కరోనా వైరస్ కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మార్చి 22 అర్ధరాత్రి నుండి మార్చి 31 అర్ధరాత్రి వరకు గూడ్స్ రైళ్లు తప్ప ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్కతా మెట్రో, కొంకణ్ రైవేలు సర్వీసులను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
News
75 జిల్లాలో మార్చి 31 వరకు లాక్ డౌన్….మన తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో అంటే.? లిస్ట్ ఇదే.!
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం….కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రెటరీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి కరోనా పరిస్థితిపై చర్చ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలోనే ప్రకటనలు విడుదల చేస్తాయని తెలుస్తోంది.
తెలంగాణలోని ఐదు జిల్లాలు ::హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం.
ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ ,విశాఖ,ప్రకాశం జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది
మార్చి 22 అర్ధరాత్రి నుండి మార్చి 31 అర్ధరాత్రి వరకు గూడ్స్ రైళ్లు తప్ప ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్కతా మెట్రో, కొంకణ్ రైవేలు సర్వీసులను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
జనతా కర్ఫ్యూ లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చిన వాళ్లకు హైదరాబాద్ పోలీసులు ఎలా బుద్ది చెప్పారో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచచ్చిన విషయం అందరికి తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు . జనతా కర్ఫ్యూను సక్సెస్ ఫుల్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. కూడళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి.. జనం రోడ్లపైకి రాకుండా చేస్తున్నారు,కొందరు వ్యక్తులు జనతా కర్ఫ్యూ లెక్కచేయకుండా హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతం లో రోడ్ల పై తిరుగుతున్నారు,వీరిపై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు,జనతా కర్ఫ్యూ ఉంది అని తెలిసి కూడా కారణం లేకుండా బయటకి వచ్చినందుకు వారికి ప్లకార్డు ఇచ్చి కూడళ్లలో ప్రదర్శింపజేశారు.ఇందులో ఎక్కువగా యువకులు ఉండడం గమనార్ధం .
#JantaCurfew || All those found on the roads without a valid reason are being stopped by cops and are made to stand holding these placards at junctions such as #Punjagutta, #Rasoolpura @HYDTP#JantaCurfew22march #CoronavirusPandemic#Hyderabad#COVID19outbreak pic.twitter.com/SGJvZAQGS1
— TOI Hyderabad (@TOIHyderabad) March 22, 2020
#HYDTPweCareForU In view of Janata Curfew @insptr_srnagar displaying placards to observe Janata curfew voluntarily. @AddlCPTrHyd #JanataCurfewChallenge pic.twitter.com/Pyu8xgaHXI
— Hyderabad Traffic Police (@HYDTP) March 22, 2020
జనతా కర్ఫ్యూ ఉన్నప్పటికీ కొందరు వాహనదారులు రోడ్ల మీదకి వచ్చారు ,వారిని హైదరాబాద్ పోలీసులు అడ్డుకొని మీకు దండం పెడతాం ఇంటికెళ్లిపోండి అంటూ హైదరాబాద్ పోలీసుల వేడుకున్నారు ,ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .
తన ఫస్ట్ లవ్ గురించి బయటపెట్టిన ప్రదీప్.! ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలతో టీవీ చూస్తూ?
తెలుగు యాంకర్స్ లో బాగా ఫేమస్ అయినా యాంకర్ మాత్రం ప్రదీప్ అనే చెప్పాలి ..కాగా ప్రదీప్ 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు ..
30 రోజులలో ప్రేమించడం ఎలా? ఈ టైటిల్ చూడగానే సినీప్రేక్షకులంతా ఆకర్షితులు అయ్యారు. పైగా ప్రదీప్ లాంటి మంచి కామెడీ టైమింగ్ వున్న యాంకర్ హీరో కావడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఇంతలో ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ సాంగ్స్ రిలీజ్ చేసి చిత్రంపై మరింత ఆసక్తి నెలకొల్పేలా చేసారు. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అనే పాట యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి .
