పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది శ్రీ లీల….ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.ఆ తర్వాత శ్రీ లీలకి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి. రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించింది. ఆ సినిమాలో శ్రీ లీల డాన్సులు నటనతో మంచి మార్కులే కొట్టేసింది.
తర్వాత నటిచ్చిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు కేవలం శ్రీలీలని కథతో సంబంధం లేకుండా కేవలం డాన్స్ లు కోసమే తీసుకుంటున్నారు అంటూ పలువురు విమర్శలు చేశారు. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలో ఆమె పాత్రలకు ఉన్న ప్రాధాన్యత చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఉన్నట్టుండి శ్రీ లీల కెరీర్ డౌన్ ఫాల్ మొదలైనట్టు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా నుండి తాజాగా కుర్చీ మడత పెట్టి అనే మాస్ సాంగ్ విడుదలైంది. ఈ సినిమాలో మాస్ స్టెప్పులతో శ్రీలీల రెచ్చిపోయింది. ఇది చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో కూడా శ్రీ లీలని డాన్సులు కోసమే తీసుకున్నారా లేదా ఆమె పాత్రకు ఏమైనా ప్రాధాన్యత ఉందా అంటూ అంటున్నారు. కథలో ప్రాధాన్యత లేకపోతే శ్రీ లీల పెద్ద తప్పు చేస్తుందని ఈ విషయాన్ని ఆమె త్వరగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇక శ్రీలీలను డాన్సులు కోసం మాత్రమే వాడుతున్నారు అంటూ ఆమె అభిమానులు కూడా బాధపడుతున్నారు. డాన్స్ రావడం శ్రీలీల ప్లస్ పాయింట్ అయితే ఇప్పుడు అదే మైనస్ గా కూడా మారుతుంది

అతడు, ఖలేజా సినిమాల తరువాత, మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
సంక్రాంతికి రిలీజ్ కానుండటంతో, ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రెండు పాటలు రిలీజ్ చేయగా, మొదటి పాటకు మంచి రెస్పాన్స్ రాగా, రెండవ పాట ట్రోలింగ్ బారిన పడింది.తాజాగా కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. పూర్తి పాటను ఈ రోజు 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ ప్రోమో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ డైలాగ్ తో పాపులర్ అయిన తాత వార్తల్లో నిలిచాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ తాత పేరు షేక్ అహ్మద్ పాషా. ఆయన మాట్లాడుతూ తన డైలాగ్ సినిమాలో వాడినందుకు తమన్ లక్షరూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. మహేష్ బాబు లాంటి పెద్ద హీరో మూవీలో తన డైలాగ్ ను సాంగ్ గా వాడుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు.












కోరాలో “ఈ కాలంలో (కలికాలం) పెళ్లి కూతుర్లు సిగ్గు పడడం మానేసి పెళ్ళిలో ఐటం సాంగ్ లకు డాన్స్ లు చేయడాన్ని మీరు సమర్థిస్తారా విమర్శిస్తారా? ఎందుకు? అనే ప్రశ్నకు
ఒకప్పుడు పసుపు కొట్టే పండుగ అనేది, మన దగ్గర చాలా గుంభనంగా జరిగేది. మరీ ముఖ్యమైన బంధువులు మాత్రమే, అలా సాంప్రదాయ బద్ధంగా పెళ్లి కొడుకు/ పెళ్లి కూతురు పొట్ట పై రోకలి తో చిన్నగా కొట్టేవారు. పసుపు తీసి, మంగళ స్నానాలు చేయించేవారు.. ఇప్పుడు మాత్రం మనవాళ్ళు ఉత్తరాది వారి హల్దీ ఎరువు తెచ్చుకుని,ఒకరి మీద ఒకరు పసుపు జల్లుకుంటూ, రెయిన్ డ్యాన్స్ లు. సంప్రదాయం కన్నా, రీల్స్ కి , సెల్ఫీ లకే ఇప్పుడు ప్రధానం. ఇది ట్రెండ్ అనుకుని పెద్దగా మనసుకి తీసుకుకుంటే మంచిది.
కానీ ఈ కృత్రిమత్వమే సహజం అనుకునే స్థాయి వచ్చేసింది ఈ సమాజంలోకి, ముఖ్యంగా జనరేషన్ జెడ్ (2000 తర్వాత జన్మించిన వారు) ఈ సెల్ఫీలకి రీల్స్ కి బాగా అలవాటు పడ్డారు. వారిని చూసి, వారిలా చేయకపోతే మనల్ని ఎక్కడ ముసలివాళ్ళు అనుకుంటారో అనో, బాగుందనో అంతకు ముందు తరాల వారు కూడా ఈ ట్రెండ్ ని అనుసరిస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫోటో షూట్,ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, వెడ్డింగ్ ఫోటో షూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇలా ఏవి తీసుకోండి, బాగుపడేది లక్షల్లో ప్యాకేజీలు అందుకునేది కేవలం ఫొటోగ్రాఫర్లు మాత్రమే.
అందుకోసం వారు చెప్పిన పిచ్చి చేష్టలు, వెకిలి వేషాలు, గోడ అంచున నిలబడి సాహసాలు, అబ్బో కృత్రిమత్వానికి పరాకాష్ట. ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి , ఇన్ని సాహసాలు చేసి తీసుకున్న ఫోటోలు, వీడియోలు పోనీ సంవత్సరానికి ఒకసారైనా చేసుకుంటారా అంటే, ఎబ్బే. ఇక మీరు అమ్మాయిలకి సిగ్గు లేదా అని అడిగారు, అది తప్పు. అబ్బాయిలు కూడా అదే బారాత్ అనే కార్యక్రమంలో డాన్స్ లు చేస్తున్నారు కదా, వీరికి సిగ్గు లేదంటే, వారికీ లేనట్టే కదా. వారి పెళ్ళిలో వారు డ్యాన్స్ చేస్తారో, ఫైట్ చేస్తారో వారి ఇష్టం అని వదిలేయడం ఉత్తమం. కాబట్టి జడ్జ్ చేయడం మానేయండి.
మీకు వీలైతే అలంటి ఫంక్షన్స్ కి దూరంగా ఉండడం, ఆ తరహా నృత్యాలు ఉన్న వీడియోస్ చూడడం మానేయండి. ఎవరికీ నచ్చిన పని వారు చేసుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది అన్న సంగతి మరువకూడదు. అలాగే అలంటి కార్యక్రమాలకి దూరంగా ఉండే హక్కు కూడా అందరికీ ఉంది. అది గుర్తించుకుంటే మనశ్శాంతికి లోటుండదు. సర్వేజనా సుఖినోభవంతు” అంటూ దుర్గా ప్రసాద్ తూము రాసుకొచ్చారు.

