కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రెండ్ సృష్టించిన టెలికాం కంపెనీ టాటా డొకోమో. దీన్ని భారతదేశంలో ఎక్కువ శాతం మంది వాడేవారు. అందుకు కారణం వీళ్లు అందించిన సెకండ్ కి ఒక్క పైసా సర్వీస్. అంతే కాకుండా సిగ్నల్ కూడా చాలా బాగా వచ్చేది. అయితే ఇంతగా క్రేజ్ సంపాదించుకున్న డొకోమో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇంటర్నెట్ నుండి సేకరించిన వివిధ ఆధారాల ప్రకారం డొకోమో అర్ధాంతరంగా ఆగిపోయినందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జపాన్ కి చెందిన ఎన్టీటీ డొకోమోతో కలిసి టాటా సంస్థ డొకోమోని టాటా డొకోమోగా భారతదేశంలో పరిచయం చేసింది. ఆ సమయంలో అన్ని కంపెనీలు నిమిషానికి ఇంత అని డబ్బులు కట్ చేసే వాళ్ళు. కానీ డొకోమో మాత్రం సెకండ్ లెక్కన డబ్బులు కట్ చేసేది. ఈ కారణంగా మిగిలిన కంపెనీలు కూడా సెకండ్ లెక్కన డబ్బులు చార్జ్ చేయడం మొదలుపెట్టాయి. ఈ కారణంగా మొబైల్ యూజ్ చేసే యూజర్ల బిల్ 15 నుండి 12 శాతం వరకు తగ్గింది.
టాటా టెలి సర్వీసెస్ తీసుకొచ్చిన ఈ మార్కెటింగ్ స్ట్రాటెజీ వల్ల ఎంతోమంది మొబైల్ వాడే వాళ్ళకి లాభం కలిగింది. కానీ కంపెనీ రెవెన్యూ తగ్గిపోయింది. జపాన్ కంపెనీ అయిన ఎన్టీటీ డోకోమో ఈ వెంచర్ లో దాదాపు 14 వేల కోట్ల డబ్బులని ఇన్వెస్ట్ చేసింది. ఇదిలా ఉండగా, 2010 లో 2G స్కామ్ అందరి ముందుకు వచ్చింది. 2010 లో అత్యున్నత ఆడిటింగ్ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ టెలికాం శాఖ, లైసెన్సుల జారీ విషయంలో చేసిన పొరపాటుకి సంబంధించిన నివేదికను వెల్లడించింది.
వినోద్ రాయ్ నేతృత్వంలోని కాగ్, టెలికాం ఆపరేటర్లకు 2G లైసెన్సులు జారీ చేయడం వల్ల 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రకటించింది. అంతే కాకుండా కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని బహిర్గతం చేసిన వారికి, అలాగే నకిలీ పత్రాలను సమర్పించిన వారికి, అంతే కాకుండా మోసపూరిత మార్గాలను ఉపయోగించి స్పెక్ట్రమ్ యాక్సిస్ చేసిన వారికి కూడా లైసెన్సులు జారీ చేయబడ్డాయి. ఈ 2G స్కామ్ డొకోమోపై కూడా ఎంతో ప్రభావం చూపింది. 
అప్పటి నుంచి టాటా టెలి సర్వీసెస్ సరైన మార్గంలో వెళ్లలేకపోయింది. కంపెనీ టెలిఫోన్ టవర్లు సంఖ్య తగ్గించేశాయి. మార్కెట్ షేర్లలో ఈ కంపెనీ వాటా తగ్గిపోతూ వచ్చింది. డొకోమో, టాటా టెలి సర్వీసెస్ అధికారుల మధ్యలో అభిప్రాయభేదాలు రావడం మొదలయ్యాయి. వ్యాపారాన్ని ముందు ఎయిర్సెల్, తర్వాత వోడాఫోన్ కి అమ్మేద్దాము అని అనుకున్నారు. కానీ ఎటువంటి ఫలితం దొరకలేదు.
మిగిలిన టెలికాం సర్వీసెస్ కంటే ముందే డొకోమో 3G సర్వీసెస్ ని లాంచ్ చేసింది. కానీ దీన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశాలు తగ్గిపోవడంతో డొకోమో బయటికి వచ్చేద్దామని నిర్ణయించుకుంది. ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది. చివరిలో డొకోమో డబ్బులు తీసుకొని టాటా సర్వీసెస్ నుండి వెళ్ళిపోయింది.
జూలై 2017 ప్రకారం టాటా డొకోమోకి కేవలం 3.16% యూజర్లు ఉన్నారు. అంటే దాదాపు 42 లక్షల మంది యూజర్లు అన్నమాట. ఇవన్నీ కాకుండా జియో రావడంతో మిగిలిన కంపెనీలన్నిటికీ మెల్లగా యూజర్లు తగ్గడం మొదలైంది. దాంతో టాటా టెలికాం సర్వీసెస్ వేరే వాళ్ళకి అమ్మేసేయాల్సి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వెల్లడించిన నివేదిక ప్రకారం టాటా టెలి సర్వీసెస్ కి దాదాపు 4,617 కోట్ల నష్టం వచ్చింది. ఈ కారణంగానే టాటా డొకోమో వారి సేవలను నిలిపివేయాల్సి వచ్చింది.

రెస్టారెంట్లలో జీఎస్టి అమలులోకి వచ్చిన అనంతరం, రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్ల దగ్గర జీఎస్టి పేరుతో ఎక్కువగా వసూలు చేస్తున్నారనే విషయం తెలిసొందే. చిన్నపాటి ఏసీ రెస్టారెంటులో ఫుడ్ తిన్నాకూడా కనీసం 18 శాతం జీఎస్టి కట్టాల్సి వస్తోంది. దీనికి తోడు సర్వీస్ చార్జి మరో పది శాతం. చాలా హోటళ్లు జీఎస్టి లెక్కపెట్టేటప్పుడు సర్వీస్ చార్జిని కూడా కలుపుతున్నాయి.
అయితే కొన్ని రెస్టారెంట్స్ కంపోజిషన్ ట్యాక్స్పేయర్ గా ఉన్నప్పటికీ కూడా బిల్ లో జీఎస్టిని కూడా కలిపి, కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఈ టాక్స్ పేయర్స్ గా ఉన్న రెస్టారెంట్స్ లో జీఎస్టి కట్టాల్సిన అవసరం లేదు. మరి కంపోజిషన్ ట్యాక్స్పేయర్ అవునో కాదో తెలుసుకోవాల్సి ఉంటుంది.
బిల్లు పై ఉన్న GST చెల్లించాలా వద్దా అని ఎలా చెక్ చేయాలంటే..?
అందరికి డబ్బులను పర్సులో పెట్టుకోవడం అనే అలవాటు ఉంటుంది. అయితే ఆ పర్సును ప్యాంట్ వెనక జేబులో పెట్టుకోవడం ఆరోగ్యానికి ప్రమాదం అనే విషయం చాలామందికి తెలియదు. పర్సుకానీ, వాలెట్ని కానీ మగవారు మరియు కొందరు స్త్రీలు బాక్ పాకెట్లో పెట్టుకుంటారు. అలా పెట్టకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని, ఓ వయసు వచ్చేసరికి, వారు సరిగా నడవలేక, వంగిపోతారని దానికి కారణం పర్సును వెనక ప్యాంట్ జేబులో పెట్టుకోవడం వల్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అది మాత్రమే కాకుండా ఎక్కువసేపు వెనక ప్యాంటు జేబులో పర్సు పెట్టుకోవడంతో “ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్” అనే సమస్య కూడా వస్తుందని చెబుతున్నారు. పర్సు అలా పెట్టుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. తరుచుగా మెడ, వెన్ను, భుజాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం పర్సుని వెనుక జేబులో పెట్టడమేనని అంటున్నారు.
వెనుక జేబులో పర్సు పెట్టుకుని ఎక్కువ సేపు కూర్చొనేవారికి నడుముకు సంబంధించిన సమస్యలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పర్సులను జేబులో పెట్టుకొని గంటలపాటు కూర్చొనేవారికి, డ్రైవింగ్ చేసేవారికి తీవ్ర నడుము నొప్పి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వాలెట్ జేబులో పెట్టుకుని కూర్చోవడం వల్ల వెన్నుముక చివరి భాగం పై ప్రెజర్ పడుతుంది. బరువైన, ఎత్తుగా ఉండే వాలెట్ పై కూర్చోవడం వల్ల కండరాల సామర్థ్యం తగ్గుతుంది. దీంతో కండరాలలో విపరీతమైన నొప్పి కలుగుతుందని సూచిస్తున్నారు.
వాలెట్ లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వోచ్చర్స్, ఆధార్ కార్డుల వంటి పలు కార్డులు పెట్టుకోవడం వల్ల అది బరువుగా మారిపోతుంది. దాన్ని బ్యాక్ జేబులో పెట్టుకోవడం వల్ల తుంటి కండరాలు మరియు కీళ్లు ఒత్తడి పడి, ఒంగిపోతాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు వాలెట్ ను బ్యాగ్ లో లేదా, డెస్క్ లో పెట్టుకోవాలి. వాహనాలు డ్రైవ్ చేస్తున్నప్పుడు బైక్ కవర్లో కానీ, కారు డెస్క్లో కానీ పెట్టాలి. పర్సులో అనవసరమైన వాటిని తొలగించాలి. సాఫ్ట్ గా ఉండే పర్సు వాడాలి. పర్సులో కాయిన్స్, కార్డులు లేకుండా నగదు ఉండేలా జాగ్రత్తగా పడాలి.
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో నివసించే దీక్షిత జోషి, 2022లో జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో 58వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, దీక్షితా సివిల్స్ ఎగ్జామ్ రాయడం కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. స్వయంగా సివిల్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అయింది.
దీక్షితా జోషి తండ్రి ఫార్మసిస్ట్, తల్లి ఇంటర్ కళాశాలలో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఆమె ఆర్యమాన్ విక్రమ్ బిర్లా పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. 12వ క్లాస్ లో ఉత్తీర్ణత పొందిన తరువాత జిబి పంత్ యూనివర్సిటీ పంత్నగర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత ఐఐటీ మండిలో మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ చేసే టైమ్ లోనే దీక్షిత యూపీఎస్సీ రాయాలని నిర్ణయించుకున్నారు. 





భారతీయ జైళ్ళలో ఎలాంటి ఆహారం ఇస్తారనే విషయాన్ని కోరాలో అడగగా, ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ జైలులో ఎలాంటి ఆహారం పెడతారనే విషయం గురించి వివరించారు. అదే విధంగా ఒక వ్యక్తి తెలంగాణలో చంచల్ గూడ జైలులో ఎలాంటి ఆహారం పెడతారో గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు.







ఈ ‘ఇండియన్ రియల్ లైఫ్ హీరోస్’ స్కెచ్ వర్క్ వీడియోని రియల్ హీరో సోనుసూద్ 2021లో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఒక కళాకారుడు తనను రియల్ లైఫ్ హీరోలతో కలిపి డ్రా చేసినందుకు సోనూ సూద్ గర్వంగా భావించాడు. ఈ పోస్ట్ను షేర్ చేస్తున్నప్పుడు, ‘నా అవార్డు’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఆ తరువాత నూరుల్ హాసన్ ఒకేసారి ఐదుగురి ఫోటోలను డ్రా చేసి, వరల్డ్ రికార్డుని సృష్టించారు.
ఈ గొప్ప ఇండియన్ ఆర్టిస్ట్ ‘నూరుల్ ఆర్ట్’ పేరుతో సోషల్ మీడియా వేదికలు అయిన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో తాను గీసిన చిత్రాలకు సంబంధించి వీడియోలను షేర్ చేస్తుంటాడు. అంతే కాకుండా అతనికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆ ఛానెల్ పేరు కూడా నూరుల్ ఆర్ట్. అతని ఛానెల్ కు వేలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
అయితే, కేసీఆర్ కన్నా ముందు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ వంటి చాలా మంది నాయకులు రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే ఇలా పోటీ చేయవచ్చా ఆనే విషయం పై ఎన్నికల కమిషన్ 2018లో సుప్రీంకోర్టులో వాదన వినిపించింది. సెక్షన్ 33(7)ను సవరించి ఒక అభ్యర్థి ఒక స్థానం నుండి మాత్రమే పోటీ చేసేలా రూల్స్ ను మార్చాలని, అది కుదరకపోతే రెండు స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థి రెండు చోట్ల గెలిస్తే, వారు వదులుకున్న నియోజకవర్గానికి జరిగే బై ఎలెక్షన్స్ ఖర్చును వారే భరించాలని ప్రతిపాదించింది.
ఇక అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు లక్షలు, లోక్ సభ నియోజకవర్గానికి పది లక్షలు ఖర్చు భరించాలని ఎలెక్షన్ కమిషన్ ప్రతిపాదించింది. సెక్షన్ 33(7) ప్రకారం ఒక అభ్యర్థి రెండు నియోజవర్గాల నుంచి ఒకేసారి పోటీ చేయవచ్చు. దీనిని 1996లో చట్ట సవరణ ద్వారా కలిపారు. 1996కి ముందు ఎలెక్షన్స్ లో అభ్యర్థులు ఒకేసారి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేసే అవకాశం ఉండేది. ఈ సవరణ తరువాత 2 స్థానాలకు పరిమితం చేశారు.