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మార్చ్ 25 న రిలీజ్ కి సిద్ధం అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. కానీ ప్రస్తుతం కరోనా దెబ్బకు సినిమా థియేటర్స్ అన్ని బంద్ చేసారు. ఈ చిత్ర విడుదల డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. ఇది ఇలా ఉండగా. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ తన మొదటి ప్రేయసి ఎవరో చెప్పి ఆశ్చర్యపరిచారు.
మొదటి గర్ల్ఫ్రెండ్ ఎవరు? ఫస్ట్ లవ్ మ్యాటర్ గురించి చెప్పండి అనగానే సోనాలి బింద్రే అని చెప్పేసాడు ప్రదీప్. సినిమా తారల గురించి కాదు మీ నిజ జీవితంలో మీ మొదటి గర్ల్ఫ్రెండ్ పేరు చెప్పు అని ఇబ్బంది పెట్టాడు యాంకర్. అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు ప్రదీప్.
తనకు ఆమె పేరు చెప్పి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని ఎందుకంటే ఇప్పుడు తాను తన భర్త పిల్లలతో కలిసి ఈ షో చూస్తూ వుండచ్చని సమాధానమిచ్చాడు ప్రదీప్.దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రదీప్ చెప్పిన ఈ ప్రేమకథ జనాలలో ఆసక్తి రేకెత్తిస్తుంది.
ఇదే విదంగా తన పెళ్లి గురించి స్పందించిన ప్రదీప్ .. ప్రేమ వివాహం చేసుకోనని. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటానని . కానీ దానికి పెళ్లి చూపులు లాంటి హడావిడీలు ఏమి ఉండవు అని చెప్పారు.
మాథమెటిక్స్ లెక్చరర్ గా పని చేసి డైరెక్టర్ అయిన సుకుమార్ దగ్గర దర్శకత్వమే కాదు …ఆదిత్య కాలేజీలో లెక్కలు కూడా నేర్చుకున్న విద్యార్థి ఇప్పుడు ౩౦ రోజులలో ప్రేమించడం ఎలా ? దర్శకుడు మున్నా. సుకుమార్ దగ్గర నేనొక్కడినే ఆర్య 2 చిత్రాలకు సహాయ దర్శుకుడిగా పనిచేసారు .
చిత్రంలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది . ఈ చిత్ర నిర్మాత బాబు బడ్జెట్ విషయంలో ఎక్కడ వెనకడుగు వెయ్యకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ చిత్ర బృందానికి సినిమా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాము.
విద్యార్థులను లోపల పెట్టి….హాస్టల్ కి తాళం వేసిన ఓనర్..! కారణం కరోనా కాదు…మరేంటో చూడండి!
“పిల్లికి చెలగాటం – ఎలుకకి ప్రాణసంకటం” అంటే ఇదేనేమో . అద్దెకిచ్చిన ఇంటికి రెంటు ఇవ్వలేదని ఒకవైపు ఇంటి ఓనర్ లబోదిబోమంటుంటే , ప్రభుత్వంతో మాట్లాడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటని స్టూడెంట్స్ , సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు . అద్దెకట్ట లేదని హాస్టల్ విద్యార్ధులని లోపలే ఉంచి తాళం వేసుకుని పోయాడు ఇంటి ఓనర్. కర్నూల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.
కర్నూల్ జిల్లా ఆత్మకూరులో డిగ్రీ , ఇంటర్ చదువుతున్న విద్యార్దినులు 150మంది వరకు ఉన్నారు. వీరిలో కొంతమందిని బిసి హాస్టల్లో, మరికొందరిని ప్రైవేట్ బిల్డింగ్ అద్దెకి తీసుకుని వసతి కల్పించారు . హాస్టల్ భవనంలో విద్యార్ధినులు ఎదుర్కోని సమస్యలంటూ లేవు, వాటర్ ప్రాబ్లం, బాత్రూం ఫెసిలిటీ సరిగా లేదు. గాలి , వెలుతురు శూన్యం . కనీసం హాస్టల్లోపలికి వెళ్లే దారైనా బాగుంటుందా అంటే అది కూడా ఇరుకే. మెయిన్ రోడ్డు మీద ఉండడంతో అమ్మాయిలకు ప్రతిది ఇబ్బందిగానే తోచింది. దాంతో విద్యార్ధినులని మరో భవనానికి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నారు.
