జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు
సున్నితమైన ఎమోషన్స్ను ఎంతో అద్భుతంగా పేపర్ బాయ్ సినిమాలో చూపించి మెప్పించాడు దర్శకుడు జయ శంకర్. ఇక రెండో ప్రయత్నంగా అరి అంటూ అరిషడ్వర్గాల మీద చిత్రాన్ని తీశాడు. ఇప్పటికే ఈ మూవీ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు సినిమాను చూసి మెచ్చుకున్నారు కూడా. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే ఈ క్రమంలో దర్శకుడు జయ శంకర్ కొత్త సినిమా మీద రూమర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఈయన ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా, ఆ కథకు నయనతార ఓకే చెప్పినట్టుగా ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద కొత్త రూమర్ వినిపిస్తోంది. జయశంకర్ అనుకుంటున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్కు సౌత్, నార్త్లో మంచి క్రేజ్ ఉన్న నటిని తీసుకున్నారని సమాచారం.
శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో జయ శంకర్ తన లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ను చేస్తున్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక జయశంకర్ తీసిన అరి చిత్రం ఈ ఎన్నికల హడావిడి అయిపోయిన తరువాత థియేటర్లోకి రానుంది. జూన్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.







మలయాళ హీరో కున్చకో బొబన్ మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితుడే. కున్చకో బొబన్ హీరోగా నటించిన మలయాళ మూవీ ‘పద్మిని’ జులై 14న థియేటర్లలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సెన్నా హెగ్డే తెరకెక్కించారు. ఈ మూవీలో మడోన్నా సెబాస్టియన్, అపర్ణా బాలమురళి, విన్సీ అలోషియస్, సజిన్, మాళవిక మేనన్ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఒక కాలేజీలో రమేష్ (కున్చకో బొబన్) ప్రొఫెసర్గా వర్క్ చేస్తుంటాడు. అతను కథలు కూడా రాస్తుంటాడు.
రమేష్ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడతాడు. కానీ మొదటి రాత్రే రమేష్ భార్య లవ్ చేసిన వ్యక్తితో వెళ్లిపోతుంది. ఆ తరువాత రమేష్ తల్లిదండ్రులు అతనికి రెండవ పెళ్లి చేయాలని భావిస్తారు. దానికి రమేశ్ కూడా ఒప్పుకోవడంతో పెళ్లి సంబంధం చూస్తారు. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ రమేష్ కు అధికారికంగా విడాకులు వస్తేనే తమ కూతురుని ఇస్తామని షరతు పెడతారు.
అయితే భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియని రమేశ్ ఆమెను ఎలా వెతికి, పట్టుకున్నాడు? ఆమెను వెతికే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? రమేష్ కు లాయర్ (అపర్ణా బాలమురళి) ఎలా సహాయం చేసింది. చివరికి రమేష్ రెండవ పెళ్లి చేసుకున్నాడా? లేదా ఇంతకీ కథలో పద్మిని ఎవరు? అనేది మిగతా కథ.
లోపల బాధను ఉంచుకుని, పైకి బాధ కనిపించకుండా నవ్వుతూ కనిపించే రమేశ్ క్యారెక్టర్ లో కున్చకో బొబన్ ఒదిగిపోయారు. లాయర్ గా అపర్ణ బాలమురళీ నటన బాగుంది. సజిన్ కామెడీ టైమింగ్, మడోన్నా సెబాస్టియన్, విన్సీ అలోషియస్, మాళవిక మేనన్, అలరిస్తారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అనుకున్న స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ సెన్నా హెగ్డే సక్సెస్ అయ్యాడు.
నారా లోకేష్ మంగళగిరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు మరియు యువతతో ఆగస్టు 16న ‘హలో లోకేష్’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి గుంటూరు, విజయవాడ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మరియు యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ జవాబు చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక యువతి నారా లోకేష్ ను బ్రాహ్మణితో పెళ్లి విషయల గురించి అడిగింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్తూ, నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. లోకేష్ మాట్లాడుతూ “తనది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని అన్నారు. అయితే ‘ముద్దుల మామయ్య (నందమూరి బాలకృష్ణ) దగ్గర అంత సాహసం చేసేవాడ్ని కాదని వెల్లడించారు.
