హళ్లాహళ్లి లేక్ ప్రాంతంలోని న్యూ తమిళ్ కాలనీలో ముక్కులు బద్దలైపోయే దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు ముందుగా ఎలుక ఏమైనా చనిపోయి ఉండవచ్చని వెతకడం మొదలుపెట్టారు.
అప్పుడే వాళ్లలో ఒకరికి నాలుగు రోజుల క్రితం నుంచి నాగమ్మ, రూప అనే తల్లి కూతురు కనబడుటలేదు అనే విషయం గుర్తుకు వచ్చింది. సమయంలో అక్కడికి వచ్చిన వ్యక్తి నాగమ్మ ఇంటి తలుపులు బద్దలు కొట్టగా వారికీ షాకింగ్ దృశ్యం కంటపడింది.

కుళ్లిన స్థితిలో ఉన్న నాగమ్మ మరియు ఆమె కుమార్తె రూప మృతదేహాలను చూసి భయభ్రాంతులయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు
అసలు వివరాల్లోకి వెళ్తే నాగమ్మ, రూప గత కొన్ని సంవత్సరాలుగా న్యూ తమిళ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రూప హోంగార్డుగా విధులు నిర్వహించేదని అయితే కొన్ని కారణాల వల్ల కొద్ది నెలల క్రితం హోంగార్డ్ విధుల నుంచి సస్పెండ్ అయ్యిందని పోలీసులు తెలియజేశారు.

రూపకి పదేళ్ల క్రితమే పెళ్లి అయినా కుటుంబ సమస్యల కారణంగా ఆమె భర్తకు పిల్లలకు దూరంగా ఉంటుందని, అప్పటినుంచి తల్లితో కలిసి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. తరచూ ఇద్దరి మధ్య ఏదో ఒక కారణంతో గొడవ జరుగుతుందని, గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తల్లి, కుమార్తెలు ఇద్దరు మద్యానికి బానిస అయ్యారు అని స్థానికులు పోలీసుల విచారణలో తెలియజేశారు.
నాగమ్మ మరియు ఇద్దరి మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇద్దరి మరణానికి గల కారణాలేమిటో అనేది పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పష్టమవుతుందని పోలీసులు తెలియజేశారు.












ఢిల్లీ ఎన్ పి ఆర్ మార్కెట్ లో 15 రోజుల కిందట కిలో చికెన్ 180 రూపాయలు ఉంటే రిటైల్ ధర ప్రస్తుతం 260 చేరింది. ఇక ఆన్లైన్లో బుక్ చేసుకునే వారైతే కిలోకి 320 రూపాయల నుంచి 340 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గత 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ ధరలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పౌల్ట్రీ వ్యాపారం దెబ్బతింది.
ఈ ప్రభావం ధరలపై కనిపిస్తోందని వ్యాపారస్తులు చెబుతున్నారు. అందుకే 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ కొరత ఏర్పడిందని దీనిద్వారా ధరలు పెరిగాయని అంటున్నారు. గత రెండు వారాల ముందు ధర 180 రూపాయల నుంచి 200 రూపాయలకు ధర అందుబాటులో ఉండేదన్నారు.
కానీ ప్రస్తుతం దీని ఖర్చు మార్కెట్ ధరలు 200 వరకు రావడంతో వ్యాపారస్తులు 250 నుంచి 2020 వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇలా రోజురోజుకు ధర పెరుగుతూ, ఢిల్లీలో కిలో చికెన్ ధర 245 రూపాయల నుండి 270 వరకు ఉన్నది. ఇక ఆన్లైన్లో మాత్రం ధర దాదాపు కిలోకి 350 పైనే ఉంది.మళ్లీ ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో, చికెన్ ప్రియులకు శుభవార్త ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.


ఈ వాహనానికి రిజిస్ట్రేషన్, సబ్సిడీ ఫ్రీగా కేంద్రం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎడాపెడా ఎలక్ట్రికల్ వాహనాలు కొనేస్తున్నారు. రోజుకో మోడల్ చొప్పున వివిధ రకాల కంపెనీలు మార్కెట్లోకి ఈ ఎలక్ట్రికల్ మోటార్ సైకిళ్లను తీసుకొస్తున్నాయి. ఇక మన హైదరాబాద్ నగరంలో సుమారుగా 5 నుంచి 6 కంపెనీలు వాహనాలను తయారు చేస్తూ ఉన్నాయి.
ఇక్కడే మొదలైంది అసలు బాధ. ఇప్పటివరకు ఈ వాహనాలు కొనుగోలు చేసిన వాటిలో చాలా వాహనాలు కాలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రికల్ మోటార్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు రావడం, ఛార్జింగ్ పెడుతున్న సమయంలో బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంలో మంటలు వ్యాపించడానికి ప్రధానకారణం బ్యాటరీ లో లోపాలు అని వారు నివేదికలో తెలియజేశారు. ఆ లోపం వల్లనే ఛార్జింగ్ పెట్టే సమయంలో బ్యాటరీలు పేలడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు.