వార్డెన్ సూచన మేరకు మరో భవనంలోకి మారడానికి సిద్దమయ్యారు విద్యార్ధినులు. హఠాత్తుగా అక్కడికి వచ్చిన భవన యజమాని , అద్దె డబ్బులు చెల్లించే వరకు ఎక్కడికి వెళ్లేది లేదని బెదిరించాడు. అంతేకాదు తనకి రావలసిన ఆరు నెలల బకాయిలు వచ్చిన తర్వాతనే మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్లనిస్తాను అంటూ విద్యార్ధినులను, సిబ్బందిని లోపల పెట్టి తాళం వేసాడు.
ఓనర్ నిర్వాకానికి భయపడిన స్టూడెంట్స్ వార్డెన్ కి కాల్ చేసి చెప్పగా, హుటాహుటిన అక్కడికి వచ్చిన వార్డెన్ షాహినూరా ,ఏదైనా ఉంటే ప్రభుత్వంతో తేల్చుకోమని , స్టూడెంట్స్ ని నిర్బందించడం ఎంత వరక కరెక్ట్ . బిల్డింగ్లో లేని సమస్యంటూ లేదని సమస్యలన్ని మీడియా ముఖంగా ఏకరువు పెట్టారు. అంతేకాదు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు.పోలీసులు వచ్చి ఓనర్ తో మాట్లాడి ఒప్పించి తాళం తీయించారు.
ప్రభుత్వం సరైన సమయానికి బిల్లులు రిలీజ్ చేయకపోవడంతో అటు అద్దె ఇచ్చిన వారికి సమస్య , ఉంటున్న స్టూడెంట్స్ కి సమస్యే. కేవలం ఆత్మకూరులోనే కాదు రాష్ట్రంలోని చాలా హాస్టల్స్ ప్రైవేట్ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆ భవనాల్లో అన్ని అరకొర వసతులతో విద్యార్దులు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎన్ని రకాల కంప్లైంట్లు వచ్చినా ప్రభుత్వాధికారుల నుండి స్పందన మాత్రం ఉండదు అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ.
watch video:
లావణ్య తన భార్య అన్నందుకు అతనికి ఏ శిక్ష పడొచ్చు? కంప్లైంట్ ఏ దశలో ఉంది!
మహేశ్ బాబు అడిగాడని వన్ నేనొక్కడినే మూవీ ఇచ్చేసా, లేదంటే అందులో నేనే హీరో . యాంకర్ ప్రదీపై పై కామెంట్స్ స్టార్ట్ చేస్తే మహేశ్, రవితేజ, తమన్నా , లావణ్య త్రిపాఠి ఇలా వరుసగా అందరిపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరలయ్యాడు. ఎవరో గుర్తొచ్చింది కదా శ్రీరామోజు సునిశిత్. తను చేసే కామెంట్స్ లో నిజం లేదనేది అందరికి తెలుసు కాని ఆ కామెంట్స్ కి ఇర్రిటేట్ అయిన లావణ్య నేరుగా సైబర్ క్రైం పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది .
హమ్మయ్య మొత్తానికి కనీసం లావణ్య అయినా వాడి తిక్క కుదిర్చింది. ఇప్పుడు అంతా పోలీసులే చూస్కుంటారు అని నెటిజన్లు కొంచెం అనుకున్నారు. ఇంతకీ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? దాని వల్ల సునిశిత్ కి పడే శిక్ష ఏంటి? ఈ మొత్తం సీన్లో పోలీసులు ఏం చేయగలరు. తెలుసా.?
లావణ్య నేను 2015 లోనే పెళ్లి చేసుకున్నాం , వాళ్లింట్లో కూడా తెలుసు . ఇద్దరం కలిసి తిరిగేవాళ్లం . తనే నేరుగా మా ఇంటికి వచ్చేది తర్వాత విడిపోయాం ఇవి సునిశిత్ కామెంట్స్. ఆ కామెంట్స్ లో నిజం లేదని, దాని వల్ల తనకు చాలా డిస్టర్బింగ్ గా ఉందని, ఎలా అయినా యాక్షణ్ తీసుకోవాలని లావణ్య కేస్ ఫైల్ చేసింది.ముందుగా యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ ని తీయించేలా యాక్షన్ తీసుకుంటారు .
సెక్షన్ 509,సెక్షన్ 67 ఐపిసి ప్రకారం యాక్షన్ తీసుకుంటామంటున్నారు పోలీసులు . ఈ లెక్కన సునిశిత్ కామెంట్లలో నిజం లేదని తేలితే సుమారు మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సునిశిత్ చేసే కామెంట్స్లో నిజం లేదని అందరికి తెలిసిన విషయమే . కాని ఇప్పుడు కేస్ వరకు వచ్చింది కాబట్టి విచారణ అనేది ఉంటుంది. తర్వాతే శిక్ష అమలు జరుగుతుంది.కాని ఈ శిక్ష పడేవరకు లావణ్య ఫైట్ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్.
ఎందుకంటే మన ఇండియాలో చట్టాలు, కోర్టుల పనితీరు ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే . ఒక కేసు పెడితే ప్రూవ్ అయి శిక్షపడడానికి కొన్నేళ్ల కాలం పడుతుంది. దాంతో పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అందువల్లే చాలా మంది మధ్యవర్తుల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవడం ఉత్తమం అని భావిస్తుంటారు. అలాంటిది సెలబ్రిటిలు ఇలాంటి తలనొప్పిలను అస్సలు తలకెత్తుకోవాలనుకోరు. ఇదే సునిశిత్ లాంటి వాళ్లకి ప్లస్ అవుతుంది. కాబట్టి సునిశిత్ పనైపోలేదు , మళ్లీ రెచ్చిపోడని గ్యారంటీ లేదు .
watch video:
నిర్భయ దోషులకు శిక్షపడటం వెనక కృషిచేసిన ముగ్గురు మహిళలు వీరే..! హ్యాట్సాఫ్ మేడం!
దేశ రాజధానిలో ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన యావత్ దేశం చేత కన్నీరు పెట్టించింది. దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ రూపంలో ఉన్న రాక్షసులకు శిక్ష పడాలని దేశంలోని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందరి కోరిక చివరికి మార్చి 20న తీరింది. ఆడపిల్లలందరికి న్యాయం జరిగిందని చెప్పలేం కాని నిర్భయకి న్యాయం జరిగింది. నిర్భయ ఆత్మకి శాంతి కలిగింది. కాని ఈ మృగాలను పట్టుకుంది, వారికి శిక్షపడేలా చేసింది, వారితో చివరి వరకు పోరాడింది ముగ్గురూ మహిళలే అని తెలుసా? వారే ఐపిఎస్ ఛాయా శర్మ, లాయర్ సీమా ఖుష్వా, నిర్బయ తల్లి ఆశాదేవి.
ఛాయా శర్మ (ఐపిఎస్)
ఏడేళ్ల క్రితం తన శరీరం ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లనను కూడా భయపడేలా ఉందంటే ఆ మృగాలు ఎంతగా గాయం చేశాయో అర్దం అవుతుంది. ఆ పాశవిక ఘటనని మళ్లీ తవ్వుకోవడం అనవసరం. కేవలం అత్యాచారానికి గురైన అమ్మాయి, హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది . పోలీసుల ముందున్న వివరాలు ఇవే . ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది. అసలు ఏం జరిగింది? ఎవరు తనని అత్యాచారం చేశారు. ఇవన్ని సమాధానం లేని ప్రశ్నలే .
అంత బాధలో కూడా స్థైర్యాన్ని కూడగట్టుకుని తనకు జరిగిన అన్యాయం గురించి, గుర్తున్నంత వరకు ప్రతి విషయాన్ని పోలీసులకు చెప్పింది. అది విన్న ఛాయా శర్మ ఎంక్వైరీ స్టార్ట్ చేసి కేవలం వారం రోజుల్లో ఆరుగురు నిందితుని పట్టుకుంది. వారిలో ఒకరు మైనర్, మరొకరు మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన నలుగురికి మొన్న ఉరి అమలు చేశారు.
