సాధారణంగా హీరోయిన్లు అంటే అందంగా, గ్లామర్ గా ఉండాలి. అయితే హీరోయిన్స్ వారి అందాన్ని కాపాడుకుంటేనే అవకాశాలు వస్తాయి. వారు కొంచెం ఎక్కువగా తిన్నా, తినడం తగ్గించినా ఇబ్బందే. హీరోయిన్స్ కాస్త బరువు పెరిగినా కూడా సమస్యే. అయితే కొంత మంది హీరోయిన్లు తమ సినిమాల కోసం లేదా వారు చేసే క్యారెక్టర్స్ కోసం బరువు తగ్గడం కానీ, పెరగడం కానీ చేస్తుంటారు.
కొందరు హీరోయిన్లకి ఆఫర్స్ ఉన్న, లేకపోయినా తీసుకునే ఆహారాన్ని బట్టి, ఆరోగ్య సమస్యల కారణంగా కొంచెం బరువు పెరగుతూ ఉంటారు. దక్షణాది హీరోయిన్లలో కొందరు లావు అవ్వడం లేదా చాలా సన్నగా కావడం జరిగింది. అయితే వారి పై బాడీ షేమింగ్ ట్రోల్స్ వచ్చాయి. ఇలా హీరోయిన్స్ సన్నగా లేదా లావుగా అయినపుడు ఫ్యాన్స్, నెటిజెన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అలా బాడీ షేమింగ్ ట్రోల్స్ కి గురైన హీరోయిన్స్ ఎవరి ఇప్పుడు చూద్దాం..
1.ఇలియానా:
పోకిరి, జల్సా వంటి హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా, బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. ఆ తరువాత రవితేజ ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ మూవీతో తెలుగులోకి మళ్ళీ వచ్చింది. ఆ సమయంలో ఇలియానా చాలా బరువు పెరగడంతో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. సన్నగా అందంగా ఉండే ఇలియానా ఇంత లావు అయింది ఏంటి అంటూ నెటిజన్స్ ట్రోల్ చేసారు.
2.అనుష్క శెట్టి:
హీరోయిన్ అనుష్క శెట్టికి బాడీ షేమింగ్ ట్రోల్స్ కొట్టా కాదు. మిర్చి, బాహుబలి చిత్రాల నుండి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో నటిస్తున్న మూవీ లుక్ బయటకి రావడంతో ఆమె బరువు పెరగడం పై మీద అభిమానులు కామెంట్స్ చేసారు.
3.రక్షిత:
ఇడియట్, నిజం, పెళ్ళాం ఊరెళ్ళితే, ఆంధ్రావాలా వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించిన రక్షిత. పెళ్లి తరువాత సినిమాలకు దూరమ అయ్యింది. ఆ తరువాత ఆమె బరువు పెరగడంతో సోషల్ మీడియాలో రక్షితను చాలా ట్రోల్ చేశారు.
4.నిత్య మీనన్:
హీరోయిన్ నిత్య మీనన్ ఆ మధ్య చాలా బరువు పెరిగింది. హిందీ మూవీ ప్రమోషన్స్ లో ఆమె వేసుకున్నడ్రెస్ పై, బరువు పెరగడం పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ చాలా ట్రోల్ చేసారు.
5.నమిత:
సొంతం, జెమినీ సినిమాలలో తన అందంతో టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న నమిత ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్ళిపోయింది. చాలా ఏళ్ల తరువాత ప్రభాస్ బిల్లా మూవీలో నటించింది. ఈ సినిమాలో నమితను చూసి ట్రోల్ చేసారు. ఆ మూవీ తరువాత కూడా ఆమెని ట్రోల్ చేశారు.
6.నివేత థామస్:
నిన్ను కోరి, వకీల్ సాబ్, జై లవ కుశ వంటి చిత్రాలలో నటించిన నివేత థామస్ టాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమధ్య విడుదలయిన ‘శాకినీ డాకిని’ మూవీలో ఆమె లావుగా కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేశారు.
7.పూనమ్ బజ్వా:
మొదటి సినిమా, నాగార్జున నటించిన బాస్ చిత్రాలలో నటించిన పూనమ్ బజ్వా ఆ తరువాత తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ బోల్డ్ చిత్రాలలో నటిస్తున్న పూనమ్ మీద తమిళ, తెలుగు ఆడియన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు .
8.రకుల్ ప్రీత్:
హీరోయిన్లు బరువు పెరగడం వల్ల బాడీ షేమింగ్ కి గురైతే, రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం సన్నగా అయినందుకు ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఫిట్నెస్ మీద ఆసక్తితో 20 కేజీలకు పైగా తగ్గి, జీరో సైజులా మారింది. ఇది ఆమె అభిమనులతో పాటుగా ఆడియెన్స్ కి కూడా నచ్చలేదు. దాంతో కట్టె పుల్లెమాదిరిగా అయ్యిందని, తినట్లేదా అని ట్రోల్ చేసారు.
Also Read:దసరా “శ్రీకాంత్ ఓదెల” తో పాటు… ఇండస్ట్రీకి “నాని” పరిచయం చేసిన 10 డైరెక్టర్స్..!





నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా సార్లు గతంలో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మోక్షజ్ఞ మొదటి సినిమాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని ఈవెంట్స్ లో మోక్షజ్ఞ బొద్దుగా ఉన్న ఫోటోలు వైరల్ అవడంతో మోక్షజ్ఞ హీరోగా సెట్ అవుతాడా నెటిజన్లు కామెంట్స్ చేశారు.
అయితే బాలయ్య లెగసీని ఇండస్ట్రీలో కొనసాగించాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. మోక్షజ్ఞ ఎంట్రీ నేపథ్యంలో యాక్టింగ్, డాన్స్ వంటి విషయాల్లో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
బొద్దుగా కనిపించే మోక్షజ్ఞ ఊహించని విధంగా స్లిమ్ లుక్ లో కనిపించారు. మోక్షజ్ఞ తన స్నేహితులతో దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులకు నందమూరి లెగసీని మోక్షజ్ఞ కొనసాగిస్తాడని అంటున్నారు.

అయితే తాజాగా విడుదలైన సినిమాలకి కాకుండా ఎప్పుడో విడిపోయిన సినిమాల్లో కూడా ఈ తప్పులను చూపిస్తూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ మహేష్ బాబు దగ్గర 25000 డాలర్లు అప్పు తీసుకుంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం పదివేల డాలర్లు అప్పు ఇచ్చాను అని తిరిగి ఇవ్వాలని అంటాడు. ఇక దర్శకుడు లాజిక్ మిస్ అవడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మలయాళ నటుడు మరియు నిర్మాత అయిన కుంచాకో బోబన్ నటించిన ‘నా తాన్ కేస్ కొడు’ అనే సినిమా 2022 లో ఆగస్ట్ 11న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గాను హిట్ గా నిలిచింది. 5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లను వసూల్ చేసింది. ఈ చిత్రం ఏనాట గా హిట్ అయ్యింది అంటే బాలీవుడ్ చిత్రాలైన అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రాల స్క్రీన్ కౌంట్ను తగ్గించి, ఆ థియేటర్లను ఈ చిత్రం మరిన్ని షోలను వేశారు.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికే దొంగ కోజుమ్మల్ రాజీవ్ కూలీ పని చేసే తమిళ అమ్మాయి దేవిని ఇష్టపడతాడు. ఆమె కోసం దొంగతనాలు మానేసి, కూలీగా మారుతాడు. ఆమె ఇంట్లో కలిసి ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఒకరోజు గుడి లో జరిగే భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో ను నుండి తప్పించుకుందేనందుకు, పక్కనే ఉన్న ఇంటి గోడ దూకడంతో అక్కడి పెంపుడు కుక్కలు కరుస్తాయి.
వాటి అరుపులకు లేచిన ఇంట్లో వారు అతడి పై దొంగతనం ఆరోపణలు చేస్తారు. ఆ ఇల్లు ఎమ్మెల్యేది కావడంతో పోలీసులు వెనటనే అరెస్ట్ చేస్తారు. కేసు కొరత్కు వెళ్తుంది. కోర్టులో, రాజీవ్ తనకు తెలిసిన పోలీసుగా మారిన న్యాయవాది సహాయంతో తన కేసును తనే స్వయంగా వాదించి, సాక్ష్యాలను తెస్తానని వాగ్దానం చేస్తాడు. అతను సాక్ష్యాలను ఎలా సంపాదించాడు. కోర్టులో ఎలా నిర్దోషి అని నిరూపించుకున్నాడనేది మిగతా స్టోరీ.
ఈ చిత్రాన్ని దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ చెప్పాలను కున్న పాయింట్ ను చక్కగా, చాలా సహజంగా తెర పై చూపించాడు. కామెడీ సన్నివేశాలు, కుంచాకో బోబన్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ గా గాయత్రీ శంకర్ నటించారు. డాన్ విన్సెంట్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు
