Ads
వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ ను టీంఇండియా విజయంతో ప్రారంభించింది. గురువారం నాడు బార్బడోస్ లో జరిగిన మొదటి వన్డేలో టీంఇండియా ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో భారత జట్టులో బ్యాటింగ్ చేసిన మార్పులకు అంతా ఆశ్చర్యపోయారు.
Video Advertisement
కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా కాకుండా ఏడవ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 5 వికెట్లు కోల్పోయినా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయలేదు. అభిమానులు అంతా మాజీ కెప్టెన్కు ఏం జరిగిందని ఆందోళన పడ్డారు. మ్యాచ్ పూర్తి అయిన తరువాత కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్లో జరిగిన మార్పుల పై వివరణ ఇచ్చాడు.కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ లో వన్డే ప్రపంచకప్ ఇండియాలో జరగనుందని, ఇప్పటి నుంచే దాని కోసం ప్రిపేర్ అవుతున్నట్లుగా తెలిపాడు. ఈ క్రమంలోనే అందరికీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నామని, ఆ కారణంతోనే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసినట్లు వెల్లడించాడు. వరల్డ్ కప్ కోసం ప్లేయర్ల సత్తాను టెస్ట్ చేస్తామని, ఫలితాలపై రాజీపడనని అన్నారు.
ఒక వైపు ఆటలో ప్రయోగాలు చేస్తూ, ఇంకో వైపు గెలుపు కోసం కష్టపడతామని పేర్కొన్నాడు. అలాగే రోహిత్ శర్మ ఏడవ స్థానంలో బ్యాటింగ్కు చేయడం పైన స్పందించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ తనకు కొత్త కాదని, కెరీర్ మొదట్లో 7వ స్థానంలోనే బ్యాటింగ్ చేసేవాడినని తెలిపాడు. మొదటి వన్డేలో బ్యాటింగ్ చేసినపుడు ఆ రోజులు గుర్తుకు వచ్చాయని అన్నాడు. కానీ అందరికీ అన్నిమ్యాచ్లలో అవకాశాలు వస్తాయని గ్యారంటీగా చెప్పలేమని అన్నాడు.
సంజు శాంసన్ను మొదటి వన్డేలో ఎందుకు ఆడించలేదు అని మీడియా అడుగగా, ఎడమ, కుడి కాంబినేషన్ కోసమే అతన్ని పక్కన పెట్టినట్లుగా తెలిపాడు. ప్రపంచ కప్ నేపథ్యంలో ఎలాంటి డౌట్స్ లేకుండా జట్టు కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవాలని భావిస్తున్నటు రోహిత్ తెలిపాడు. ఇషాన్ కిషన్ మొదటి వన్డేలో బాగా ఆడాడని అతని పై ప్రశంసలు కురిపించాడు.
Also Read: ధోని అక్క “జయంతి గుప్తా” ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..? ఆమె ఏం చేస్తున్నారు అంటే..?
End of Article