ఇండోనేషియాలో ఇటీవల జరిగిన ఒక సంఘటన చర్చల్లో నిలిచింది. సాధారణంగా సినిమాలో మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నిజ జీవితంలో ఇలాంటివి జరగడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. వివరాల్లోకి వెళితే, టీవీ9 తెలుగు కథనం ప్రకారం, ఇండోనేషియాలోని బంగ్కా ద్వీపానికి చెందిన రెనాటా ఫదేయా వయసు 24 సంవత్సరాలు. ఆమె తనకంటే 38 సంవత్సరాలు పెద్దవాడైన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ మధ్య ఇలా వయసులో చాలా పెద్దవారైన వాళ్లని వివాహం చేసుకుంటున్నారు. ఇందులో వింత ఏం ఉంది అనుకోవద్దు.

ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆ వ్యక్తి మొదటి పెళ్లి సమయానికి రెనాటా ఫదేయా వయసు 9 సంవత్సరాలు. ఆయన 2009 లో మొదటి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళికి రెనాటా ఫదేయా అతిథిగా వెళ్లారు. అప్పుడు ఆమె చాలా చిన్న పిల్ల. రెనాటా ఫదేయా భర్త 2011 లో రెండవ భార్యతో విడిపోయారు. ఆయనకి రెండవ వివాహంలో పిల్లలు లేరు. మొదటి వివాహంలో ఒక బిడ్డ ఉంది. రెనాటా ఫదేయా తన భర్తని మళ్లీ 2019 లో కలిశారు. 2020 లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. టిక్ టాక్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ, తన భర్తని తాను 2019 లో మాత్రమే కలిశాను అని అనుకున్నారు అని, కానీ ఇద్దరు బంధువులు అని, ఈ విషయం తనకి ఇటీవలే తెలిసింది అని, 15 సంవత్సరాల క్రితమే తన భర్తని కలిసినట్టు ఒక పోస్ట్ షేర్ చేశారు.
అందులో భాగంగానే ఆమె మొదటి భర్త పెళ్లిలో ఆమె అతిథిగా వెళ్ళిన ఫోటోని, అలాగే ఇప్పుడు అదే భర్తతో, తన బాబుతో ఉన్న ఫోటోని రెనాటా ఫదేయా షేర్ చేశారు. ఇప్పుడు రెనాటా ఫదేయాని తన భర్త చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పారు. సాధారణంగా సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. అంటే, ఇప్పుడు భార్య భర్తలు అయిన ఇద్దరు చిన్నప్పుడే తెలియకుండా కలవడం, ఆ సమయంలో ఫోటోలు తీసుకోవడం వంటివి సోషల్ మీడియాలో అంతకుముందు కూడా షేర్ చేశారు. ఇప్పుడు రెనాటా ఫదేయా కూడా తన భర్తని తాను చిన్నప్పుడే కలిసిన ఫోటోని షేర్ చేశారు.

ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి చాలా సార్లు చర్చలు జరిగాయి. ఎందుకు చేసుకోలేదు అంటూ అడుగుతూనే ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖులు, హీరోయిన్లు సైతం రాహుల్ గాంధీని వివాహం చేసుకుంటాం అని ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతగా చర్చకు దారితీసిన పెళ్లి గురించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సమాధానం చెప్పారు. 2022లో సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 137 రోజుల సుదీర్ఘ పాదయాత్రను శ్రీనగర్లోని చారిత్రాత్మక లాల్ చౌక్లో ముగించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు ఐదు నెలల్లో 4,080 కిలోమీటర్లు సాగింది.
ఆ సమయంలో రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజల్లో ఉంటూ సామాన్యులను కలిసి మంచి చెడ్డలు తెలుసుకున్నారు. ఆ క్రమంలో కాలేజ్ స్టూడెంట్స్తో కూడా ముచ్చటించారు. అయితే వారిలో ఒక స్టూడెంట్ పెళ్లి గురించి రాహుల్ గాంధీని అడిగారు. ఆ ప్రశ్నకు ‘తన పనులు మరియు పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయినందువల్ల వివాహం గురించి ఆలోచించలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు.




