కేవలం నిర్భయ మాటలే తనను కేసు ముందుకు తీసుకుపోయేలా నడిపాయని, చిన్న గాయం అయితేనే విలవిల్లాడుతామే , అలాంటిది అంతటి బాధని పంటిబిగువున పెట్టి వారికి ఎలా అయినా శిక్ష పడేలా చేయాలని నిర్భయ కోరిన కోరక ఇన్నేళ్లకు తీరిందని భావోగ్వేదానికి గురయ్యారు ఛాయా శర్మ. ఎటువంటి ప్రలోభాలకు తగ్గకుండా నేరస్థులను తప్పించుకోకుండా చూడడంలో ఛాయ శర్మ పాత్ర ఎనలేనిది.
సీమా ఖుష్వా (లాయర్):
ఉత్తర ప్రదేశ్ కి చెందిన సీమా ఖుష్వాహా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్లో సభ్యురాలు. ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా ఇన్నేళ్ల పాటు ఈ కేసుని వాదించడమే కాదు, నిర్భయ తల్లిదండ్రుల్లో ధైర్యాన్ని నూరిపోయడంలో సీమా ఖుష్వా కృషి ఎనలేనిది.ఎఫ్ఐఆర్ నమోదు దగ్గరనుండి ఛార్జిషీట్ చేయించడం వరకు సీమా ప్రధాన పాత్ర పోషించారు .
పటియాలా హౌస్ కోర్ట్ నుండి, ఢిల్లీ హైకోర్టు, తదనంతరం సుప్రీం కోర్టు వరకు నిర్భయ తరపున తన వాదనలు వినిపించారు.దోషులు ఎన్ని సార్లు శిక్ష నుండి తప్పించుకుంటూ వచ్చినా కృంగిపోకుండా ప్రతిసారి తన వాదనలు మరింత బలంగా వినిపించారు. ఎట్టకేలకు విజయం సాధించారు.
ఆశా దేవి ( నిర్భయ తల్లి):
ఆడపిల్ల అత్యాచారానికి గురవడం వల్ల కుటుంబ పరువు పోతుందనుకునే సమాజం మనది. పోనీ తెగించి కేసు పెట్టిన న్యాయం జరిగిన కేసులు చాలా అంటే చాలా తక్కువ శాతం. అలాంటిది కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడడానికి సిధ్దపడింది ఆశాదేవి. ఏడేళ్లుగా పోరాటం చేసింది.
ఆలస్యం అయినా నా కూతురికి న్యాయం జరిగింది, ఇకముందు ఇలాంటి అన్యాయం ఎక్కడ జరిగినా తను పోరాడటానికి సిధ్దం అని ఉరి శిక్ష అమలు కాగానే ఆశాదేవి మాట్లాడిన మాటలు ఇవి. నిర్భయ ఘటన జరగడానికి ముందు తనొక మామూలు గృహిణి.
విధి ఎప్పుడు ఎవరితో ఎలా ఆడుకుంటుందో ? ఎవరికి అంతుబట్టదు. ఈ క్షణానికి సంతోషంగా గడిపిన వాళ్లు మరుక్షణం బాగుంటారని చెప్పలేం. అంతా విధిలీల . వివాహం జరిగి ఆరునెలలు, మరో ఆరునెలల్లో పండంటి బిడ్డకి జన్మనివ్వబోతూ , భవిష్యత్ కోసం కలలు కంటున్న తరుణంలో భర్త చనిపోయాడు. భర్త శవం తనతో పాటే ఒకే విమానంలో ప్రయాణించినా, తర్వాత ఆ విషయం తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చింది. కేరళలో చోటు చేసుకున్న విషాద ఘటన వివరాలు.
ముఫ్పై ఏళ్ల మొహమ్మద్ సహీర్ ది కేరళలలోని కన్నూరుకి దగ్గరలోని చుజాలి గ్రామం. ఆరు నెలల క్రితం షిఫానాతో వివాహం జరిగింది. వివాహం తర్వాత భార్యను తీసుకుని ఒమన్ కి వెళ్లిపోయాడు సహీర్. భర్తతో కలిసి మస్కట్ వచ్చిన షిఫానా సంతోషంగా గడుపుతోంది. వారి దాంపత్య బంధానికి గుర్తుగా తనలో మరో ప్రాణి జీవం పోసుకుంది. దీంతో అటు సహీర్ , ఇటు షిపానా కుటుంబ సభ్యులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఒక రోజు స్నేహితులతో ఫుట్ బాల్ ఆడడానికి వెళ్లిన సహీర్, ఆట ఆడుతూ గ్రౌండ్లో కుప్పకూలిపోయాడు. దీంతో ఫ్రెండ్స్ సహీర్ ను వెంటనే నిజ్వాలోని బదర్ అల్ సమా హాస్పిటల్ కి తీస్కెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు తను చనిపోయాడని, గుండెనొప్పి వచ్చిందని చెప్పారు. వారికి కడుపుతో ఉన్న షిపానాకు ఈ విషయం ఎలా చెప్పలో అర్దం కాలేదు.
దాంతో నేరుగా విషయం చెప్పకుండా సహీర్ కి కరోనా లక్షణాలు ఉన్నాయని, హాస్పటల్ ఐసోలేషన్ వార్డులో ఉన్నారని చెప్పారు. తనని చూస్తానంటే, నువ్ ప్రెగ్నెంట్ వి కాబట్టి నిన్ను లోపలకి అనుమతించరని తనను భారత్ కి వెళ్లేందుకు ఒప్పించారు. భర్త ఆరోగ్యం బాగాలేదని తెలిసిన షిఫానా భారంగానే వెనుదిరిగింది.
మస్కట్ నుండి కోజికోడ్ వచ్చే ఎయిరిండియా విమానంలో షిఫానా ఇండియాకి బయల్దేరగా, అదే విమానంలో సహీర్ మృతదేహం ఉన్ శవపేటికను తీసుకొచ్చారు. కన్నూరు చేరుకున్నాక అసలు విషయం షిఫానా కి చెప్పారు. నిజం తెలుసుకున్న షిపానా భోరున ఏడ్చింది. పండంటి బిడ్డతో ఇండియాకి తిరిగొస్తారనుకుని నిర్జీవంగా వచ్చిన సహీర్ ని చూసి ఇరు వైపుల కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఏ పాత్రనైనా అలవోకగా నటించగల విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ .సామాజిక సమస్యలపై గళం విప్పే సినిమా వాళ్ల జాబితాలో ప్రకాశ్ రాజ్ ది మొదటి పేరుంటుంది. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించే ప్రకాశ్ రాజ్ రియల్ లైఫ్ హీరో అని ఎనో సార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీడియాకి శేర్ చేశారు నటుడు శివాజి రాజా. అదేంటో మీరే చూడండి.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమావాళ్లకి సరిగ్గా సూటవుద్ది. అవకాశాలున్నప్పుడే డబ్బులు పోగేసుకోవడం తెలియక ఎందరో నటులు అవస్థలు పడుతుంటారు, కొందరు అడ్డదారులు తొక్కుతారు. అలా ఆర్ధికంగా బాగా చితికిపోయిన ఒక సీనియర్ నటుడు , అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యాయాత్నం చేసారట. తన తోటి నటుడు చనిపోవడానికి సిద్దపడ్డారని తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ చలించిపోయారు.వెంటనే ఆ నటున్ని తన వద్దకు తీసుకురమ్మని శివాజిరాజాని అడిగారట.
ప్రకాశ్ రాజ్ అడగడంతో నేను అతన్ని తన వద్దకు తీసుకువెళ్లాను. వెళ్లాక కొద్దిసేపు రిలాక్స్ అవ్వమని చెప్పారు. ఆ తర్వాత జీవితంలో ఎంతపెద్ద సమస్యలొచ్చినా చనిపోవాలనే నిర్ణయం తీసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చారట. ఇప్పుడు నీకున్న సమస్యేంటి అప్పు. అంతేకదా, ఆ అప్పు నేను తీరుస్తాను అని అన్నారట.ఇదంతా తన ముందే జరిగిందని చెప్పుకొచ్చారు శివాజి రాజా.
