విక్టరీ వెంకటేష్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫ్యామిలీ సినిమాలతో కామెడీ సినిమాలతో తనకంటూ సెపరేట్ మార్కెట్ ను ఏర్పరచుకున్నారు.ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి వెంకటేష్ ఇండస్ట్రీలో అందరితో మంచి సంబంధాలు ఉంటాయి.
అయితే వివాదాలకు దూరంగా ఉండే వెంకీ సినిమాకి వివాదాలు వచ్చి పడ్డాయి. వెంకటేష్ నటించిన ఓ సినిమా రిలీజ్ కి ముందు కాంట్రవర్సీలో చిక్కుకుంది. కానీ రిలీజ్ అయ్యాక బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇంతకీ అది ఏ సినిమానో తెలుసా…?

వెంకటేష్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొండపల్లి రాజా’ సినిమా విడుదల తర్వాత పెద్ద వివాదమే క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మరో హీరోగా సుమన్ నటించారు. మరో కీలక పాత్రలో శ్రీకాంత్ నటించారు .కొండపల్లి రాజా సినిమా హిందీలో జితేంద్ర, శతృఘ్న సిన్హా హీరోలుగా నటించిన ‘ఖుద్గర్జ్’ సినిమాకు రీమేక్.ఆ తర్వాత ఈ సినిమాను కృష్ణంరాజు, శరత్ బాబు హీరోలుగా ప్రాణ స్నేహితులుగా తెరకెక్కింది. వి.మధుసూదన రావు డైరెక్ట్ చేశారు. అదే సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళంలో శరత్ బాబుతో కలిసి ‘అన్నామలై’గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.
అప్పట్లో ప్రాణ స్నేహితులు సినిమా హీరో కృష్ణంరాజు ఈ సినిమా తెరకెక్కించడానికి మా అనుమతి తీసుకోలేదని కోర్టుకు కెక్కారు. దీంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. ఆ తర్వాత చిత్ర నిర్మాతలు, ప్రాణ స్నేహితులు చిత్ర నిర్మాతలతో పాటు కృష్ణంరాజుతో రాజీకి రావడంతో ఈ సినిమా విడుదలకున్న అడ్డంకులు తొలిగిపోయాయి. తర్వాత వెంకీ సినిమా సూపర్ హిట్ అయింది






రవితేజ హీరోగా హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. భాగ్యశ్రీ చీరకట్టులో ఉన్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఆకట్టుకొనేలా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది.
భాగ్యశ్రీ బోర్సే పూణెకు చెందిన నటి, మోడల్. 33 ఏళ్ళ భాగ్యశ్రీ మోడల్ గా రాణిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే నైజీరియాలో లాగోస్ లో చదువుకుంది. ఇండియా తిరిగి వచ్చిన తరువాత బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ టైమ్ లో మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. ఒక ఎజెన్సీతో పనిచేసింది. అలా పలు బ్రాండ్లకు భాగ్యశ్రీ అంబాసిడర్ గా పని చేసింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ ప్రకటనతో భాగ్యశ్రీ పాపులర్ అయ్యింది.
రీసెంట్ గా ‘యారియాన్ 2’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రాజ్యలక్ష్మిగా తన నటనతో యూత్ ను ఆకట్టుకుంది. యారియన్ 2 మూవీలో భాగ్యశ్రీ బోర్సే నటన చూసి, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమా నుండి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్, తాప్సి జంటగా నటించిన సినిమా డంకీ. ఈ మూవీలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్ మరియు అనిల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్లు ఈ మూవీ పై ఆసక్తిని రేకెత్తించాయి. షారుక్ హీరోగా నటించడం, రాజ్ కుమార్ హిరానీ లాంటి దిగ్గజ దర్శకుడు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ మూవీ డిసెంబర్ 21న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో డంకీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.
ట్రైలర్ తో మూవీ పై ఆసక్తి ని క్రియేట్ చేసిన, రాజ్ కుమార్ హిరానీ ఆడియెన్స్ అంచనాలను మాత్రం అందుకోలేక పోయాడంటూ టాక్. ప్రధమార్ధం చెత్తగా ఉందని, ఇక ద్వితీయార్ధం ఎమోషనల్ సీన్స్ తో నెట్టుకొచ్చారట. కొన్ని సీన్స్, అలాగే ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ కదిలిస్తాయని, మిగతాది బోర్ ఫీల్ అయ్యేలా ఉందట. హిరానీ ఎప్పటిలానే ఈ చిత్రంతో కూడా సందేశం ఇచ్చాడట.
మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుండి సంజు వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమా విషయంలో తడబడ్డట్టు సమాచారం. మరో వైపు డంకీ మూవీ పై బీఎఫ్ఎఫ్సీ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీలో బలమైన హిం-స, లైం-గి-క బెదిరింపులు, భయానక, ఆ-త్మ-హ-త్య, అడల్ట్ కామెడీ మరియు డ్రగ్స్ వంటి అంశాలు ఉన్నాయని షాకింగ్ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది.

