ఏ వ్యక్తి వేలిముద్రలు ఒక్కలా ఉండవన్న సంగతి తెలిసిందే. అలాగే.. నడక కూడా ఒకేవిధంగా ఉండదు. ఇక మనం ఐడెంటిటీ కోసం పెట్టుకునే సంతకాలు కూడా ఒకలా ఉండవన్న సంగతి తెలిసిందే. ఒకేలాంటి సంతకాలు ఉండకూడదు. మనం కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకునే సంతకాలు పెడుతూ ఉంటాము.
అయితే.. మనం రకరకాలుగా సంతకాలు పెట్టేస్తూ ఉంటాం. కొందరు సింపుల్ గా పేరు రాసేస్తారు. మరి కొందరు ఒక్క లెటర్ ను మాత్రమే ఉపయోగిస్తారు. మరి కొందరు ఏమి రాసారో కూడా అర్ధం కాకుండా గీసేస్తారు. న్యూమరాలజిస్ట్ లు అయితే మనం పెట్టె సంతకాన్ని బట్టే అదృష్టం కూడా ఉంటుందని.. ఎలా పెట్టాలో తెలుసుకుని పెట్టాలని చెబుతుంటారు.
ఇది ఇలా ఉంటే, మనం పెట్టె సంతకాన్ని బట్టే మన వ్యక్తిత్వం కూడా ఉంటుందట. సంతకం పెట్టి కింద రెండు గీతలు గీసేవారు బాగా డబ్బు సంపాదిస్తారట. కానీ పిసినారులుగా వ్యవహరిస్తారట. వీరు అభద్రతాభావంతో ఉంటారట. కొందరు సంతకం పెట్టి కింద ఒక గీత గీసి రెండు చుక్కలు పెడతారట. వీరు డబ్బు సంపాదించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారట. కానీ, వీరు బాగా డబ్బుని ఆదా చేస్తారట. కొందరు సింపుల్ గా సూటిగా సంతకం చేసేసారట. ఇలాంటి వారి సంపాదన సాధారణంగా ఉంటుందట. వీరు తమ ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరట.
కొందరు చిన్న చిన్న పదాలతోనే సంతకం చేసేసారట. ఇటువంటి వారికి డబ్బు ఎలా సంపాదించాలో, ఎలా తెలివిగా వ్యవహరించాలో బాగా తెలుసు. కానీ, వీరు దానికోసం ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇక సంతకంగా పేరుని రాసేసి కింద ఓ చుక్కను పెట్టేవారు ఆర్ధికంగా బలంగా ఉంటారట. వీరి మారీడ్ లైఫ్ కూడా సంతోషంగా ఉంటుందట. కొందరు పై నుంచి కిందకి సంతకం చేస్తుంటారు. ఇటువంటి వారు ప్రతికూల ఆలోచనలను కలిగి ఉంటారు. వీరు అప్పులు చేయాల్సి వస్తుంది. ఇక అనేక వ్యాధులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక సంతకం చేసేటప్పుడు కొందరు సున్నితంగా చేస్తుంటారు. పెన్నుపై ఎక్కువ ఒత్తిడి పెట్టరు. అటువంటి వారు డబ్బు సంపాదన కోసం తమని తాము మార్చుకుంటారు. చాలా ఒత్తిడికి గురి అవుతారు. కొందరు సంతకం పెట్టేటప్పుడు మొదటి అక్షరాన్ని పెద్దదిగా రాసి, మిగతా అక్షరాలను చిన్నగా అందంగా రాస్తుంటారు. ఇటువంటి వారు క్రమంగా ఉన్నతస్థితికి చేరుకుంటారట.
సంతకంతో మొదటి అక్షరం పెద్దదిగా రాసేవారు మంచి మనసుని కలిగి ఉంటారు. వారికి అకస్మాత్తుగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంటుందట.
గమనిక: ఈ వివరాలన్నీ నిపుణుల అభిప్రాయాల మేరకు సేకరించిన సమాచారం. ఇవి కేవలం నమ్మకాలు మాత్రమే. వీటిని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.







ప్రపంచంలో ప్రతి ఒక భాషకు చరిత్ర ఉంటుంది.
వీటిలో తెలుగు, కన్నడ భాషల గురించి తెలియాలంటే ద్రవిడ కుటుంబం గురించి తెలుసుకోవాలి. ఈ ద్రవిడ కుటుంబాన్ని 4 వర్గాలుగా విభజించారు. అవి ఏంటంటే దక్షిణ ద్రవిడ భాష, దక్షిణ-మధ్య ద్రవిడ, మధ్య ద్రవిడ, ఉత్తర ద్రవిడ భాషలు. మూల దక్షిణ ద్రవిడ భాషల నుండి దక్షిణ మధ్య ద్రవిడ భాషలు వచ్చాయని ప్రముఖ భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి ‘ది ద్రవిడియన్ లాంగ్వేజెస్’ అనే బుక్ లో రాశారు.
అంటే తెలుగు మరియు కన్నడ భాషలు రెండు ఒకే మూలం నుండి వచ్చాయి. అందువల్లే ఈ రెండు భాషల మధ్య లిపి, నిర్మాణంలో సారూప్యత కనిపిస్తుంది. తెలుగు, కన్నడ భాషలో ఉండే శాసనాలు 6వ శతాబ్దం నుండి కనిపించడం ప్రారంభం అయ్యింది. క్రీ.శ.624 – 1189 మధ్య పాలించిన వేంగి చాళుక్యుల కాలంలోని శాసనాలు తెలుగు-కన్నడ లిపిలో ఉన్నాయి. 15వ శతాబ్దం వరకు తెలుగు, కన్నడ లిపి ఒక్కటిగా ఉండి ఆ తరువాత కాలంలో విడివిడిగా ప్రయాణించాయి.
తెలుగు లిపిలోని అక్షరాల పైన ఉండే అడ్డగీత, తలకట్టుగా మారింది. వంకరగా ఉండే అక్షరాలు కాస్త గుండ్రంగా మారాయి. కానీ కన్నడ లిపిలో అడ్డగీతలు అలాగే ఉన్నాయి. లిపిలోని వంకర అక్షరాలు పూర్తిగా పోలేదు. కన్నడ లిపి కోణాకారంలోకి మారింది. అయితే ప్రిటింగ్ యంత్రాలు వచ్చిన తరువాత తెలుగు అక్షరాలలో ఈ మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. పాతకాలంలోని గ్రంథాలలో తలకట్టు కనిపించదు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం మనం కామా, ఫుల్స్టాప్ ఉపయోగిస్తున్నాము. అయితే పాతకాలం తెలుగులో కామాకు బదులుగా ఒక నిలువు గీతను, ఫుల్ స్టాప్ కు బదులుగా రెండు నిలువుగీతలను ఉపయోగించేవారు. విదేశీయులు తీసుకువచ్చిన అచ్చుయంత్రంతో ముద్రణ మొదలుపెట్టిన తరువాత తెలుగు అక్షరాలు చక్కని రూపంతో పాటుగా కామా, ఫుల్ స్టాప్ వంటివి చేరాయి.
ప్రాచీన తెలుగు భాషా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ ఒకప్పుడు తెలుగు, కన్నడ భాషల లిపి ఒకటేనని ఆ తరువాత జరిగిన పరిణామంలో రెండూ విడిపోయాయని వెల్లడించారు. అర్ధం అయ్యేలా సులభంగా చెప్పాలంటే తెలుగు కన్నడ భాషలు రెండు ఓకే ఇంటిలో జన్మించి, విడిపోయిన సోదరులు అని చెప్పవచ్చు.
ఇక్కడ పనిచేసే ఉద్యోగుల డ్రెస్ కోడ్ కూడా స్పెషల్ గా ఉంటుంది. సిబ్బంది దుస్తుల ఎరుపు రంగులో ఉంటుంది. గదుల్లోని ఫర్నీచర్ కూడా బంగారు పూతతో ఉంటాయి.
ఈ హోటల్ పై భాగంలో ఇన్ఫినిటీ పూల్ ఉంది. కొలను వెలుపల ఉండే గోడలపై ఉన్న ఇటుకలు బంగారు పూతతో ఉంటాయి. 2009 లో ఈ హోటల్ నిర్మించబడింది. బంగారం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్ముతారు. అందువల్ల దీనిని బంగారంతో తయారు చేశారు.
ఇక ఇక్కడ గదుల ప్రారంభ ఖరీదు సుమారు 20 వేల రూపాయలు. డబుల్ బెడ్ రూం సూట్ ఒక రాత్రి ఉండేందుకు రెంట్ 75 వేలు. ఇందులో 6 రకాల గదులు, 6 సూట్లు ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ సూట్ లో ఉండేందుకు ఒక రాత్రికి రూ.4.85 లక్షలు.
ఇక్కడి రూమ్స్ లో ఫర్నిషింగ్ గోల్డ్ కోటెడ్తో ఉంటాయి. బాత్రూమ్, షవర్, సింక్, ఇలా అన్నీ బంగారంతో ఉంటాయి.
ఈ హోటల్లో గేమింగ్ క్లబ్ ఉంది. ఈ క్లబ్ 24 గంటలు తెరిచే ఉంటుంది. ఇందులో పేకాట, క్యాసినో లాంటి ఆటలు కూడా ఆడతారు. ఇక్కడ అవి ఆడి గెలిచి డబ్బు కూడా సంపాదించవచ్చు.
Also Read: 












గత ఏడాది ఇండియన్ రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్స్ ను ప్రకటించింది. రైలులో ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు ఈ రూల్స్ ను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. తరచూగా రైలులో ప్రయాణం చేసేవారు, రైలు లో లాంగ్ జర్నీ వెళ్లాలనుకునేవారు ఈ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలి. ఇండియన్ రైల్వే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించాలానే ఉద్దేశ్యంతో ఈ రూల్స్ ను ప్రవేశ పెట్టింది.
ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారికి ఈ రూల్స్ ఎక్కువగా వర్తిస్తాయి. ఈ కొత్త నియమనిబంధనలు పాటించనట్లయితే ప్రయాణికులు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో బెర్త్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారీ అనుకున్న ప్రకారం సీటు దొరకకపోవచ్చు. ఇక రైలులో మిడిల్ బెర్త్ దొరికితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి లోయర్ బెర్త్లు ఉన్న ప్రయాణికులు అర్థరాత్రి వరకు కూర్చుంటారు. అటువంటి పరిస్థితిలో, మిడిల్ బెర్త్ కలిగిన ప్రయాణికుడు తప్పనిసరిగా మిడిల్ బెర్త్ నియమాన్ని తెలుసుకోవాలి.
మిడిల్ బెర్త్ రూల్: 











