“అతని వల్లే నా కెరీర్‌ను నాశనం అయ్యింది.. !” అంటూ… “అంబటి రాయుడు” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“అతని వల్లే నా కెరీర్‌ను నాశనం అయ్యింది.. !” అంటూ… “అంబటి రాయుడు” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

అంబటి రాయుడు అజారుద్దీన్‌, వీవీఎస్‌లక్ష్మణ్ ల తరువాత అంతటి ప్రతిభ కలిగిన తెలుగు క్రికెటర్‌. అయితే ఆయన కెరీర్‌ క్రికెట్‌ పాలిటిక్స్ లో నలిగిపోయింది. అంబటి రాయుడు పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది వరల్డ్ కప్ 2019 సెలక్షన్ వివాదం.

Video Advertisement

ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు ప్రస్తుతం రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వరల్డ్ కప్ 2019 కి ఎంపిక చేయకపోవడానికి కారణం, తన కెరీర్ కి అడ్డుపడిన వ్యక్తి గురించి వెల్లడించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ambati-rayudu-2అంబటి రాయుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హెచ్‌సీఏలో తన చిన్నప్పటి నుండే పాలిటిక్స్ మొదలు అయ్యాయని అన్నారు. శివలాల్ యాదవ్ తన కొడుకు అర్జున్ యాదవ్‌ను భారత జట్టుకు ఆడించాలని తనను  ఇబ్బంది పెట్టారని రాయుడు అన్నారు. దానికి కారణం అర్జున్ యాదవ్ కన్నా తాను బాగా ఆడుతుండటం వల్ల అడ్డంకిగా ఉన్న  తనను తొలగించెందుకు  ప్రయత్నం చేశారు.ఆ సమయంలో తనకు 17 ఏళ్లు అని,  అందువల్ల అర్జున్ యాదవ్ భారత జట్టుకు త్వరగా సెలెక్ట్ అవ్వాలని  కోరుకునేవాడినని తెలిపారు. అయితే భారత్‌కు ఆడటం అర్జున్ యాదవ్ వల్ల కాలేదని అన్నారు. ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నా చిన్నప్పుడే  క్యాన్సర్ ప్రారంభం అయ్యిందని, ప్రస్తుతం అది 4 వ స్టేజ్‌కు చేరిందని అన్నారు. బీసీసీఐ కల్పించుకుంటే పరిస్థితి మారుతుందని అన్నారు.2003-04లో భారత్ -ఏకి బాగా ఆడాను. అయితే  2004లో మారిన సెలక్షన్ కమిటీలో శివలాల్ యాదవ్ సన్నిహితులు వచ్చారని, ఇక అక్కడి నుంచి తన కెరీర్ కు బ్రేక్ పడిందని అన్నారు. తనను ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడగటంతో  4 ఏళ్ల పాటు తనతో ఎవరిని మాట్లాడనీయలేదని అన్నారు. తనను మానసికంగా కూడా దెబ్బతీయడానికి  ప్రయత్నం చేశారని చెప్పాడు. బీసీసీఐ మేనేజ్‌మెంట్‌లో ఉన్న శివలాల్ యాదవ్‌ వల్లే తనను వరల్డ్ కప్ 2019 కి ఎంపిక చేయలేదని అన్నాడు. శివలాల్ యాదవ్ వల్లే తన కెరీర్ పోయిందని అంబటి రాయుడు చెప్పారు.

Also Read: ఈ జనరేషన్ లో ఇలాంటి బౌలర్ ఇప్పటి వరకు లేడు… ఇతనిని మించిన వాడు రాడు ఏమో..!


End of Article

You may also like