ఇంట్లో అమ్మానాన్నవాళ్ళు ఒక వెకేషన్ కు వెళ్తే అక్కడ చెప్పారు. ఇలా మేము అనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నా అభిప్రాయం మీకు తెలుసు కదా. వాళ్ళు ముందు అలా ప్రతిపాదించారు.
అయితే విజయ్ కుమారి ముందుగా యోగా టీచర్ గా, బ్యాంకర్ గా, వాలంటీర్ గా పనిచేసేవారు. ఆమె సద్గురు భార్యగా అందరికీ పరిచయం. ఆమె కూతురు రాదే జగ్గి ఇండియన్ క్లాసికల్ డాన్సర్.



”గరుడ గమన వృషభ వాహన” మూవీ 2021లో నవంబర్ 19న రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించింది. ఈ కన్నడ మూవీ షోలు హైదరాబాద్ వంటి పలు నగరాల్లోనూ వేశారు. ఈ మూవీ పై అంత హైప్ ఏర్పడింది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ లేదు. ఈ చిత్రానికి రాజ్ బి శెట్టి దర్శకత్వం వహించారు. థియేటర్లలో విజయం సాధించిన ఈ మూవీ ఆ తరువాత ఓటీటీలో రిలీజ్ అయ్యి, దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇద్దరు మిత్రులు వారి శత్రువులను ఎదురించే క్రమంలో పెద్ద గ్యాంగ్ స్టర్స్ గా ఎదుగుతారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ ఎదురైన సమస్యలు, ఆ తరువాత వారి పతనానికి కారణం అయిన పరిస్థితుల ఏమిటనేది మిగిలిన కథ. రొటీన్ కథ అయినప్పటికీ కంప్లీట్ వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రాజ్ బి శెట్టి మరియు రిషబ్ శెట్టిలు అద్భుతంగా నటించారు.
వారి నటనతో పాటు, యాక్షన్ సీన్స్ ఈ మూవీలో హైలైట్. మంచి కలెక్షన్స్ తో పాటు, ‘గరుడ గమన వృషభ వాహన’ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీకి జాతీయ అవార్డులలో గుర్తింపు దక్కలేదు. దాంతో ఇట్లాంటి సినిమాకి ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవటం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
టైటిల్ లో సూచించిన విధంగా ఈ మూవీ ముగ్గురు యువకుల కథ. రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోనీ వర్గీస్) ఇద్దరు అన్నదమ్ములు, వీరి స్నేహితుడు జేవియర్ (నీరజ్ మాధవ్) తో కలిసి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతారు. చర్చిలో జరుగిన పండుగలో తన తండ్రి పై చేయి వేశారని డోని రౌడీ గ్యాంగ్ ను చితకబాదుతాడు. ఆ రౌడీ గ్యాంగ్ అర్ధరాత్రి సమయంలో డోని ఇంటి పైకి వచ్చి కుటుంబంలో చిన్న పిల్లలతో పాటు అందరి పై దాడి చేస్తారు. వారికి తీవ్రమైన గాయాలు అవుతాయి.
డోని ఇంటి పై దాడి చేసిన గ్యాంగ్ ఎవరిది? ఆ గ్యాంగ్ కి డోని కుటుంబం పై ఉన్న పగ ఏమిటి? దాడి చేసిన తరువాత ఆ గ్యాంగ్ పై డోని, రాబర్ట్, జేవియర్ ఎలా పగ తీర్చుకున్నారు అనేది మిగిలిన కథ. డైనమిక్ ఫైట్ సీక్వెన్స్లు, హై-స్టేక్స్ స్టంట్స్, టెన్షన్-ఫిల్డ్ మూమెంట్స్ తో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ, ఎమోషన్స్, మాస్, కామెడీ వంటివన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.
ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. షేన్ నిగమ్, ఆంటోనీ వర్గీస్ మరియు నీరజ్ మాధవ్ ముగ్గురు ఎక్కడా తగ్గకుండా పోటీ పడి నటించారు. విష్ణు అగస్త్య విలన్ పాత్రలో నటించాడు. విలన్ గా ఆయన లుక్స్, ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను సైతం భయపెట్టాయి. ఈ మూవీకి యాక్షన్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి.