గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. ఈమె ఎన్నో సంవత్సరాల నుండి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకొని తన జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ సడన్ గా ఫేమస్ అయిపోయారు.
రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయ్యి, ఆమె ఫుడ్ స్టాల్ తీసేయమనడం వరకు వెళ్ళింది. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకి ఫుడ్ స్టాల్ నడుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం కూడా అయిపోయింది. సందీప్ కిషన్ వంటి సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్తున్నారు. తమ సినిమాల కోసం ప్రమోషన్స్ కోసం వారు ఇలాంటి దారిని ఎంచుకున్నారు.

ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కుమారి ఆంటీ కి ప్లస్ అవుతుంది. ఆమె గురించి అందరికీ తెలుస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే సోషల్ మీడియా అవసరానికంటే ఎక్కువగా ప్రచారం చేయడంతో ఈ విషయం మీద చర్చలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పక్కనే మరొక ఫుడ్ స్టాల్ నడుపుకుంటున్న ఒక మహిళ, ఈ విషయం మీద తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

“ఆమె చేసేది సాధారణమైన భోజనమే కదా, అంత ఎక్కువగా పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి?” అని అంటున్నారు. మీరు పబ్లిసిటీ ఇవ్వకండి అని, అందువల్ల తమ బతుకులు సమస్యల్లో పడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కొంత మంది, “కుమారి ఆంటీ చేసిన భోజనం బాగుంది కాబట్టి ఆమెకి అంత పబ్లిసిటీ వస్తోంది” అని అన్నారు.

అందుకు ఈ మహిళ, “కుమారి ఆంటీ చేసిన భోజనం అంత బాగుంది అంటే మీ ఇళ్లల్లో చేసే భోజనం బాగుండదు అని మీరు చెప్తున్నట్టే కదా?” అని తిరిగి ప్రశ్న వేశారు. “ఇళ్లలో మీ అమ్మలు మీ భార్యలు కూడా చేస్తున్నారు కదా” ఇక్కడ అంత రుచిగా ఏం ఉంది? ఇంతగా హైలైట్ ఎందుకు చేస్తున్నారు? మీరు రావడం వల్ల మేము రోడ్డు పాలు అవుతున్నాము. పోయిన సారి బుల్డోజర్లు తీసుకొచ్చారు. అప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు?” అంటూ ఆ మహిళ మాట్లాడారు.

కుమారి ఆంటీ గురించి మాట్లాడుతూ, “ఇదంతా వీళ్ళ మూలానే అయ్యింది. అప్పుడు కూడా ఒకసారి ఇలాగే అయ్యింది. ఈ అమ్మాయికి, ఇంకొక పక్కన ఉన్న రాధమ్మ అనే అమ్మాయికి యూట్యూబ్ లోకి వెళ్ళకండి అని చెప్పాం. ఆ అమ్మాయి శుభ్రంగా అమ్ముకుంటుంది. ఈ గోల ఏంటి? ఇలాంటి రాద్ధాంతాలు చేయడం ఏంటి?” ఇదంతా డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు. లేకపోతే ఇళ్ళకి వెళ్లి ఎందుకు చూపిస్తారు. అంత లావున ఏం ఉంది. ఇంతకంటే టేస్ట్ గా చేసే వాళ్ళు ఉంటారు. ఆవిడ వల్లే ఇలా జరిగింది” అని అన్నారు.
watch video :
ALSO READ : 50 కి దగ్గరగా ఉన్నా…పెళ్లి చేసుకోని 10 మంది హీరోయిన్స్.! ఒకొక్కరికి ఒకో కారణం.!








బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, దేశంలో డిజిటల్ పేమెంట్ యాప్స్ లో పేటీఎమ్ కూడా ఒకటి. డిజిటల్ పేమెంట్ మార్కెట్ లో పేటీఎమ్ వాటా 16 నుండి 17 శాతం ఉంటుంది. బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు విధిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పేటీఎం ఆడిట్ రిపోర్ట్ తో పాటు ఇతర బాహ్య ఆడిటర్ల రిపోర్ట్స్ ప్రకారం, తరచుగా పేటీఎం రూల్స్ ని ఉల్లంఘించినట్లుగా తేలింది. అందువల్ల బ్యాంకుల నియంత్రణ చట్టంలో ఉన్న ’35ఏ’ రూల్ ప్రకారంగా, ఫిబ్రవరి 29 అనంతరం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో లావాదేవీలు, వ్యాలెట్, క్రెడిట్ డిపాజిట్, ఫాస్టాగ్ టాప్అప్లు ఆపేస్తున్నాము.
కస్టమర్ల బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి, ఉపఎగిన్చుకోవడానికి పూర్తిగా పేటీఎం సహకరించాలి. అందుకు తగిన సౌకర్యాలు కల్పించాలి. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఫాస్టాగ్లలో ఉన్న డబ్బును విత్డ్రా, లేదా వాడుకోవడానికి కస్టమర్ల పై ఎటువంటి ఆంక్షలు ఉండవు’’ అంటూ ఆర్బిఐ ప్రకటనలో వెల్లడించింది. అందువల్ల ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు దానిని వినియోగించలేరు. మార్చి 15 లోగా నోడల్ అకౌంట్ను కూడా సెటిల్ చేయాలని ఆర్బీఐ పేటీఎంను కోరింది.





ఫుడ్ కు ఫేమస్ అయిన హైదరాబాద్ లో ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ లు బాగా పెరిగిపోయాయి. ఆ ఫుడ్ కి రోజు రోజుకి అభిమానులు పెరిగిపోటున్నారు. రోడ్డు పక్కన మంచి రుచికరమైన ఫుడ్ దొరకడం, అది కూడా చాలా తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటి దగ్గరకి జనాలు క్యూ కడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా కుమారి ఆంటీ పేరు చెప్పుకోవచ్చు. ఆమె ఫుడ్ బిజినెస్ తో చాలా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఏక్కడ చూసిన ఆమె గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. అయితే అదే ప్రాంతంలో అనురాధ ఆంటీ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు.
ఆమె స్టాల్ లో టేస్టీ దాల్ రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, జీరా రైస్, టమాటా రైస్, పెరుగన్నం అందుబాటులో ఉన్నాయి. ఇక నాన్ వెజ్ లో మటన్, చికెన్, లివర్, ఫిష్, తలకాయ, ఫ్రాన్స్ వంటి కర్రీస్ ఉంటాయి. వెజ్ ప్లేట్కు 80 రూపాయలు కాగా, రైస్ అన్లిమిటెడ్ గా ఉంది. చికెన్ కర్రీ రూ.120 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్ ),చికెన్ ఫ్రై రూ.150 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), మటన్ కర్రీ –రూ.200 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), లివర్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ప్రాన్స్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ఫిష్ కర్రీతో రైస్ 150 రూపాయలు,కాగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటితో కలిపి తీసుకుంటే 450 రూపాయలు.
ఆమె వద్ద రోజుకు మూడు వందల మంది దాకా ఫుడ్ తింటారు. ఆ లెక్కన ఒక్కోక్కరికి యావరేజ్ గా రూ. 100 చొప్పున రోజుకు 30000 వస్తుంది. ఖర్చులన్ని పోగా 10 వేల రూపాయల వరకు మిగిలే ఛాన్స్ ఉంది. ఈ విధంగా చూస్తే నెలకు మూడు లక్షల దాకా ఆమెకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. తక్కువ ధరకు వందల మందికి ఆహారం అందిస్తున్న ఇలాంటి మహిళలను అందరు మెచ్చుకుంటున్నారు.