కరోనా మహమ్మారి కారణం గా అందరు ఇంటికే పరిమితం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. స్కూల్స్ ను కూడా క్లోజ్ చేసి ఆన్ లైన్ ద్వారానే పిల్లలకు పాఠాలు కూడా చెప్పేస్తున్నారు. అయితే.. బ్లాక్ బోర్డు పై చూసి నేర్చుకోవడం కంటే.. మొబైల్ లేదా లాప్ టాప్ స్క్రీన్ పై చూసి నేర్చుకోవడం కొంత కష్టసాధ్యం. దానికి తోడు పిల్లలకు కూడా కళ్లపై చాలా ఒత్తిడి పడుతోంది. అందులోను.. చాలా పాఠశాలలు సమయాన్ని తగ్గించే బోధనను చేస్తున్నా.. ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.
ఈ క్రమం లో ఓ ఆరేళ్ళ చిన్నారి.. పీఎం మోడీ కె కంప్లైంట్ చేసేస్తోంది. ఆన్ లైన్ లో పాఠ్యాంశాలను బోధించడం వలన ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో చెప్పేస్తోంది. లాంగ్ ఆన్ లైన్ క్లాసెస్, ఆ తరువాత హోమ్ వర్క్స్ వలన పిల్లలపై ఎంత ఒత్తిడి పడుతోందో ఈ వీడియో ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ వీడియో ను ఔరంగజెబ్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్ లో షేర్ చేసారు.
A six-year-old Kashmiri girl’s complaint to @PMOIndia @narendramodi regarding long hours of online classes and too much of school work. pic.twitter.com/S7P64ubc9H
— Aurangzeb Naqshbandi (@naqshzeb) May 29, 2021