ప్రపంచంలో దాదాపు 90 శాతం మంది ఆడవాళ్లు ఇష్టపడేది నగలు. అవి సింపుల్ వి అయినా కావచ్చు లేదా హెవీ అయినా కావచ్చు చాలా మందికి ఏదో ఒక ఆభరణం అంటే ఇష్టం ఉండి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశ స్త్రీలకి. నగలు పెట్టుకోవడానికి కారణం అలంకారం అని అనుకుంటాం. కానీ కాదు. ప్రతి ఆభరణం పెట్టుకోవడం వెనక ఆరోగ్యానికి సంబంధించిన కారణాలు ఉన్నాయి.

కాళ్ల నీ మడమ ని కలిపే భాగంలో పట్టీలు పెట్టుకుంటారు. సాధారణంగా పట్టీలు వెండితో తయారు చేస్తారు ఎందుకంటే వెండి తో భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అందువల్ల భూమి నుండి పాజిటివ్ ఎనర్జీ బయటికి వస్తుంది. అంతేకాకుండా పట్టీలు పెట్టుకోవడం వల్ల కీళ్ల నొప్పులు రావట. పట్టీల శబ్దం వల్ల చెడు శక్తులు దూరంగా ఉంటాయి అని అంటారు. అందుకే బంగారం ఇతర మెటీరియల్స్ తో కాకుండా వెండితో తయారుచేసిన పట్టీలు పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు పెద్దలు.
వెండి శరీరానికి చలవ చేస్తుంది వెండి వస్తువులని పెట్టుకోవడం వలన శరీరం లో ఉన్న వేడి బయటకు వెళ్ళి పోతుంది. అందుకే బంగారం కంటే వెండి పట్టీలు పెట్టుకుంటారు.అయితే కొంతమందికి బంగారు పట్టీలు పెట్టుకోవచ్చా అని సందేహముంటుంది. లక్ష్మీ దేవి కి పసుపు రంగు చాలా ఇష్టం. బంగారం కూడా ఇదే రంగులో ఉంటుంది బంగారంతో చేసిన వేటినైనా కూడా కాళ్ళకి పెట్టుకోవడం మంచిది కాదు. అందుకని మనం పెద్దలు చెప్పిన మాటలను వింటూ ఉండాలి అలానే పూర్వికులు పెట్టిన ఆచారాలను పాటిస్తూ ఉండాలి.



ఇక కథ విషయానికి వస్తే, అనుపమ(ప్రియమణి) అమాయకపు గృహిణి. ఆమె ఒక అపార్ట్మెంట్ లో భర్త మోహన్, కొడుకు వరుణ్తో కలిసి నివసిస్తుంటుంది. యూట్యూబ్లో సొంత కుకింగ్ ఛానెల్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటలు చేస్తుంటుంది. అయితే ఆమెకు ఇతరుల ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడూ కిటికీలోంచి ఇతరులను గమనిస్తూ, అపార్ట్మెంట్ లో పనిచేసే పనిమనిషి శిల్ప నుండి వారి విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరుకారం మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రావు రమేష్ వంటివారు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలోని టైటిల్ సాంగ్ ధమ్ మసాలా ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా వీడియో సాంగ్ రిలీజ్ అయ్యి, ఆకట్టుకుంటోంది. ఈ పాటలో మహేష్ బాబు పక్కన స్టెప్స్ వేసిన ఒక సైడ్ డ్యాన్సర్ హైలైట్ అయ్యింది.
ఆ అమ్మాయి ఎవరా అని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ఫల్గుణి బంగేరా. ఆమె డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్. ఆమె ఒమన్లో పుట్టి పెరిగింది. ఫాల్గుణి తన కెరీర్ ను కొనసాగించడానికి ఇండియాకి వచ్చారు. బుల్లితెర పాపులర్ డ్యాన్స్ షోలు అయిన ఢీ 10, ఆట 6 జూనియర్స్ లో ఉన్న కొరియోగ్రాఫర్లలో ఆమె కూడా ఒకరు. టాలీవుడ్ టాప్ హీరోల పాటలకు పని చేసింది. టాలీవుడ్ లో శేఖర్ మాస్టర్తో కలిసి ఫల్గుణి కొరియోగ్రఫీ చేశారు.
వెంకీ మామా, డియర్ కామ్రేడ్, ఇస్మార్ట్ శంకర్, అలా వైకుంఠపురములో, భీష్మ వంటి సినిమాలకు పనిచేసింది. తమిళ సినిమాలకు కూడా ఫల్గుణి వర్క్ చేసింది. ఎన్నో పాటల్లో కనిపించింది. ఆమె సినిమాల్లో పనిచేయడమే కాకుండా ఆన్లైన్ డ్యాన్స్ క్లాసులు కూడా తీసుకుంటుంది. ఆమె యశ్వంత్ మాస్టర్ తో కలిసి అనేక స్టేజ్ షోలు మరియు ప్రత్యేక కార్యక్రమాలలో కనిపించింది. ఆమె ఇక్కడే కాకుండా విదేశాలలో కూడా ప్రత్యేక నృత్య ప్రదర్శనలలో పాల్గొంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఫల్గుణిని ఇన్ స్టాగ్రామ్ లో 163K ఫాలో అవుతున్నారు.






అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం ఎంతో దివ్యంగా, అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్యలో దశాబ్దాల తర్వాత బాబ్రీ మసీదు వివాదం ముగిసి, సుప్రీం కోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణం జరిగింది. 500 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవంతో భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముస్లింలు కూడా పాల్గొనడం ఆమోదించలేని పాకిస్థాన్, రామ మందిరం పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్యసమితికి అధికారికంగా లేఖ రాసింది.
భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఎప్పుడూ అలసిపోని పాక్ నాయకులలో మునీర్ అక్రమ్ ఒకరు. పాకిస్తాన్ రాయబారి ఉన్న మునీర్ అక్రమ్ రామ మందిరం పై ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. అందులో
ఈ ధోరణి భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం మరియు శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. భారతదేశంలోని ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణ కోసం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబ్రీ మసీదు లాగే భారతదేశంలోని ఇతర మసీదులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదుతో సహా ఇతర మసీదులు ఎన్నో అవమానాలు మరియు విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని పాకిస్థాన్ లేఖలో వెల్లడించింది.
హయత్ నగర్ బస్ డిపో 1 బస్ కండక్టర్ ను ఒక యువతి మద్యం మత్తులో బూతులు తిడుతూ, అతని పై దాడి చేసిన ఇన్సిడెంట్ ఆలస్యంగా బయటికి వచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది తెలియలేదు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దాన్ని బట్టి, హయత్ నగర్ నుండి అఫ్టల్ గంజ్ మార్గంలో నడిచే 72 బస్ లో ఉదయాన్నే ఒక యువతి మద్యం సేవించి ఎక్కింది. 500 రూపాయల నోటు ఇచ్చి టికెట్ ఇవ్వమనడంతో కండక్టర్ ఇంత ఉదయం చిల్లర ఉండదని తెలిపాడు.
దాంతో ఆగ్రహించిన యువతి బస్ కండక్టర్ని నానా బూతులు తిట్టి, కొట్టడమే కాకుండా తోటీప్రయాణికులు చెబుతున్నా వినకుండా కండక్టర్ని కాలుతో తన్నడం, ఉమ్మడం జరిగింది. ఎంత చెబుతున్నా వినకుండా కండక్టర్పై దాడి చేసింది. ఆమె ప్రవర్తన భరించలేక చివరికి బస్సును పక్కకు ఆపడంతో ఆమె దిగిపోయింది.
అయితే దిగే ముందు కూడా బస్సులో ఉన్న మరో స్త్రీని సైతం బూతులు తిట్టింది. ఇదంతా ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘట పై ఎండి సజ్జనార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.


చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి అభినందిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, అలీ, సందీప్ రెడ్డి వంగా నిర్మాత చినబాబు, త్రివిక్రమ్ లు కూడా వెళ్లి చిరంజీవిని అభినందించారు. తాజాగా నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ షేర్ చేసింది.అందులో ‘‘ బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ కూడా ఆ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకోవడానికి అర్హులు. ఆయన కరోనా టైమ్ లో చేసిన సేవ ఎనలేనివి. కానీ ఆయనకు ఏ పొలిటికల్ లీడర్ ని కాకాపట్టడం తెలియదు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజెన్లు ఆమెకు మద్ధతు తెలుపుతున్నారు. పూనమ్ కౌర్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. సామాజిక మధ్యమాలలో యాక్టీవ్గా ఉంటూ తరచూ వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె కామెంట్స్ నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.