ఒకవైపు దర్శకుడిగా, మరొకవైపు నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నారు సముద్రఖని. గత కొంత కాలం నుండి తెలుగు సినిమాల్లో కూడా సముద్రఖని నటిస్తున్నారు. తన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన విమానం సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : విమానం
- నటీనటులు : సముద్రఖని, మీరాజాస్మిన్, మాస్టర్ ధృవన్.
- నిర్మాత : కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్
- దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల
- సంగీతం : చరణ్ అర్జున్
- విడుదల తేదీ : జూన్ 9, 2023

స్టోరీ :
వీరయ్య (సముద్రఖని), తన కొడుకు రాజు (ధ్రువన్) తో కలిసి ఒక బస్తీలో నివసిస్తూ ఉంటాడు. అదే బస్తీలో సుమతి (అనసూయ భరద్వాజ్), కోటి (రాహుల్ రామకృష్ణ) అనే ఒక చెప్పులు కుట్టే వ్యక్తి, డేనియల్ (ధనరాజ్) అనే ఒక ఆటో డ్రైవర్ కూడా నివసిస్తూ ఉంటారు. రాజు తల్లి తనకి జన్మనిచ్చి చనిపోతుంది. అప్పటి నుండి వీరయ్య రాజు ఆలన పాలన చూసుకుంటూ ఉంటాడు. వీరయ్య అదే బస్తీలో మరుగుదొడ్లు కడుగుతూ ఉంటాడు. కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో తన కొడుకుని చదివిస్తూ ఉంటాడు.

రాజుకి విమానం అంటే చాలా ఇష్టం. ఎప్పటికి అయినా విమానం ఎక్కాలి అనుకుంటూ ఉంటాడు. కానీ రాజుకి లుకేమియా ఉంది అని తెలుస్తుంది. దాంతో తన కొడుకు కోరిక అని నెరవేర్చాలి అని వీరయ్య అనుకుంటాడు. అప్పటి నుంచి విమానం ఎక్కడానికి కావాల్సిన డబ్బులని పోగు చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల వీరయ్య జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు వీరయ్య చేసిన తప్పు ఏంటి? తన కొడుకు కోరికని నెరవేర్చాడా? వారు విమానం ఎక్కారా? వీరయ్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఒక సినిమా చూసే ప్రేక్షకుడికి అన్ని ఎమోషన్స్ కంటే ఎక్కువగా కనెక్ట్ అయ్యేది ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్. తల్లి సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు, తండ్రి సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు, ఇలా ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలని బాగా చూపిస్తే, ప్రేక్షకులు వాటిని కచ్చితంగా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగే సినిమా.

ట్రైలర్ చూస్తే ఇది ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సినిమా అని అర్థం అయిపోతోంది. సినిమా కూడా అలాగే ఉంటుంది. సినిమాలో కంటతడి పెట్టించే సీన్స్ చాలా ఉంటాయి. ఒక కొడుకు కోరిక తీర్చడం కోసం ఆ తండ్రి పడే తపన, దాని కోసం అతను పడే కష్టం, ఇవన్నీ చాలా బాగా చూపించారు. కొన్ని చోట్ల అయితే అసలు ఇది సినిమా అని, వారు నటులు అని మర్చిపోతాం. చాలా సంవత్సరాల క్రితం మాతృదేవోభవ సినిమా వచ్చింది. ఆ సినిమా చూస్తున్నంత సేపు కూడా ప్రేక్షకులకి ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ప్రేక్షకులకి అలాగే అనిపిస్తుంది. అంటే వారు సినిమాలో పడుతున్న బాధలని తెరపై అంత బాగా చూపించారు అని, ప్రేక్షకులు దానికి కనెక్ట్ అయ్యారు అని అర్థం. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ప్రేక్షకులని కంటతడి పెట్టించేలా చేస్తుంది. అసలు ఊహించి కూడా ఉండరు ఏమో. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.

సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం సముద్రఖని. ఆయన ఎంత మంచి నటుడు అనేది మళ్లీ ఈ సినిమా ద్వారా మరొకసారి నిరూపించారు. అలాగే రాజు పాత్ర పోషించిన మాస్టర్ ధ్రువన్ కూడా తన పాత్రకి తగ్గట్టుగా అమాయకంగా నటించారు. ముఖ్య పాత్రల్లో నటించిన అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ కూడా పాత్రల పరిధి మేరకు నటించారు. అనసూయకి అయితే నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అనసూయ చాలా బాగా నటించారు.

చాలా సంవత్సరాల తర్వాత మీరా జాస్మిన్ మళ్లీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఎయిర్ హోస్టెస్ పాత్రలో మీరా జాస్మిన్ నటించారు. అయితే సినిమాలో ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా కొన్ని చోట్ల మిగిలినవి కూడా కవర్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. సినిమా అంతా వీరయ్య, రాజు చుట్టూ తిరిగినా కూడా, మిగిలిన పాత్రల గురించి ఇంకా కొంచెం బాగా చూపించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

వారి పాత్రలు సినిమా ముందుకి వెళ్ళటానికి సహాయం చేస్తున్నాయి కాబట్టి వారిపై కూడా కొంచెం ఫోకస్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంతే కాకుండా కొన్ని సీన్స్ ఎంతసేపు ముందుకి కదలవు. అలా మెల్లగా నడుస్తాయి అంతే. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- ఎమోషనల్ సీన్స్
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
- సాగదీసినట్టుగా ఉంటే కొన్ని సీన్స్
- తెలిసిపోయే కథ
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
తండ్రి కొడుకులకి మధ్య సాగే ఒక ఎమోషనల్ సినిమా ఇది. ఇలాంటి ఎమోషనల్ సినిమాలని ఇష్టపడే వారికి విమానం సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుంది.
watch trailer :
ALSO READ : TAKKAR REVIEW : “సిద్ధార్థ్” హీరోగా నటించిన టక్కర్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!







మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా జల్లికట్టు డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసెరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మలయాళ, తెలుగు బాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫిలాసఫికల్ పాయింట్తో తెరకెక్కించారు. ఈ సినిమా కథ జేమ్స్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.
జేమ్స్ అనే వ్యక్తి వేలంకిని మాత దర్శనానికి తన భార్యాపిల్లలు మరియు బంధువులతో కలిసి వెళతాడు. అక్కడి నుండి బస్ లో తిరిగి వచ్చేటపుడు తమిళనాడు రాష్ట్రంలోని ఒక ఊర్లో దిగిన జేమ్స్, నేరుగా ఒక ఇంటిలోకి వెళతాడు. తెలుగు వ్యక్తి అయిన జేమ్స్ అప్పటి నుండి తమిళంలో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఆ పల్లెటూరులోని అందరిని వారి పేర్లతో పలకరిస్తూ, తన ఊరు అదే అని చెబుతాడు.
ఆ ఊరి నుండి 2 సంవత్సరాల క్రితం మిస్ అయ్యిన సుందరంలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. జేమ్స్లో సడెన్ గా వచ్చిన ఆ మార్పుకు కారణం ఏమిటి అనేది జేమ్స్ భార్య, బంధువులతో పాటు ఆ ఊరివాళ్లకు అర్ధం కాదు. జేమ్స్ ను తీసుకెళ్లడానికి భార్య, బంధువులు ఎంత ప్రయత్నించినా జేమ్స్ అంగీకరించడు. జేమ్స్ అసలు ఎందుకు అలా మారాడు? సుందరంగా మారిన జేమ్స్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు?
జేమ్స్ తన గతాన్ని తెలుసుకొని భార్యాపిల్లలతో కలిసి వెళ్లాడా? లేదా సుందరంగా ఆ ఊరిలోనే ఉండిపోయాడా అనేదే మిగతా స్టోరి. మమ్ముట్టి అటు జేమ్స్ గా, ఇటు సుందరంగా 2 క్యారెక్టర్లలోనూ జీవించాడు. ఈ రెండు పాత్రలలో మమ్ముట్టి యాక్టింగ్, వేరియేషన్స్ అద్భుతం.


ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్నారు. లంకేశ్వరుడు రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించారు. ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుండి సోషల్ మీడియా అంతా ఆదిపురుష్ వార్తలతో నిండిపోయింది.
ఈ ట్రైలర్ లో రావణాసురుడు సీతాదేవిని అపహరించిన విధానాన్ని చూసి, రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆదిపురుష్ కి మద్ధతుగా రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణంలోని రావణుడు సీతను అపహరించే వీడియోను, ఆదిపురుష్ లో అదే సన్నివేశాన్ని పొలుస్తూ ట్వీట్ చేస్తున్నారు.
సీరియల్ లో రావణాసురుడు సీతాదేవిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. కానీ ఆదిపురుష్ లో రావణాసురుడు సీతాదేవిని టచ్ చేయకుండా తీసుకెళ్లాడు. దీనిని అందరు తప్పుగా చూపించారని అంటున్నారు. సీరియల్ తో పోలిస్తే ఆదిపురుష్ కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సీతమ్మను ఎవరు టచ్ చేయలేరని కామెంట్స్ పెడుతున్నారు.





నట సింహం బాలకృష్ణ 108వ చిత్రం ప్రకటించినప్పటి నుండి ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్యను ఎలా చూపిస్తారనే ఆసక్తి అటు ఇండస్ట్రీలోనూ, ఇటు అభిమానుల్లో ఏర్పడింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోందని టాక్. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంటో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.
టైటిల్ను డిఫరెంట్ గా ప్రకటించాలని ప్లాన్ చేసిన చిత్రబృందం, రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో 108 హోర్డింగ్లను పెట్టి మూవీ టైటిల్ ను ప్రకటించింది. అయితే ఈ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ భగవంత్ కేసరి కాదంట. ‘బ్రో ఐ డోంట్ కేర్’ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూవీకి టైటిల్ ‘బ్రో’ అని ఫిక్స్ చేశారు. దాంతో ఆ టైటిల్ ను పక్కనపెట్టి ‘భగవంత్ కేసరి’ ఫైనల్ చేశారంట.
ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడి పాత్ర పోషించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి తరచు ఈ మూవీ పై ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కార్టూన్ సినిమా అని ట్రోల్స్, కామెంట్స్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఈ మూవీ పై విపరీతమైన నెగటివిటి స్ప్రెడ్ అయ్యింది. దీంతో మేకర్స్ విజువల్స్ గ్రాఫిక్స్ పై మరింత దృష్టి పెట్టారు. ఈ కారణంగానే సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైంది.
ఆ తరువాత రిలీజ్ చేసిన ట్రైలర్ తో విమర్శలు కాస్త తగ్గాయి. కానీ రామాయణాన్ని తప్పుగా చూపించారని మరోసారి ఆదిపురుష్ పై వివాదం మొదలైంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించింది. ఆదిపురుష్ చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ని వినూత్నంగా చేసింది. మూవీ రిలీజ్ అయిన థియేటర్లలో ఒక్క సీట్ హనుమంతుడికి కేటాయించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆదిపురుష్ మూవీ టీమ్ మాత్రం మీడియా ఇంటరాక్షన్లు మరియు ఇంటర్వ్యూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తమ చిత్రం చుట్టూ వివాదాలు రాకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లేదా ఇంటర్వ్యూలలో అడిగే కొన్ని ప్రశ్నలు వివాదానికి దారి తీస్తుండడం తెలిసిందే. అందువల్ల ఈ చిత్రం విడుదలయ్యే వరకు ఆదిపురుష్ టీమ్ నుండి ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవని తెలుస్తోంది. తమ మూవీకి ఎలాంటి వివాదాలు రాకుండా చేయడం కోసం ఆదిపురుష్ టీమ్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు.






