ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినప్పటి నుండి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి తరచుగా ఏదో ఒక వార్త చర్చల్లో నిలుస్తునే ఉంది. రాళ్ల దాడులు, వరుసగా ప్రమాదాలు, వందే భారత్ ట్రైన్ లో నీళ్లు కారడం లాంటి అనేక సంఘటనలు వింటూనే ఉన్నాం.
తాజాగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రైల్వే ఉన్నతాధికారులు ఈ ఘటన పై దర్యాప్తు చేపట్టారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వందేభారత్ ట్రైన్స్ తో రైల్వే డిపార్ట్మెంట్ లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ రైళ్లు వేగవంతంగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. అది మాత్రమే కాకుండా ప్రయాణికుల కోరిక మేరకు ప్రతి నెలా కొత్త వందే భారత్ రైళ్లను మొదలుపెడుతున్నారు. ఇక ఇప్పటిదాకా మధ్యాహ్న సమయంలో మాత్రమే ఈ ట్రైన్స్ నడుస్తున్నాయి. అయితే వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.
అయితే రైలు, బస్సు, విమానం వంటి వాటిలో ప్రయాణం చేయాలంటే ఎవరైనా సరే టికెట్ ఉండాల్సిందే. అయితే తాజాగా యూపీకి చెందిన కానిస్టేబుల్ వందే భారత్ రైలులో టికెట్ లేకుండా ప్రయాణించాడు. ఆయన తన పక్క సీట్లో తన లగేజ్ పెట్టుకున్నారు. టీసీ ప్రయాణికులందరి దగ్గర టికెట్ చెక్ చేస్తూ వచ్చారు. కానిస్టేబుల్ ను టికెట్ చూపించమని ఆడడడంతో టికెట్ లేదని, తాను ఎక్కాల్సిన రైలు మిస్ అవడంతో, ఈ ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందని చెప్పారు.
దాంతో టికెట్ లేకుండా ఎలా ఎక్కుతారని, అలా అసలు ఎక్కకూడదని టీసీ చెప్పారు. నెక్స్ట్ స్టేషన్లో అతన్ని దిగిపోమని సూచించారు. ఈ ఘటనను రైల్లో ఉన్న పాసింజర్లు వీడియో తీసి, నెట్టింట్లోషేర్ చేశారు. ఆవీడియో వైరల్ అవడంతో ఈ విషయం రైల్వే శాఖ వరకూ వెళ్లింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. https://twitter.com/razzbsingh/status/1711266701483159844?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1711266701483159844%7Ctwgr%5E9112c634cf91eb6f719a50387a6ea7f88a8eab96%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fnational%2Fviral-video-up-police-personnel-boarded-vande-bharat-without-ticket-tte-reprimanded-719966.html Also Read: ఐఫోన్ మీద ప్రేమతో ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..? డైరెక్ట్ షాప్ కి వెళ్లి..?


ఇజ్రాయెల్లో భారత సంతతికి చెందిన యూదులు సుమారు 95,000 మంది, భారతీయులు 18,000 మంది నివసిస్తున్నారని తెలుస్తోంది. యుద్ధం జరుగుతున్నప్పటికీ కొందరు భారతీయులు పెద్దగా ఆందోళన పడడం లేదు. సెక్యూరిటీకి సంబంధించిన సూచనలను పాటించినట్లయితే ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. దాడి ఎక్కువగా ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోనే జరుగుతుందని, మిగతా ప్రాంతాల్లో అంతగా దాడులు జరగట్లేదు. అందువల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటే దాడుల వల్ల కలిగే ప్రమాదం తక్కువ అని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు.
రాకెట్లు ఎక్కువగా అష్కెలోన్ సిటీలోనే పడ్డాయి. ఇక ఈ ప్రాంతంలో ఉండే తెలంగాణకు చెందిన ఎల్లే ప్రసాద్ ”చాలా అలర్ట్ గా ఉండాలి, సైరన్ మోగిన వెంటనే షెల్టర్కు వెళ్ళాలి” అని అన్నారు. హిబ్రూ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ స్టూడెంట్ బిందు మాట్లాడుతూ సేఫ్టీ ప్రోటోకాల్లను ఫాలో అయ్యానని, సురక్షితంగా ఉన్నానని వెల్లడించారు. అలాగే ఇండియన్ స్టూడెంట్స్ అందరూ పరస్పరం టచ్లోనే ఉన్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారని తెలిపారు.
రజాకార్ సినిమాను యాటా సత్యనారాయణ తెరకెక్కిస్తుండగా, బిజీపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రం కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్కు రాలేదంటూ ఈ టీజర్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు హిందువులను ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం రాజ్యంగా చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన దారుణాలను, అరాచకాలను తెరకెక్కించినట్టుగా చూపించారు.
ఈ టీజర్ చూసిన మత పెద్దలు, నెటిజన్లు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టీజర్ మొత్తంలో రజాకార్ల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేస్తూ, వారిని చెడ్డగా చూపించేందుకు ప్రయత్నం చేశారని అంటున్నారు.చరిత్రను వక్రీకరించి కొందరు ఈ మూవీని తీశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం, తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
సీపీఎం పార్టీ లీడర్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ లీడర్ల సారథ్యంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు మరియు భూస్వాముల మధ్య జరిగిన సాయుధ పోరాటానికి, కొందరు కులం, మతం రంగును అద్దుతున్నారని, ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అయితే ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయని, అందుకే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఐ ఫోన్ సిరీస్ లు వచ్చిన వెంటనే అమ్ముడవుతాయి. రీసెంట్ గా కొత్తగా ఐఫోన్ 15, ప్రో మాక్స్ రిలీజ్ అయ్యాయి. అలా రాగానే ఐ ఫోన్ లవర్స్ ఎగబడి మరి వాటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఐఫోన్ అంటే ఇష్టం ఉన్న ఒక బిచ్చగాడు చిల్లర నాణేలను యాపిల్ స్టోర్కు తీసుకువచ్చి, ఆ నాణేలతో యాపిల్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఆ వీడియోలో మాసిపోయిన బనియన్, లుంగీతో శరీరం అంతా మురికితో ఒక బిచ్చగాడు, జనాలతో రద్దీగా ఉన్న యాపిల్ స్టోర్కు వెళ్ళాడు. ఒక సంచీని భుజానికి వేసుకుని ఉన్నాడు. అయితే స్టోర్ లో ఉన్నవారు ఏం జరుగుతుందో అర్థం కాక అతన్ని చూడడం మొదలుపెట్టారు. ఆ బిచ్చగాడు కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ యాపిల్ ఫోన్ కొనడం కోసం స్టోర్కు వచ్చినట్లు చెప్పాడు. అది విన్నవారు అతను జోక్ చేస్తున్నాడని భావించారు. అయితే అతను తాను తీసుకువచ్చిన సంచీలో ఉన్న డబ్బును చూపించడంతో అందరూ షాక్ అయ్యారు.
సంచిలో తీసుకువచ్చిన చిల్లర అంతా స్టోర్లోని ఫ్లోర్ పై పోసి, వాటిని తీసుకుని యాపిల్ ఫోన్ 15 ప్రో మాక్స్ ఇవ్వామని అడిగాడు. ఇక ఆ స్టోర్ సిబ్బంది అందరూ ఆ నాణేలను లెక్కించగా, రూ.1.59 లక్షల ఉంది. అవి తీసుకుని అతనికి ఐఫోన్ ను ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియోను తీసి, సామాజిక మధ్యమంలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్ గా మారింది. కానీ కొంత మంది మాత్రం ఇది ప్రాంక్ వీడియో అని అంటున్నారు. మరి కొంత మంది అయితే నిజంగానే ఇలా జరిగింది అంటున్నారు. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ కేసులో ముఖ్యంగా సెక్షన్ 17A చుట్టూ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే 17A సెక్షన్కు చెందిన వివిధ అంశాలు, గతంలో కొన్ని కేసుల్లో ఇచ్చిన తీర్పుల గురించి ధర్మాసనం ముందు ఉంచారు. వాటిలో రఫేల్ కొనుగోళ్ల విషయంలో యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అలాగే రఫేల్ కేసులో ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ముందు ఉంచారు. రఫేల్ కొనుగోళ్ల పై 2019లో యశ్వంత్ సిన్హా వేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ కేఎం జోసెఫ్ డిస్మిస్ చేసిన విషయాన్ని కోర్టుకు గుర్తుచేశారు.
బుల్లర్ కేసుతో పాటు పలు కేసులలో తీర్పులను వివరించిన సాల్వే, స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు పై రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదని అన్నారు. ఈ కేసులో బుల్లర్ కేసులో ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నానని ధర్మాసనాన్ని సాల్వే కోరారు. చంద్రబాబు పై రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ను తాను సవాల్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. దానిలో ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరు లేదని సాల్వే వాదించారు. ఆ తరువాత ఏపీ సీఐడీ తరఫున లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
రోహత్గీ వాదిస్తూ, 2018కి ముందు కొంతవరకు విచారణ జరిగి ఆగిపోయిందని, అంతేకాని విచారణ జరగలేదని కాదని వాదించారు. హైకోర్టులో విచారణ పూర్తి అయ్యాక పత్రాలు ఇచ్చామని, దానిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. 2018 చట్ట సవరణ చేసిన అనంతరం చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చితే, దానిని రాజకీయ ప్రతీకార చర్యగా వ్యవహరించకూడదని అన్నారు.
