బిగ్ బాస్ సీజన్ 1 లో…సందడి చేసిన యాంకర్ హరి తేజ అందరికి గుర్తుకు ఉండే ఉంటారు..ఆ షో లో అల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న హరి తేజ లో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ అనుకున్నారు. అటు బుల్లి తెర రంగం మీద ఇటు వెండి తెర మీద రెండిటిని మేనేజ్ చేస్తూ తెలుగు సినీ ప్రేక్షకుల కి మరింత చేరువ అవుతున్నారు హరి తేజ.ప్రముఖ చానెల్స్ లో హోస్ట్ గా యాంకర్ గా తన కెరీర్ ని దిగ్విజయంగా సాగిపోతుండగా సినిమాలలో కూడా అడపా దడపా పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
కొందరు చేసిన పనిని చెయ్యలేదు అంటూ…చెయ్యని పనిని చేశాను అంటూ వాపోతుంటారు ..అది వాస్తవమే..కానీ చేసిన పనులు ఒప్పుకోవాలి అంటే నిజంగా గట్స్ ఉండాలి అనే చెప్పాలి…అసలు విషయానికి వస్తే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ వలన సెలెబ్రిటీలు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే..దొరికిన ఈ కాస్త సమయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు ..ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాన్స్ కి లైవ్ లో చిట్ చాట్ చేసిన హర్ తేజ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు..
ఇటీవలే ‘హిట్’ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే అందులో హరి తేజ ఒక కీలక పాత్ర చేసారు షీలా పాత్ర తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.ఒక అభిమాని ఏమని ప్రశ్నించారు అంటే..’అక్క హిట్ సినిమాలో మీరు నిజంగానే సిగరెట్ తాగారా’ అన్ని ప్రశ్నించాడు. అందుకు ఆమె అవును ఆ సన్నివేశం పాత్ర డిమాండ్ మేరకు ఆలా చేశాను, పాత్ర డిమాండ్ చేయడం వాళ్ళ తప్పదని ..చెప్పుకొచ్చారు మరో నెటిజెన్ అడిగిన ప్రశ్నకి మేడం మీ డేట్ అఫ్ బర్త్ చెప్పగలరా అన్న ప్రశ్నకి..మీకు చెప్పినా వేస్ట్, మీరు ఎలాగూ నమ్మరు. అయినా చెబుతున్నా అంటూ తాను 24వ తేదీ ఫిబ్రవరి 1992 సంవత్సరం జన్మించానని చెప్పింది. దీంతో నెటిజెన్స్ అంత ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ALSO READ : షూటింగ్స్ లేక వ్యవసాయం చేస్తున్న జబర్దస్త్ కమెడియన్!






రైళ్లు ,సబర్బన్ రైళ్ల రద్దు ని మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది కరోనా వైరస్ నివారించే భాగంగా లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగించడం తో రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. పార్సిల్ , సరకు రవాణా కి ఎటువంటి ఆటకం ఉండదు అంటూ ప్రకటించింది. రైలు టిక్కెట్ల కోసం స్టేషన్లకు రావొద్దు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చికుక్కున విద్యార్థులు,పర్యాటకులు,వలస కార్మికులు,తీర్థయాత్రికులు, మరే ఇతర కారణాల చేత చిక్కుకున్న ప్రయాణికులు శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయబోతునన్టు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మేరకు ,కేంద్ర హోమ్ శాఖ మార్గ దర్శకాలనులోబడి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపబోతుననట్టుగా తెలిపింది.ఈ రైళ్లలో ప్రయాణదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవల్సిందిగా సూచించారు.రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించింది వ్యక్తులకి టిక్కెట్లను విడివిడిగా ఇవ్వడం కుదరదు బృందాలకు కూడా టికెట్లు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి టిక్కెట్ల కోసం నేరుగా రైల్వే స్టేషన్లకు దయచేసి రావద్దు అని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇకపోతే మన దేశానికి ….పెద్ద మహమ్మారిలా మారింది లాక్ డౌన్ కారణంగా అటు సినీ రంగం..ఇటు టీవీ రంగం కూడా షూటింగ్స్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది..తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు..ఇలాంటి వృత్తినే నమ్ముకున్న ఆర్టిస్టుల కష్టాలు అన్ని ఇన్ని కావు..వేళ్ళని ఆదుకోవడనికి ఇంకా ఎవ్వరు ముందు రాలేదు.ఇక బుల్లి తెర సంచలనం ‘జబర్దస్త్’ ఎంత పేరు ని సంపాదించుకుందో అందరికి తెలియనిది కాదు.స్కిట్ ల మీదే ఆధార పడి బ్రతుకుతున్న వారు ఎందరో…వీరిలో ఒకరు అయిన జబర్దస్త్ కమెడియన్ జీవన్ తన రైతు వృత్తినే ఎన్నుకున్నారు.










