దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీ తెలుగు సినిమా స్టామినా ఏమిటో ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఈ మూవీ పాన్ ఇండియా పదాన్ని పరిచయం చేసింది. హీరో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చింది. భారతీయ దర్శకులలో జక్కన్నకు ప్రత్యేకతను సృష్టించింది. హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డులు సృష్టించింది.
‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజ్ అయ్యి సరిగ్గా ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. 2015 లో జులై 10న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పటి దాకా సాగిన టాలీవుడ్ సినీ గమనాన్ని మర్చేసింది. ఇది ఇలా ఉంటే బాహుబలి: ది బిగినింగ్ మూవీలో ఇంటర్వెల్ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. అయితే ముందుగా అనుకున్న సీన్ అది కాదంట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాహుబలి మూవీ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతియోశక్తి లేదు. జక్కన్న దర్శకత్వ ప్రతిభ, రెబల్ స్టార్ ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, సత్యరాజ్ ల అద్భుతమైన నటన బాహుబలి సినిమాని బ్లాక్ బస్టర్ గా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఇండస్ట్రీల రికార్డులన్నిటిని ఈ మూవీ తిరగరాసి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేసింది. బాహుబలి మూవీలో విగ్రహం పైకి లేపిన అనంతరం ఇంటర్వెల్ వస్తుంది. అయితే దర్శకుడు రాజమౌళి ముందుగా వేరే సీన్ దగ్గర ఇంటర్వెల్ వేయాలని అనుకున్నారంట.
అది ఏమిటంటే, దేవసేన ‘‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగి వచ్చాడు’ అని చెప్పినప్పుడు శివుడు నడుస్తూ ఉంటే అతడిలో నుండి అమరేంద్ర బాహుబలి రూపం వస్తుంటే ఇంటర్వెల్ రావాలి. ఈ సీన్ కన్నా ముందు శివుడు నిప్పు, గాలి, భూమి, నీరు, ఆకాశం అయిన పంచభూతాలను దాటుకుని మాహిష్మతి రాజ్యంలో అడుగుపెడతాడు. అయితే ఈ సీన్ ను జక్కన్న ఇలా తీయాలని అనుకోలేదట.
మాహిష్మతి రాజ్యంలోకి వచ్చే ముందు శివుడు మంచు కొండల్లో సైనికులతో ఫైట్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడున్న ఒక సైనికుడు శివుడిని చూసి అమరేంద్ర బాహుబలి అనుకుని, ‘ప్రభూ నన్ను ఏమీ చేయొద్దు’ అంటూ వేడుకుంటాడు. ఆ తరువాత తప్పించుకుని వెళ్ళి, బిజ్జలదేవుడికి బాహుబలి గురించి చెబుతాడు. కానీ, బిజ్జలదేవుడు నమ్మకుండా ‘బాహుబలి చనిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి మట్టిలో కలిపాం’ అని చెప్పగానే శివుడు మట్టి గోడను పగుల కొట్టుకుని ఇటువైపు రావాలి.
ఆ తరువాత ‘బాహుబలి శరీరాన్ని మంటల్లో కలిపాం’ అని చెప్పగానే శివుడు మంటలను దాటి రావాలి. ఈ విధంగా బిజ్జలదేవుడు ఒక్కో డైలాగ్ చెప్తుంటే ఒక్కో స్టేజ్ ను శివుడు దాటుకుని వచ్చేలా తీయాలని, అక్కడ ఇంటర్వెల్ వేయాలని భావించారంట. అయితే విగ్రహం పైకి ఎత్తిన తరువాత ఇంటర్వెల్ వస్తే బాగుంటుందని, బిజ్జలదేవుడి డైలాగ్స్ తొలగించారు. ఇక శివుడి మాహిష్మతికి వచ్చే సీన్స్ ను ‘నిప్పులే శ్వాసగా’ అనే పాటలా తీశాం’’ అని జక్కన్న ఒక సందర్భంలో వెల్లడించారు.
Also Read: “నిహారిక కొణిదెల-చైతన్య” విడాకుల తర్వాత మొదటి సారిగా స్పందించిన చైతన్య తండ్రి..! ఏం అన్నారంటే..?


















కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 2008లో సత్యం అనే తమిళ యాక్షన్ డ్రామా మూవీలో నటించాడు. ఈ చిత్రానికి దర్శకుడు సురేష్ కృష్ణ సహచరుడు ఎ. రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకి దర్శకుడిగా మొదటి సినిమా. ఈ మూవీలో విశాల్ తొలి సారిగా పోలీసు క్యారెక్టర్ లో నటించాడు.
లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. అయితే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని ‘సెల్యూట్’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు, అయితే ఈ మూవీ తమిళ, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరించారు. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. సెల్యూట్ మూవీ 2008లోఆగస్టు 14న విడుదలైంది.
ఈ చిత్రాన్ని విశాల్ అన్న విక్రమ్ కృష్ణ నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీలోని ఒక యాక్షన్ సీన్ ను ఇన్ స్టా ఎంటర్టైన్మెంట్ జోన్ అనే పేజీలో పోస్ట్ చేశారు. ఆ సీన్ లో విశాల్ కిక్ చేసిన బాల్ రౌడీలందరికి తగిలి, మళ్ళీ విశాల్ చేతిలో రొటేట్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఎవరో బోయపాటికి బ్రదర్ లాగా ఉన్నాడు అని కామెంట్స్ పెడుతున్నారు.












బయోపిక్ డ్రామాగా వచ్చిన “తర్లా ” ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో హుమా ఖురేషి, షరీబ్ హష్మీ జంటగా నటించారు. పూర్ణేందు భట్టాచార్య, భారతీ అచ్రేకర్, వీణా నాయర్ తదితరులు నటించారు. కథ విషయనికి వస్తే, పెద్ద కలలు కనే మిడిల్ క్లాస్ అమ్మాయి తర్లా (హుమా ఖురేషి). జీవితంలో పెద్దగా ఏదైనా సాధించాలనుకునే ఆమెకి పెళ్లి జరగడంతో సినిమా మొదలవుతుంది. వృత్తిరీత్యా ఇంజనీర్ నలిన్ (షరీబ్ హష్మీ)ని తర్లా పెళ్లి చేసుకుంటుంది.
కాలేజ్కి వెళ్లే తర్లా పెళ్లి అనంతరం వంట చేయడం ఎలా నేర్చుకుంది. అందరికి ఆదర్శంగా నిలిచే విధంగా ఆ తరువాత తన సొంత వంటల పుస్తకాలతో, భర్త సపోర్ట్ తో ఎలా ఎదిగింది అనేది స్టోరీ. హుమా ఖురేషి తర్లా దలాల్ పాత్రలో మెప్పించింది. షరీబ్ హష్మీ భార్యకు సహాయం చేసే భర్త పాత్రలో మెప్పించాడు.
మూవీలోని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. పాటలు ఫర్వాలేదు. సింపుల్ కథను చక్కగా చూపించారు. సాలు కె థామస్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. రాకేష్ యాదవ్ ప్రొడక్షన్ డిజైన్ మరియు తస్నీమ్ ఖాన్ కాస్ట్యూమ్స్ 1960-80 కాలానికి సంబంధించినవి ఉపయోగించారు. తర్లాను ఫిల్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు.