ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నట్టుగా, ఓటీటీలలో వెబ్ సిరీస్లు రిలీజ్ అవుతున్నాయి. అలా వచ్చిన వెబ్ సిరీస్లలో ‘అయలీ’ ఒకటి. ఈ వెబ్ సిరీస్ తమిళంలో రూపొందింది.
ఈ తమిళ వెబ్ సిరీస్ జనవరి 26 నుండి ప్రముఖ ఓటీటీ ‘జీ5’ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మరి అయాలీ స్టోరీ ఏమిటో? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
అభి నక్షత్రం, అనుమోల్, మదన్ కీలకపాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ కి ముత్తు కుమార్ దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్లగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, తమిళనాడులో ఉండే వీరపన్నై అనే ఊరి గ్రామ దేవత అయలీ. ఆ దేవతను రజస్వల కాని అమ్మాయిలు మాత్రమే దర్శించుకోవాలనే నియమం ఉంటుంది. ఆ ఊరి అమ్మాయిలకు రజస్వల అయిన వెంటనే పెళ్లి చేయాలని, అమ్మాయిలు అంతగా చదువుకోకూడదనే కట్టుబాట్లు ఉంటాయి.
అయితే ఈ కట్టుబాట్లు పాటించకుండా, ప్రేమించిన వ్యక్తితో ఒక అమ్మాయి పారిపోవడంతో దేవత ఆగ్రహించి ఆ ఊరిని నాశనం చేసిందనుకున్న ఆ గ్రామస్థులందరు వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు. ఆ గ్రామస్థుల ఒక ఊరిని నిర్మించుకుని, అందులో అయలీ దేవత గుడిని నిర్మించి, తమ ఆచారాల్ని మళ్ళీ కొనసాగిస్తుంటారు. అయితే ఆ గ్రామాంలోని యళిల్ (అభి నక్షత్ర) డాక్టర్ కావాలని కలలు కంటుంది. ఆమె టెన్త్ క్లాస్ వరకు ఎలా చదువుకుంది? ఆమె కల నెరవేరిందా? లేదా? ఆమె ఊరి ప్రజల్లో ఎలా మార్పు తీసుకొచ్చింది? అనేది మిగిలిన కథ.
మొదటి నుంచే యళిల్ పాత్ర పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానిని దర్శకుడు అలానే కొనసాగిస్తూ ఆమె పోరాటాన్ని తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అభి నక్షత్ర యళిల్ క్యారెక్టర్ లో జీవించింది. స్టోరీని ఆ పాత్రే ముందుకు నడిపించింది. అనుమోల్, సింగంపులి, మదన్, టీఎస్ ధర్మరాజు, లింగా వంటివారు తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. రెవా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హత్తుకుంటుంది. రామ్జీ సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
Also Read: “రాశి ఖన్నా” కి ఏమయ్యింది..? తెలుగు సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు..?


ఉత్తర కర్ణాటక సావాజీ కమ్యూనిటీకి చెందిన వారు శ్రావణ మాసాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రావణం నుండి వినాయక చతుర్థి వరకు మాంసాహారాన్ని తినరు. మాంసాహార డైట్ ను ఎలుకల వీక్ మొదలవుతుంది. తొలి రోజు మోదక, కడుబు వంటి తీపి ఆహారాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు వినాయకుడి మూషికానికి ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా ఎలుకలు మొక్కలకు హాని చేస్తాయి. ఇలా ఎలుకలను పూజిస్తూ, హాని కలిగించకూడదని ప్రార్ధిస్తారు.
నాన్ వెజ్లో వంటకాలలో మటన్ వంటకాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. మటన్ మసాలా, మటన్ ఖీమా, మటన్ బోటీ తదితర వాటిని నైవేద్యంగా పెడతారు. అయితే కొందరు చికెన్, చేపలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఎడ్మి, రోటీ మొదలైన వంటకాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా వినాయకుడికి మాంసాహార వంటకాలు నైవేద్యంగా సమర్పించడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ 1988లో నవంబర్ 5న ఢిల్లీలో పంజాబీ ఫ్యామిలిలో జన్మించాడు. న్యూ ఢిల్లీలో పెరిగిన కోహ్లి, వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో క్రికెట్ లో శిక్షణ పొందాడు. ఢిల్లీ అండర్-15 జట్టుతో తన కెరీర్ మొదలుపెట్టాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. తక్కువ సమయంలో వన్డే జట్టులో ముఖ్యమైన ప్లేయర్ గా మారాడు. ఆ తర్వాత టెస్టుల్లో 2011లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో, కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మొదటిసారి నంబర్ వన్ ప్లేస్ కు చేరుకున్నాడు.
నెక్స్ట్ మ్యాచ్ల్లో కూడా కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడు. శుక్రుడు, శని, చంద్రుడు కోహ్లికి అవకాశాలను కల్పిస్తారు. విరాట్ కోహ్లీ లైఫ్ లో సంతోషం ఎక్కువగా ఉంటుంది. కోహ్లీ జాతకంలో అదృష్టాన్ని ఇచ్చే రాజయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రహా స్థితి చాలా బాగుంది. కోహ్లీ జాతకం ప్రకారంగా భారత జట్టు వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
రేఖ ఆనందం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వచ్చిన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో యువతకు రేఖ మరింత చేరువైంది. ఆ మూవీ తరువాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ రేఖకు అవకాశాలు వచ్చాయి. అయితే టాలీవుడ్ లో రేఖకు మంచి హిట్లు వచ్చాయి. అయితే ఆ తరువాత రేఖ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమె కొన్ని సినిమాలలో సైడ్ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత టాలీవుడ్ కు దూరం అయ్యింది.
చాలా రోజుల తరువాత రేఖ బుల్లితెర పై మెరిసింది. అయితే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బాగా చిక్కిపోయింది. ఏదో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేఖ తన ఆరోగ్య సమస్య గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పాల్గొంది.ఆ షోలో రేఖ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అది సహజం, మన వృత్తిని చూసి అలా జరగవు. అయితే ఏం జరిగినా కూడా లైఫ్ లో ముందుకు వెళ్ళాలని, జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన లైఫ్ లో గుణపాఠం లాంటిది.
తనకు కొన్ని హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చాయని, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. అనుకోకుండా జరిగింది. అయితే చాలా మందికి హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉంటాయి. చిన్నవి అయినా, పెద్ద వ్యాధి అయినా ఒత్తిడికి లోనవ్వద్దు. ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు మరింతగా పెరుగుతాయని చెప్పుకొచ్చారు.
ఉపేంద్ర 90లలో ఓం, ఎ, ఉపేంద్ర, రా లాంటి సినిమాలతో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. యాక్టర్ గానే కాకుండా దర్శకుడిగానూ ఉపేంద్ర వేసిన ముద్ర ప్రత్యేకమైంది. ఉపేంద్ర డైరెక్షన్ లో మూవీ అంటే టేకింగ్, కథాకథనాలు ఆడియెన్స్ అంచనాలకు అందని రేంజ్ లో ఉంటుంది. ‘ఉపేంద్ర’ మూవీతో తెలుగులో హిట్ అందుకుని భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఉపేంద్ర, గత 20 ఏళ్ళలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
అయితే చాలా విరామం తర్వాత ‘యుఐ’ అనే సినికు దర్శకత్వం చేస్తూ, నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ను సెప్టెంబర్ 18న థియేటర్లో రిలీజ్ చేశారు. టీజర్ చూడడానికి వెళ్ళిన ఫ్యాన్స్ ఉపేంద్ర ఇచ్చిన షాక్ కి కొన్ని క్షణాల వరకు తేరుకోలేకపోయారు. టీజర్ ప్లే చేయగానే ఒక్కసారిగా చీకటిగా మారింది. విజువల్ ఏం లేకుండా ఆడియో మాత్రమే వినిపించడంతో ముందుగా ఏదో టెక్నికల్ ఎర్రర్ అని భావించారు. కానీ టీజర్ అది అని గ్రహించడానికి టైమ్ పట్టింది.
అయితే గత కొద్దిరోజులుగా ఉపేంద్రపై కన్నడ ఇండస్ట్రీలో పదేళ్ల పాటు సినిమాలు చేయకుండా నిషేధం విధించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఉపేంద్ర సినిమా తరువాత ఆయన డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. దాంతో ఉపేంద్రను బ్యాన్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నకు ఉపేంద్ర, నటన వైపు వెళ్లాలనే ఉద్దేశ్యంతో డైరెక్షన్ కు దూరంగా ఉన్నట్టు తెలిపారు.
సింహా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ నటించిన మూవీ లెజెండ్. ఈ మూవీ 2014 లో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పై ఆచంట గోపిచంద్, ఆచంట రామ్, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. కొర్రపాటి సాయి సమర్పించారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీకి త్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నాంది అవార్డ్ వచ్చింది.
ఈ రెండు సినిమాలలో ఆనంద్ రాజ్ అనే యాక్టర్ నటించాడు. సింహా సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా నటించాడు. ఈ నటుడి పేరు ఆనంద్ రామరాజు. ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంలో జన్మించారు. తన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని అక్కడే పూర్తి చేశాడు. నటన పై విపరీతమైన ఆసక్తి ఉన్న రామరాజు 2003లో సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ పొందారు.
