చలసాని అశ్విని దత్ 1972 లో స్థాపించిన చలనచిత్ర సంస్థే ఈ వైజయంతీ మూవీస్.ఈ సంస్థ ద్వారా తెలుగు తెరకు ఎందరో ప్రముఖ నటీనటులను పరిచయమయ్యారు. అలా పరిచయమై తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆ నటీనటులు ఎవరో చూద్దామా..
1.రాజకుమారుడు- మహేష్ బాబు
సూపర్ స్టార్ నట వారసుడుగా తెలుగు సినీ తెరకు మహేష్ బాబును రాజకుమారుడు మూవీ ద్వారా హీరోగా పరిచయం చేసిన ఘనత వైజయంతి మూవీస్ కే దక్కుతుంది.

2.గంగోత్రి – అల్లు అర్జున్ మరియు అదితి అగర్వాల్
గంగోత్రి చిత్రం ద్వారా అల్లు అర్జున్ ని అతికి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయం చేసింది వైజయంతి మూవీస్.

3.ఒకటో నెంబర్ కుర్రాడు – నందమూరి తారకరత్న
నందమూరి తారకరత్న ను హీరోగా ఒకటో నెంబర్ కుర్రాడు మూవీ ద్వారా వైజయంతి మూవీస్ తెలుగు తెరకు పరిచయం చేసింది.

4.బాణం – నారా రోహిత్
వైజయంతి మూవీస్ నిర్మించిన బాణం చిత్రం ద్వారా నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

5. ఎవడే సుబ్రహ్మణ్యం- విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్
విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ ను తెలుగు తెరకు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా వైజయంతి సంస్థ పరిచయం చేసింది.

6.మహానటి – దుల్కర్ సల్మాన్
ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ను తెలుగు ప్రజలకు మహానటి చిత్రం ద్వారా వైజయంతి సంస్థ దగ్గర చేసింది.

7.సీతారామం – మృణాల్ ఠాకూర్
నార్త్ ఇండియన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను సీతారామం సినిమా ద్వారా వైజయంతి మూవీస్ హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో లాంచ్ చేసింది.






1.ఇలియానా:
2.అనుష్క శెట్టి:
3.రక్షిత:
4.నిత్య మీనన్:
5.నమిత:
6.నివేత థామస్:
7.పూనమ్ బజ్వా:
8.రకుల్ ప్రీత్:
Also Read:

నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా సార్లు గతంలో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మోక్షజ్ఞ మొదటి సినిమాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని ఈవెంట్స్ లో మోక్షజ్ఞ బొద్దుగా ఉన్న ఫోటోలు వైరల్ అవడంతో మోక్షజ్ఞ హీరోగా సెట్ అవుతాడా నెటిజన్లు కామెంట్స్ చేశారు.
అయితే బాలయ్య లెగసీని ఇండస్ట్రీలో కొనసాగించాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. మోక్షజ్ఞ ఎంట్రీ నేపథ్యంలో యాక్టింగ్, డాన్స్ వంటి విషయాల్లో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
బొద్దుగా కనిపించే మోక్షజ్ఞ ఊహించని విధంగా స్లిమ్ లుక్ లో కనిపించారు. మోక్షజ్ఞ తన స్నేహితులతో దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులకు నందమూరి లెగసీని మోక్షజ్ఞ కొనసాగిస్తాడని అంటున్నారు.

అయితే తాజాగా విడుదలైన సినిమాలకి కాకుండా ఎప్పుడో విడిపోయిన సినిమాల్లో కూడా ఈ తప్పులను చూపిస్తూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ మహేష్ బాబు దగ్గర 25000 డాలర్లు అప్పు తీసుకుంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం పదివేల డాలర్లు అప్పు ఇచ్చాను అని తిరిగి ఇవ్వాలని అంటాడు. ఇక దర్శకుడు లాజిక్ మిస్ అవడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మలయాళ నటుడు మరియు నిర్మాత అయిన కుంచాకో బోబన్ నటించిన ‘నా తాన్ కేస్ కొడు’ అనే సినిమా 2022 లో ఆగస్ట్ 11న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గాను హిట్ గా నిలిచింది. 5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లను వసూల్ చేసింది. ఈ చిత్రం ఏనాట గా హిట్ అయ్యింది అంటే బాలీవుడ్ చిత్రాలైన అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రాల స్క్రీన్ కౌంట్ను తగ్గించి, ఆ థియేటర్లను ఈ చిత్రం మరిన్ని షోలను వేశారు.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికే దొంగ కోజుమ్మల్ రాజీవ్ కూలీ పని చేసే తమిళ అమ్మాయి దేవిని ఇష్టపడతాడు. ఆమె కోసం దొంగతనాలు మానేసి, కూలీగా మారుతాడు. ఆమె ఇంట్లో కలిసి ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఒకరోజు గుడి లో జరిగే భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో ను నుండి తప్పించుకుందేనందుకు, పక్కనే ఉన్న ఇంటి గోడ దూకడంతో అక్కడి పెంపుడు కుక్కలు కరుస్తాయి.
వాటి అరుపులకు లేచిన ఇంట్లో వారు అతడి పై దొంగతనం ఆరోపణలు చేస్తారు. ఆ ఇల్లు ఎమ్మెల్యేది కావడంతో పోలీసులు వెనటనే అరెస్ట్ చేస్తారు. కేసు కొరత్కు వెళ్తుంది. కోర్టులో, రాజీవ్ తనకు తెలిసిన పోలీసుగా మారిన న్యాయవాది సహాయంతో తన కేసును తనే స్వయంగా వాదించి, సాక్ష్యాలను తెస్తానని వాగ్దానం చేస్తాడు. అతను సాక్ష్యాలను ఎలా సంపాదించాడు. కోర్టులో ఎలా నిర్దోషి అని నిరూపించుకున్నాడనేది మిగతా స్టోరీ.
ఈ చిత్రాన్ని దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ చెప్పాలను కున్న పాయింట్ ను చక్కగా, చాలా సహజంగా తెర పై చూపించాడు. కామెడీ సన్నివేశాలు, కుంచాకో బోబన్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ గా గాయత్రీ శంకర్ నటించారు. డాన్ విన్సెంట్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు