ఒక సినిమాలో అన్న చెల్లెలుగా నటించిన హీరో హీరోయిన్లు మరోక సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తుంటారు. ఇలా నటించటానికి వారికి ఎలాంటి భావన రాదు. నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేయాల్సి ఉంటుంది. అయితే హీరోహీరోయిన్లుగా నటించినపుడు రొమాంటిక్ సన్నివేశాలు కూడా చేయాల్సి వస్తుంది.
ఎన్టీఆర్ కి బడిపంతులు సినిమలో మనవరాలుగా నటించిన శ్రీదేవి, ఆ తరువాతి కాలంలో పలు సినిమాలలో ఆయనకు జంటగా నటించి, హిట్ పెయిర్ గా నిలిచారు. తెలుగు చిత్రాలలో ఇలాంటివి చాలామంది హీరోహీరోయిన్లకు ఎదురయ్యాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా తనకు అన్నయ్యగా నటించిన హీరోకి ఆ తరువాతి కాలంలో జంటగా నటించాల్సి వచ్చింది. ఆ సీనియర్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

సీనియర్ నటి రోజా 90 దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి టాప్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. 2000 సంవత్సరం వరకు హీరోయిన్ గా రాణించింది. ఆ తర్వాత సినిమాలలో కీలక పాత్రలలో నటించారు. తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించిన మూడవ సినిమా సీతారత్నం గారి అబ్బాయి.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1992 లో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో వినోద్ కుమార్ హీరోగా నటించగా ఆయనకు జంటగా రోజా నటించారు. అలనాటి నటి వాణిశ్రీ కీలక పాత్రలో నటించగా, రోజా అన్నయ్యగా శ్రీకాంత్ నెగిటివ్ పాత్రలో నటించారు. అప్పటికి శ్రీకాంత్ ఇంకా హీరోగా మారలేదు. శ్రీకాంత్ హీరోగా మారి, స్టార్ హీరో అయిన తరువాత రోజాకు జోడీగా నటించారు.

2000లో వీరిద్దరు జంటగా నటించిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ మూవీలో రోజా శ్రీకాంత్ కి భార్యగా నటించారు. అదే ఏడాది వీరిద్దరు తిరుమల తిరుపతి వెంకటేశా సినిమాలో జంటగా నటించారు. ఇలా ఒకప్పుడు అన్నయ్యగా నటించిన శ్రీకాంత్ తో రోజా హీరోయిన్ గా చేసింది. శ్రీకాంత్ ఓ సందర్భంలో మాట్లాడుతూ “రోజా తనను అన్నా అని పిలిచేదని, సాంగ్స్, రొమాన్స్ షూటింగ్ చేసేటపుడు కూడా అన్నా అనేదని, అలా పిలిస్తే, ఆ ఫీల్ రావట్లేదని రోజా పై కోప్పడినట్టు చెప్పుకొచ్చాడు.

















అతనితో పాటు వచ్చిన అధికారులు భక్తుల చేతిలోని ప్రసాదంను విసిరేశారు. ఇది జరిగిన తరువాత మన్రోకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అనేక మంది వైద్యులు వచ్చినప్పటికీ మన్రో నొప్పిని తగ్గించలేకపోయారు. ఈ క్రమంలోనే మద్రాసు గవర్నమెంట్ మన్రోకి మంత్రాలయం వెళ్ళి పన్నులు వసూల్ చేయమని చెప్పింది. అప్పటికి రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి అయ్యి 100 సంవత్సరాలు అయ్యింది. మన్రో చెప్పు తీసేసి ఆలయం లోపలికి వెళ్ళాడు. అయితే అక్కడ ఒక ఋషి ఇంగ్షీష్ లో మఠం గురించి చెప్తున్నాడు. ఆయన ఒక్క మన్రోకి మాత్రమే కనిపించాడు.
ఎంత ఎక్కువ తింటే అంత నొప్పి తగ్గి ప్రసాదం మొత్తం తినేసరికి కడుపునొప్పి తగ్గిపోయింది. తన తప్పుడు ఆర్డర్ తొలగించి భక్తులకు ప్రసాదం ఇవ్వడం పునఃప్రారంభించవలసిందిగా ఆలయ అధికారులను ఆదేశించాడు. సమీపంలోని కొడపాయల్ గ్రామం నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రసాదం తయారీ కోసం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రసాదాన్ని బుట్టలో కాకుండా గంగాళంలో సమర్పించాడు. అలా అప్పటి నుండి ప్రసాదాన్ని గంగాళంలో సమర్పిస్తున్నారు.
ఈ సంఘటనతో మన్రో మరియు అతని కుటుంబం శ్రీనివాసునికి అమితమైన భక్తులుగా మారారు. మన్రో పేరుతో కూడా ప్రసాదాన్ని సమర్పించేవారు. చేతులతో తింటే ఏ కలరా వస్తుందని మన్రో చెప్పాడో చివరి అదే కలరా సోకి మన్రో కర్నూల్ లోని పత్తికొండ అనే గ్రామంలో జులై 6, 1827 లో మరణించాడు.




















తల్లి ఉషారాణి గృహిణి, అక్క సుచిత సైతం ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తుందని అన్నారు. మానసికంగా తన ఎదుగుదలలో ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర కీలకమని ఆమె చెప్పుకొచ్చారు. చదువు విషయంలో ఎప్పుడూ ఇంట్లో నుండి ఒత్తిడి లేదని, టెన్త్ క్లాస్ లో 10 పాయింట్లు వచ్చినట్టుగా తెలిపారు. ఇంటర్మీడియట్ లో 985 మార్కులు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఎంసెట్ లో 186వ ర్యాంక్ వచ్చిందని, సాఫ్త్ వేర్ ఫీల్డ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ లో చేరినట్టు తెలిపింది.