ఆనంద్ రామరాజు 2004 లో ఆరుగురు పతివ్రతలు అనే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు రు. ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఆ తరువాత గౌతమ్ SSC, పోకిరి, సింహా, నేనింతే, లెజెండ్, లౌక్యం, ఆగడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో నటించాడు. ఎక్కువగా నెగిటివ్ రోల్స్లో నటించిన రామరాజు తన నటనకు గాను ప్రశంసలు అందుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెల్సిందే. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 కోసం 3 లక్షల 80 వేలమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 2,32,457 మంది మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను లీకేజీ వల్ల మొదటిసారి రద్దు చేశారు. ఆ తరువాత జూన్ 11న మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఇప్పుడు రెండవ సారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తిరిగి నిర్వహించాలని కోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ టైమ్ లో అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకపోవడం వల్లే రద్దు చేస్తున్నట్టుగా కోర్టు తెలిపింది. జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ అమలు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేని ఓఎంఆర్ షీట్లు ఇవ్వడంతో అక్రమాలకు తావిచ్చేలా ఉందని కొందరు అభ్యర్థులు ఈ విషయం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ ఎగ్జామ్ ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా గవర్నమెంట్ ను, టీఎస్పీఎస్సీ బోర్డును ఆదేశించాలని అభ్యర్థులు బి. ప్రశాంత్, జి.హరికృష్ణ, బండి ప్రశాంత్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, పిటిషనర్ల తరఫున లాయర్ గిరిధర్రావు వాదనల అనంతరం, పరీక్షను రద్దు చేస్తూ ఏరోజు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో అభ్యర్థులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.
గుంటూరు కారం సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఆ తరువాత హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. గత కొద్దిరోజులుగా ఈ మూవీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న శ్రీలీల, మెయిన్ హీరోయిన్ అవగా, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి తీసుకున్నారని తెలుస్తోంది. జగపతి బాబు ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టారు. నాన్ స్టాప్ గా షూటింగ్ కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. మహేష్ బాబు తల్లిగా ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోలందరితో నటించిన రమ్యకృష్ణ, కొన్నేళ్ళ నుండి హీరోలకు తల్లిగా, కీలక పాత్రలలో నటిస్తోంది. ఇటీవల జైలర్ మూవీలో రజినికాంత్ భార్యగా నటించింది. రమ్యకృష్ణ ప్రస్తుతం గుంటూరు కారంలో మహేష్ బాబు తల్లిగా నటిస్తోంది. అయితే వీరిద్దరు ఇంతకు ముందు ‘నాని’ మూవీలో కలిసి నటించారు. మళ్ళీ 19 ఏళ్ల తరువాత గుంటూరు కారంలో నటిస్తున్నారు.
విజయ్ ఆంటోని కుటుంబం చెన్నైలోని డిడి కే రోడ్ లో నివసిస్తుంది. విజయ్ ఆంటోనీ, ఫాతిమా దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు మీరా ఆంటోనీ, లారా ఆంటోని. పెద్ద కుమార్తె మీరా వయసు 16 సంవత్సరాలు. ఆమె చర్చ్ పార్క్ హై స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఈమె ప్రయాణం తీసుకోవడానికి కారణం డిప్రెషన్ అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆమె గత కొద్దిరోజులుగా డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకుంటుందని అంటున్నారు.
గారాల కుమార్తె మీరా దూరం అవడం హీరో విజయ్ ఆంటోనీ జీర్ణించుకోలేకపోతున్నాడు. పిల్లలే లోకంగా బ్రతికే తండ్రి, వారిలో ఒకరు శాశ్వతంగా దూరం అయితే కలిగే దుఖాన్ని ఎవరూ ఓదార్చలేరు. కుమార్తె మీరాతో పాటు తాను కూడా చనిపోయానని విజయ్ ఆంటోనీ చేసిన ట్వీట్ అందరి హృదయాలను కలిచివేస్తోంది. తన జీవితంలో ఎన్నో కోల్పోయిన విజయ్ ఆంటోని ఇప్పుడు కుమార్తెను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నాడు.
తన కుమార్తె మీరా ఆంటోని అడిగిన ఆఖరి కోరికను తీర్చలేకపోయానని ఆయన చాలా బాధపడుతున్నారట. మీరా థాయిలాండ్ కు తీసుకువెళ్లమని కోరిందంట. అయితే విజయ్ ఆంటోనీ బిజీ షెడ్యూల్స్ వల్ల తీసుకెళ్లలేకపోయాడట. ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మరింతగా విజయ్ బాధపడుతున్నారు.