చంద్రబాబు మీద తగిన ఆధారాలు లభించిన అనంతరం 2021లో కేసు రిజిస్టర్ చేశారని, ఈ కేసులో ఆయనను ఎప్పుడు చేర్చినా కూడా విచారణ కొనసాగుతున్నట్లుగా పరిగణించాలని కోర్టులో వాదించారు. ఇక నేరం ఎప్పుడు జరిగిందో, అప్పుడు ఉన్న చట్టం ప్రకారంగానే విచారణ చేయాలని సుప్రీం కోర్టు ముందుకు తీసుకెళ్లారు. తదుపరి విచారణను సుప్రీం కోర్టు శుక్రవారంకు వాయిదా వేసింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 30 రోజులుగా జైల్లో ఉన్నారు. ఈ కేసులో సెప్టెంబరు 10న అరెస్ట్ అయిన చంద్రబాబు, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్టోబరు 5న మూడవసారి ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
ఫైబర్నెట్, అమరావతి రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు A-24గా, అమరావతి రింగ్ రోడ్డు కేసులో A-1 గా, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. అయితే సీఐడీ అధికారులు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ను కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
మరో వైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తన పై రిజిస్టర్ చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తరపున దాఖలు అయిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేదీ బెంచ్ ముందు సీఐడీ తరపున లాయర్ రోహత్గీ, మాజీ సీఎం చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే, మనుషేక్ సింగ్ సింఘ్వీ వాదించారు. 17ఏ చుట్టూనే వాదనలు జరుగుతున్నాయి. రాజకీయల వల్ల కక్ష సాధింపుకు పాల్పడకుండానే సెక్షన్ 17ఏను తీసుకొచ్చారని లాయర్ హరీశ్ సాల్వే వాదిస్తున్నారు.


ఈ సంఘటన 2018 లో ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హెడ్ మాస్టర్ పేరు డి బాలు. తమిళనాడులోని విల్లుపురంలో మునిసిపల్ సెకండరీ పాఠశాలకు హెడ్ మాస్టర్ పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాలకు ఆ ప్రాంతంలోని విద్యార్థులు హాజరుకాకపోవడం అనేది అక్కడ చాలా సాధారణ విషయం. దాంతో విద్యార్థులు పాఠశాలకు తీసుకురావడానికి ప్రత్యేకంగా ఏదైనా చేయాలని, అక్కడ ఉన్న కట్టుబాటును మార్చాలని డి బాలు నిర్ణయించుకున్నారు.
ఆ హెడ్ మాస్టర్ వయసు 56 ఏళ్ళు , ఆయన గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. చదువు మీద ఇంట్రెస్ట్ లేక పాఠశాల మానేసిన పిల్లలు, పాఠశాలకు హాజరు కానీ విద్యార్థులు, చదువును నిర్లక్ష్యం చేసే విద్యార్థుల ఇళ్ళకు ఆ హెడ్ మాస్టర్ ప్రతిరోజూ వెళతాడు. విద్యార్థుల తల్లిదండ్రులను పిల్లలను పాఠశాలకు పంపించమని వారిని అభ్యర్థిస్తాడు. ఒక విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం లేదు. దాంతో బాలు మోకాళ్ళపై కూర్చుని చేతులు జోడించి చదువుకోమని వేడుకుంటున్నాడు.
విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, బాగా చదువుకుని జీవితంలో పురోగతి సాధించాలని చెప్తూ బతిమిలాడుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. విద్యార్థుల ఫ్యూచర్ కోసం ఈ హెడ్ మాస్టర్ గారు చేస్తున్న పనికి నెటిజెన్లు అభినందిస్తూ కామెంట్లు పెట్టారు.
మానసిక చికిత్స పొందుతున్న ఆ మహిళతో సాన్నిహిత్యం ఏర్పడడంతో ప్రమీల ఆమె గురించి అడిగింది. అప్పుడు సదరు మహిళ తాను మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందినట్టుగా, తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపింది. మూడు సంవత్సరాల క్రితం తాను ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలులో ఎక్కానని చెప్పారు. ఆమెకు తన కుటుంబ సభ్యులను సంప్రదించడానికి వివరాలు కూడా లేకపోవడంతో పుదుక్కోట్టైలో చిక్కుకుపోయానని ఆ మహిళ చెప్పింది.
వివరాలు తెలుసుకున్న ఆ మెడికల్ స్టూడెంట్ ఆ మహికు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆ మహిళ ఫొటోను మరియు వివరాలను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఆ మహిళ పేషెంట్ స్నేహితురాలికి ఆ పోస్ట్ కనిపించింది. స్నేహితురాలు వెంటనే వీడియో కాల్ చేసి మహిళతో మాట్లాడింది. గత శుక్రవారం ఆ మహిళను ఆమె భర్తతో మాట్లాడించారు.
వీడియో కాల్ తర్వాత, మహిళ కుటుంబం తరువాతి రోజు శనివారం ఆమెను కలవడానికి పుదుక్కోట్టైకి వచ్చింది. ఆ మహిళ తప్పిపోయినపుడు ఆమె కుటుంబసభ్యులు లోకల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. కానీ ఆ మహిళ ఆచూకీ దొరకలేదు. దాంతో ఆమె మరణించి ఉంటుందని అనుకున్నారు. మానసిక చికిత్స వల్ల మహిళ పరిస్థితి మెరుగుపడిన తరువాత ఆమెకు తన వివరాలు గుర్తుకు వచ్చాయి. ఒక్క పోస్ట్ వల్ల మూడు సంవత్సరాల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకుంది.