రామ మందిరం వేడుకకి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి అన్న సంగతి తెలిసిందే. వారిలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందినవారు, ఇంకా ఇతర రంగాల్లో పేరు గాంచిన వారు కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఈ వేడుక కోసం భారీగా ఏర్పాటు జరుగుతున్నాయి. తెలుగు సినిమా రంగానికి చెందిన కొంత మంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. వారిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు, ప్రభాస్, రామ్ చరణ్ కూడా ఉన్నారు.

వీరితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో సంవత్సరాల నుండి సినిమాలు చేస్తూ, సినిమా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆహ్వానాలు అందిన ప్రతి ఒక్కరూ ఈ వేడుకకి హాజరు అవుతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు అవ్వలేరు అని తెలుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సినిమా బృందం అంతా కూడా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. సినిమా రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి భాగానికి సంబంధించి ఇటీవల ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ అయోధ్యకి వెళ్లలేరు. షూటింగ్ బిజీ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ అయోధ్యలోని రామ మందిరం వేడుకకి వెళ్లలేకపోతున్నారు అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బయట ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. సినిమా షూటింగ్ కూడా భారీ సెట్టింగ్స్ మధ్యలో జరుగుతోంది.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెటప్ కూడా డిఫరెంట్ గా ఉంది. గెటప్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్స్, విలన్ లుక్స్ ఇటీవల విడుదల చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ స్టైల్స్ కనిపిస్తారు. కాబట్టి సినిమా షూటింగ్ షెడ్యూల్ అంత టైట్ గా ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేకపోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ వార్త ప్రచారంలో ఉంది. మరి ఇదంతా నిజమేనా? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వెళ్తారా? ఇది తెలియాలి అంటే మాత్రం వేడుక జరిగే రోజు వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ లోనే ఉన్నారు.

2010 ఏప్రిల్లో షోయబ్ మాలిక్, సానియా మీర్జాల పెళ్లి హైదరాబాద్లో గ్రాండ్ గా జరిగింది. ఆ సమయంలో వీరి వివాహం పై పెద్ద ఎత్తున్న చర్చలు జరిగాయి. ఈ జంటకు కుమారుడు ఇజాన్ 2018లో జన్మించారు. సానియా, మాలిక్ మధ్య విభేదాలు వచ్చినట్టు రెండు సంవత్సరాలుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇజాన్ సానియా దగ్గరే దుబాయ్ లో ఉండగా, షోయబ్ మాలిక్ ఎక్కువగా పాక్ లో ఉంటున్నాడు. విడాకుల పై ఇద్దరు బహిరంగంగా మాట్లాడలేదు.
కానీ నెట్టింట్లో క్రిప్టిక్ పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే విడాకులు ఇంకా కష్టం అంటూ సానియా పోస్ట్ షేర్ చేసింది. దాంతో విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతలోనే సనా జావేద్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. సనా జావేద్ను పాకిస్థాన్ కు చెందిన నటి మరియు మోడల్.
ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్’ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక సీరియల్స్లో నటించింది. 2017లో డానిష్ మెహ్రునిసా వి లబ్ యు అనే సోషియో-కామెడీ మూవీతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాలలో నటించిన సన ఎన్నో అవార్డులు అందుకుంది. 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్ను పెళ్లి చేసుకుంది. 2023లో నవంబర్ 28న అతనికి విడాకులు ఇచ్చింది. తాజాగా షోయబ్ మాలిక్ని రెండవ సారి పెళ్లి చేసుకుంది. మాలిక్, సనా జావేద్ రిలేషన్ లో ఉన్నారని గత ఏడాది నుండి రూమర్లు వస్తున్నాయి.







బాలీవుడ్ లో గోల్మాల్, సింగమ్ సిరీస్, సింబ, సూర్యవంశీ వంటి సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించాడు. వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి, నికితిన్ ధీర్, ముఖేష్ రుషి కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ సిరీస్ కథ విహాయనికి వస్తే, దేశరాజధాని డిల్లీలో వరుసగా బాంబు పేలుళ్లు జరగడంతో ఢిల్లీ పోలీసులు షాక్ అవుతారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగానికి చెందిన కమిషనర్ అయిన విక్రమ్ బక్షి (వివేక్ ఒబెరాయ్), డిప్యూటీ కమిషనర్ అయిన కబీర్ మాలిక్ (సిద్ధార్థ్ మల్హోత్రా) లకు పేలుళ్లకు బాధ్యులైన టెర్రరిస్టులను పట్టుకునే బాధ్యతను అప్పగిస్తారు. గుజరాత్ ఏటీఎస్ చీఫ్ అయిన తారా శెట్టి (శిల్పా శెట్టి) టెర్రరిస్టులను పట్టుకోవడంలో కబీర్ మరియు విక్రమ్ బక్షికి సహాయం చేస్తుంది. అసలు బాంబు పేలుళ్ల వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? జరార్ హైదర్ (మాయాంక్ టాండన్) కు పేలుళ్లకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ కేసును కబీర్, విక్రమ్ ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ.
రోహిత్ శెట్టి చిత్రాలలోని హీరోల తరహాలోనే సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ పాత్రలు ఉంటాయి. ఇక పోలీస్ ఆఫీసర్ శిల్పా శెట్టి పాత్ర కూడా అలానే ఉంటుంది. నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్స్ మరియు ఛేజింగ్ సీన్స్ చక్కగా రూపొందించబడ్డాయి.
















