యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శక్తి. ఈ మూవీ తొలి షోతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుని భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఫ్లాప్ అవడంతో ప్రొడ్యూసర్ కి భారీ నష్టాలను మిగిల్చింది.
ఈ చిత్రంలో ప్రభు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, హీరోయిన్ మంజరి ఫడ్నిస్, నాజర్, జాకీ ష్రాఫ్, వినోద్ కుమర్ వంటి వారు నటించారు. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోయిన్ కాపాడే సన్నివేశంలో మిస్టేక్ ని గమనించిన నెటిజెన్లు డైరెక్టర్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ మూవీ శక్తి. ఈ మూవీకి ముందు ఇదే కాంబోలో కంత్రి అనే సినిమా వచ్చింది. మెహర్ రమేష్ తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి సినిమా కంత్రి. ఈ సినిమాని అశ్వినీదత్ నిర్మించారు. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాగానే వసూల్ చేసింది. ఈ సినిమా తరువాత మూడేళ్లకి ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబోలో ‘శక్తి’ సినిమా రూపొందింది.
ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మాత. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి షోతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుని పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల వచ్చిన నష్టానికి అశ్వినీదత్ నిర్మాణ రంగం విడిచి, విజయవాడకు వెళ్ళిపోవాలని అనుకున్నానని ఒక సందర్భంలో వెల్లడించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా నటించారు. ఎన్టీఆర్ సీక్రెట్ ఆపరేషన్ లో హోమ్ మినిస్టర్ కుమార్తె ను కాపాడే గైడ్ పాత్రలో కనిపిస్తాడు.
ఒక సీన్ లో హీరోయిన్ ఇలియానాను కొందరు బలవంతంగా తీసుకెళ్తుంటారు. ఆ విషయాన్ని ఆమె ఫ్రెండ్స్ ఎన్టీఆర్ తో చెప్పడంతో ఆమెని కాపాడడం కోసం ఎన్టీఆర్ పారాషూట్ సహాయంతో వెళ్ళి విలన్ పై దుకుతాడు. కానీ ఆ సీన్ లో డూప్ పెట్టడంతో, ఎన్టీఆర్ కి బదులు సీన్ లో డూప్ కనిపిస్తాడు. ఈ మిస్టేక్ ని గమనించిన నెటిజెన్లు చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: JAPAN REVIEW : “కార్తీ” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

పల్లెటూరి పొగరుబోతు అమ్మాయి క్యారెక్టర్ అయినా, ఆత్మాభిమానం కల మధ్యతరగతి యువతి క్యారెక్టర్ అయినా, అందం అణుకువ ఉన్న అమ్మాయి అయినా, నవలా నాయికగా నటించాలన్నా అది వాణిశ్రీకి మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు. ఆ అదృష్టం ఆమెకే దక్కింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాలతో కలిపి సుమారు 95 సినిమాలలో నటించిన వాణిశ్రీ, ఆ రోజుల్లో అందరికన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా నిలిచింది.
వాణిశ్రీ అసలు పేరు రత్న కుమారి. 1962 లో భీష్మ తెలుగు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదట్లో కొన్ని సినిమాలలో చిన్న పాత్రలు చేసిన ఆమె. ఆ తరువాత అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. ఆమె 40 ఏళ్ల సినీ కెరీర్లో 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సౌత్ , నంది అవార్డులు మరియు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. వాణిశ్రీ టాప్ హీరోయిన్ గా ఉన్న టైమ్ లోనే డా. కరుంకరన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
1989 లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. కొడుకు పుట్టిన తరువాత థైరాయిడ్ సమస్య ఏర్పడి, వాణిశ్రీ బాగా లావయ్యారని తెలుస్తోంది. తాజాగా తిరుమలకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారు వాణిశ్రీ ఇలా మారిపోయరేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.














































