2016లో ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు, తమిళంలోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే ‘బిచ్చగాడు’. దీనికి ఇప్పుడు సీక్వెల్గా వచ్చిన చిత్రం ‘బిచ్చగాడు 2’. హిట్ మూవీకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాకు టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ తాజాగా టార్గెట్ను ఫినీష్ చేసింది. ఇందులో కావ్య తాపర్ హీరోయిన్గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

పర్ హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాను ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని కూడా ఇచ్చాడు. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్ను జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ వ్యాపారాన్ని జరుపుకుందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఈ మూవీ తెలుగులో రూ. 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ లక్ష్యాన్ని చేరుకున్న ఈ సినిమా అదనంగా రూ. 75 లక్షలు ప్రాఫిట్ అందుకుని తెలుగులో హిట్ గా నిలిచింది. తమిళంలో మళ్ళీ అంత హవా లేదు. అలా అని అక్కడి కూడా నష్టాలు ఏమీ రాలేదు. తెలుగులో అయితే లాభాలు కాస్త ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ‘బిచ్చగాడు 3 ‘ కూడా తీయడానికి విజయ్ ఆంటోనీ రెడీ అయిపోయాడు.

విజయ్ గురుమూర్తి, సత్యగా డిఫరెంట్ షేడ్స్తోకూడిన క్యారెక్టర్లో విజయ్ ఆంటోనీ నటన బాగుంది. పాజిటివ్, నెగెటివ్ షేడ్స్తో సాగే పాత్రలో అదరగొట్టాడు. అతడి క్యారెక్టర్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. హీరోగానే కాకుండా దర్శకుడిగా ఫస్ట్ సినిమానే మంచి మార్కులు కొట్టేసాడు.

పేరుకే సీక్వెల్ గానీ రెండు కథలకు పెద్దగా సంబంధం ఉండదు. బిచ్చగాడు సెంటిమెంట్కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే సీక్వెల్ మాత్రం బ్రెయిన్ మార్పిడి అనే ప్రయోగాత్మక పాయింట్కు యాక్షన్ అంశాలను జోడించి నడిపించారు. చివరి వరకు కథను ఉత్కంఠభరితంగా నడిపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు విజయ్ ఆంటోనీ.
Also read: ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ లో “ఊర్వశి రౌతేలా” ధరించిన నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!




















1. ఏజెంట్:
2. రామారావు ఆన్ డ్యూటీ:
3. వినయ విధేయ రామ:
4. రభస :
5. స్పైడర్:
6. నోటా:
7. శ్రీనివాస కళ్యాణం:
8. మిస్టర్:
9. శాకుంతలం:
కానీ ఆ తరువాత చివరికి సమంత నటించింది. ఈ మూవీ రిలీజ్ తరువాత అనేక విమర్శలు వచ్చాయి. దర్శకుడు గుణ శేఖర్ పై, సమంతను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.









హీరో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మైథలాజికల్ చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటించారు. రామాయణం ఆధారంగా ఇప్పటికే అనేక చిత్రాలు రూపొందాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా గ్రాండ్గా సిల్వర్ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ చేస్తున్నారు.
ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినపుడు ఆడియెన్స్ నుండి విమర్శలు చేశారు. ఇప్పటి దాకా వచ్చిన రామాయణం చిత్రాలను చూసిన ఆడియెన్స్ కి దర్శకుడు చేసిన మార్పులు అసలు నచ్చలేదు. టీజర్ యానిమేషన్లా ఉందనే ట్రోల్స్ వచ్చాయి. హిందూవాదులు కూడా రావణాసురుడి క్యారెక్టర్ చిత్రీకరణను పూర్తిగా వ్యతిరేకించారు. ఇక హనుమంతుడికి గెడ్డం పెట్టడం హిందూవాదులకు అసలు నచ్చలేదు.
ఈ విమర్శల తరువాత మూవీ పై మరింత ఫోకస్ చేసిన ఓం రౌత్, ట్రైలర్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. 3డీలో ట్రైలర్ను చూసిన ఆడియెన్స్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. జూన్ 16న ఈ చిత్రం 5 భాషల్లో భారీగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో జూన్ 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో బాహుబలి సినిమా తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ హీరో ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్గా మార్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ తిరుపతిలోనే నిర్వహించారు. 2015 లో జూన్ 13న తిరుపతిలోని ఎస్వీ గ్రౌండ్స్లో బాహుబలి ఆడియో లాంచ్ వేడుక జరిగింది. ఆ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.
8 ఏళ్ళ తరవాత జూన్ 6న ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరగనుంది. దాంతో బాహుబలి సినిమా లాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా బాహుబలి సెంటిమెంట్ వాడుతున్నారంటే ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందంటూ మీమ్స్ షికారు చేస్తున్నాయి.





పెళ్లి అనే విషయం శరత్ బాబుకు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇద్దరిని అఫిషియల్ గా పెళ్లి చేసుకున్నా, సీక్రెట్గా వేరొకరితో కాపురం చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. శరత్ బాబు పరిశ్రమలో అడుగుపెట్టిన సమయానికే తెలుగు ఇండస్ట్రీలో రమాప్రభ స్టార్ కమెడీయన్గా వెలుగొందుతున్నారు. ఆమె శరత్ బాబు కన్నా వయసులో 4 ఏళ్లు పెద్దది. అయినపట్టికి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అలా వారు 14 సంవత్సరాల పాటు చాలా అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించారు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెట్టడంతో విడాకులు తీసుకున్నారు. తరువాత శరత్ బాబు తమిళ యాక్టర్ నంబియార్ కుమార్తె స్నేహలతను వివాహం చేసుకున్నారు. కానీ ఆయన కొన్నాళ్లకే స్నేహలతతో కూడా విడిపోయారు. ఆ తరువాత కొంతకాలం ఒంటరిగా ఉన్న శరత్ బాబు, హీరోయిన్ నమితను రహస్యంగా వివాహం చేసుకున్నారనే ప్రచారం కొలీవుడ్, టాలీవుడ్ లో విస్తృతంగా జరిగింది.
అయితే శరత్ బాబు అప్పట్లో ఈ వార్తలను ఖండించినా ఆ రూమర్స్ ఆగలేదు. శరత్ బాబును ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీకు పిల్లలు లేరా అని అడిగినపుడు దానికి ఆయన తన సోదరులు, అక్కాచెల్లెల పిల్లలు అంతా కలిసి 25 మంది అని, వారంతా కూడా తన పిల్లలే అని చెప్పారు. శరత్ బాబు మరణించిన రోజు నుండే అతని బంధువులు ఆస్తుల కోసం తగాదా పడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మరో వైపు శరత్బాబుకు మాజీ భార్య స్నేహ నంబియార్తో ఇద్దరు పిల్లలు ఉన్నారని, సాయి కార్తీక్ అనే కుమారుడు, పల్లవి అనే కుమార్తె ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా కొంతమంది ఆయనకు పిల్లలు లేరని, మరి కొంతమంది పిల్లలు ఉన్నారని అంటున్నారు.