దేశంలో కరోనా మహమ్మారి ఉప్పెనలా వచ్చింది. మొదటి వేవ్ తో పోలిస్తే రెండో వేవ్ లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉత్తర భారతదేశం లో దీని తీవ్రత మరింత ఎక్కువగా వచ్చింది.

ఉత్తర్ ప్రదేశ్ లో కూడా మరింతగా విజృంభించింది అయితే అక్కడి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో బాగా పనిచేసిందని ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. ప్రస్తుతం వారణాసిలో పర్యటిస్తున్న ఆయన అక్కడ ప్రసంగించారు. అలాగే అక్కడి రాష్ట్ర ప్రజలకి వరాల జల్లులు కురిపించారు. దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టింగ్లోను, వ్యాక్సిన్లలోనూ ప్రధమ స్థానం లో ఉందంటూ కొనియాడారు.
Also Read :
కేరళ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేసిన కేరళ హైకోర్ట్ !









