కోరా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రశ్నలు, సమాధానాల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకునే ఒక వెబ్ సైట్. ఎవరు ఏ ప్రశ్నను అడిగినా, ఏ విషయం గురించి అడిగినా ప్రపంచంలో ఎవరో ఒకరు సమాధానం చెబుతుంటారు.
ఇప్పటికే ఎంతోమంది కోరా ద్వారా ప్రశ్నలు, సమాధానాల చెబుతూ తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ఉంటారు. తాజాగా కోరాలో ‘హైదరాబాద్ లో పెరిగిన అమ్మాయిలని పెళ్ళి చేసుకోవటానికి వెనకాడుతున్నారు ఎందుకని’ అడిగిన ప్రశ్నకి ఒక యూజర్ ఏమని సమధానం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..
“హైదరాబాద్ లో పెరిగిన అమ్మాయిలని పెళ్ళి చేసుకోవటానికి వెనకాడుతున్నారు. ఎందుకని” అనే ప్రశ్నకు అలోక్ నంద ప్రసాద్ “ఒక వేళ నిజంగా అలా జరుగుతుంటే అందుకు కారణాలుండకపోవు. హైదరాబాద్ అనే కాదు, ఏ పెద్ద పట్టణంలో పెరిగిన అమ్మాయి అయినా స్వతహాగా మిగతా అమ్మాయిలతో పోలిస్తే కాస్త ఎక్కువ ధైర్యంగా, స్వతంత్రంగా ఉంటుంది. తన బలాబలాలపై స్పష్టత, జీవనవిధానం గురించి అవగాహన ఎక్కువ. అక్కడి బడులు, కళాశాలలు, కార్యాలయాలు, దైనందిన జీవనంలో నెగ్గాలంటే ఆ ధైర్యం తప్పదు.
నిజానికది అందరమ్మాయిలకూ ఉండాల్సిన నిగ్గు. కానీ చిన్న ఊర్ల పరిమిత ఆలోచనా ధోరణులు, కట్టుబాట్లకు అలవాటు పడిన తల్లిదండ్రులు, వేసుకునే బట్టలు మొదలు స్నేహాలు, ఆశయాల వరకు అన్నిటా పిల్లలకు పరిమితులు విధిస్తూంటారు (కొన్ని తెలిసీ, ఎన్నో తెలియక). అవగాహన విస్తరించుకోనందున వారి పిల్లలకు (అబ్బాయిలకూ) అవసరమైన స్థైర్యం అలవడటం దాదాపు అసాధ్యం. పై చదువులకో, ఉద్యోగానికో వలసెళ్తే తప్ప ఆ పిడివాదపు సంకెళ్ళను తెంచుకోవటం సాధ్యపడదు. అప్పటికీ ఆ సంకెళ్ళను తెంచుకోనివ్వని తల్లిదండ్రులతో నరకయాతన పడే వ్యక్తులు ఎందరో తెలుసు. చిన్న ఊర్లలో అంతా ఇలాగే ఉంటారని కాదు కానీ బహుశా 80% ఇంతే.
ఇలా పెరిగిన అబ్బాయిలు పట్టణాల్లో పెరిగిన అమ్మాయిలను చేసుకోటానికి వెనుకాడటంలో ఆశ్చర్యం లేదు. వెనుకాడటం అంటే నిజానికి జంకటమేగా? చేతిలో చిల్లిగవ్వ లేనివాడు కోటి రుపాయల ఇల్లు కొనటానికి వెనుకాడటంలా, నెదర్లాండ్స్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వెనుకాడటంలాగానే అవతలి వ్యక్తి వ్యక్తిత్వం నా కంటే వికాసం చెందినదేమోనన్న సందేహంతో వెనుకాడటం ఉన్న మాట. కేవలం ఒక వ్యక్తి పెరిగిన ఊరిని బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి తీర్పునిచ్చే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని లార్డ్ లబక్దాస్ ఎప్పుడో చెప్పారు” అని రాసుకొచ్చారు.



స్మితా సబర్వాల్ 1977 లో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో బెంగాలీ ఫ్యామిలిలో ఆర్మీ అధికారి కల్నల్ ప్రణబ్ దాస్, పురబీ దాస్లకు జూన్ 19న జన్మించారు. ఆమె సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదువుకున్నారు. ఐసీఎస్ఈ పరీక్షలో స్మితా సబర్వాల్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ ఫర్ ఉమెన్ కాలేజ్ నుండి కామర్స్లో పట్టా తీసుకున్నారు. 2000లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష రాసిన ఆమె, ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంక్ సాధించింది. అప్పుడు ఆమె వయసు 22 ఏళ్ళు.
2001లో ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో స్మితా సబర్వాల్ అడ్మినిస్ట్రేటివ్ శిక్షణ పూర్తి చేసింది. తన ప్రొబేషన్ టైమ్ లో ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనింగ్ పొందారు. ఆ తరువాత చిత్తూరులోని మదనపల్లి సబ్ కలెక్టర్గా ఆమె మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కడప డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్గా గ్రామీణాభివృద్ధి విభాగంలో పనిచేశారు. ఆ తరువాత వరంగల్ మునిసిపల్ కమీషనర్గా పనిచేశారు. ఆమె “ఫండ్ యువర్ సిటీ” అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్ ఓవర్బ్రిడ్జ్లు, బస్-స్టాప్లు, పార్కులు వంటి పెద్ద సంఖ్యలో పబ్లిక్ యుటిలిటీలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) క్రియేట్ చేశారు. ఆ తర్వాత విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. 2011 ఏప్రిల్ లో, సబర్వాల్ కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మరియు విద్యా రంగంలో చాలా కృషి చేశారు. ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్ సిటీలో విశాలమైన రోడ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, బస్టాప్లు, మరుగుదొడ్లు మరియు ఇతర ప్రజా ప్రయోజనాల రూపంలో కొత్త రూపురేఖలను సంతరించుకునేలా చేశారు.
2012–2013లో ప్రధానమంత్రి 20 పాయింట్ల కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉత్తమ జిల్లాగా అవార్డు పొందింది. 2014 సార్వత్రిక ఎన్నికల టైమ్ లో ఆమె మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆమె కలెక్టర్ గా కరీంనగర్ మరియు మెదక్ జిల్లాలను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపింది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఆమె పై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో చేసే తప్పులు చేసి, ఇప్పుడు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళడం ఫ్యాషన్ అయ్యిందని, ఆమెని వెళ్ళకుండా చూడాలని ‘దేశం మొత్తంలో హెలికాప్టర్లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమెగారు మాత్రమే’ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.
జట్టులో ఓపెనర్ల పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో, అలాగే ఫినీషర్ల పాత్ర కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మ్యాచ్ ప్రారంభంలో ఎంత బాగా ఆడినప్పటికీ, మ్యాచ్ ను విజయవంతంగా ముగించే ఫినిషర్ లేకపోతే అప్పటిదాకా ఎంత స్కోర్ చేసిన వ్యర్థమే అవుతుంది. అలా అని జట్టులో ఫినీషర్లు మాత్రమే ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ధోనీ రిటైర్ అయినప్పటి నుండి భారత జట్టు మంచి ఫినీషర్ కోసం చూస్తోంది. ధోనీ లాగా మ్యాచ్ చివరి వరకు నిలిచి మ్యాచ్ ను గెలిపించగల యువ క్రికెటర్ల పై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఐపీఎల్ భారత జట్టుకు ఎందరో మంచి ఆటగాళ్లను ఇచ్చింది. ఈసారి ఐపీఎల్ ద్వారా మంచి ఫినీషర్ లభించినట్టుగా భావిస్తున్నారు. ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా సోమవారం నాడు కోల్కతా, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు 5 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు పై గెలిచింది.
మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 179 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు చేసిన కోల్కతా జట్టు ఆఖరి బంతికి గెలుపును సాధించింది. కెప్టెన్ నితీశ్ రాణా 51 పరుగులు, ఆండ్రీ రసెల్ 42 పరుగులు, రింకు సింగ్ 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి తమ జట్టును గెలిపించారు. ఇక ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ ఫినీషర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. రింకూ సింగ్ చివరి బంతికి ఫోర్ కొట్టి కోల్కతా జట్టును గెలిపించాడు. కోల్కతాకు వరుసగా ఇది రెండవ విజయం. దీనితో పాయింట్ల పట్టికలో 5వ స్ధానానికి కోల్కతా జట్టు చేరుకుంది.
రింకూ సింగ్ అంతకముందు మ్యాచ్ లో కూడా కీలక సమయంలో తన జట్టును ఆదుకున్నాడు. 35 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ చివరి ఓవర్. 5 బాల్స్ లో 28 పరుగులు చేయాల్సి ఉండగా, ప్రతీ బాల్ ని సిక్సర్గా మార్చి గుజరాత్ జట్టు పై కోల్కతా జట్టుకు విజయాన్ని అందించాడు. ఇలా వరుస మ్యాచ్ లలో రింకూ సింగ్ ప్రతిభను చూసినవారు భారత జట్టుకి మరో ధోనీ దొరికేశాడని అభిమానులు సంతోష పడుతున్నారు.



వచ్చే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్న వైసీపీ, తాజగా 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జులను మార్చింది. కొండెపి- ఆదిమూలపు సురేష్, మంగళగిరి- గంజి చిరంజీవి, ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, వేమూరు- వరికూటి అశోక్ బాబు,సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, తాడికొండ- మేకతోటి సుచరిత, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, గాజువాక- వరికూటి రామచంద్రరావు, రేపల్లె- ఈవూరు గణేష్ లను ఇన్చార్జులగా నియమించారు.
యర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్ను తాజాగా కొండెపికి ఇన్చార్జిగా మార్చడం చర్చకు దారి తీసింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుడు డోలా బాలవీరాంజనేయస్వామి స్థానం ఇది. 2014 మరియు 2019 ఎలెక్షన్స్ లో ఇక్కడి నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉండవచ్చు.
కొండెపికి ఇన్చార్జిగా మార్చడం పై తాజాగా ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. నియోజకవర్గ మార్పు విషయంలో పార్టీ నిర్ణయమే పాటిస్తానని, అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తానని వెల్లడించారు. పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని, సైనికుడిలా పార్టీ విజయం కోసం పనిచేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమకు కెప్టెన్ అని అన్నారు. కొండెపి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు.

