ఇప్పుడు భారతదేశంలో ఎవ్వరి నోట విన్న ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం గురించే. ఎన్నో సంవత్సరాల భారతీయుల ఆకాంక్ష నేడు నెరవేరింది. కోర్టు కేసులు ఎన్నో చిక్కులు ఎన్నో గొడవలు నడుమ అయోధ్య రామయ్య తన సంస్థానంలో కొలువు తీరాడు.
ఈ ఆలయం నిర్మాణం వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి.మన భారత ప్రధాన మోడీ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న సంగతి చాలా మందికి తెలియదు…!

గతంలో 32 ఏళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ ఒక శపథం చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన తరువాతే తాను తిరిగి అయోధ్యకి వస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ఆ శపథం నెరవేరింది. నేడు కోట్లాది మంది భారతీయుల సాక్షిగా ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిరం ఆవిష్కరించారు. నాడు రామ జన్మ భూమిలో మోడీ పర్యటన అనంతరం అక్కడ పరిస్థితుల్లో చేసిన ప్రతిజ్ఞ నాటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

32 ఏళ్ల కిందట మోడీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏక్తా యాత్ర నిర్వహించారు. రామమందిరం గురించి సందేశాన్ని దేశం మొత్తం తెలియజేయడానికి ఆ యాత్రను నిర్వహించారు. అప్పుడు జైశ్రీరామ్ అనే నినాదం మధ్య మోడీ ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాతే తాను అయోధ్యలో పెడతానని చెప్పారు. చెప్పిన విధంగానే ప్రధానమంత్రి హోదాలో ఆలయ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు.

అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట కోసం మోడీ ఏకంగా 11 రోజులు పాటు ఉపవాస దీక్ష చేశారు.అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట తరువాత ప్రధాని మోడీ దీక్ష విరమించారు. పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం చరణామృత్ ను ప్రధాని మోడీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తాగించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మన ప్రధాని నరేంద్ర మోడీకి యావత్ భారత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు..
On this exact day, 32 years ago, @narendramodi arrived at the #AyodhyaRamTemple. He was on a Yatra to spread the message of unity from Kanyakumari to Kashmir, the Ekta Yatra.
Amidst chants of 'Jai Shri Ram', Narendra Modi vowed to return only when the Ram Temple was built.
The… pic.twitter.com/nbLxkTFN9V
— Modi Archive (@modiarchive) January 14, 2024












విగ్రహాం కింది భాగంలో 3 ఫ్లోర్లు కలవు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 4 హాళ్లను నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున నిర్మించారు. వీటిలో ఒక సినిమా హాలు, మూడు హాళ్లలో డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. మొదటి ఫ్లోర్లో 4 హాళ్లు, రెండవ ఫ్లోర్లో 4 హాళ్లు కలవు. అంబేద్కర్ విగ్రహం మరియు స్మృతివనంకోసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే తెలంగాణలో మాజీ సీఎం కేసిఆర్ 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గత ఏప్రిల్ లో ఆవిష్కరించారు. అయితే ఆ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
తాజాగా విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంను టిడిపి దళిత నాయకులు సందర్శించారు. ఈ క్రమంలో తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాన్ని రూ.150 కోట్ల రూపాయలలోపే ఏర్పాటు చేశారు. విజయవాడలో అంతే ఎత్తు అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుకు మాత్రం 400 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయ్యిందని టీడీపీ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. నక్కా ఆనంద్ బాబు “తమ ప్రభుత్వం ఉన్నప్పుడే 137 కోట్ల రూపాయలతో స్మృతివనం ఏర్పాటుకోసం పనులను మొదలుపెట్టామని, 26 శాతం వరకు పూర్తి చేశామని అన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ పేరుతో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.
వైఎస్ షర్మిల తనయుడి ఎంగేజ్మెంట్ ఆహ్వాన పత్రికలను గత పది రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను కలిసి అందచేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే షర్మిల అందరికన్నా ముందుగా ఆహ్వాన పత్రికను తన అన్న జగన్ కు అందచేశారు. కానీ దానికి సంబంధించిన ఫోటో లేదా వీడియో ఎక్కడా కనిపించలేదు. అటు వైసీపీ కానీ ఇటు షర్మిల కానీ వాటిని రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా నిశ్చితార్థంకు జగన్ హాజరైన ఫోటోలు, వీడియోలు సీఎంఓ ప్రతినిధులే రిలీజ్ చేశారు. ఇందుకు కారణం ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గా షర్మిల అవడమే అంటున్నారు.
ఇక కొడుకు నిశ్చితార్థంకు ఆహ్వానించిన షర్మిల, వైఎస్ జగన్, భారతిలను పట్టించుకోలేదని, జగన్ వచ్చి, వెళ్లేంత వరకు అన్నా చెల్లెళ్ళు అంతగా కలవలేదని టాక్. ఫోటో దిగడం కోసం స్వయంగా జగన్ పిలిచినా షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ పట్టించుకోలేదు. దాంతో జగన్, భారతి బొకే ఇచ్చి వెంటనే వేడుక నుండి వెళ్లిపోయారు. ఇదంతా చూసినవారు జగన్ కలవాలని చూసినా షర్మిలే దూరంగా ఉంటున్నారని అక్కడికి వచ్చినవారు అంటున్నారు. జగన్ తన చెల్లిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలని చూసినా ఆమె అన్న వైపు చూడలేదని ఇతర అతిథులు అంటున్నారు.
అయితే ఇదే వేడుకకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ స్వయంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నంత సమయం ఆయనతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అన్నతో ఫోటోకు దూరంగా ఉన్న షర్మిల, బ్రదర్ అనిల్, పవన్ కళ్యాణ్ పక్కన ఫోటో దిగడం. రాజకీయంగా జగన్ శత్రువు అయిన పవన్ కళ్యాణ్ కు షర్మిల ఇంతటి ఆదరం చూపడంతో అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు పెరిగిపోయాయని అంటున్నారు.




షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల పెళ్లి ఫిబ్రవరి 17న జరగనుంది. ఈ క్రమంలో షర్మిల పాలిటిక్స్ కు అతీతంగా పలువురు రాజకీయ నేతలను కలిసి నిశ్చితార్ధంతో పాటు వివాహం, రిసెప్షన్కి కూడా ఆహ్వానిస్తున్నారు. ముందుగా అన్న జగన్ను కలిసి పెళ్లికి ఆహ్వానించింది. అన్న జగన్ కు ప్రత్యర్థులు అయిన టిడిపి అధినేత చంద్రబాబును షర్మిల కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పడం.
జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం చూస్తుంటే అన్న జగన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికే అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం చంద్రబాబుతో భేటీని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నారు. తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.
