దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే వంటి సినిమాలతో అలరించిన ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు అయినా, సొంతంగా ఎదగాలనే తపనతో కెరీర్ లో ముదుకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ తాజాగా ‘బేబీ’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మొదటి షోతొనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. బేబీ మూవీ రిలీజ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటించిన మూవీ బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేశ్ డైరెక్షన్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్, డైలాగుల వంటివి ఈ చిత్రం పై అంచనాలు పెరిగేలా చేశాయి. హీరో విజయ్ దేవరకొండ `బేబీ` ప్రీమియర్ చూసిన తరువాత ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి షోతొనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య మొదటిససారిగా హీరోయిన్ గా నటించింది. వైష్ణవి యూట్యూబ్ వీడియోల ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో మూవీలో బన్నీ చెల్లిగా వైష్ణవి నటించింది. పలు సినిమాలలో చిన్న పాత్రలలో నటించింది.
బేబీ మూవీలో వైష్ణవి చైతన్య నటనతో ఆడియెన్స్ ఆకట్టుకుందని టాక్ వినిపిస్తోంది. మూవీ కూడా చాలా సహజంగా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే సోషల మీడియాలో బేబీ మూవీ రిలీజ్ పై పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు కూడా చూసేయండి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.

హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పలు ఆలయాలను దర్శిస్తూ, అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో అమీన్ పీర్ దర్గాను సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నాడు. ఆ తరువాత కాణిపాకం చేరుకుని కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని, పూజలు నిర్వహించాడు. అక్కడి నుంచి సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తికి వెళ్లాడు.
సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామికి సాయి ధరమ్ తేజ్ స్వయంగా హారతి ఇచ్చారు. ప్రస్తుతం అది వివాదాస్పదంగా మారింది. శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్య స్వామికి పూజారి తప్ప వేరే వ్యక్తులు ఎవరు కూడా హారతిని ఇవ్వకూడదట. హీరో అయితే హారతి ఇవ్వడానికి ఎలా అనుమతి ఇచ్చారని గుడి అధికారులను భక్తులు ప్రశ్నిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఎలా హారతి ఇస్తాడని అతని పై కొందరు మండిపడుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత అంతగా బయటకు రాలేదు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఇది తనకు పునర్జన్మ అని, భగవంతుడు పునర్జన్మ ప్రసాదించారని, అందుకే ఆలయాలను సందర్శించి, పూజలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు.
టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఇండియాలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ట్రైలర్ తో ఇప్పటికే వావ్ అనిపించిన మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా పై హైప్ పెంచుతూ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలతో ఈ మూవీ మరింత క్రేజ్ పెరిగింది. దాంతో ఈ సిరీస్ నుండి కొత్త మూవీ వస్తున్న ప్రతిసారి ఆడియెన్స్ ఎగ్జైటెడ్ గా ఉంటారు. దానికి తగినట్టుగా మిషన్ ఇంపాజిబుల్ 7 వచ్చింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయ్యింది. ఈ మూవీకి ఇండియాలో కూడా ఎక్కువ థియేటర్లు లభించాయని తెలుస్తోంది.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, సముద్రంలో మునిగిపోయిన ఒక సబ్ మెరైన్ లో ప్రపంచానికి చెడు చేసే ఒక రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యాన్ని కనిపెట్టాలంటే 2 భాగాలు ఉన్న తాళం చెవి కావాలి. ఆ తాళం చెవిని వెతికే బాధ్యతను ప్రభుత్వ ఆఫీసర్లకి అప్పగిస్తుంది. వారితో పాటు హంట్ (టామ్ క్రూజ్) కూడా రంగంలోకి దిగుతాడు. కీ వెతికే సమయంలో వారికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని ఫైనల్ కీని ఎలా సంపాదిస్తారు అనేది కథ.
