ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో జరిగిన ఒక సంఘటన చర్చలకి దారితీసింది. ఒక వ్యక్తి తప్పుడు ఆలోచన రెండు నిండు ప్రాణాలని బలికొంది. వివరాల్లోకి వెళితే నీరజ్ కుష్వాహా అనే ఒక వ్యక్తి లలిత్ పూర్ లోని సదర్ కొత్వాలీ ప్రాంతంలోని చంద్ మారి గ్రామంలో నివసిస్తాడు.
అక్కడ ముసుగు ధరించిన కొంత మంది వ్యక్తులు తమ ఇంట్లోకి వచ్చి తన భార్య, కూతురు మీద దాడి చేశారు అని నీరజ్ చెప్పాడు. రాత్రి 1:30 ఆరుగురు దొంగలు వాళ్ళ ఇంట్లోకి వచ్చి తన కూతురిని, భార్యని చంపేశారు అని చెప్పాడు. తన నోట్లో సాక్స్ కుక్కి, నగదు, నగలు దోచుకుని పారిపోయారు అని అన్నాడు. అంతే కాకుండా నకిలీ గాయాలతో ఆసుపత్రిలో కూడా చేరాడు.

ఇదే విషయాన్ని ఆసుపత్రిలో స్టేట్మెంట్ గా ఇచ్చాడు. కానీ పోలీసులు మాత్రం నీరజ్ చెప్పిన దాన్ని నమ్మలేదు. దాంతో మరింత విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. 22 ఏళ్ల తన భార్య అందంగా ఉండేదని, రోజంతా రిలీజ్ చేస్తూ ఉండేది అని, సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో మాట్లాడేది అని చెప్పాడు. వారిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది.

అయితే నీరజ్ తన మరదలిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని తన భార్యతో చెప్తే ఒప్పుకోలేదు. దాంతో క్రికెట్ బ్యాట్ తో ఆమెను కొట్టి చంపాడు. ఏడాది వయసున్న తన కూతురిని కూడా క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు. ఇంట్లో ఆభరణాలు అన్నీ కూడా టీవీ వెనకాల దాచి పెట్టేసి, ఇంట్లో వస్తువులు చిందరవందరగా చేసి. ఇంట్లో దొంగతనం జరిగినట్టు క్రియేట్ చేసి. తనకి కూడా దెబ్బలు తగిలినట్టు అందరిని నమ్మించాడు. ఈ విషయాన్ని పోలీసులు విచారణలో తెలుసుకొని అరెస్ట్ చేశారు.
UP के जिला ललितपुर में पति नीरज कुशवाहा ने ही पत्नी और मासूम बेटी की हत्या की थी।
हत्यारोपी नीरज बोला– "मेरी पत्नी सुंदर थी, पूरे दिन Reel बनाती थी। सोशल मीडिया पर लोगों से बात करती थी। मैं उसको छोड़कर भाभी की बहन से शादी करना चाहता था। लेकिन पत्नी विरोध कर रही थी। मैंने… https://t.co/SdBSIGwgry pic.twitter.com/OC4lHOrvV5
— Sachin Gupta (@SachinGuptaUP) January 9, 2024


అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్టకు శుభముహూర్తం ఆసన్నమైంది. రామ భక్తులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తరుణం కొన్ని రోజుల్లోరాబోతుంది. అయోధ్య రామ మందిరంను దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రామయ్యకు చాలా మంది భక్తులు భారీగా కానుకలను సమర్పించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రామయ్యకు బంగారు పాదుకలు సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్ర మొదలు పెట్టారు.
శ్రీనివాస శాస్త్రి హైదరాబాద్కు చెందినవారు. అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండర్ కూడా. రాముడు అయోధ్య నుండి లంకకు నడుచుకుంటూ వెళ్లిన మార్గంలో శ్రీనివాస శాస్త్రి నడుస్తున్నారు. రామేశ్వరంలో మొదలైన ఈ పాదయాత్ర, అరణ్య వాసంలో రాముడు తిరిగిన ప్రాంతాల గుండా వెళ్తున్నారు. దారిలో కంచి, శృంగేరీ, పూరీ, ద్వారకా పీఠాధీశుల ఆశీస్సులు తీసుకుని అయోధ్య వైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
64 ఏళ్ళ వయసు ఉన్న శ్రీనివాస శాస్త్రి తలపై బంగారు పాదుకలు పెట్టుకుని అయోధ్యకు ఎనిమిది వేల కిలోమీటర్ల నడుస్తూ, భక్తిని చాటుకుంటున్నారు. రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటికే ఐదు లక్షల ఇటుకలను దానం చేశారు. శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ. తన తండ్రి రామ భక్తుడని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం చూడాలనేది తన కల అని ఎప్పుడు చెప్పేవారు. తండ్రి కలను నెరవేర్చడం కోసం బంగారు పాదుకలతో పాదయాత్ర చేస్తూ, అయోధ్యకు వెళుతున్నానని చెప్పుకొచ్చారు.


ఒక రైతుగా సాధారణ జీవితం గడుపుతున్న తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందడంతో భావోద్వేగానికి లోనయ్యాడు అతడు. బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో 1992 డిసెంబర్ 2 వ తేదీ నుంచి 4, 5 రోజుల పాటు అయోధ్యలో ఉన్న మహ్మద్ హబీబ్ తనతో ఉన్న వారితో కలిసి కరసేవకుడిగా కొట్లాడాడు. ఆ సమయంలో మహ్మద్ హబీబ్ చేసిన పోరాటాన్ని గుర్తించిన అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్, శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని అతనికి ఆహ్వానం పంపించింది. హిందువుల ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఒక ముస్లిం కి ఆహ్వానం పంపడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. భారతదేశం ఎందుకు మత సామ్రాస్య దేశమో అర్థం అవుతుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు








