జగ్గీ వాసుదేవ్ అలియాస్ సద్గురు ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ప్రముఖ యోగా గురువు, మోటివేషనల్ స్పీకర్. ఇషా ఫౌండేషన్ స్థాపించి సద్గురు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అనేక దేశాల్లో సద్గురుకి శిష్యులు ఉన్నారు భక్తులు ఉన్నారు. సద్గురు స్పీచెస్ వినడానికి వేరే దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు.
అయితే సద్గురు భార్య విజయ్ కుమారి మహాసమాధి అయ్యారు. అయితే ఆమె మరణం వెనకాల సద్గురు ఉన్నారంటూ పోలీసులు మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. హిందూ కల్చర్ లో ఒక మనిషి తన శరీరానికి ఎటువంటి గాయం చేయకుండా విడిచి వెళ్లిపోవడం ఎప్పటినుండో ఉంటుంది. దాన్ని మహాసమాధి అని అంటుంటారు. పురాతన యోగులు మునులు చాలా సంవత్సరాలుగా మహాసమాధిని తీసుకున్నారు. సద్గురు భార్య విజయ్ కుమారి 1997 జనవరి 23న మహాసమాధి అయ్యారు. ఇది తర్వాత చాలా కాంట్రవర్సీ అయింది.
అయితే విజయ్ కుమారి ముందుగా యోగా టీచర్ గా, బ్యాంకర్ గా, వాలంటీర్ గా పనిచేసేవారు. ఆమె సద్గురు భార్యగా అందరికీ పరిచయం. ఆమె కూతురు రాదే జగ్గి ఇండియన్ క్లాసికల్ డాన్సర్.
ఆమె చనిపోయినప్పటినుండి ఆమె మరణానికి చాలామంది కారణాలు అడుగుతూ ఉంటారు. కాకపోతే ఆమె తన ఇష్టపూర్వకంగానే మహా సమాధి అయ్యారని కొందరు అంటూ ఉంటారు.ఆమె సద్గురుని 1984లో మొదటిసారిగా మైసూర్ సిటీలో విజయ్ కుమారి సద్గురుని కలిశారు తర్వాత ఒకరికొకరు నచ్చడం, సహజీవనం చేయడం జరిగింది. 1985 మే 20న వీరి పెళ్లి జరిగింది.

జనవరి 23 1997న ఆమె మహాసమాధి అయ్యారు. ఆమె మరణం తర్వాత 12 గంటలకు ఆమెను దహనం చేశారు. అది కాంట్రవర్సీ అవ్వడంతో విజయ్ కుమారి తండ్రి కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్ లో సద్గురు మీద కేసు పెట్టారు.తర్వాత ఎనిమిది నెలలపాటు ఈ కేసు విచారణ కొనసాగాయి. భార్య మరణం గురించి సద్గురుని కూడా విచారించారు. ఆమె మరణానికి ముందు డాక్టర్లు పరిశీలించి ఆమె హార్ట్ ఎటాక్ తో చనిపోతుంది అని తెలిపారు.

తర్వాత ఆమెకి పోస్టుమార్టం అనేది చేయలేదు. తర్వాత ఆమె ఆస్తికలను ఫోరెన్సిక్ టెస్ట్ కి పంపించిన కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో 1999 జనవరి 8న కోర్టు ఈ కేసును కొట్టివేసింది.విజయ్ కుమార్ కి సద్గురుకి పెళ్లయిన తర్వాత 6 సంవత్సరాలకి కూతురు రాదే జగ్గి పుట్టింది. ఆమెకు ఏడు సంవత్సరాలు ఉండగా విజయ్ కుమారి చనిపోయింది. 2014లో రాదే 24 సంవత్సరాల అప్పుడు సందీప్ నారాయణ వివాహం చేసుకుంది. ఇషా ఫౌండేషన్ లో ఈ వివాహం జరిగింది.



”గరుడ గమన వృషభ వాహన” మూవీ 2021లో నవంబర్ 19న రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించింది. ఈ కన్నడ మూవీ షోలు హైదరాబాద్ వంటి పలు నగరాల్లోనూ వేశారు. ఈ మూవీ పై అంత హైప్ ఏర్పడింది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ లేదు. ఈ చిత్రానికి రాజ్ బి శెట్టి దర్శకత్వం వహించారు. థియేటర్లలో విజయం సాధించిన ఈ మూవీ ఆ తరువాత ఓటీటీలో రిలీజ్ అయ్యి, దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇద్దరు మిత్రులు వారి శత్రువులను ఎదురించే క్రమంలో పెద్ద గ్యాంగ్ స్టర్స్ గా ఎదుగుతారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ ఎదురైన సమస్యలు, ఆ తరువాత వారి పతనానికి కారణం అయిన పరిస్థితుల ఏమిటనేది మిగిలిన కథ. రొటీన్ కథ అయినప్పటికీ కంప్లీట్ వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రాజ్ బి శెట్టి మరియు రిషబ్ శెట్టిలు అద్భుతంగా నటించారు.
వారి నటనతో పాటు, యాక్షన్ సీన్స్ ఈ మూవీలో హైలైట్. మంచి కలెక్షన్స్ తో పాటు, ‘గరుడ గమన వృషభ వాహన’ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీకి జాతీయ అవార్డులలో గుర్తింపు దక్కలేదు. దాంతో ఇట్లాంటి సినిమాకి ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవటం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
టైటిల్ లో సూచించిన విధంగా ఈ మూవీ ముగ్గురు యువకుల కథ. రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోనీ వర్గీస్) ఇద్దరు అన్నదమ్ములు, వీరి స్నేహితుడు జేవియర్ (నీరజ్ మాధవ్) తో కలిసి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతారు. చర్చిలో జరుగిన పండుగలో తన తండ్రి పై చేయి వేశారని డోని రౌడీ గ్యాంగ్ ను చితకబాదుతాడు. ఆ రౌడీ గ్యాంగ్ అర్ధరాత్రి సమయంలో డోని ఇంటి పైకి వచ్చి కుటుంబంలో చిన్న పిల్లలతో పాటు అందరి పై దాడి చేస్తారు. వారికి తీవ్రమైన గాయాలు అవుతాయి.
డోని ఇంటి పై దాడి చేసిన గ్యాంగ్ ఎవరిది? ఆ గ్యాంగ్ కి డోని కుటుంబం పై ఉన్న పగ ఏమిటి? దాడి చేసిన తరువాత ఆ గ్యాంగ్ పై డోని, రాబర్ట్, జేవియర్ ఎలా పగ తీర్చుకున్నారు అనేది మిగిలిన కథ. డైనమిక్ ఫైట్ సీక్వెన్స్లు, హై-స్టేక్స్ స్టంట్స్, టెన్షన్-ఫిల్డ్ మూమెంట్స్ తో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ, ఎమోషన్స్, మాస్, కామెడీ వంటివన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.
ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. షేన్ నిగమ్, ఆంటోనీ వర్గీస్ మరియు నీరజ్ మాధవ్ ముగ్గురు ఎక్కడా తగ్గకుండా పోటీ పడి నటించారు. విష్ణు అగస్త్య విలన్ పాత్రలో నటించాడు. విలన్ గా ఆయన లుక్స్, ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను సైతం భయపెట్టాయి. ఈ మూవీకి యాక్షన్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి.