మూవీ సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సన్నివేశాలతో నడిపించారు. స్టోరీ పరంగా గొప్పగా ఏమీ లేకపోయినా యాక్షన్ లవర్స్ కోరుకునే సీన్స్ మాత్రం అభిమానులని చాలా ఇంప్రెస్ చేస్తాయి. యాక్షన్ ప్రియులను మెప్పించేలా మూవీ ఉన్నా లెంగ్త్ ఎక్కువయిన భావన వస్తుంది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయ్యేట్టు ఉంది. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ఆడియెన్స్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా మూవీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు.
తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లలో 6వ సీజన్ తప్ప మిగిలిన సీజన్స్ అన్ని రికార్డ్ స్థాయిలో టీఆర్ఫీ రేటింగ్స్ ని పొంది సూపర్ హిట్ అయ్యాయి. అతి త్వరలోనే 7వ సీజన్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా హోస్ట్ హీరో అక్కినేని నాగార్జునే అని తెలుస్తోంది. రీసెంట్ గా నాగార్జునకి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది.
ఈ ప్రోమోని త్వరలోనే రిలీజ్ చెయ్యబోతున్నారట. ఇక సీజన్ 7లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అధికారికంగా తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో చాలా కఠినమైన రూల్స్ ఉండబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో కంటెస్టెంట్స్ కొన్ని సందర్భాలలో హద్దులు దాటి మరి గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ క్రమంలో నోటి నుండి పొరపాటున బ్యాడ్ వర్డ్ ఒక్కటి బయటికి వచ్చినా సరే ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు ఇచ్చి షో నుండి బయటకి పంపేస్తారట.
అది మాత్రమే కాకుండా బిగ్ బాస్ 5వ సీజన్ లో షణ్ముఖ్, సిరల రొమాన్స్ బిగ్ బాస్ షో చూసే ఆడియెన్స్ కు ఎంత ఇబ్బంది కలిగించిందో తెలిసిందే. ఇక ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది. అందువల్ల సీజన్ 7లో అలాంటి రొమాన్స్ జరగకుండా చూసుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. హద్దులు దాటి రొమాన్స్ చేసిన వారికి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపిస్తారని టాక్ వినిపిస్తోంది.
స్టార్ హీరోలకు ప్రేక్షకులలో ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. దాని వల్ల వారు బయటికి రావడం అంత సులభం కాదు. వారికి సెక్యూరిటీ ఉండాలి. అందులోనూ నమ్మకమైన బాడీ గార్డు కూడా ఉండాలి. రక్షణ కవచం వలె పని చేసే బాడీ గార్డులకు స్టార్ హీరోలు వారి రేంజ్లో జీతాలు ఇస్తున్నారు. వేలల్లో, లక్షల్లో కాదు. వారి ఏడాది జీతం కోటల్లో ఉందంటే ఆశ్చర్యపోక మానరు. వీరి జీతం చిన్న హీరోలలో కొందరి రెమ్యూనరేషన్ తో సమానం.
అందరి కన్నా ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్ రవి సింగ్. ఇతను బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ బాడీగార్డు. రవి సింగ్ నెల జీతం దాదాపు రూ.17 లక్షలు, అంటే సంవత్సరానికి రూ.2.7 కోట్ల పైనే సంపాదిస్తున్నాడు. అతని తరువాతి స్థానంలో ఉన్న బాడీగార్డు షేరా, సల్మాన్ ఖాన్ బాడీగార్డ్. షేరా సుమారు 29 సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ దగ్గరే బాడీ గార్డుగా ఉన్నాడు. షేరా నెల శాలరీ రూ.15 లక్షలు, అంటే ఏడాదికి రెండు కోట్ల అని తెలుస్తోంది.
