఆదిపురుష్ మూవీ దర్శకుడు ఓం రౌత్, రైటర్ మనోజ్ శుక్లా పై వెంటనే పై కేసు నమోదు చేయాలని కోరింది.
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాముడు, హనుమంతుడి గౌరవాన్ని పోగొట్టేలా ఉన్నాయని పేర్కొంది. శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడి క్యారెక్టర్లను మలిచిన విధానం బాగాలేదని పేర్కొన్నారు. భారతీయ ఇతిహాసమైన రామాయణం పేరుని చెడగొట్టేలా ఆదిపురుష్ ఉందని, మూవీలోని డైలాగ్లు హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అన్నారు.
భారతదేశంలో శ్రీరాముడిని దేవుడిలా ఆరాధిస్తారని, కానీ ఆదిపురుష్ మూవీలో రాముడిని, రావణాసురుడిని వీడియో గేమ్స్లోని క్యారెక్టర్లలా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇలాంటి మూవీలో హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, సైఫ్ అలీఖాన్ లు భాగస్వామ్యం అవడం సిగ్గుచేటని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొన్నారు.
ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి అందరికి తెలిసందే. జ్యోతిష్య వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయి. వేణుస్వామి ఇటీవల ఆదిపురుష్ సినిమా గురించి చెప్పారు. ఆదిపురుష్ సినిమా పై వస్తున్న ట్రోల్స్, విమర్శల నేపథ్యంలో వేణుస్వామి చెప్పిందే జరుగుతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ మూవీకి ఇప్పటివరకు హిట్ టాక్ రాలేదు. రివ్యూలు కూడా ఆదిపురుష్ హిట్ అని, ఫ్లాప్ అని చెప్పలేకపోయాయి.
వేణుస్వామి ‘ఆదిపురుష్’ రిలీజ్ కు ముందే అందరు అనుకున్నట్లుగా ఈ సినిమా హిట్ కాదని, యావరేజ్ గా నిలుస్తుందని జోస్యం చెప్పారు. బాహుబలి అంత ఊహించుకోవాల్సిన పని లేదన్నారు. రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా అయినా ఆదిపురుష్ మాత్రం అంతగా హిట్ కాదని అన్నారు. హీరో ప్రభాస్ జాతకాన్ని బట్టి ఫలితం ఉందన్నారు.
విజువల్ వండర్ గా రూపొందించడంలో ఆదిపురుష్ మూవీ యూనిట్ సక్సెస్ అవలేదని, ప్రభాస్ ఇచ్చిన ఛాన్స్ ని డైరెక్టర్ ఓంరౌత్ సరిగా వినియోగించుకోలేదని, రామాయాణం స్టోరి విషయంలో సినిమాటిక్ ఫ్రీడంను ఎక్కువగా తీసుకున్నాడని అంటున్నారు. అందువల్లనే ఆడియెన్స్ పూర్తిగా ఈ మూవీ ఆమోదించడంలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక వేణుస్వామి చెప్పినట్టుగానే ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది.