సెలబ్రిటీలలో చాలా మంది స్నేహితులు ఉంటారు. సాధారణంగా ఒకే రంగంలో ఉన్నవారు చాలా మంది స్నేహితులుగా ఉంటారు. కొంత మంది చిన్నప్పటినుండి స్నేహితులు అయితే, కొంత మంది మాత్రం వృత్తిపరంగా కలిసి పనిచేసినప్పుడు స్నేహితులు అవుతారు.
కొంత మంది స్కూల్ నుండి ఒకరికి ఒకరు తెలిసి ఉంటారు. అలా ఉన్న సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. అయితే, స్నేహితులు అవ్వాలి అంటే ఒకటే రంగానికి చెందిన వారు అవ్వాల్సిన అవసరం లేదు. కొంత మంది వేరు వేరు రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా స్నేహితులుగా ఉన్నారు.

అది ఇప్పుడు కాదు. చాలా సంవత్సరాల క్రితం నుండి ఒకరికి ఒకరు కలిసి ఉన్నారు. ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటో కూడా అలాంటిదే. ఇందులో ఇద్దరు సెలబ్రిటీలు ఉన్నారు. ఒకరు పొలిటిషన్ అయితే, ఇంకొకరు యాక్టర్. రాజకీయరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు ఒకరైతే, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఒకరు ఉన్నారు.

ఫోటో చూసిన చాలా మందికి వాళ్ళల్లో ఎవరో ఒకరు అయినా ఈపాటికి అర్థం అయ్యి ఉంటారు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితే, మరొకరు సుమంత్. కింద నుండి మొదటి వరుసలో మధ్యలో ఉన్న వ్యక్తి హీరో సుమంత్. కింద నుండి రెండవ వరుసలో మధ్యలో ఉన్న వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి. వీరిద్దరూ చిన్నప్పటినుండి స్నేహితులు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో కలిసి చదువుకున్నప్పుడు దిగిన ఫోటో ఇది.

ఇందులో వీరితో పాటు మరి కొంత మంది కూడా ఉన్నారు. ఇందులో ఉన్న వాళ్ళ పేర్లు పల్లవి, వైయస్ జగన్, ఐఎస్ విష్ణు, రామారావు, సుమంత్, వరప్రసాద్ వరుసలో రాసి ఉన్నాయి. ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1991 బ్యాచ్ స్టూడెంట్స్ దిగిన ఫోటో. తర్వాత సుమంత్ కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ జగన్, తాను కలిసి చదువుకున్నాము అని చెప్పారు. వాళ్లు క్లాస్ మేట్స్ అని అన్నారు సుమంత్ నటించిన ఇదం జగత్ అనే ఒక సినిమా టీజర్ కూడా జగన్ విడుదల చేశారు. అదే సమయంలో వాళ్ళిద్దరూ స్నేహితులు అని సుమంత్ చెప్పారు.
ALSO READ : అంబానీ ఆడవారి చేతికి ఈ నల్లని తాడు గమనించారా..? ఇలా కట్టుకోవడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా..?










హీరోయిన్ రష్మిక మందన్నలా కనిపిస్తున్న ఆ సెలబ్రిటీ పేరు సనా మీర్. ఆమె ఎవరో కాదు పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్. సనా మీర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరుపున 14 సంవత్సరాల పాటు ఆడి, అత్యుత్తమ క్రికెటర్ గా పేరు తెచ్చుకుంది. తన క్రికెట్ కెరీర్ లో ఆఫ్ స్పిన్నర్గా అసాధారణ ఆటతీరును ప్రదర్శించింది.
ఆమె 226 అంతర్జాతీయ మ్యాచ్లలో ఆడింది. అందులో 137 మ్యాచ్లలో జట్టుకు కెప్టెన్గా ఉంది. వన్డేలలో 100 వికెట్లు తీసిన మొదటి పాకిస్తాన్ మహిళా బౌలర్. 2018లో, ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్లో నంబర్ 1 ర్యాంక్ సాధించిన మొదటి పాకిస్తానీ మహిళా క్రికెటర్గా ఆమె నిలిచింది. ఆమె 2010, 2014 ఆసియా క్రీడలలో పాకిస్తాన్కు రెండు బంగారు పతకాలను సాధించింది. ఆమె 240 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. ఆమె 2009-2017 వరకు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా సారధ్యం వహించింది.
సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్కు మే 2020లో రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న మ్యాచ్ల కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 37 ఏళ్ల సనా మీర్, క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్ జట్టులోని అత్యంత అందమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. చాలా మంది క్రికెట్ అభిమానులు ఆమె క్యూట్ లుక్స్ ను ఇష్టపడుతారు.
