నాచ్యురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై తెలుగు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
నాచ్యురల్ స్టార్ నాని గతంలో అనేక విజయవంతమైన చిత్రాలను అందించాడు. ప్రతి ప్రాజెక్ట్తో, అతను తన పాత్రలకు ప్రత్యేకమైన టచ్ ఇచ్చే నాని వాటిని తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేస్తాడు.

ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సినిమాకి సంబదించిన అంచైన్డ్ పోస్టర్ ని విడుదల చేసారు. కాగా ఇందుల ప్రధాన విలన్ రోల్ లో తమిళ నటుడైన SJ సూర్యని సంప్రదించి డేట్స్ కంఫర్మ్ చేసుకొన్నారు.కానీ SJ సూర్య భారీ మొత్తంలో పారితోషం అందుకుంటున్నట్టు సమాచారం.ఈ చిత్రానికి SJ సూర్య గారు మాత్రమే చేయగలరు అని మరియు ఆ పాత్రకి ఆయనే న్యాయం చెయ్యగలరు అని ప్రొడ్యూసర్స్ నమ్మకం కాబట్టి ఆ పారితోషం ఇవ్వడానికి కూడా మేము వెనకడము.SJ సూర్య గారికి అక్షరాలా 10 కోట్లు. ఇది ఈ సినిమా బడ్జెట్ లోని చాల భాగం.

మొదటి సారి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు యాక్షన్ సినిమా తీయబోతున్నారు.ఈ సినిమాలో సాయి కుమార్ గారు కేవలం వాయిస్ ఓవర్ ఇచ్చారా లేదా ముఖ్య పాత్రలో కూడా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.జాక్స్ బిజోయ్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు,మురళి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కార్తీక శ్రీనివాస్ కూర్పు నిర్వహణ చేసారు మరియు శేఖర్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసారు.

ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ మరియు కథతో యాక్షన్ ఫిలిం కాన్సెప్ట్ లోకి దిగబోతున్నారు.దీనితో అటు ప్రొడ్యూసర్స్ ఇటు సినిమా ప్రేక్షకులు ఈ ఆక్షన్ సినిమా ఎలా ఉండబోతోందో అందులోని SJ సూర్య గారి స్ట్రాంగ్ యాంటీ రోల్ ఏమిటో అని ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా తమ షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని సినిమా అభిమానుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.

1. రంగుల రాట్నం:
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన 1942లో కృష్ణాజిల్లాలోని పమిడిముక్కలలో మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం అనే సినిమాతో చంద్రమోహన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ ను అందుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా నటించిన చంద్రమోహన్, 175 పైగా సినిమాలలో హీరోగా చేశారు. ఆ తరువాత ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించిన ఆయన మొత్తం 932 చిత్రాలలో నటించాడు.
సెకండ్ హీరోగా, హీరోగా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా వైవిధ్యమైన క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల ద్వారా ఆయన తెలుగు ఆడియెన్స్ మనసులో చెరిగిపోని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కి చంద్రమోహన్ను లక్కీ హీరోగా చెబుతారు. ఆయన పక్కన నటించిన హీరోయిన్స్ ఆ తరువాతి కాలంలో టాప్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఏలారు. వారిలో జయప్రద, జయసుధ, శ్రీదేవి, సుహాసిని, విజయశాంతి వరకు చాలా మంది ఉన్నారు. వారంతా కెరీర్ తొలినాళ్లలో చంద్రమోహన్ తో నటించినవారే.
చంద్రమోహన్ కెరీర్ లో ఆయన నటనకు గానూ 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన భార్య పేరు జలంధర. మంచి రచయిత్రి. పలు కథా సంకలనాలను రాశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, మధుర మీనాక్షీ అమెరికాలో స్థిరపడింది. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ చెన్నైలో స్థిరపడింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ మూవీ శక్తి. ఈ మూవీకి ముందు ఇదే కాంబోలో కంత్రి అనే సినిమా వచ్చింది. మెహర్ రమేష్ తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి సినిమా కంత్రి. ఈ సినిమాని అశ్వినీదత్ నిర్మించారు. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాగానే వసూల్ చేసింది. ఈ సినిమా తరువాత మూడేళ్లకి ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబోలో ‘శక్తి’ సినిమా రూపొందింది.
ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మాత. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి షోతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుని పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల వచ్చిన నష్టానికి అశ్వినీదత్ నిర్మాణ రంగం విడిచి, విజయవాడకు వెళ్ళిపోవాలని అనుకున్నానని ఒక సందర్భంలో వెల్లడించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా నటించారు. ఎన్టీఆర్ సీక్రెట్ ఆపరేషన్ లో హోమ్ మినిస్టర్ కుమార్తె ను కాపాడే గైడ్ పాత్రలో కనిపిస్తాడు.
ఒక సీన్ లో హీరోయిన్ ఇలియానాను కొందరు బలవంతంగా తీసుకెళ్తుంటారు. ఆ విషయాన్ని ఆమె ఫ్రెండ్స్ ఎన్టీఆర్ తో చెప్పడంతో ఆమెని కాపాడడం కోసం ఎన్టీఆర్ పారాషూట్ సహాయంతో వెళ్ళి విలన్ పై దుకుతాడు. కానీ ఆ సీన్ లో డూప్ పెట్టడంతో, ఎన్టీఆర్ కి బదులు సీన్ లో డూప్ కనిపిస్తాడు. ఈ మిస్టేక్ ని గమనించిన నెటిజెన్లు చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పల్లెటూరి పొగరుబోతు అమ్మాయి క్యారెక్టర్ అయినా, ఆత్మాభిమానం కల మధ్యతరగతి యువతి క్యారెక్టర్ అయినా, అందం అణుకువ ఉన్న అమ్మాయి అయినా, నవలా నాయికగా నటించాలన్నా అది వాణిశ్రీకి మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు. ఆ అదృష్టం ఆమెకే దక్కింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాలతో కలిపి సుమారు 95 సినిమాలలో నటించిన వాణిశ్రీ, ఆ రోజుల్లో అందరికన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా నిలిచింది.
వాణిశ్రీ అసలు పేరు రత్న కుమారి. 1962 లో భీష్మ తెలుగు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదట్లో కొన్ని సినిమాలలో చిన్న పాత్రలు చేసిన ఆమె. ఆ తరువాత అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. ఆమె 40 ఏళ్ల సినీ కెరీర్లో 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సౌత్ , నంది అవార్డులు మరియు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. వాణిశ్రీ టాప్ హీరోయిన్ గా ఉన్న టైమ్ లోనే డా. కరుంకరన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
1989 లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. కొడుకు పుట్టిన తరువాత థైరాయిడ్ సమస్య ఏర్పడి, వాణిశ్రీ బాగా లావయ్యారని తెలుస్తోంది. తాజాగా తిరుమలకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారు వాణిశ్రీ ఇలా మారిపోయరేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.






























