యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ విడుదల అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో శ్రీయా రెడ్డి నటించారు. రాధ రామ అనే క్యారెక్టర్ లో అలరించారు.
ఈ క్యారెక్టర్ సలార్ సినిమాకి కీలకంగా మారింది శ్రీయ రెడ్డి నటనకి మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన వారందరూ శ్రీయా రెడ్డి ఎవరు అంటూ ఇంటర్నెట్ లో వెతకడం మొదలుపెట్టారు. అయితే శ్రీయా రెడ్డి బ్యాగ్రౌండ్ ఏంటి ఆమె పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం….!

శ్రీయా రెడ్డి 28 నవంబరు 1983 లో జన్మించారు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు. గిరి స్టార్టింగ్ లో యాంకర్ గా , విజెగా పనిచేశారు. తర్వాత పలు సౌత్ ఇండియా భాషల్లో కూడా నటించారు. శ్రీయా తండ్రి మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి. సినిమాల్లోకి రాకముందు ఎస్.ఎస్.మ్యూజిక్ చానల్లో వీడియో జాకీగా పనిచేసారురు. 2002లో సమురాయ్ అనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. ఆమె నటించిన బ్లాక్, తిమిరు, కాంచీవరం వంటి సినిమాల్లోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దొరికాయి.

తర్వాత తెలుగు,మలయాళీ చిత్రల్లో కూడా నటించారు. శ్రీయా రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి 2003లో అప్పుడప్పుడు అనే చిత్రంతోటి ఎంట్రీ ఇచ్చారు తర్వాత 2006లో అమ్మ చెప్పింది అనే చిత్రంలో నటించారు. తర్వాత తెలుగులో మరే చిత్రంలోను నటించలేదు.తాజాగా ప్రభాస్ సలార్ సినిమాలో మళ్ళీ కనిపించారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రంలో కూడా శ్రీయా రెడ్డి కీలకపాత్రలో నటిస్తున్నారు


ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించిందని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ ను చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా సలార్ మూవీలో ప్రభాస్ కనిపించాడు. ప్రభాస్ కటౌట్ కు తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడని టాక్. కథపరంగా ఎలా ఉన్నా సినిమాలో ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు అద్భుతంగా ఉండడంతో ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. నెట్టింట్లో ఎక్కడ చూసినా సలార్ మేనియా కనిపిస్తోంది.
అయితే ‘సలార్’ టీజర్ లో ఓ తాత, హీరో ప్రభాస్ని ‘డైనోసర్’తో పోల్చడం తెలిసిందే. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా ప్రమోషన్స్లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి కూడా ‘డైనోసర్ ఎపిసోడ్’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పడం తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన తరువాత జక్కన్నతో పాటు , ఫ్యాన్స్, ఆడియెన్స్ నిరాశ పడినట్టున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘సలార్ పార్ట్-1’ లో ఆ ఎపిసోడ్ మిస్ అయ్యింది. బహుశా పార్ట్-1 లో ఉండొచ్చేమో.
ఈ సన్నివేశం మాత్రమే కాకుండా మరో రెండు సన్నివేశాలు కూడా సలార్ పార్ట్-1 మిస్ అయినట్టు తెలుస్తోంది. సూరిడీ పాటలో భయపడి లేచిన పృధ్వీ రాజ్ తో ‘ఒరే నేనున్నా కదా పడుకో’ అంటూ ప్రభాస్, కి చెప్పే సీన్ కాగా, మూడవది కార్ సీన్, దాంతో ఈ సీన్స్ ఎందుకు పెట్టలేదని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సీక్వెల్ లో ఈ సీన్స్ ఉంటాయేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నటుడు రాజ్ బి. శెట్టి కన్నడ చిత్రసీమలో ఓ ట్రెండ్ ను సృష్టించారు. ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపించారు. శెట్టి నటుడు మాత్రమే కాదు దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ కూడా. ఆయన నటించే చిత్రాలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. యుక్ మొత్తే కతి, గరుడ గమన వృషభ వాహన చిత్రాలలో విభిన్నమైన కథలతో ఆడియెన్స్ కు చేరువయ్యారు. రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టిలకి మంచి స్నేహితుడు. ఈ ముగ్గురి నుండి సినిమా వస్తుందంటే కన్నడ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
ఈ ఏడాది రాజ్ బి. శెట్టి మరొక డిఫరెంట్ మూవీ ‘టోబి’ తో ఆడియెన్స్ ని పలకరించారు. టోబి మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లీవ్ లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, టోబీ ఒక విడిచిపెట్టిన పిల్లవాడు. చిన్నతనంలో అనేక వేధింపులకు గురి అవుతాడు. అతనికి పేరు కూడా లేదు. ఆ పిల్లవాడికి ఆశ్రయం ఇచ్చినవారు టోబీ అని పిలుస్తారు.
టోబీ కోపం ఎక్కువగా ఉంటుంది. అతనికి కోపం వచ్చినపుడు చంపేస్తాడు. టోబీతో పాటు అతని కోపం కూడా పెరుగుతుంది. విపరీతమైన కోపం వల్ల అతను పాపులర్ అవుతాడు. అతనికి నచ్చినవారు చెబితేనే ఏదైనా వింటాడు. అయితే కొందరు వ్యక్తిని కొందరు టోబీని స్వార్ధం కోసం వాడుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న టోబీ ఏం చేశాడు? వారి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.







రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సలార్ రిలీజ్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఈ మూవీలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా, దేవరాజ్ వంటివారు నటించారు.
బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ కి హిట్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీ చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ విశ్వరూపాన్ని చూపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో కూడా యాక్షన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. హీరో ప్రభాస్ ఒక సన్నివేశంలో ఇనుప కడ్డీ పట్టుకుంటే, ఆ రాడ్ పైన ఫింగర్స్ ప్రింట్ పడుతాయి. మరో సన్నివేశంలో ఒక గుద్దు గుద్దితే షాక్ కొట్టిన వాడు బ్రతుకుతడం ఏంటని, కరెంట్ వైర్ సీన్ అవసరమా అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.