ఐపీఎల్ 2022 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. కేకేఆర్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ బౌలర్లు విజృంభణతో కేకేఆర్ 128 పరుగులకే ఆలౌట్ అయింది. తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో కూడా ఆర్సీబీ మొదట్లో చాలా తడబడింది. చివరకు ఆఖరి ఓవర్లో మూడు వికెట్ల తేడాతో గట్టెక్కింది.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో బెంగళూరు స్పిన్నర్ వహిందు హసరంగ స్పిన్ మ్యాజిక్తో కోల్కత్తా బాట్స్మన్ కి చుక్కలు చూపించారు. ఒకదశలో 100 స్కోర్ అయినా చేయగలుతుందా అంకున్నారు kkr ఫాన్స్. ఆండ్రీ రసెల్ 25 పరుగులు, చివర్లో ఉమేశ్ యాదవ్ 18 పరుగులు, వరుణ్ చక్రవర్తి 10 పరుగులు నాటౌట్ సాధించడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. హసరంగ డిసిల్వా(4/20) ధాటికి కోల్కతా 18.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో RCB టిమ్సౌథీ(3/20), ఉమేశ్ యాదవ్(2/16) ధాటికి 17 పరుగులకే మూడు కీలక వికెట్లు డుప్లెసిస్(5), అనూజ్ రావత్(0), కోహ్లీ(12) కోల్పోయింది. రూథర్ఫోర్డ్(28), షాబాజ్ అహ్మద్(27), డేవిడ్ విల్లే(18) రాణించడంతో చివర్లో దినేష్ కార్తీక్ 7 బంతుల్లో 14 నాటౌట్ గా నిలవడంతో గెలుపు RCB సొంతం అయ్యింది.
#1.

#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.

#11.
#12.
#3.
#4.
#15.
స్కోర్ కార్డు:
కోల్కతా: 18.5 ఓవర్లలో 128 ఆలౌట్(రస్సెల్ 25, ఉమేశ్ యాదవ్ 18, డిసిల్వా 4/20, ఆకాశ్దీప్ 3/45),
బెంగళూరు: 19.2 ఓవర్లలో 132/7(రూథర్ఫోర్డ్ 28, షాబాజ్ అహ్మద్ 27, సౌథీ 3/20, ఉమేశ్ యాదవ్ 2/16).
