హిందువుల పూజల్లో కొబ్బరికాయకి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పనవసరం లేదు. ప్రతి పూజ ఆరంభం ముందు కొబ్బరికాయ కొట్టి ఆరంభించడం మనకి అలవాటు. కొందరైతే కొబ్బరికాయని నైవేద్యంగా కూడా ప్రసాదిస్తారు. కొబ్బరికాయకు లేని విశిష్టత లేదు.
కానీ ఒక్కసారి మనకు తెలియకుండా పూజ చేసే సమయంలో కుళ్ళిన కొబ్బరికాయ వస్తాది. అలాంటప్పుడు అరిష్టం ఏదైనా వస్తుందా అని భక్తులకు లేనిపోని సంకోచం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక లోలోపల అంతర్మాధనం చెందుతూ ఉంటారు.

మనం ఏదైనా విశిష్టమైన పని ప్రారంభించే ముందు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిన కాయ వస్తే అది కీడుకు సంకేతం. ఆ పనికి ఏదో ఆటంకం గోచరిస్తుందని శాస్త్రం చెబుతుంది. దీనిపైన భక్తులకు ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి. దీనికి ఏదైనా పరిష్కారం మార్గం ఉందా అంటూ వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ కథనం.

ముందుగా కొబ్బరికాయ కొట్టేముందు తేలికగా అనిపిస్తే అది కుళ్ళిన కాయ అని అర్థం
దాన్ని ముందుగానే పక్కన పెట్టి వేయాలి. మనకు తెలియకుండా కాయ కొట్టిన తర్వాత కుళ్ళిందని అర్థమైతే దాన్ని వెంటనే పక్కన పడేసి చేతులు కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక మంత్రం జపించి పరిహారం చేసుకోవాలి. ఈ మంత్రం జపించడం ద్వారా కుళ్ళిన కాయ కొట్టడం ద్వారా వచ్చే దోషం తొలగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఆ మంత్రం ఏంటంటే…”వనమాలి గదే శాంకి… శంకేచక్రిచనందకి శ్రీమన్నారాయనోవిష్ణు వాసుదేవో విరక్షకు”ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించాలి.ఈ మంత్రం జపించడం వల్ల కుళ్ళిన కొబ్బరికాయ కొట్టడం ద్వారా వచ్చే శకునం తొలగుతుందని తెలిపారు.
Also Read:23, 24 తేదీల్లో దసరా పండగ ఎప్పుడు జరుపుకోవాలి…? పండితులు ఏం చెప్తున్నారు అంటే..?

















గోరింటా అంటే గోరు+అంటూ . సంస్కృతంలో దీన్ని నఖరంజని అంటారు. దీన్ని బట్టి చూస్తే గోరింటాకు గోర్లకు మంచిది అని తెలుస్తుంది. ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని సరసాలు ఆడుతారు. మూడు సందర్భాల్లో గోరింటాకు పెట్టుకుంటారు. గ్రీష్మ ఋతువులో ఆషాడ మాసంలోను, వర్ష ఋతువులో భాద్రపద మాసంలోనూ, శరద్ ఋతువు లో అశ్వయుజ మాసంలోనూ గోరింట పెట్టుకుంటారు. ఇవి మూడు వానకారు పబ్బాలుగా ప్రసిద్ధి. తెల్లవారుజాము నుంచి ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే పాటల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు పొందుపరిచారు. ఇళ్లల్లో నీళ్ల తావుల్లో తిరిగే ఆడవాళ్లకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి వాడవలసిన మందులను తెలిపే పాట కూడా ఉంది.




