అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ట వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇంకా ఎంతో మంది వ్యాపారవేత్తలు కూడా అయోధ్య రామ మందిరానికి హాజరయ్యారు. రాజకీయ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులని ఈ వేడుకకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అందులో, తెలుగు రాష్ట్ర ప్రముఖులు కూడా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ వేడుకకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా అయోధ్య రామ మందిరానికి వెళ్లారు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న మాత్రం నెలకొంది. అదేంటంటే, వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ వేడుకకి వెళ్ళలేదు. వారికి ఆహ్వానాలు అందలేదు అని అంటున్నారు. అయితే, “అసలు వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ వేడుకకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి?” అని అంటున్నారు. దీనిపై పలు సమాధానాలు వస్తున్నాయి. జగన్ ప్రస్తుతం వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాన్ని ఖరారు చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు.

అయితే మరొక పక్క వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డితో పాటు, మరి కొంత మంది నేతలు, రామ మందిర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు చేయడంతో జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది అని చాలా మంది అనుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ చీఫ్ అయిన రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కూడా ఆహ్వానాలు అందాయి. అయినా కూడా వాళ్ళు వెళ్లలేదు. జగన్ దంపతులు కూడా రామ మందిరానికి వెళ్లలేదు. “జగన్ క్రిస్టియానిటీ మతాన్ని నమ్ముతారు కాబట్టి, ఈ వేడుకకి వెళ్ళలేదు” అని కొంత మంది అంటున్నారు.

“ఈ ఆహ్వానాలు కేవలం బీజేపీకి మద్దతు తెలిపిన వారికి మాత్రమే అందాయి” అని కూడా అన్నారు. మరి కొంత మంది అయితే, “జగన్ బీజేపీకి దూరంగా ఉండాలి అని నిర్ణయించుకొని ఈ వేడుకకి వెళ్ళలేదు” అని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. అసలు జగన్ కి ఆహ్వానం అందిందా లేదా అనే విషయం కూడా ఇంకా ప్రశ్నగానే ఉంది. ఒకవేళ ఆహ్వానం అంది ఉంటే వెళ్లలేకపోవడానికి కారణాలు ఇవి అయ్యుండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ALSO READ : రామ్ చరణ్ ని అలా అన్నప్పుడు ఉపాసన లేకపోవడమే వెలితి… ఆహ్వానం అందినా కూడా ఆమె ఎందుకు వెళ్ళలేదు.!

















విగ్రహాం కింది భాగంలో 3 ఫ్లోర్లు కలవు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 4 హాళ్లను నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున నిర్మించారు. వీటిలో ఒక సినిమా హాలు, మూడు హాళ్లలో డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. మొదటి ఫ్లోర్లో 4 హాళ్లు, రెండవ ఫ్లోర్లో 4 హాళ్లు కలవు. అంబేద్కర్ విగ్రహం మరియు స్మృతివనంకోసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే తెలంగాణలో మాజీ సీఎం కేసిఆర్ 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గత ఏప్రిల్ లో ఆవిష్కరించారు. అయితే ఆ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
తాజాగా విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంను టిడిపి దళిత నాయకులు సందర్శించారు. ఈ క్రమంలో తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాన్ని రూ.150 కోట్ల రూపాయలలోపే ఏర్పాటు చేశారు. విజయవాడలో అంతే ఎత్తు అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుకు మాత్రం 400 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయ్యిందని టీడీపీ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. నక్కా ఆనంద్ బాబు “తమ ప్రభుత్వం ఉన్నప్పుడే 137 కోట్ల రూపాయలతో స్మృతివనం ఏర్పాటుకోసం పనులను మొదలుపెట్టామని, 26 శాతం వరకు పూర్తి చేశామని అన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ పేరుతో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.
వైఎస్ షర్మిల తనయుడి ఎంగేజ్మెంట్ ఆహ్వాన పత్రికలను గత పది రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను కలిసి అందచేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే షర్మిల అందరికన్నా ముందుగా ఆహ్వాన పత్రికను తన అన్న జగన్ కు అందచేశారు. కానీ దానికి సంబంధించిన ఫోటో లేదా వీడియో ఎక్కడా కనిపించలేదు. అటు వైసీపీ కానీ ఇటు షర్మిల కానీ వాటిని రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా నిశ్చితార్థంకు జగన్ హాజరైన ఫోటోలు, వీడియోలు సీఎంఓ ప్రతినిధులే రిలీజ్ చేశారు. ఇందుకు కారణం ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గా షర్మిల అవడమే అంటున్నారు.
ఇక కొడుకు నిశ్చితార్థంకు ఆహ్వానించిన షర్మిల, వైఎస్ జగన్, భారతిలను పట్టించుకోలేదని, జగన్ వచ్చి, వెళ్లేంత వరకు అన్నా చెల్లెళ్ళు అంతగా కలవలేదని టాక్. ఫోటో దిగడం కోసం స్వయంగా జగన్ పిలిచినా షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ పట్టించుకోలేదు. దాంతో జగన్, భారతి బొకే ఇచ్చి వెంటనే వేడుక నుండి వెళ్లిపోయారు. ఇదంతా చూసినవారు జగన్ కలవాలని చూసినా షర్మిలే దూరంగా ఉంటున్నారని అక్కడికి వచ్చినవారు అంటున్నారు. జగన్ తన చెల్లిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలని చూసినా ఆమె అన్న వైపు చూడలేదని ఇతర అతిథులు అంటున్నారు.
అయితే ఇదే వేడుకకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ స్వయంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నంత సమయం ఆయనతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అన్నతో ఫోటోకు దూరంగా ఉన్న షర్మిల, బ్రదర్ అనిల్, పవన్ కళ్యాణ్ పక్కన ఫోటో దిగడం. రాజకీయంగా జగన్ శత్రువు అయిన పవన్ కళ్యాణ్ కు షర్మిల ఇంతటి ఆదరం చూపడంతో అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు పెరిగిపోయాయని అంటున్నారు.


