యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయి.. ఒక్కసారిగా బేబీ సినిమాతో ఓ ఎత్తుకు వెళ్లిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఎవరి నోట వింటున్న ఈమె పేరే.
ఎందుకంటే బేబీ సినిమాలో ఈమె నటనకు ధియోటర్లలో చూసిన ప్రతిఒక్కరూ ఫిదా. తన నటనతో అందరి దృష్టిలో పడి ఓ క్రేజీ ఆఫర్ను కొట్టేసింది ఈ భామ. ఒక్క సినిమాతోనే తన టాలెంట్ను చూపించిన వైష్ణవి.. యూత్ గుండెల్లో బేబీగా బలమైన ముద్ర వేసుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో వైష్ణవికి వరుస అవకాశాలు రావడం ఖాయమని అందరు అనుకున్నారు.

అనుకున్న ప్రకారమే.. ఆమె రెండు ప్రాజెక్టుల్లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒక ప్రాజెక్ట్.. బొమ్మరిల్లు భాస్కర్, మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్ధు కాంబోలో వస్తున్న చిత్రానికి హీరోయిన్గా వైష్ణవిని ఎంపిక అయినట్లు తెలుస్తుంది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ కొత్త రికార్డులను క్రియేట్ చేసి.. భారీ వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే.





అప్పట్లోనే దాదాపు 45 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం మెగా అభిమానులకు ఎప్పుడు గుర్తుంది పోతుంది. ఈ మూవీలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన విషికా ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది.

“షారుఖ్ జవాన్ సినిమా ఎలా ఉంది, మీ వ్యూ తెలుపగలరా సర్ ?” అని కోరాలో అడిగిన ప్రశ్నకు
విశ్లేషణ: ఒక నిజాయితీ గల ఆర్మీ ఆఫీసర్ దేశద్రోహిగా క్రియేట్ చేయబడి చనిపోవడం, అది నిజం కాదని కొడుకు ప్రూవ్ చేయడం అనే లైన్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవకి చెందినది. కొన్ని కుట్రల వల్ల హత్యకి గురి కాబోయి, కొన ఊపిరితో ఒక గ్రామానికి చేరి ఆ గ్రామస్తులు చేయించిన వైద్యంతో రక్షించబడి ఒకానొక టైమ్ లో ఆ ఊరినే కాపాడిన ఆఫీసర్ అనే సీన్ తో అసలు ఎలివేషన్ స్టార్ట్ అవుతుంది.
తర్వాత ఒక పెద్ద బిజినెస్ మాన్(కాళీ) కూతురిని ట్రైన్ హైజాక్ లో అపంహరించి, డబ్బులు డిమాండ్ చేసి నలబై వేల కోట్లు లాగేయడం ఆ డబ్బునంతా రైతుల రుణాల కోసం వెచ్చించడం లాంటి రాబిన్ హుడ్ హీరోగా అసలు కధను మొదలెడతారు. ఇది రుచించక విలన్ అతనిని ట్రాప్ చేసి చంపబోయే ప్రయత్నంలో విక్రమ్ రాథోడ్ (మరో షారుఖ్) సూపర్ ఎంట్రీ ఇవ్వడం, ఇక ఇక్కడి నుండే కధ అనూహ్య మలుపులు తీసుకోవడం, అసలు వీళ్లెవరు, ఆ కాళీ ఎవరు, వీళ్ళ కదేంటి అనేదే మిగిలిన సగం సినిమా. ఇలా, ఒక కథగా చూస్తే ఎక్కడా కొత్తగా అనిపించదు, చాలా సినిమాలు జ్ఞప్తికొస్తాయి.
