మహాభారతం లో ఒక్కో పాత్ర కి ఒక్కో విశిష్టత ఉంది. పాండవులను వివాహమాడిన ద్రౌపది గురించి పరిచయం అవసరం లేదు. కానీ ఆమె గురించిన చాలా విషయాలు మనకు తెలియవు.
అవేంటో.. ఆమె తన ఐదుగురు భర్తలతోను ఎలా కాపురం చేసేదో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేదో ఈరోజు తెలుసుకుందాం.

అర్జునుడు స్వయంవరం లో ద్రౌపదిని గెలుస్తాడన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత అర్జునుడు ఆమెను కుంతి వద్దకు తీసుకెళ్తాడు.. తాను గెలిచిన బహుమానాన్ని చూడాలని కోరగా.. కుంతి పరధ్యానం లో ఉండి తల తిప్పకుండానే ఐదుగురిని పంచుకోమని చెబుతుంది. దీనితో.. తల్లి మాట ప్రకారం పాండవులు ఐదుగురు ద్రౌపది ని పెళ్లాడుతారు. ఆ తరువాత కుంతి బాధపడుతుంది. జరిగింది జరిగిపోయినా.. ద్రౌపది మాత్రం తన భర్తలతో సఖ్యత గా మెలిగేది.

వారి మధ్య గొడవలు రాకుండా ఉండేది. ఇందుకోసం పాండవులు కూడా ఓ నియమం పెట్టుకున్నారు. ద్రౌపది కొన్ని నెలలపాటు ఒక్కొక్కరి దగ్గరా ఉంటూ వచ్చేది. ఆ సమయం లో మరొకరు ద్రౌపది ఉన్న చోటుకు వెళ్లకూడదని.. అలా వెళితే నియమం తప్పినందుకు అరణ్యవాసం చేయాల్సి ఉంటుందని నియమం పెట్టుకున్నారు. ఓసారి.. ఓ వ్యక్తి అర్జునుడు వద్దకు వచ్చి కొందరు తన పశువుల్ని దొంగిలించారని తనని రక్షించాలని కోరతాడు. అయితే.. అర్జునుని విల్లు ధర్మరాజు వద్ద ఉంటుంది. ఆ సమయం లో ద్రౌపది ధర్మ రాజు వద్ద ఉంటోంది.

నియమం తప్పుతుందని తెలిసినా.. అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్లి విల్లు తీసుకుని సమస్యను పరిష్కరించి ఆ తరువాత అరణ్యవాసం చేస్తాడు. అందుకే.. ద్రౌపది కి ఐదుగురు భర్తలున్నా ఏనాడు వారి మధ్య గొడవలు రాలేదు. ద్రౌపది గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఆమె అందరిలా పసిపిల్లలా తల్లి కడుపున పుట్టలేదు. యుక్తవయసు ఉన్న స్త్రీ గా అగ్ని నుంచి పుట్టింది. అందుకే ఆమెని యజ్ఞసేని అని పిలుస్తారట.

ఆమె శ్రీకృష్ణుడిని తప్ప.. తన భర్తలతో సహా ఎవరిని అంతగా నమ్మేది కాదట. ఎందుకంటే.. శ్రీ కృష్ణుడు ఆమెను వస్త్రాపహరణం నుంచి చీరలు ఇచ్చి రక్షిస్తాడు. అప్పటినుంచి ఆమె శ్రీకృష్ణుడిని సోదరుడిగా భావించి ఆరాధిస్తుంది. విరాట రాజు కొలువులో కీచకుల వలన, నిండుసభలో కౌరవులు కూడా ఆమెను అపహాస్యం చేయడం తో ఆమెకు తమ భర్తలపై నమ్మకం పోయిందట.

కానీ.. ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్ళేటపుడు ఆమె కన్య గానే వెళ్ళేది. అదెలా అంటే.. ఆమెకో వరం ఉంది. ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లే సమయం లో ఆమె అగ్ని లోంచి నడిచేది. ఆ తరువాత తిరిగి కన్య గా అయ్యాక.. మరో భర్త వద్దకు వెళ్ళేది. ద్రౌపది తన ఇంట్లో సామాన్లను ఎప్పుడు నిండుగా ఉంచుకునేదట. ఎవరు వచ్చినా వండిపెట్టి కడుపునిండా భోజనం పెట్టేది.











బ్యాట్స్మెన్ తాను ఆడిన మొదటి బంతికే అవుట్ అయితే దాన్ని గోల్డెన్ డక్ అంటారు.అలాగే పరుగులు ఏమీ చేయకుండానే రెండు, మూడు బాల్స్కు అవుట్ అయితే వాటిని సిల్వర్, బ్రాంజ్ డక్స్ అని పిలుస్తారు.ఇక మ్యాచ్లో బాల్స్ను ఆడకుండా, పరుగులు చేయకుండా ఔట్ (రన్ అవుట్) అయితే దాన్ని డైమండ్ డక్ అని పిలుస్తారు. అలాగే బ్యాట్స్మెన్ తాను మ్యాచ్లో ఆడే మొదటి బాల్ లేదా, ఆ సీజన్కు ఆ బ్యాట్స్మెన్ టీం ఆడే మొదటి మ్యాచ్ మొదటి బాల్కు బ్యాట్స్మెన్ అవుట్ అయితే దాన్ని పల్లాడియం డక్ అంటారు