అక్షయ్ కుమార్ బాడీగార్డు శ్రేయ్సే థెస్లె సంవత్సరానికి రూ.1.2 కోట్ల జీతం అని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ కు బాడీగార్డుగా పనిచేసిన జితేంద్ర షిండే ఏడాదికి రూ.1.5 కోట్లు జీతం తీసుకున్నాడు. ఆరేళ్ల పాటు అమితాబ్ బాడీగార్డ్ పని చేసి 2021 ఆగస్టు తర్వాత మానేశాడు. ఆమిర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ ఘోర్పడేకి సంవత్సరానికి రెండు కోట్లు జీతం అని తెలుస్తోంది. దీపికా పదుకొణె బాడీగార్డ్ జలాల్ కి ఏడాదికి రూ.1.2 కోట్లు, అనుష్క శర్మ బాడీగార్డ్ ప్రకాశ్ సింగ్ ఏడాదికి రూ.1.2 కోట్లు జీతం తీసుకుంటునట్లు తెలుస్తోంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని అన్వేషణ కోసం 2008లో చంద్రయాన్-1 ను ప్రయోగించింది. ఇది మూన్ పై నీరు ఉందని రుజువు చేసింది. ఆ తరువాత చంద్రుని పై ల్యాండింగ్, అన్వేషణ కోసం చంద్రయాన్-2 అంతరిక్ష నౌకను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, 2019లో ప్రయోగించారు. కానీ సాంకేతిక లోపం వల్ల చంద్రయాన్-2ను మోసుకెళ్లిన ల్యాండర్ ల్యాండింగ్లో ఫెయిల్ అయ్యి చంద్రుడి పై కూలిపోయింది. ఈసారి సాంకేతిక లోపం తలెత్తకుండా చంద్రయాన్ 3ని ఇస్రో సిద్ధం చేసింది.
శాస్త్రవేత్తలు గతంలో మాదిరిగా జరగాకుండా ఉండేందుకు చాలా టెస్ట్ రన్లు నిర్వహించారు. చంద్రయాన్-3 మిషన్ 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్. అంటే ప్రొపల్షన్ స్పేస్క్రాఫ్ట్లో ఉండే రోవర్ ల్యాండర్ ను చంద్రుని పై 100కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. చంద్రుని కక్ష్య నుండి చంద్రున్ని, భూమిని, అధ్యయనం చేయడం కోసం ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒక పరికరాన్ని అమర్చారు. చంద్రుని ఉపరితలం నివాస యోగ్యమో, లేదో తేల్చడం కోసం, చంద్రుని పై జరిగే మార్పులకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.
ఇప్పటి వరకు చాలా దేశాలు చంద్రుని ఉత్తర ధ్రువం పై ఎన్నో పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం ఇప్పటిదాకా చంద్రుని పై ఎవరు అడుగుపెట్టని దక్షిణ దిశను చేరాలనే ప్రయత్నిస్తోంది. అక్కడ భారత జెండాను పెట్టనున్నారు. చంద్రయాన్–1 నుంచి చంద్రయాన్–3 వరకు దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ఇస్రో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు ప్రాంతంలో చంద్రయాన్–3 ల్యాండర్ను దించనున్నారు. యావత్ ప్రపంచం చంద్రయాన్ 3 కోసం ఎదురుచూస్తోంది.
టీమిండియా మేనేజ్మెంట్ తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్ ను వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ కు పక్కనపెట్టింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల్లో కేఎస్ భరత్కు వికెట్ కీపర్గా ఛాన్స్ ఇచ్చింది. కానీ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ కు భరత్ స్థానంలో యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు మొదటిసారి టెస్టుల్లో అవకాశాన్ని ఇచ్చింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీ ఫైనల్లో కేఎస్ భరత్కు వికెట్ కీపర్గా భారత జట్టు తరఫున ఆడే ఛాన్స్ లభించింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భరత్ వికెట్ కీపింగ్లో సత్తా చాటినా, బ్యాటింగ్లో తడబడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా వికెట్ కీపర్గా కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ లలో ఎవరిని ఆడించాలనే చర్చ జరిగింది. వికెట్ కీపింగ్లో సత్తా చాటిన భరత్ నే మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ముఖ్యమైన మ్యాచ్లలో వికెట్ కీపర్గా భరత్ రాణించినా, బ్యాటింగ్లో తడబడ్డాడు. వెస్టిండీస్ టూర్ కు భరత్ ను సెలెక్ట్ చేసినప్పటికీ, తుది జట్టులో స్థానం దక్కలేదు.
