ఇండస్ట్రీ లోకి వచ్చిన తక్కువ సమయానికే మంచి పాపులారిటీని సాయి పల్లవి సొంతం చేసుకుంది. ఈమె కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ కాస్త డిఫరెంట్ గా ఉన్న క్యారక్టర్లని మాత్రమే ఎంపిక చేసుకుంటుంది. కానీ ఈ మధ్య సాయి పల్లవి కి అవకాశాలు బాగా తగ్గి పోయాయి.
కేవలం ఒకే ఒక సినిమా విడుదలకు ఇప్పుడు రెడీ గా ఉంది. ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి గ్లామర్ పాత్రలు చేయక పోయినా స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది.

ఇప్పటి దాకా ప్రతీ సారి తనకి నచ్చిన కథల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటూ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అంతే కానీ ఈ అమ్మడు ఎప్పుడు తొందర పడలేదు. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా లో నటించి మంచి హిట్ ని సాయి పల్లవి అందుకుంది. అలానే నాని తో కలిసి నటించిన శ్యామ్ సింగరాయ్ కూడా మంచి హిట్ ను సాయి పల్లవి కి అందించింది.

అయితే ఈమె రెండు హిట్స్ ని అందుకున్నప్పటికీ ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా లో నటించింది. అదే విరాటపర్వం. ఈ సినిమా గత ఏడాది నుండి విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ తెర మీదకి ఇంకా రాలేదు. ఈ సినిమా ఓటీటీ లో విడుదలయ్యే అవకాశం కనబడుతోంది.

భోళా శంకర్ సినిమా లో సాయి పల్లవి కి నటించే అవకాశం వచ్చినా ఆమె దానిని తిరస్కరించింది అయితే ఆమె కథ నచ్చితేనే ఊ అనేట్టు కనపడుతోంది. అప్పటి వరకు సాయి పల్లవి సైలెంట్ గానే ఉండేలా వుంది.




మొదటి నుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న కొరటాల శివ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో ముఖ్యమైన పాత్ర రామ్ చరణ్ కాబట్టి కొరటాల శివ కూడా బోయపాటి తరహాలోనే రామ్ చరణ్ తో చేసి బోల్తా పడ్డారని గుసగుసలు మొదలయ్యాయి.






ఈ తప్పిదానికి మహేష్ సీరియస్ అవ్వలేదని ఆ సమయంలో చాలా కూల్ గా వ్యవహరించాడని తెలియజేసింది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కు ఒక మంచి పాత్ర ఉందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు ఆయన అందులో హీరోగా నటించడమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చేస్తానని చెప్పడం విశేషం.
ఈ సినిమాలోని కథ మరియు కథనం గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు చాలా బాగుందని చేద్దామని చెప్పడం తో డైరెక్టర్ పరశురాం చాలా ఆనందించారట. అయితే ఈ కథనం రాసింది స్పెషల్ గా మహేష్ బాబు కోసమేనని ఆయన అంటున్నారు. మహేష్ బాబుతో ఒక సాంగ్ చేస్తున్న సమయంలో కీర్తి సురేష్ ఒక స్టెప్ లో కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయిందట. 









ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవికి సినిమాలపై ఆసక్తి కలగడానికి కూడా ఈ ఇల్లే కారణమని చెప్పవచ్చు.అలాగే చిరంజీవి కూడా తన ఉద్యోగ ప్రయత్నాల కోసం వెళ్లి, సినిమాల్లో తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పునాది రాళ్లు సినిమా నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటి ఆచార్య సినిమా వరకు ఆయన సినీ జీవితం ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగింది.