జస్ట్ హీరో ఎలివేషన్లతో, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లతో చాలావరకు ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ కొన్నిచోట్ల పెదవి విరుపులైతే తప్పలేదు. ఇక కాంబో విషయానికొస్తే, షారుఖ్ ఖాన్ లాంటి హీరోని పెట్టుకొని కొత్త కథతో వస్తాడనుకుంటే మనం చూసిన ఎన్నో కథలను మిక్స్ చేసి ఈ రొట్ట రొటీన్ సినిమా తీశాడు అట్లీ, కాకపోతే ఇదొక బాలీవుడ్ మూవీ అంతే. కాకపోతే ప్రస్తుతం సొసైటీలో ప్రధాన సమస్యలైన రైతులు, వారి ఆత్మహత్య లు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో విధి విధానాలు లాంటి వాటిని కమర్షియాలిటీ జోడించి హృద్యంగా తెరకెక్కించిన తీరు మాత్రం మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
అలాగే షారుఖ్ డైలాగులు కూడా కొంతలో కొంత ఆలోచింపచేసే విధంగా ఉంటాయి, కధగా ‘జవాన్’ పాతదైనా రొటీన్ అయినా, రేసీగా స్క్రీన్ ప్లే రాసుకుని తెరకెక్కించాడు అట్లీ. ఇక అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల గూస్ బాంప్స్ తెప్పించింది. పాటలు మాత్రం పెద్దగా ఎక్కలేదనేది నిజం. విజయ్ సేతుపతి విలనిజంలో పస లేదు, నయనతార ఓకే. దీపికా, సంజయ్ దత్ వి పెద్ద పాత్రలేమి కావు. కానీ బానే చేశారు. ప్రియమణి పాత్ర బాగా డిజైన్ చేశారు. కానీ చివరలో నయనతార కోసం ఆ పాత్రను చంపేసినట్లు అనిపిస్తుంది.
ప్లస్ & మైనస్: షారుఖ్, విజయ్ సేతుపతి, అనిరుధ్ , యాక్షన్ సీన్స్ ప్లస్ కాగా, పాత కధ, నచ్చని పాటలు పెద్ద మైనస్ అయ్యాయి.
స్కంద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టు పేరు మేఘనా సునీల్. ఆమె గుండమ్మ కథ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. గుండమ్మ గా మేఘన అందంతో, నటనతో బుల్లితెర ఆడియన్స్ ఆకట్టుకుంటోంది. ఇంట్లోవారు ఆమెను మేగీ అని పిలుస్తారు. ఆమె స్వస్థలం విజయవాడ. ఆమె తండ్రి పేరు సునీల్, తల్లి పేరు శ్రీలక్ష్మి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోందని తెలుస్తోంది.
ఆమె తండ్రి సునీల్ కు నటన పైన ఉన్న మక్కువ వల్ల, మేఘనకు కూడా నటన పట్ల ఇష్టం కలిగింది. ఈ రంగంలోకి అడుగుపెట్టింది. మేఘన సిటీ కేబుల్ లో యాంకర్ గా కూడా చేసింది. పలు ప్రకటనలలో నటించిన మేఘన, హీరో నాగార్జునతో కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రకటనలో నటించింది. ఆమె జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ కోసం ఆడిషన్స్ కి హాజరు అవడంతో గుండమ్మ కథలో సీరియల్ లో పాత్రకు సెట్ అవుతుందని భావించి ఆ సీరియల్ లో తీసుకున్నారు.
ఆ సీరియల్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరైన మేఘన ఆ తరువాత అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, అమ్మాయిగారు సీరియల్స్ అవకాశం వచ్చింది. ఆ తరువాత పలు సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి. దాంతో F3, ముఖచిత్రం, హిడింబా వంటి సినిమాలలో నటించింది. తాజాగా స్కంద మూవీలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క నటిస్తూనే స్టడీస్ కొనసాగిస్తోంది.
జవాన్ కథ మహేష్ బాబుకి బాగా నచ్చిందని, కానీ కాల్ షీట్స్ లేకపోవడంతో సున్నితంగా ఈ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ కు ముందు, ఆ తరువాత మహేష్ బాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ తరువాత అట్లీ ఈ స్టోరీని రామ్ చరణ్ కి వినిపించారంట. అయితే డిఫరెంట్ కథతో రిస్క్ చేయడానికి ముందుకు రాలేదట. ఆ తరువాత అట్లీ షారూఖ్ ఖాన్ కి కథ చెప్పడం, ఆయనకు నచ్చి ఒకే చేయడంతో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ ఏడాది షారుక్ కి రెండవ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
బేబీ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి, ఎన్నో సినిమాలలో నటించినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చిన నటీనటులు చాలామంది ఉన్నారు. వారి గురించి మూవీ రిలీజ్ అయిన సమయంలో వైరల్ కూడా అయ్యారు. కానీ మూవీ క్లైమాక్స్ లో వైష్ణవి చైతన్య పెళ్లి చేసుకున్న నటుడు ఎవరు అనేది మాత్రం చాలా రోజుల వరకు తెలియలేదు. ఆ పెళ్లికొడుకు సెకన్లపాటే కనిపించినా బాగా వైరల్ అయ్యాడు.
ఆ అభాగ్యుడు ఎవరు? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చాయి. అయితే బేబిని పెళ్లి చేసుకున్న నటుడు ఎవరో ఫైనల్గా తెలిసింది. ఆ నటుడి పేరు మల్లిడి కృష్ణ. తన నేటివ్ తూర్పు గోదావరి జిల్లా. అతను ఎవరో కాదు. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట సోదరుడు.
బేబీ అతని మొదటి సినిమా కాదు. ఎన్నో సినిమాలలో నటించాడు. మల్లిడి కృష్ణ కలర్ ఫోటో మూవీలో హీరో సుహాస్ కి సీనియర్ గా నటించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ మూవీలో హీరోయిన్ ను పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఇచ్చాడంట. సెకన్ల పాటు మాత్రమే కనిపించినా మల్లిడి కృష్ణకు మంచి గుర్తింపు వచ్చింది.
విజయలక్ష్మి చెన్నై లో జన్మించింది. ఆమె బెంగళూరులో చదువుకుంది. 1997లో ‘నాగమండలం’ అనే కన్నడ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్కు జంటగా నటించింది. తొలి మూవీతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారారు. తమిళంలో కూడా పలు సినిమాలలో విజయలక్ష్మి నటించింది. తెలుగులో హనుమాన్ జంక్షన్ మరియు పృథ్వి నారాయణలో నటించారు. ఒక మలయాళ మూవీలో మోహన్లాల్తో కలిసి నటించింది. ఆమె కెరీర్లో సుమారు 40 చిత్రాలలో నటించింది.
పలువురు స్టార్ హీరోల పక్కన హిరోయిన్ గా నటించిన విజయలక్ష్మి, తమిళ నటుడు, దర్శకుడు మరియు నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత అయిన సీమాన్ పై ఫిబ్రవరి 2020లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. అతను తనను వివాహం చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆ తరువాత సీమాన్ వేధింపులు భరించలేక 2020 లో బలవన్మరణానికి కూడా పాల్పడింది. ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతో విజయలక్ష్మి కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే విజయలక్ష్మి మరోసారి సీమాన్ పై ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని, ఏడు సార్లు సీమన్ బలవంతంగా అబార్షన్ చేయించినట్టు విజయలక్ష్మి ఆరోపించింది. అది మాత్రమే కాకుండా తన నగలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. న్యాయం చేయమని అడిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారని సీమన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుని, సీమాన్ను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.



ఇంకా ఆ సమయంలో శ్రీకాంత్ అసోసియేట్ కిషోర్ వేరే యాక్టర్ ఎందుకు.. నువ్వే ఈ పాత్ర చేయవచ్చు కదా అని అన్నాడు. అయిన శ్రీకాంత్ ఒప్పుకోలేదు. కానీ కిషోర్ బలవంతం చేయగా చివరికి శ్రీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపాడు. సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.