బిగ్ బాస్ 7 లో పల్లవి ప్రశాంత్ విజేత కాగా, రన్నర్ గా బుల్లితెర నటుడు అమర్దీప్ నిలిచాడు. ఫినాలే ముగిసిన అనంతరం బయటకు వచ్చే వీరిని చూడడానికి ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకు చేరారు. అయితే షో నుండి బయటి వచ్చిన రన్నర్ అమర్ దీప్ తో పాటు, అతని ఫ్యామిలీని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తరిమి కొట్టారు. వందలాది మంది ఒక్కసారిగా కారు పై దాడి చేశారు.
స్టూడియో నుండి బయటకు వచ్చిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ మరియు సెలబ్రిటీల కార్ల మీద కూడా రాళ్లు విసిరారు. చేతికి దొరికిన వస్తువులతో అద్దాలను పగలగొట్టారు. ఇప్పటి దాకా జరిగిన బిగ్ బాస్ సీజన్స్ మొత్తంలో ఇలా ఒక సెలబ్రిటీ పై అటాక్ జరగడం ఇదే తొలిసారి.
అమర్ దీప్ని కొట్టిన తరువాతే అన్నపూర్ణ స్టుడియోస్ నుండి వెళ్తామని పబ్లిక్గా యూట్యూబ్ ఛానల్స్ తో చెప్పిన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అభిమానులు, అన్నట్టుగానే ఫినాలే షో ముగిసిన తరువాత అర్ధరాత్రి బయటికి వచ్చిన అమర్ దీప్ మరియు అతని కుటుంబం పై దాడి చేశారు. వారి కారుని కూడా ధ్వంసం చేశారు. కారులో ఉన్న అమర్ దీప్, తల్లి, అతని భార్య, ఫ్రెండ్ నరేష్ లొల్ల,డ్రైవర్ ను భయభ్రాంతులకు గురి చేశారు.
బూతులు తిడితూ, కారును అద్దాలను పగులగొట్టారు. అమర్ దీప్ని బయటకు లాగాడానికి ప్రయత్నం చేశారు. దాంతో అమర్ దీప్ తల్లి, భార్య తీవ్ర భయాందోళన పడ్డారు. అరగంట పాటు జరిగిన దాడిలో వదిలేయమని అమర్ తల్లి, ఫ్రెండ్ దండం పెట్టినా వినలేదు. కారుని ధ్వసం చేశారు. ఈ దాడిలో కారులో ఉన్న అమర్ దీప్కి, తల్లి, భార్యకి గాయాలు అయినట్టు తెలుస్తోంది. అమర్ దీప్ కారునే కాకుండా, గీతూ రాయల్, అశ్విని కార్లను, ఆర్టీసీ బస్సు, ఇతర వాహనాలను కూడా పగుల గొట్టారు. గీతూ రాయల్ ఈ విషయం పై కేసు పెట్టింది.
గీతూ, అశ్విని సోషల్ మీడియాలో దాడి గురించి పోస్ట్ చేశారు. అమర్ దీప్ పై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు వీడియో నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసినవారు ఎలక్షన్స్ టైమ్ లో కూడా ఇంత గొడవ అవలేదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
Also Read: నితిన్ సినిమా కోసం రాజశేఖర్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా…?






1. మహేష్ బాబు:
2. రామ్ చరణ్:
3. వరుణ్ తేజ్:
4. మెగాస్టార్ చిరంజీవి:
5. అఖిల్ అక్కినేని:
6. అక్షయ్ కుమార్:
7. షారుఖ్ ఖాన్:
8. ముస్తఫా బర్మావాలా:
9. అమీర్ ఖాన్:
భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, ఘోర పరాజయం పాలైంది. దీంతో అమీర్ ఖాన్ అభిమానులకి క్షమాపణలు చెప్పారు.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బుల్లితెర పై సత్యమేవ జయతే అనే టాక్ షోతో ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, సామాజిక సమస్యల పై రియాలిటీ టాక్ షోను మొదలుపెట్టాడు. సత్యమేవ జయతే మొదటి సీజన్ 2012లో మే 6న ప్రసారం అయ్యింది. ఈ షో డీడీ నేషనల్, స్టార్ వరల్డ్ తో పాటుగా మొత్తం పది ఛానెల్స్ లో ప్రసారం అయ్యింది. ఈ షోలో భారతదేశంలో ప్రబలంగా ఉన్న ఆడపిల్లల భ్రూణహత్యలు, పిల్లల లైంగిక వేధింపులు, అత్యాచారం, పరువు హత్యలు, గృహ హింస లాంటి సున్నితమైన సామాజిక సమస్యల పై దృష్టి సారించింది.
అంటరానితనం, వివక్ష, ప్రత్యామ్నాయ లైంగికతలను అంగీకరించడం, విషపురుషత్వం, మద్యపానం మరియు నేర రాజకీయాల మెడికల్ మాఫియా గురించి ఈ షోలో చర్చించారు. యువత వారి లక్ష్యాలను సాధించడానికి, ప్రేక్షకులను ప్రోత్సహించడానికి గొప్ప విజయాలు సాధించి, గుర్తింపు పొందని వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ షో సాగింది. పౌరులకు వారి దేశం గురించిన సమాచారంలో సాధికారత కల్పించడం మరియు చర్య తీసుకోవాలని వారిని కోరడం కూడా దీని లక్ష్యం. ఈ షో హిందీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు లాంటి 8 భాషలలో ఏకకాలంలో ప్రసారం చేయబడింది. అందరికి రీచ్ కావడానికి వీలుగా ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ ప్రసారం చేశారు.
ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. సత్యమేవ జయతే మొదటి సీజన్ కు 165 దేశాల నుండి బిలియన్ డిజిటల్ ఇంప్రెషన్లను పొందింది. పలు దేశాలలో వ్యూయర్స్ నుండి ప్రతిస్పందనలతో, మిలియన్ల మంది ప్రజలు ఈ షోకు మద్దతు ఇచ్చారు. రెండో సీజన్ను 600 మిలియన్ల మంది ఇండియన్స్ చూశారు. అయితే ఈ షో కొన్ని కారణాల వల్ల ఆపేశారు. ఎందుకనేది తెలినప్పటికి సమాజంలో జరిగే ఎన్నో విషయాల గురించి ఈ షో మాట్లాడింది. ఈ షోకి మరిన్ని సీజన్స్ వస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.
‘ఓ మై బేబీ’ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి గుంటూరు కారం యూనిట్ మీద మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం దానిపై పాట రచయిత రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ వార్ మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా అకౌంట్ కూడా డిలీట్ చేసారు. ఈ ట్రోలింగ్ పై నిర్మాత నాగవంశీ రెస్పాండ్ కావడం మరింత హాట్ టాపిక్ కి దారి తీసింది. ఆ తరువాత ఆ పోస్ట్ డిలీట్ చేసాడు. ఇలా ఇద్దరు వెనక్కి తగ్గడానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు క్షమాపణ చెప్పడమే అంటూ ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది.
ఆ పోస్ట్ లో “నాగవంశీ తన ట్వీట్లను తొలగించాడు. అతను ఫ్యాన్స్ గురించి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేశాడు. మహేష్బాబు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ పై సోషల్ మీడియాలో ఉపయోగించిన భాషతో అప్ సెట్ అయ్యాడు. అది చాలా తప్పు అనేలా చెప్పారు. మహేష్ అన్నకి తన ఫ్యాన్స్ అంటే ఎంత పిచ్చి అనేది అర్దమైందా? వర్క్ తో మాట్లాడదాము, ఇంప్రెస్ చేద్దాము. వాళ్ళు చెప్పారు అంటే వూరికే చెప్పరు. ఏదైనా అని ఉంటే నా తరుపున క్షమించండి, రామజోగయ్య గారు, తిరిగి వర్క్ కు రండి. నెక్ట్స్ పాట అదిరిపోయేలా రాయండి అనేలా చెప్పారంట.
ప్రొడక్షన్ హౌస్ మరియు నిర్మాతలు తెలుసుకోవలసిన విషయం, ఎండ్ ఆఫ్ ద డే అభిమానులే అంతా, వాళ్లకోసమే సినిమాలు తీసేది అనే స్టేట్మెంట్ ఉంటుంది ఏ హీరో నుండి అయినా, అట్లాంటిది వారిని జడ్జ్ చేయవద్దు. మీ చెత్త ప్రవర్తన వల్ల మా హీరో మాకు సారీ ఫిల్ అవడం మాకు ఇష్టం ఉండదు. మా అన్నయ సినిమా అండి.సెలెబ్రేషన్స్ మేము చేసుకుంటాము అంటే అర్ధం, సెలెబ్రేషన్స్ చేసేలా సాంగ్స్ ఇవ్వాలి అని, బలవంతంగా రుద్దడం కాదు. ఓవర్ ఆల్ గా ఇక్కడితో పంచాయితీ అయిపొయింది. అదిరిపోయే కంటెంట్ మీరు మాకు ఇవండి. దాన్ని నెక్స్ట్ లెవల్ సెలెబ్రేషన్స్ మేము చూసుకుంటాము” అని చెప్పుకొచ్చారు.
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రి, శక్తికపూర్, బబ్లూ పృథ్విరాజ్ కీలక పాత్రలలో నటించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధిచింది. రూ. 760 కోట్ల పైగా సాధించి, పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీలో నటించిన త్రిప్తి దిమ్రి లాంటివారికి మంచి గుర్తింపు లభించింది. ఆమె ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నర్స్ పాత్రలో హిందీ సీరియల్ నటి దీప్తి పాటిల్ నటించారు.
దీప్తి పాటిల్ ముంబైలో పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది. ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ఆమె యాక్టింగ్ కెరీర్ 2018లో పాపులర్ స్టార్ ప్లస్ షో అయిన “యే హై మొహబ్బతేన్” తో ప్రారంభం అయ్యింది. ఆ షోతో బ్రేక్ రావడంతో అవకాశాలు వచ్చాయి. అలా రామన్ అకా కరణ్ పటేల్ యొక్క నర్సుగా. ఆమె సుమారు 20 ఎపిసోడ్లలో నటించింది. “యే రిష్టే హై ప్యార్ కే” ద్వారా గుర్తింపును తెచ్చుకుంది.
ఆ తరువాత దీప్తి పాటిల్ పలు పౌరాణిక మరియు క్రైమ్ షోలలో నటించింది. అలా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి పాటిల్ డైరెక్టర్ సందీప్ వంగా యనిమాల్ మూవీలో రణబీర్ కపూర్, రష్మిక ఇంట్లో ఉండే నర్స్ క్యారెక్టర్ కు తీసుకున్నారు. ఈ మూవీతో ఆమె పాపులర్ అయ్యారు. దీప్తి పాటిల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ, తరచూ తనకు సంబడనహించి ఫోటోలు, రీల్స్ ను షేర్ చేస్తుంటారు. ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో 36 k కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.