భరత్ ను తప్పించడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చి, ఇప్పుడు వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టులో తప్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భరత్ను తప్పించి ముంబై ఇండియన్స్ జట్టు ఇషాన్ కిషన్కు ఛాన్స్ ఇచ్చావా అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ పై సెటైర్లు వేస్తున్నారు. భరత్ బ్యాటర్గా మెరుగైన ఛాయిస్ కాకపోవచ్చు. అయితే వికెట్ కీపర్గా ఇషాన్ కంటే అతడే బెటర్ అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే క్లైమాక్స్ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉందో, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంలో క్లైమాక్స్ ముఖ్యమైన పాత్రను పోషించింది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న బ్రో మూవీలో కూడా అత్తారింటికి దారేది మూవీ వంటి ఎమోషనల్ క్లైమాక్స్ ను త్రివిక్రమ్ పెట్టినట్టు తెలుస్తోంది. బ్రో మూవీ క్లైమాక్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ ఉంటుందని సమాచారం. 2023 లో బ్రో మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే బ్రో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్రో మూవీకి అఖండ మూవీ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఊహించుకోవద్దని ఫ్యాన్స్ కు ఇంటర్వ్యూలలో ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. ఇక బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బ్రో మూవీతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తమ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇటీవల కాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండెలోని రక్త నాళాలలో రక్త ప్రసరణకు అడ్డంకి ఏర్పడటం లేదా రక్తనాళాలు పూడుకుపోవడం తదితర కారణాలతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్ ముఖర్జీ మరియు డాక్టర్ మువ్వా శ్రీనివాస్ ఒక వీడియోలో మాట్లాడుతూ తమ దగ్గరికి వచ్చిన పేషెంట్ ఒకరు చెప్పిన విషయన్ని పంచుకుంటూ, అదే సమయంలో గుడికి వెళ్ళినపుడు గుండెపోటు వచ్చినపుడు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. ద్వారకా తిరుపతికి వెళ్ళిన ఒక మహిళ ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా పడిపోయింది.
అప్పుడు ఆమె కుటుంబ సభ్యులకు సీపీఆర్ చేయడం పై కొంత అవగాహన ఉండడంతో ఆమెకు సీపీఆర్ చేస్తూ దగ్గరలో ఉన్న హాస్పటల్ కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారని డాక్టర్ ముఖర్జీ తెలిపారు. ఈ క్రమంలోనే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వెల్లడించారు. ఈ విషయం గురించి వివరంగా తెలుసుకోవాలి అంటే క్రింద ఉన్న వీడియోని చూడండి..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ మూవీ జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు ఇప్పటిదాకా ఆరు మిలియన్ల వ్యూస్ లభించాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ ముక్కోణపు ప్రేమకథ విజయం సాధిస్తుందని మూవీ యూనిట్, ట్రైలర్ ను చూసిన ఆడియెన్స్ భావిస్తున్నారు.
ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత సోషల్ మీడియాలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ వీడియో వైరల్ గా మారింది. అందులో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా నటించింది. అందులో హీరోయిన్ అందంగా లేదని బ్రేక్ అప్ చెప్తాడు. ఆ తరువాత ఆమె గ్లామర్, అందంగా మారుతుంది.
ఈ వీడియో చివర్లో ‘అమ్మాయిలు మనం ప్రేమించేటపుడు ఆధార కార్డ్ లో ఫోటోలా ఉంటారు. అదే మనం వదిలేసిన తరువాత ఇన్ స్టాగ్రామ్ లో మోడెల్స్ లా ఉంటారు’ అని చెప్తాడు. బేబీ ట్రైలర్ లో కూడా హీరోయిన్ ముందు డార్క్ మేకప్ లో ఉంటుంది. కాలేజీలో జాయిన్ అయిన తరువాత ఆమెలో మార్పు వస్తుంది. ఇది చూసిన నెటిజెన్లు “బేబీ” గురించి షణ్ణు అప్పుడే చెప్పేసాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.