టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి జగపతిబాబు. అప్పుడు హీరోగా చేసిన జగపతిబాబు ప్రస్తుతం విలన్గా చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ విలన్గా కొనసాగిస్తున్నాడు.
కేవలం సినిమాల్లో కాకుండా వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్తో పాటు రెండో ఇన్నింగ్స్ కూడా అదరగొడుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో హీరో ప్రభాస్, రాజమౌళి కుటుంబంపై పొగడ్తల వర్షం కురిపించాడు జగ్గుభాయ్. ఎన్నో హిట్లు సాధించిన రాజమౌళి మాత్రం సాధారణంగానే ఉంటాడు.

కేవలం రాజమౌళి మాత్రమే అలా కాదు.. వాళ్ల కుటుంబం మొత్తం కూడా అలానే ఉంటారని జగపతిబాబు ఓ ఇంటర్వూలో తెలిపారు. ఎన్ని అవార్డులు వచ్చిన వాళ్ల కుటుంబానికి గర్వం ఉండదు. అందుకే ఆస్కార్ వంటి అవార్డులు వరించాయని అతను తెలిపారు. రాజమౌళి కుటుంబంతో ఎక్కడికి వెళ్లినా సరే.. సినిమా గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు.

జగపతిబాబు రాజమౌళికి బంధువే అయిన పాత్రలు అడగలేను. బంధువే కదా అని ఛాన్స్ ఇచ్చే వ్యక్తి కూడా కాదని తెలిపారు. ఏ పాత్రకు ఎవరు సెట్ అవుతారో రాజమౌళికి బాగా తెలుసు. సినిమాల గురించి రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉంటుంటారు. వీరి కుటుంబం నుంచి 20శాతం వరకు మిగతా వాళ్లు నేర్చుకోవచ్చని జగపతిబాబు తెలిపారు.

రెబల్ స్టార్ ప్రభాస్ చేయి చాచే రకం కాదు. తిరిగి ఇచ్చే రకం. కొన్ని సమస్యల వల్ల జగపతిబాబు డిప్రెషన్లోకి వెళ్లారు. ఆ సమయంలో ప్రభాస్కి ఫోన్ చేసి.. మాట్లాడాలని అడిగాను. తను జార్జియాలో ఉన్నాడు. అయిన ఏమాత్రం ఆలోచించకుండా నేను నీకున్నా.. నీ సమస్య చెప్పు డార్లింగ్ నేను తీరుస్తా అని ధైర్యం చెప్పాడు. జార్జియా నుంచి వచ్చిన వెంటనే నన్ను కలిసి నాకు ఓదార్పుగా ఉన్నాడు. వయస్సులో నా కంటే చిన్న అయిన గొప్పోడు, అందరితో ప్రేమగా ఉంటాడని జగపతిబాబు తెలిపాడు.




బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సంచలనంగా మారాడు. సెలెబ్రెటీ కానప్పటికీ. సాధారణ వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన ప్రశాంత్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. షో ప్రారంభం అయ్యి, రెండు వారాలు పూర్తి కాగా, రెండుసార్లు ప్రశాంత్ నామినేషన్స్ లో నిలిచాడు. కానీ టోటల్ ఓటింగ్ లో నలబై శాతం ఓట్లు అతనికే వస్తున్నాయని సమాచారం.
పల్లవి ప్రశాంత్ బలమైన కంటెస్టెంట్ అని హౌజ్ మెంబర్స్ ఇప్పటికే పసిగట్టారు. దాంతో జనాల్లో రైతుబిడ్డ పై సింపథీ పోగొట్టడానికి ట్రై చేస్తున్నారు. అందుకే రెండవ వారం నామిషన్స్ లో రితికా రోజ్, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, తేజా, శివాజీతో పాటు కొందరు ప్రశాంత్ పై అటాక్ చేశారు. సింపథీ మాటలు మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ప్రశాంత్ కున్న క్రేజ్ తగ్గకపోగా మరింతగా పెరిగిందని తెలుస్తోంది.
పల్లవి ప్రశాంత్ తెలంగాణకు చెందిన వ్యక్తి. రైతుబిడ్డగా పాపులర్ అయిన ప్రశాంత్ ఫ్యామిలీ కాస్త డబ్బు ఉన్న ఫ్యామిలీ అని సమాచారం. పల్లవి ప్రశాంత్ కి దాదాపు 26 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉందని అంటున్నారు. అది మాత్రమే కాకుండా సొంత ఊరిలో పెద్ద ఇల్లుతో పాటుగా, కాస్ట్లీ లగ్జరీ కారు కూడా ఉందని టాక్. ప్రశాంత్ పొలం, హౌజ్ విలువ కోట్లలో ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ వ్యవసాయ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయని టాక్. ఈ న్యూస్ లో నిజమెంతో తెలియదు కానీ నెట్టింట్లో వైరల్ గా మారింది.
షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన జవాన్ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించి, వెయ్యి కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ విజయంతో అట్లీ సంతోషంలో మునిగిపోయాడు. ఈ క్రమంలోనే అట్లీ తన మూవీ జవాన్ ను ఆస్కార్ బరిలో దింపాలని కోరుకుంటున్నాడు. ఈ విషయం గురించి దర్శకుడు అట్లీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అట్లీ మాట్లాడుతూ, ఏ దర్శకులకు అయినా అవార్డుల పైన ఆశ ఉంటుందని అన్నారు. జాతీయ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్ వంటివాటిని అందుకోవాలని కలలు కంటారని అన్నారు. అన్నీ కరెక్ట్ గా సెట్ అయితే, జవాన్ మూవీని ఆస్కార్ బరిలో నిలబెట్టాలని భావిస్తున్నామని, ఈ విషయం గురించి షారుఖ్ సర్ని అడగాలని, ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో అని అట్లీ చెప్పుకొచ్చారు.
అయితే అట్లీ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజెన్లు అట్లీని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. కొందరు నెటిజెన్లు అన్నీ సినిమాలను కలిపి తీసావు. ఏ విభాగంలో ఆస్కార్ ఇవ్వమని అంటావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ వంటి మూవీ కేటగిరీలో ఆస్కార్ ఇస్తారా? అని, రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే జవాన్ మూవీని సౌత్ లో ఆదరించక పోయినా, బాలీవుడ్ లో ఈ మూవీని విపరీతంగా చూస్తున్నారు. దాంతో బాలీవుడ్లో అతిపెద్ద రికార్డులను సృష్టిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఫ్లాప్ హీరోయిన్లకు కూడా తన సినిమాలలో అవకాశం ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్, కొన్ని సంవత్సరాల కిందట బ్రూస్ లీ అనే మూవీలో శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించారు. ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. బ్రూస్ లీ మూవీ 2015లో అక్టోబరు 16న రిలీజ్ అయ్యి, ఫ్లాప్ గా నిలిచింది.
అయితే ఆ తరువాత కాలంలో రామ్ చరణ్ డైరెక్షన్ లో ధృవ మూవీలో నటించారు. ఈ మూవీలో రామ్ చరణ్ బ్రూస్ లీ మూవీ ఫ్లాప్ అయిన ఆ మూవీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ధృవ మూవీలో అవకాశం ఇచ్చారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను పాటిస్తూ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీకి ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఎందుకంటే 2019లో రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది.
అయితే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ హీరోయిన్ కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ లో ఛాన్స్ ఇచ్చారు. దాంతో నెట్టింట్లో రామ్ చరణ్ ఫ్లాప్ సెంటిమెంట్లను పట్టించుకోరని, అందువల్లే ఫ్లాప్ మూవీ హీరోయిన్లకు తన చిత్రాలలో ఛాన్స్ ఇస్తున్నారని అంటున్నారు.
అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన కుమారుడు సుశాంత్ హీరోగా పలు చిత్రాలను నిర్మించారు. కరెంట్, అడ్డా, కాళిదాసు, ఆటాడుకుందాం రా వంటి సినిమాలను నిర్మించారు. అయితే ఈ చిత్రాలకు నాగసుశీలతో పాటు చింతలపూడి శ్రీనివాసరావు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాలు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దాంతో నాగసుశీల, శ్రీనివాసరావుకు 2017లో విబేధాలు వచ్చాయి. వీరిద్దరు పార్టనర్స్ గా ఉండి, కొన్న ల్యాండ్ విషయంలో ఇద్దరికీ గొడవలు జరిగాయి. నాగసుశీల నాంపల్లి 2017లో చింతలపూడి శ్రీనివాసరావు మీద కోర్టులో కంప్లైంట్ చేశారు.
కోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. శ్రీనివాసరావు నాగసుశీల తన మీద తప్పుడు కేసులు పెట్టారని మీడియాకు చెప్పారు. నాగసుశీల శ్రీనివాసరావు పై సరి అయిన ఆధారాలు చూపించకపోవడంతో నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే ఇప్పుడు నిర్మాత నాగసుశీల పై అదే శ్రీనివాసరావు కేసు పెట్టాడు. నాగసుశీలతో పాటు మరో పన్నెండు మంది తన పై అటాక్ చేశారని శ్రీనివాసరావు తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు.
శ్రీనివాసరావు, నాగసుశీలతో కలిసి కొనుగోలు చేసిన భూములను అప్పుడే పంచుకున్నామని, తన వాటా భూమిని ఒక ఆశ్రమానికి డొనేట్ చేశానని, ఆ స్థలంలో ప్రస్తుతం ఆశ్రమం నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. కానీ నాగసుశీల ఆ భూమి తనదేనని ఇప్పుడు గొడవ చేస్తున్నారని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. నాగసుశీల, ఆమె కుమారుడు సుశాంత్, బౌన్సర్లు, కొంత మంది వచ్చి దౌర్జన్యం చేశారని, గొడవ చేశారని శ్రీనివాసరావు ఆరోపణలు చేస్తున్నారు.
విజయ్ ఆంటోనీ తన ఫ్యామిలితో కలిసి చెన్నైలో డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు. విజయ్ కుమార్తె పేరు మీరా ఆంటోనీ. ఆమె చర్చ్ పార్క్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. 16 ఏళ్ల మీరా ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను గమనించిన ఫ్యామిలీమెంబర్స్ సమీపంలోని కావేరీ హాస్పటల్ కి తరలించారు. అయితే అప్పటికే మీరా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు మీరా మృతిని ఆ-త్మ-హ-త్య-గా కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన టైమ్ లో విజయ్ ఆంటోని ఇంట్లో లేరని అంటున్నారు.
మీరా మరణానికి కారణం చదువుల్లో ఒత్తిడి అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పైన, తన కుమార్తె మీరా చనిపోవడం పైన విజయ్ ఆంటోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కుమార్తె చనిపోయి, బాధలో ఉన్న విజయ్ ఆంటోనికి ప్రముఖులు, ఫ్యాన్స్ ధైర్యాన్ని చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే గతంలో బలవన్మరణం ఆలోచనల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు బలవన్మరణంకు ఎందుకు పాల్పడుతారు?
అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి అనే విషయం పై మాట్లాడారు. “ఎవరినైనా అతిగా నమ్మి మోసపోవడం, కమిట్మెంట్ ఇచ్చి, ఆ పనిని చేయలేకపోవడం, చదువుకునే పిల్లలకు చదువుల వల్ల కలిగే ఒత్తిడితో ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పుకొచ్చాడు. బడి నుంచి వచ్చిన తరువాత పిల్లల్ని ట్యూషన్కి పో అంటూ ఉంటాం. పిల్లలను సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వడం లేదు. పిల్లలను కొంచెం ఫ్రీగా వదిలేయాలని” చెప్పుకొచ్చాడు. విజయ్ ఆంటోని కూడా తన కుమార్తె చదువు విషయంలో ఒక కామన్ ఫాదర్ లానే ప్రవర్తించాడా? అందువల్లే ఒత్తిడికి గురై ఆమె ప్రాణం తీసుకుందా అని అంటున్నారు.
ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7/జి బృందావన కాలనీ మూవీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పలు రికార్డులను సృష్టించింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. కమర్షియయల్ గా హిట్ అయ్యింది. ఈ మూవీకి గాను రవి కృష్ణ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ అవార్డ్ అందుకున్నాడు. ఈ మూవీ సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు.
