మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమాన్యుయేల్ అందరికీ పరిచయం. మలయాళ సినిమాలతో తన కెరీర్ ఆరంభించిన అను తర్వాత నాచురల్ స్టార్ నాని పక్కన మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఫస్ట్ సినిమా తోనే అను ఇమాన్యుయేల్ కి హిట్ దక్కింది.
ఆ తర్వాత వరుస పెట్టి ఆఫర్లు క్యూ కట్టాయి. వెంటనే రాజ్ తరుణ్ సరసన చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా కూడా కామెడీ సినిమాగా హిట్ అయింది.తర్వాత అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుస పెట్టి ఫ్లాపాలు అవ్వడం మొదలుపెట్టారు. అను ఇమాన్యూయల్ ని తెలుగు సినిమాల్లో ఐరన్ లెగ్ గా ముద్ర వేసేసారు.

స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య సినిమాలో నటించింది. అది ఫ్లాప్ గా మిగిలింది. నాగచైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు, శర్వానంద్ సరసన మహాసముద్రం, అల్లు శిరీష్ పక్కన ఊర్వశివో రాక్షసివో, రవితేజ సరసన రావణాసుర ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అవడం మొదలుపెట్టాయి. దీంతో అను ఇమాన్యుయల్ తెలుగులో ఆఫర్లు కూడా తగ్గాయి.తాజాగా అమ్మడు తమిళ్ లో కార్తీ సరసన జపాన్ సినిమాలో నటించింది. అను ఇమాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని కార్తీ అభిమానులు అందరూ ముందుగానే ఆందోళన చెందారు.

తాజాగా జపాన్ సినిమా దీపావళి కానుకగా విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆటలో అరటి పండుగా మిగిలింది. అసలు అనునీ ఎందుకు తీసుకున్నారా అని సగటు ప్రేక్షకుడికి అర్థం కాదు. అయితే కథగా చూస్తే జపాన్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఈ సినిమా పుణ్యమా అంట అను ఇమాన్యుయేల్ ఖాతాలో మరో ఫ్లాప్ సినిమా వచ్చి చేరింది. దీంతో ఇక అమ్మడికి ఆఫర్ ఇచ్చే డైరెక్టర్ ఎవరూ ఉండరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మునుముందు అను ఇయాన్యుయేల్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read:మొత్తం సినిమా ఒక ఎత్తు… క్లైమాక్స్ మరొక ఎత్తు..! ఈ సినిమా చూశారా..?


రవితేజ హీరోగా హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. భాగ్యశ్రీ చీరకట్టులో ఉన్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఆకట్టుకొనేలా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది.
భాగ్యశ్రీ బోర్సే పూణెకు చెందిన నటి, మోడల్. 33 ఏళ్ళ భాగ్యశ్రీ మోడల్ గా రాణిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే నైజీరియాలో లాగోస్ లో చదువుకుంది. ఇండియా తిరిగి వచ్చిన తరువాత బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ టైమ్ లో మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. ఒక ఎజెన్సీతో పనిచేసింది. అలా పలు బ్రాండ్లకు భాగ్యశ్రీ అంబాసిడర్ గా పని చేసింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ ప్రకటనతో భాగ్యశ్రీ పాపులర్ అయ్యింది.
రీసెంట్ గా ‘యారియాన్ 2’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రాజ్యలక్ష్మిగా తన నటనతో యూత్ ను ఆకట్టుకుంది. యారియన్ 2 మూవీలో భాగ్యశ్రీ బోర్సే నటన చూసి, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమా నుండి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్, తాప్సి జంటగా నటించిన సినిమా డంకీ. ఈ మూవీలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్ మరియు అనిల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్లు ఈ మూవీ పై ఆసక్తిని రేకెత్తించాయి. షారుక్ హీరోగా నటించడం, రాజ్ కుమార్ హిరానీ లాంటి దిగ్గజ దర్శకుడు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ మూవీ డిసెంబర్ 21న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో డంకీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.
ట్రైలర్ తో మూవీ పై ఆసక్తి ని క్రియేట్ చేసిన, రాజ్ కుమార్ హిరానీ ఆడియెన్స్ అంచనాలను మాత్రం అందుకోలేక పోయాడంటూ టాక్. ప్రధమార్ధం చెత్తగా ఉందని, ఇక ద్వితీయార్ధం ఎమోషనల్ సీన్స్ తో నెట్టుకొచ్చారట. కొన్ని సీన్స్, అలాగే ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ కదిలిస్తాయని, మిగతాది బోర్ ఫీల్ అయ్యేలా ఉందట. హిరానీ ఎప్పటిలానే ఈ చిత్రంతో కూడా సందేశం ఇచ్చాడట.
మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుండి సంజు వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమా విషయంలో తడబడ్డట్టు సమాచారం. మరో వైపు డంకీ మూవీ పై బీఎఫ్ఎఫ్సీ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీలో బలమైన హిం-స, లైం-గి-క బెదిరింపులు, భయానక, ఆ-త్మ-హ-త్య, అడల్ట్ కామెడీ మరియు డ్రగ్స్ వంటి అంశాలు ఉన్నాయని షాకింగ్ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది.