ఇంతకీ ఆ నటుడు అప్పుల విలువ అక్షరాలా యాభై లక్షలు . యాభైలక్షల రుణం తీర్చే బాద్యత తనపై వేసుకున్నారు. అది భారం అనుకోలేదు. తన తోటినటుడు కష్టాల్లో ఉండడం చూడలేక బాద్యతగా తీసుకున్నారు. ఆ సీనియర్ యాక్టర్ పేరు బయటకి చెప్పడానికి నిరాకరించారు శివాజీరాజా, అంతేకాదు ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ తను చేసిన సాయం గురించి చెప్పుకోవాలని చూడరు, కాని ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన మరో వ్యక్తి గురించి తెలిసి నేను చెప్పకుండా ఉండడం భావ్యం కాదు అందుకే చెప్తున్నాను అంటూ ఉద్వేగానికి గురయ్యారు.
తేదీ 20-03-2020, ఉదయం 5:30ని. టైం తర్వాత.. నిర్భయ నిందితులని తీహార్ జైల్లో “ఉరి తీశారు”. అనే వార్త కళ్లారా చూసే వరకు కానీ ఎవరికి నమ్మాలనిపించలేదు. ఒకటి రెండు కాదు సుమారు ఏడేళ్లుగా జరుగుతున్న న్యాయపోరాటంలో ఎట్టకేలకు న్యాయం గెలిచింది . చట్టంలో ఎన్ని రకాల మార్గాలున్నాయో అన్నింటిని వాడుకుని తప్పించుకోవాలని చూసిన వారికి శిక్షపడింది.
నిర్భయ తల్లిదండ్రులు అనుభవిస్తున్న మానసిక క్షోభకి కొంతలో కొంత న్యాయం జరిగింది. కూతురిని తీసుకురాలేకపోయినా , కూతురిని అత్యంత పాశవికంగా అత్యచారం చేసి చంపిన ఆ మానవమృగాలకి శిక్ష పడాలనుకున్న ఆ తల్లిదండ్రుల న్యాయపోరాటానికి ఫలితం దక్కింది. నిర్భయకి న్యాయం జరిగింది ,న్యాయం జరిగింది అంటూ యావత్ దేశం ముక్త కంఠంతో మార్మోగిపోతోంది.
“ఆలస్యంగా అయినా సరే మాకు న్యాయం జరిగింది అనుకుంటున్నాను. న్యాయవ్యవస్థ మీద మాకు నమ్మకం పెరిగింది. నిర్భయ దోషులను ఉరి తీయడం వలన ఈ దేశంలోని తల్లిదండ్రులకి కూడా న్యాయం జరిగింది. . మా అమ్మాయికే కాదు , ఇకపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరి తరపున పోరాడతాం అని ఏడేళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత దోషులకి శిక్షపడగానే నిర్భయ తల్లి ఆశా దేవి మాట్లాడిన మాటలు ఇవి.
“నిర్భయ దోషులకి అనేక సార్లు శిక్షలు పడినప్పటికి, తప్పించుకుంటూ వచ్చారు. దీనివల్ల న్యాయవ్యవస్థలో ఎన్ని లొసుగులున్నాయో అవన్ని బయటికి వచ్చాయి. ఆ లోపాలను సరిదిద్దుకుంటూ భవిష్యత్లో ఏ అమ్మాయికి అన్యాయం జరిగిన సత్వరంగా శిక్షపడేలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్భయ తండ్రి బద్రినాధ్ సింగ్.
డిసెంబర్ 16,2012 అర్దరాత్రి నిర్భయ అనుభవించిన నరకాన్ని ఇన్నేళ్లపాటు ఆ తల్లిదండ్రులు అనుభవించారు. కూతురిని చిత్రవధ చేసి నరకం చూపించిన ఆ క్రూరాతి క్రూర మృగాలకి శిక్షపడేవరకు అలుపెరగని పోరాటం చేశారు . అన్ని రకాల సాక్ష్యాలు ఉండి , దోషులు కళ్లముందే తిరుగుతున్నా శిక్షించడానికి ఇంత కాలం పట్టింది. అదే ఏ సాక్ష్యాలు మిగలకుండా పోతున్నా నిర్భయల సంగతి ఏంటో?
watch video: