గతనెల మూడో తేదీన సోషల్ మీడియాలో ఓ పోస్టు బాగా వైరల్ అయ్యింది. ఓ మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఇటుకల బట్టీ దగ్గర నిలబడిన ఫొటో అది.ఈ ఫొటో వెనుక గుండెను బరువెక్కించే విషాదకరమైన కథ ఉంది.ఆకలికి పేద గొప్పా తేడా తెలియదు. తినటానికి తిండి లేకపోయినా ఆకలి అనేది మనిషికే కాదు ప్రతీ జీవికి సర్వసాధారణం.అలా కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ తల్లి కడుపున బిడ్డలకు పట్టెడన్నం పెట్టటానికి చేసిన పని మనస్సుల్ని కలచివేస్తోంది. ఆ తల్లి పడిన బాధ ఏంటో తెలియాలి అంటే కింద ఉన్నా వీడియో చుడండి .అలాగే అందరికి షేర్ చేయండి
News
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం…ఇప్పటి నుంచి ఫేక్ కలక్షన్లు గొడవా ఉండదు
తెలుగు సినిమా ఇప్పుడు రికార్డు వసూళ్ల వలలో చిక్కుకుంది. మా సినిమా ఇంత సాధించింది.. మాది ఇన్ని రికార్డులు బద్దలు కొట్టింది అంటూ – పోస్టర్లు వేసుకుంటూ, ఎవరి డబ్బా వాళ్లే కొట్టుకుంటున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లి `వాళ్లది ఫేక్ కలక్షన్లు..మా హీరో గొప్పంటే .. మా హీరో గొప్ప.. మా హీరో ఈ రేంజ్ లో వసూళ్లు సాదించాడంటే .. కాదు మీవి ఫేక్ ఫేసూల్లు ఇదిగో మా హీరో జెన్యూన్ వసూళ్లు అంటూ ఇంకా ఆయా హీరోల ఫాన్స్ మధ్య గొడవలు నడుస్తూనే ఉన్నాయి.ఈ విషయం గురించి అటు కోలీవుడ్, ఇటు బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఆ హీరోలు టాలీవుడ్ పరువు తీస్తున్నారని టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు
దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్మాతలు కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకున్నారు.నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పడిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమాల రిలీజ్ల విషయంలో నిర్మాతలకు తన వంతు సహకారాన్ని అందిస్తుంది. సినిమాల రిలీజ్ విషయంలో క్లాష్ రాకుండా కీలక పాత్ర పోషించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్… తమ సినిమా వసూళ్ల లెక్కలు ఎవరికి వాళ్లు ప్రకటించుకోకూడదని గిల్డ్ ఓ నియమం విధించింది. ఒకవేళ సినిమా వసూళ్ల వివరాలు ప్రకటించుకోవాల్సివస్తే అందుకు గిల్డ్ అనుమతి తీసుకోవాలి. ఇలా చేస్తే ఫేక్ కలక్షన్ల గొడవ తగ్గుతందున్నది అభిప్రాయం.. మొత్తానికి ఇది మంచి అడుగే. గిల్డ్ నిస్పక్షపాతంగా ఉంటే తప్పకుండా ఫేక్ వసూళ్ల బెడద తప్పుతుంది.మొత్తానికి ఇది సినిమా అభిమానులకు మంచి అడుగే. గిల్డ్ ఖచ్చితంగా పనిచేస్తే ఫేక్ వసూళ్ల బెడద తప్పుతుంది అని సినీ అభిమానులు కోరుకుంటున్నారు
చైనాలో మొదలైన కరోన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. …అలా వైరస్ బారిన పడిన ఒక మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. . అయితే వైద్యులు పుట్టిన బాలుడికి కూడా వెంటనే కరోనా టెస్టులు చేశారు. అదృష్టవశాత్తు బాలుడికి వైరస్ సోకలేదని వైద్యులు తెలిపారు. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లో శనివారం ఈ బాలుడు జన్మించాడు. వైద్యులు తగిన రక్షణ చర్యలు తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేసి బాలుడిని బయటకు తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.కరోనాను ఎదిరించి పుట్టిన ఈ బాలుడి వార్త సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తుంది. నెటిజన్లు అందరూ ఆ బాలుడిని లక్కీ బోయ్ అని అంటున్నారు
Lucky baby: A woman infected with novel coronavirus pneumonia gave birth to a boy with no infection in Zhejiang, China. #FightVirus pic.twitter.com/hQtK1RZUXi
— China Xinhua News (@XHNews) February 9, 2020
మనం చేసిన సహాయం…ఏదో ఒక రూపంలో నిన్ను వెతుకుంటు వస్తుంది అని చెప్పడానికి వీళ్ళ కథే ఒక ఉదాహరణ
ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి.వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి “HELP, HELP” అని అరుస్తూ ఉంటాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు.తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు,ఎవరు బాబు మీరు?? ఎవరు కావాలి?? అని అడుగుతాడు రైతు.”నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి” అంటూ ఒక ఇనప్పెట్టె ఇస్తాడు.అప్పుడు రైతు “క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం, ” అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు.ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు….ఈ అబ్బాయి నీ కొడుకా?? ఏం చదువుతున్నాడు?? అని అడుగుతాడు పెద్దమనిషి.
అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటాడు” అంటాడు రైతు.”అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు” అంటాడు.ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు.పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివిస్తాడు, వాళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు.కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది, డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు, అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు.ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా??పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త “Alexander Fleming”..!!! ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా?? బ్రిటీష్ ప్రధాన మంత్రి ” Winston Churchil” అందుకే అంటారు ” పుణ్యం వూరికే పోదు, కలకాలం తోడొస్తుంది” అని.!!
<
కియారా అద్వానీ తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకలోకాన్ని బుట్టలో వేసుకుందిభరత్ అనే నేను తో పాపులర్ అయినా బాలీవుడ్ స్మార్ట్ బ్యూటీ తరువాత వినయ విధేయ రామ తో మెరిసిన పెద్దగా ఆకట్టుకోలేక పోయింది..
ఆ సినిమా ప్లాప్ అవ్వడం తో మళ్ళి టాలీవుడ్ లో ఇంత వరకు కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీ గా గడిపేస్తూ ఉన్న ఈ బ్యూటీ…ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తి కరమైన విషయాలను పంచుకుంది..ఎవరితో అయినా ప్రేమలో పడితే తనకు శృ0గార0 అభ్యంతరం లేదు అన్నది అది కూడా అవతలి వ్యక్తి పెళ్ళికి ఒప్పుకుంటే మాత్రం ఇష్టమే నట కచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటేనే రిలేషన్షిప్ ని కొనసాగిస్తాను అన్నది.
ప్రస్తుతానికి అయితే ఎవరితోనూ ప్రేమలో లేను అంటూ చెప్పుకు వచ్చింది ఆలా ఎవరినా ఉంటె మీడియా కి కచ్చితంగా వెల్లడిస్తా అన్నది,ఎంతయినా ఇలాంటి కామెంట్స్ ఇవ్వడానికి గట్స్ ఉండాలి కదూ.లేటెస్ట్ సమాచారం మేరకు మహేష్తో తెలుగులో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
ఓ అద్భుతమైన లవ్ ప్రపోజల్ సీన్ ఇది. తన ప్రియురాలిని సముద్రాలు దాటించి.. ఈఫిల్ టవర్ ఎదుట.
వాలెంటైన్స్ డే– ప్రేమికుల దినోత్సవం దగ్గర పడింది. ప్రపంచమంతా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్ వీక్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 7 రోజ్ డే, ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే, ఫిబ్రవరి 9 చాక్లెట్ డే, ఫిబ్రవరి 10 టెడ్డీ డే, ఫిబ్రవరి 11 ప్రామిస్ డే, ఫిబ్రవరి 12 హగ్ డే, ఫిబ్రవరి 13 కిస్ డే చివరిగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకోనున్నారు. ఓ యువతికి బాలీవుడ్ స్టైల్లో లవ్ ప్రపోజ్ చేసిన వీడియోకి నెటిజన్లు ఫిదా అయ్యారు. రెండు వారాల్లో పన్నెండున్నర లక్షల మందికిపైగా ఈ వీడియోను చూశారు.ఏ ప్రేమికుడికైనా తన లవర్కి జీవితకాలం గుర్తుండిపోయేలా ప్రపోజ్ చేయాలని ఉంటుంది. ఊహించని రీతిలో ప్రియుడు తన ప్రేమను చెబుతూ ఎదుట నిలిస్తే.. ఆ యువతి కూడా కలయా నిజమా అన్న ఫీలింగ్లో ఉండడం కామన్. అలాంటి ఓ అద్భుతమైన లవ్ ప్రపోజల్ సీన్ ఇది. తన ప్రియురాలిని సముద్రాలు దాటించి.. ఈఫిల్ టవర్ ఎదుట.. స్నేహితులు, కుటుంబసభ్యుల మధ్య.. బాలీవుడ్ స్టైల్లో డాన్స్ చేస్తూ.. ఓ యువకుడు తన ప్రేమను వ్యక్తం చేశాడు.
అతడి పేరు శ్యామ్ షా న్యూయార్క్లో ఉంటాడు ఆమె పేరు శివానీ బాఫ్నా ముంబైలో ఉంటుంది ,అనుకోకుండా 2015లో ఇద్దరూ ఓ డ్యాన్స్ షో లో కలిశారు.అదిరిపోయే డాన్స్ చేసిన ఆ ఇద్దరూ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అది కాస్తా ప్రేమగా మారింది. దాదాపు ఏడాదిన్నరగా లవ్లో ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఉండేది ఏమో చాల దూరం, ఒకరినొకరు మిస్స్ అవుతున్న ఫీలింగ్ లోనుంచి ఓ అద్భుతమైన ఆలోచనతో ఈఫిల్ టవర్ దగ్గర లవ్ ప్రపోజ్ చేశాడు శ్యామ్.ఆమెను ప్యారిస్కి రప్పించి.. ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి తను ఐ లవ్ యూ చెప్పే వరకూ మొత్తం వీడియో తీయించాడు.ఈ వీడియో రెండు వారాల్లో 13.57 లక్షల మందికి పైగా చూశారు. వాలంటైన్స్ డే దగ్గర పడడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
‘అసలైన హీరోలంటే వీళ్లే…ఈ ఫొటోలు లక్షలాది మంది ప్రజల హృదయాలను తాకుతున్నాయి..ఈ ఫొటోల వెనకున్న కథేంటో మీరే చూడండి.
కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెల్సిందే. ఈ వైరస్ ధాటికి 900 మంది మరణించగా వేలాదిమంది ఇంకా బాధించబడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది వైద్యులకు వైరస్ సోకడం బాధాకరం. అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా వైద్య సేవలు అందించి అలసి సొలసిన కొందరు చైనా డాక్టర్లు, నర్సుల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి. ఈ ఫొటోల వెనకున్న కథేంటో మీరే చూడండి.
ఈ మహమ్మారి నుంచి రక్షించేందుకు పగలు, రాత్రి.. అని తేడా లేకుండా వీళ్లు సేవలందిస్తున్నారు. దీని వెనుక ఎంతో అనుభవం కలిగిన ప్రఖ్యాత వైద్యుల నుంచి ఆస్పత్రిలో పని చేసే సాధారణ నర్సుల వరకు ఎంతోమంది శ్రమ ఉంది. ‘కరోనా వైరస్తో పోరాడే క్రమంలో.. తమ సుదీర్ఘమైన షిఫ్ట్ పూర్తైన తర్వాత మాస్కులు తొలగించాక, ఈ నర్సుల ముఖాలు ఇలా ఉన్నాయి. ఈ ఫొటోలు లక్షలాది మంది ప్రజల హృదయాలను తాకుతున్నాయి. ఈ ఏంజెల్స్కి సెల్యూట్..!’ అంటూ రాసుకొచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం ఈ నర్సులు పడుతోన్న శ్రమను ప్రశంసిస్తూ నెటిజన్లు ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.
Real Hero ???