ఈ మూవీ తరువాత రవి కృష్ణ తన తదుపరి సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వరుస అపజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో సినిమా అవకాశాలు పొందడంలో కూడా విఫలమయ్యాడు. తెలుగు, తమిళం భాషల్లో కలిపి సుమారు 8 సినిమాలలో హీరోగా నటించాడు. వీటిలో ‘7/జి బృందావన కాలనీ’ మూవీ తప్ప మిగిలిన సినిమాలన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
2011 తరువాత రవి కృష్ణ మరే సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అవకాశాలు లేక ఎక్కువ సమయం ఇంటి దగ్గరే గడుపుతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో రవి కృష్ణ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇటీవల 7/జి బృందావన కాలనీ సీక్వెల్ రాబోతున్నట్టుగా కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం రవి కృష్ణ బరువు తగ్గించుకుని, సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది.
సాహస్ పగడాల, దీపికా రెడ్డి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘7:11 పీఎం’ జులై 7న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, హంసలదీవి అనే గ్రామంలో 1999 సంవత్సరంలో రవి ప్రసాద్ (సాహస్) ఆటో గ్యారేజ్లో పని చేస్తూ, ఐపీఎస్ సాధించాలని సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. రవి, విమల (దీపికా రెడ్డి) ప్రేమించుకుంటారు. రాజేశ్ అనే వ్యక్తి, స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ ఒక ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ ఊరిలోని ప్రజలందరిని మోసం చేయడానికి రెడీ అవుతాడు.
ఆ మోసాన్ని తెలుసుకున్న రవి అతన్ని అడ్డుకొనే ప్రయత్నంలో అనుకోకుండా ఒక బస్సు ఎక్కుతాడు. నిద్ర లేచే సరికి రవి మెల్బోర్న్లో ఉంటాడు. అక్కడ కాలం 2024 లో నడుస్తూ ఉంటుంది. అసలు ఆ ఊరికి టైమ్ మిషన్ ఎలా వచ్చింది? రవి ఎందుకు ఆ టైమ్ మిషన్ ఎక్కాల్సి వచ్చింది? అతను తిరిగి తన కాలానికి వెళ్లాడా? తాను ప్రేమించిన విమలను కలిశాడా లేదా? అనేదే మిగిలిన కథ.
డైరెక్టర్ చైతూ మాదాల సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కొత్తగా, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అయితే ఆ పాయింట్ను కథగా చెప్పడంలో తడబాటు కనిపిస్తుంది. అయితే మొదటి సినిమా దర్శకుడిగా స్టోరీని డీల్ చేసిన తీరు, పలు క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు బాగుంది. పాత్రల్లో సహజత్వం కనిపిస్తుంది. హీరో సాహస్ చక్కటి నటనను ప్రదర్శించాడు. హీరోయిన్ దీపిక పాత్ర పరిధి మేరకు నటించింది.
19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్గా 41 సంవత్సరాల కల్నల్ మన్ప్రీత్ సింగ్ వర్క్ చేస్తున్నారు. బుధవారం నాడు జమ్మూ కశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో రావడంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో కల్నల్ మన్ప్రీత్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్, మేజర్ ఆశిష్ ధోంచక్ మరణించారు.
ముగ్గురు అమర వీరుల భౌతిక కాయాలను వారి స్వగ్రామలకు తరలించారు. ఈ క్రమంలో కల్నల్ మన్ప్రీత్ సింగ్ భౌతిక కాయాన్ని పంజాబ్ రాష్ట్రంలోని మల్లాన్పూర్ కు తరలించారు. ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి ఇసుక వేస్తే రాలనంత మంది ప్రజలు వచ్చారు. కన్నిటితో కల్నల్ మన్ప్రీత్ సింగ్ అంతిమ సంస్కారాలను జరిపించారు. అయితే ఆయన భౌతిక కాయం వద్ద చోటు చేసుకున్న ఒక సన్నివేశం అక్కడ ఉన్న వారి మనసులను కలిచివేసింది.
కల్నల్ మన్ప్రీత్ సింగ్ ఆరేళ్ళ కుమారుడు కబీర్ ఆర్మీ డ్రెస్ వేసుకుని, కనిపించాడు. అక్కడ ఏం జరిగిందో అర్ధం కానీ చిన్న వయసులో ఉన్న ఆ బాబు తన నాన్న భౌతిక కాయానికి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. అన్న సెల్యూట్ చేయడం చూసిన ఆ బాబు చెల్లెలు రెండేళ్ల పాప కూడా సెల్యూట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.