మనిషిని జంతువులను వేరే చేసేవి భావోద్వేగాలే. ప్రతి మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. సమయాన్ని, సందర్భాన్ని బట్టి అవి బయటకు వస్తుంటాయి. కోపం, ఆవేశం, దుఃఖం, బాధ, నిరాశ వంటివన్నీ భావోద్వేగాలు. ఇవి కేవలం మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంటాయి.
అయితే కొన్ని పదాలు యాసిడ్ లా పనిచేస్తాయి. కొన్ని రిలేషన్ ని నాశనం చేస్తాయి. కాబట్టి ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ కోపం గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాటలు ఉపయోగించుకోవాలి. లేషన్ లో చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పుడు.. వచ్చే మాటల విషయంలో చాలా కేర్ లెస్ గా ఉంటారు. ఆ అలవాటు.. మీ రిలేషన్ ని నాశనం చేసే అవకాశం ఉంటుంది.

అయితే ఆడవారు కోపం లో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అని కోరా లో ఒక ప్రశ్న వచ్చింది. దానికి హరిత అనే యూజర్ ఇలా సమాధానం ఇచ్చారు.
#1 “ఇప్పుడు ఏమైందని అంత రాద్దాంతం. ఇంత చిన్న విషయానికి…!!”
కోపం లో ఉన్న ఆమెతో ఈ మాట అంటే చాలు.. ఆ కోపం తారాస్థాయికి చేరుకుంటుంది.. ఎందుకంటే చూసే వారికి చిన్న విషయం అనిపించొచ్చు కానీ ఆమెకు అదే పెద్ద సమస్యలా ఉండొచ్చు.

#2 “ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి చూడటం అలవాటు అయిపోయింది నీకు..”
చిన్న విషయాలని చిన్నదిగానే భావించి సర్దుకుపోవడం ఆడవాళ్ళ నైజం…కాబట్టి ఒక అమ్మాయికి కనుక కోపం వచ్చింది అంటే అది ఖచ్చితంగా పెద్ద విషయమే. అలాగే అమ్మాయిలు బాధలో ఉన్నప్పుడు.. లక్షల ఆలోచనలు వాళ్ల మైండ్ లో మెదులుతాయి. కాబట్టి.. మీ పదాలు.. మీ మాటలు మరింత ఇబ్బందిపెడతాయి.

ఈ విషయాలు పక్కన పెడితే ఒక వేళ మీ భార్య లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కోపం గా ఉన్నప్పుడు తప్పు మీ వైపు ఉంటే క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పడం వల్ల మీ విలువ ఏమీ తగ్గదు. తప్పు మీదైతే క్షమాపణ అడగడం ద్వారా మీ బంధం బలోపేతం అవుతుంది. అలాగే ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించండి. కోపం వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అసలు సమస్య ఏమిటి, ఎందుకలా కోపగించుకుంటుంది ఆమె చెప్పడానికి ప్రయత్నించినప్పుడు చెప్పనివ్వాలి. అప్పుడే సమస్యని పరిష్కరించగలం.











మనదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. తాత, నానమ్మ, పెద్దనాన్న, చినాన్న, వారి పిల్లలు, పది, పదేహేను మంది ఒకే కుటుంబంగా సంతోషంగా జీవించేవారు. ఆ తరువాత చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాల తదితర అవసరాలతో మెల్లమెల్లగా చిన్న కుటుంబాలు వచ్చాయి. సాధారణంగా వాటిలో అమ్మనాన్న ఇద్దరు పిల్లలు ఉంటారు. కానీ రాబోయే రోజుల్లో వాటి స్థానంలో భార్యభర్తలు మాత్రమే ఉండే ఫ్యామిలీలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దానికి కారణం స్త్రీ పురుషుల ఆలోచన విధానంలో వస్తున్న మార్పు అని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో భార్యభర్తలు ఉన్నత చదువులు చదివి, మంచి జాబ్స్ చేస్తున్నారు. వారి కెరీర్ లో ఎదగడానికి, జీవితంలో మంచి పొజిషన్ లో సెటిల్ అవడం కోసం, మంచి లైఫ్ స్టైల్ కోసం పిల్లలను అప్పుడే వద్దని అనుకునే జంటలు ఉన్నారు. అయితే కొన్ని జంటలు మాత్రం పిల్లలను అసలే వద్దని భావిస్తున్నారని ఒక అధ్యయనంలో తేలింది.
తమ చిన్నతనంలో ఎదురైన పరిస్థితుల వల్ల, గర్భం మరియు ప్రసవం గురించిన భయాల వల్ల, ఆర్ధికంగా మంచి స్థితిలో లేకపోవడం వల్ల, ఇద్దరు కెరీర్ లో ఇంకా ఎదగాలని దానికి పిల్లలు అడ్డు అని భావించడం వల్ల కూడా పిల్లలను వద్దని అనుకుంటున్నారు. అయితే మనం ఎంచుకునే విషయం ఏది అయినా అందులో ప్రయోజనాలతో పాటుగా నష్టాలు కూడా ఉంటాయి. పిల్లలు లేకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే..
1. ఎక్కడి కైనా వెళ్ళినప్పుడు లేదా చుట్టూ ఉండే ఫ్యామిలీలు లేదా ఫ్రెండ్స్ వారి పిల్లలతో ఉన్నప్పుడు ఆ గ్రూప్ నుండి పిల్లలు లేనివారు దూరంగా ఉండాల్సి వస్తుంది. లేదా అందులో కలవలేరు. వారు పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండాల్సి వస్తుంది. సంతానోత్పత్తి సంవత్సరాలు ముగిసిన ఐదుగురు స్త్రీలలో ఒకరు ఇలా బాధపడుతున్నారని ఒక పరిశోధన సారాంశం.










మన పితృస్వామ్య వ్వవస్థ కుటుంబంలో అల్లుడూ, కోడలు ఇద్దరూ వేరే కుటుంబాల నుండి వచ్చినప్పటికీ, కోడలికి కుటుంబ బాధ్యతను, అల్లుడికి అయితే హోదా ఇచ్చింది. ఇక ఇల్లరికం వెళ్ళిన అల్లుడు అయితే బాధ్యతలో కోడలితో సమానంగా చూస్తారు. అందువల్లనే ఇల్లరికపు అల్లుడిని ఇంటికి పెద్ద పాలికాపు అని అంటారు. సాధారణంగా ఎవరింటి కైనా వెళ్ళినపుడు అతిథి పాటించే నియమాలన్నీ కూడా అల్లుడికి అత్తవారింటికి వెళ్ళిన సమయంలో వర్తిస్తాయని చెప్పచ్చు.