నిన్నటి మ్యాచ్ లో రాహుల్ ని ఉద్దేశించి న్యూజీలాండ్ ప్లేయర్ నీషమ్ ట్విట్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాహుల్
నిన్న జరిగిన చివరి వన్డేలో భారత్ పై న్యూజిలాండ్ అయిదు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. రాహుల్ (112) శతకంతో మెరిశాడు. అయితే 20వ ఓవర్ లో రాహుల్ సింగిల్ కోసం ప్రయత్నించగా నీషమ్ అతడికి ఎదురుగా వచ్చాడు. దీంతో రాహుల్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయినా తర్వాత వెంటనే ఇద్దరూ నవ్వుకొన్నారు.న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. సరదా ట్వీట్లతో సందడి చేస్తుంటాడు. తాజాగా టీమ్ ఇండియా బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
నిజంగా ఆ ఫోటో చూస్తే.. వాళ్లు గొడవ పడుతున్నట్లు ఉండదు.. ఈ పేపర్, సీజర్స్ ,రాక్స్ గేమ్ ఆడుతున్నట్లుగానే ఉంటుంది. అంతేకాకుండా.. రాహుల్ ని ట్యాగ్ చేస్తూ.. ఏప్రిల్ వరకు కొన్ని పరుగులు దాచిపెట్టుకో అంటూ మరో ట్వీట్ చేశాడు.అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో నీషమ్ ను పంజాబ్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ లో కూడా రాహుల్ రాణించాలనే ఉద్దేశంతో నీషమ్ అలా ట్వీట్ చేశాడు.
పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు. దానికి అసలు కారణం ఇదే
మనం తరచూ కరెంటు వైర్ల మీద కూర్చునే కాకులు, పిట్టల్ని చూస్తుంటం వీటికి షాక్ కొట్టదా? అనిపిస్తుంటుంది మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఎవరికైనా పెద్దవారికి వేస్తే వారు చెప్పే సమాధానం మనకు తృప్తినివ్వదు. కరెంటు వైర్ల మీద కూర్చునే పక్షులకి షాక్ కొట్టదు! అందుకు రెండు కారణాలున్నాయి. అవేంటంటే….
అదే నిజమైతే…ప్రభాస్ ఇంకో మూడు సంవత్సరాలు కనిపించకపోవచ్చు! ఫాన్స్ పరిస్థితి ఏంటో?
బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. సాహో కి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అతని అభిమానులు అందరు అతని నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పూజ హెగ్డే సరసన ప్రభాస్ నటించబోయే సంగతి అందరికి తెలిసిందే. సాహో విడుదలకు ముందే దర్శకుడు రాధా కృష్ణ తో మూవీ మొదలుపెట్టినప్పటికీ, ప్రభాస్ సాహో ప్రొమోషన్స్ లో బిజీగా గడుపుతూ ఈ మూవీ షూటింగ్ పక్కన పెట్టాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి సరికొత్త అప్డేట్ వచ్చింది.
ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ వచ్చేది 2021లోనే అంట. ఎందుకంటే సినిమా షూటింగ్ మొదలెట్టి సంవత్సరం దాటినా ఇప్పటివరకు సగం షూటింగ్ కూడా అవ్వలేదంట. ఇది ఇలా ఉంటె మరో క్రేజీ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. రాజమౌళి ప్రభాస్ నిర్మాణ భాగస్వాములు కానున్నారట. ఆ బ్యానర్ లో వచ్చే సినిమా కూడా వారి కాంబినేషన్ లోనే అంట. దీని గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, ఇద్దరు సదాభిప్రాయంకి వచ్చారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇక వీరి ప్రాజెక్ట్ 2021 చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ల్లో తెరకెక్కడం ఖాయం. వీరిద్దరి కాంబినేషన్ అంటే కనీసం సినిమా విడుదల అవ్వడానికి మూడు సంవత్సరాలైనా పడుతుంది అని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి దీని గురించి కచ్చితంగా తెలియాలంటే ప్రభాస్ రాజమౌళి అప్డేట్ ఇచ్చేవరకు వేచి చూడాలి!