Ads
భారత లెజెండరీ క్రికెటర్లు అయిన సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, లపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ మండిపడ్డారు. దానికి కారణంవారిద్దరూ పాన్ మసాల ప్రకటనలో నటించారు. అలాంటి ప్రకటనలో దిగ్గజ క్రికెటర్లు నటించడాన్ని తప్పుబట్టాడు. వారి పై ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు.
Video Advertisement
ఇటీవల గౌతమ్ గంభీర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రీసెంట్ గా భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మరియు విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఒక ‘పాన్ మసాలా’ ప్రకటనలో నటించారు. దాంతో గౌతమ్ గంభీర్ ఓ ఇంటర్వ్యూలో వారి పై ఘాటుగా స్పందించాడు. డబ్బు సంపాదించడం కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయని, పాన్ మసాలా ప్రకటనలలో నటించడం వల్ల ఆ ప్రకటనలు చూసే కోట్లాది పిల్లలకు చెడు సందేశం వెళ్తుందని గంభీర్ అన్నారు.
గంభీర్ మాట్లాడుతూ ‘ఒక క్రికెటర్ పాన్ మసాలా ప్రకటనలో నటిస్తారని తన లైఫ్ లో అనుకోలేదని, ఈ పని అసహ్యంగా ఉందని అన్నారు. ఈ యాడ్ ద్వారా ఏం సందేశం ఇస్తున్నారని గంభీర్ అడిగాడు. అలాగే రోల్ మోడల్స్ను కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని ఫ్యాన్స్ కి సూచించాడు. ‘‘ఏ వ్యక్తి అయినా వారు చేసే పని ద్వారానే గుర్తింపును తెచ్చుకుంటాడు. కోట్లాది మంది మిమ్మల్ని చూసి, మీరు చేసేవాటిని అనుకరిస్తూ ఉంటారు. అందువల్ల పాన్ మసాలా ప్రకటన చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
ఈ క్రమంలో గతంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. గంభీర్ సచిన్ తెందూల్కర్ గురించి చెప్పారు. ‘సచిన్కు ఒక సమయంలో పాన్ మసాలా ప్రకటన కోసం రూ. 20-30 కోట్ల ఆఫర్ వచ్చింది. అయితే సచిన్ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. ఆల్కహల్, పొగాకు ఉత్పత్తుల యాడ్స్ చేయనని తన తండ్రికి సచిన్ మాట ఇచ్చాడు. అందువల్లే సచిన్ ఒక రోల్ మోడల్’ అని గౌతమ్ గంభీర్ అన్నారు.
Also Read: “అతని వల్లే నా కెరీర్ను నాశనం అయ్యింది.. !” అంటూ… “అంబటి రాయుడు” కామెంట్స్..! ఏం అన్నారంటే..?
End of Article