ఒక సినిమా అంటే ఫైటింగ్ సీన్లు, భారీ బడ్జెట్ పాటలు ఉండాల్సిన అవసరం లేదు. మామూలు కథని ఆసక్తికరంగా చూపించినా కూడా ప్రేక్షకులు చూస్తారు. అలాంటి ఒక కథతో వచ్చిన సినిమా ఇదే. ఈ సినిమా పేరు, అర్చన 31 నాట్ అవుట్. ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకి అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఊరిలో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది అర్చన (ఐశ్వర్య లక్ష్మి). ఎన్నో పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత 31వ పెళ్లి సంబంధం అర్చనకి నచ్చుతుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.

పెళ్లికి ముందు రోజు పెళ్ళికొడుకు గతంలో అతనిని ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నట్టు చెప్తాడు. కానీ ఈ విషయాన్ని అర్చన తన ఇంట్లో వాళ్లకు చెప్పదు. పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ కూడా ఈ విషయం తెలియదు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఒకే ఒక్క రోజులో సినిమా కథ చాలా వరకు మొత్తం నడుస్తుంది. అయినా కూడా తర్వాత ఏమవుతుంది అని ఆసక్తితో సినిమా నడిపించారు. 2022 లో వచ్చిన ఈ సినిమా మలయాళం భాషలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.

ఈ సినిమాలో డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అందులోనూ సినిమా చివరిలో హీరోయిన్ తీసుకునే నిర్ణయం, అప్పుడు హీరోయిన్ ఇచ్చే స్పీచ్ చాలా బాగా రాశారు. పెళ్లి అనే ఒక విషయం ఒక అమ్మాయి జీవితాన్ని నిర్ణయించదు అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. పెళ్లికి ముందు రోజు పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి పారిపోతే, ఈ విషయాన్ని ఆ అమ్మాయి ఎంత జాగ్రత్తగా పరిష్కరించింది అనేదాన్ని ఈ సినిమాలో చూపించారు. సినిమాలో చాలా తక్కువ మంది నటీనటులు ఉంటారు. పెద్ద పెద్ద సెట్టింగ్స్ కూడా ఉండవు. ఒక ఊరిలో ఇంట్లో సినిమా నడుస్తుంది. ఆడపిల్లలు ఈ సమాజంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో చాలా సున్నితంగా ఇందులో చూపించారు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చూపించారు.
ALSO READ : “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!

నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా సార్లు గతంలో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మోక్షజ్ఞ మొదటి సినిమాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని ఈవెంట్స్ లో మోక్షజ్ఞ బొద్దుగా ఉన్న ఫోటోలు వైరల్ అవడంతో మోక్షజ్ఞ హీరోగా సెట్ అవుతాడా నెటిజన్లు కామెంట్స్ చేశారు.
అయితే బాలయ్య లెగసీని ఇండస్ట్రీలో కొనసాగించాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. మోక్షజ్ఞ ఎంట్రీ నేపథ్యంలో యాక్టింగ్, డాన్స్ వంటి విషయాల్లో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
బొద్దుగా కనిపించే మోక్షజ్ఞ ఊహించని విధంగా స్లిమ్ లుక్ లో కనిపించారు. మోక్షజ్ఞ తన స్నేహితులతో దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులకు నందమూరి లెగసీని మోక్షజ్ఞ కొనసాగిస్తాడని అంటున్నారు.

అయితే తాజాగా విడుదలైన సినిమాలకి కాకుండా ఎప్పుడో విడిపోయిన సినిమాల్లో కూడా ఈ తప్పులను చూపిస్తూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ మహేష్ బాబు దగ్గర 25000 డాలర్లు అప్పు తీసుకుంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం పదివేల డాలర్లు అప్పు ఇచ్చాను అని తిరిగి ఇవ్వాలని అంటాడు. ఇక దర్శకుడు లాజిక్ మిస్ అవడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మలయాళ నటుడు మరియు నిర్మాత అయిన కుంచాకో బోబన్ నటించిన ‘నా తాన్ కేస్ కొడు’ అనే సినిమా 2022 లో ఆగస్ట్ 11న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గాను హిట్ గా నిలిచింది. 5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లను వసూల్ చేసింది. ఈ చిత్రం ఏనాట గా హిట్ అయ్యింది అంటే బాలీవుడ్ చిత్రాలైన అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రాల స్క్రీన్ కౌంట్ను తగ్గించి, ఆ థియేటర్లను ఈ చిత్రం మరిన్ని షోలను వేశారు.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికే దొంగ కోజుమ్మల్ రాజీవ్ కూలీ పని చేసే తమిళ అమ్మాయి దేవిని ఇష్టపడతాడు. ఆమె కోసం దొంగతనాలు మానేసి, కూలీగా మారుతాడు. ఆమె ఇంట్లో కలిసి ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఒకరోజు గుడి లో జరిగే భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో ను నుండి తప్పించుకుందేనందుకు, పక్కనే ఉన్న ఇంటి గోడ దూకడంతో అక్కడి పెంపుడు కుక్కలు కరుస్తాయి.
వాటి అరుపులకు లేచిన ఇంట్లో వారు అతడి పై దొంగతనం ఆరోపణలు చేస్తారు. ఆ ఇల్లు ఎమ్మెల్యేది కావడంతో పోలీసులు వెనటనే అరెస్ట్ చేస్తారు. కేసు కొరత్కు వెళ్తుంది. కోర్టులో, రాజీవ్ తనకు తెలిసిన పోలీసుగా మారిన న్యాయవాది సహాయంతో తన కేసును తనే స్వయంగా వాదించి, సాక్ష్యాలను తెస్తానని వాగ్దానం చేస్తాడు. అతను సాక్ష్యాలను ఎలా సంపాదించాడు. కోర్టులో ఎలా నిర్దోషి అని నిరూపించుకున్నాడనేది మిగతా స్టోరీ.
ఈ చిత్రాన్ని దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ చెప్పాలను కున్న పాయింట్ ను చక్కగా, చాలా సహజంగా తెర పై చూపించాడు. కామెడీ సన్నివేశాలు, కుంచాకో బోబన్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ గా గాయత్రీ శంకర్ నటించారు. డాన్ విన్సెంట్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు

మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీని సొంత ప్రొడక్షన్ హౌజ్ లో మమ్ముట్టి నిర్మించారు. ఈ యాక్షన్-మిస్టరీ థ్రిల్లర్ మూవీకి రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. రిలీజ్ అయిన మొదటి షో నుండే ఈ మూవీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆడియెన్స్ డిమాండ్ మేరకు 25 కొత్త కేంద్రాలలో 70 అదనపు షోలను ప్రారంభించారు.
ఇక కథ విషయాని వస్తే, ఇక ఒక రాజకీయ నాయకుడి ఇంట్లోవారిని హత్య చేసి, ఇంట్లోని నగలు డబ్బును కొందరు దోచుకుని వెళ్తారు. ఈ కేసును చేధించడానికి కన్నూర్ స్క్వాడ్ ను నియమిస్తారు. ఈ స్క్వాడ్ ఏఎస్ఐ జార్జ్(మమ్ముట్టి ) నేతృత్వంలోని నలుగురు సభ్యుల ప్రత్యేక పోలీసుల దర్యాప్తు బృందం. ఏఎస్ఐ జార్జ్, అతని టీమ్ ఈ కేసును ఎలా చేధించారు అనేది మిగిలిన కథ.
సినిమాటోగ్రాఫర్ రాబీ వర్గీస్ రాజ్ ఈ మూవీతో దర్శకుడిగా మారారు. సినిమా కథనం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు, సినిమా వేగం పుంజుకుంటుంది. ఈ చిత్రం సెకండాఫ్ శరవేగంగా సాగుతూ, ఆశ్చర్యం కలిగిస్తుంది. మమ్ముట్టి ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు. మమ్ముట్టి చెప్పే ‘మాస్’ డైలాగ్లు ఆడియెన్స్ ను అలరిస్తాయి.