తల్లిదండ్రులు సంపాదించినటు వంటి ఆస్తిలో సాధారణంగా పిల్లలకు హక్కు ఉంటుందనే విషయం తెలిసిందే. కుటుంబ యజమాని తన ఫ్యామిలీలోని పిల్లలకి ఆస్తిని సమానంగా పంచుతూ వీలునామ రాస్తారు. ఎందుకంటే తమ తదనంతరం వారి పిల్లల మధ్య ఆస్తుల కోసం ఎలాంటి తగాదాలు పెట్టుకోకూడదనే ఉద్దేశ్యంతో సాధారణంగా వీలునామా రాస్తుంటారు.
అయితే ఒక భర్త ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే, అతని ఆస్తిలో భార్యకు, కుమారుడికి మరియు కూతురుకి ఎంత వాటా వస్తుంది. ఒకవేళ ఆ పిల్లలు తల్లికి ఆస్తిని ఇవ్వకుంటే అప్పుడు ఆమె పరిస్థితి ఏమిటీ? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
డబ్బు చాలా శక్తివంతమైనది. డబ్బు వల్ల సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక మనిషి వీలునామా రాయకుండా మరణిస్తే కుటుంబ సభ్యులు ఆస్తిలో ఎవరికి ఎంత వాటా వస్తుంది అనే విషయం పై తగాదాలు పడుతుంటారు. చాలా సార్లు ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆస్తుల కోసం ఎప్పుడు ఊహించని వ్యక్తులు కూడా ఆస్తిలో తమకు వాటా ఉందంటూ తెరపైకి రావచ్చు. అలాంటి వాటికి హిందూ వారసత్వ చట్టం 1956 సమాధానం చెబుతుంది.
హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారంగా ఒక వ్యక్తి సంపాదించిన ఆస్తి పై అతని భార్యకు, పిల్లలకు హక్కు ఉంటుంది. వీరిని షెడ్యూల్లోని క్లాస్-1 గా పరిగణిస్తారు. అంటే ఒక వ్యక్తి ఎలాంటి వీలునామాను రాయకుండా చనిపోతే, భార్యకు, పిల్లలు అతని ఆస్తికి సమాన హక్కుదారులు అవుతారు. అంటే ఒక వ్యక్తికి 10 ఎకరాల పొలం ఉండి, అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండి, అతను వీలునామా రాయకుండా మరణించినట్లయితే షెడ్యూల్లోని క్లాస్-1వర్తిస్తుంది.
షెడ్యూల్లోని క్లాస్-1 ప్రకారం భార్య, కుమారులు, కుమార్తెల అందరికి సమానంగా పంపిణీ చేయబడుతుంది. అలా భార్యకు 2 ఎకరాలు, కుమారులకు, కుమార్తెలకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున ఇవ్వబడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి పిల్లలు తల్లికి వాటా ఇవ్వకుండా తామే తీసుకుంటే ఆమె 125 సిఆర్పీసీ ప్రకారం పిల్లలు మేజర్లు అయితే వారిపై ఫామిలి కోర్టులో మెయింటెనెన్స్ పిటిషన్ ను వేసినట్లయితే వెంటనే ఆమెకు మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..
watch video :
Also Read: ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక…పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.

సాధరణంగా అయితే అందరు రెండు రకాల విధానాలలో కుర్చీలో కూర్చుని కాళ్ళను ఒకదాని మీద మరొకటి వేస్తుంటాము. మోకాలి పై మరొక మోకాలిని క్రాస్ చేయడం, చీల మండల దగ్గర క్రాస్ చేసి కూర్చోవడం చేస్తుంటాం. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల హిప్స్ అమరికలో తేడాలు వస్తాయి. ఒకదానితో పోలిస్తే మరొకటి పెద్దగా అవుతుంది. అంతేకాదు కాలు, మోకాలు, పాదం వంటి శరీరంలోని క్రింది భాగాలకి రక్తప్రసరణలో మార్పులు వస్తాయి.
చీల మండలం దగ్గర క్రాస్ చేసి కూర్చోవడం కంటే మోకాలి పై మోకాలు వేసుకుని కూర్చోవడం అత్యంత ప్రమాదకరం అని చాలా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇలా కూర్చోవడం వల్ల సిరలలో రక్త ప్రసరణ వేగం తగ్గి రక్తపోటు అధికం అవుతుంది. కాలు మీద కాలు వేసుకుని సుధీర్ఘకాలం తరచు కూర్చుంటే కండరాలు పొడవు, పెల్విక్ బోన్స్ అమరికలో ధీర్ఘకాలీక మార్పులు వస్తుంటాయి. ముందుకు వంగిపోయే గుణం, భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. మెడ ఎముకలలో మార్పులు రావడంతో తల భాగం అమరికలో మార్పులు వస్తుంటాయి.
దాంతో మెడకు కూడా ప్రభావితం అవుతుంది. పొత్తికడుపు కాండరాల్లో, వెన్నుముక కింద భాగంలో కూడా మార్పులు రావచ్చు. ఒక వైపు పిరుదులు, కండరాలపైనే ఎక్కువ సమయం పాటు భారం పడడం వల్ల పొత్తికడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలను కోల్పోయి బలహీనంగా మారుతుంది. గూని వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో భాగాలు అసాధారణమైన ఆకారంలో మారే ప్రమాదం ఉంది.
క్రాస్ లెగ్స్ వల్ల ఫైబులర్ నారాలుగా పిలిచే పెరోనియల్ నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి గురి అయిన వ్యక్తి తన కాలి వేళ్ళను, ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేరు. అయితే చాలా వరకు ఇది స్వల్పకాలికమే. కొన్ని నిముషాల తరువాత సాధారణ స్థితికి వస్తాయి. కాలు మీద కాలు వేసుకుని కూర్చోడం వల్ల సంతాన ఉత్పత్తి పై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఆ సమస్య కూడా వస్తుంది.

















అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో తిరుపతి, అనంత పద్మనాభస్వామి దేవాలయం, షిర్డీ లాంటి దేవాలయాలకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. దేశంలోనే ఈ దేవాలయాలు అత్యంత ధనిక దేవాలయాలుగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. అది కూడా ఫ్యామిలీ అంతా వెళ్తుంది. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్, రెస్టారెంట్లు, హోటల్స్ తో పాటు ఇతర బిజినెస్ లకు డిమాండ్ కూడా పెరుగుతుంది.
వివిధ రంగాలకు ఆదాయం పెరగడంతో టాక్స్ ల రూపంలో గవర్నమెంట్స్ కు పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. ఇటీవల శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడితో 2 నెలలకు గాను 357 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన నేపథ్యంలో ఆధ్యాత్మిక టూరిజం పేరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.
ఎస్బీఐ నివేదిక ప్రకారం, యూపీలో రామ మందిరం నిర్మాణం మరియు అదనపు చర్యల వల్ల 2024-25 లో యూపీ గవర్నమెంట్ కు అదనంగా 25 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ మొత్తం సందర్శకుల రాకతో సమకూరనుంది. దీనివల్ల రోడ్డు, రైలు, వాయురవాణా పెరిగే ఛాన్స్ ఉంది. భక్తుల సేవల గాను హోటల్స్, హాస్పటల్స్ సైతం పెరుగుతాయి. 2027 వరకు మహారాష్ట్రతో పాటుగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లను అధిగమించి, దేశ జీడీపీలో యూపీ వాటా పది శాతంగా ఉంటుందని తెలిపింది.


