తరతరాల నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలా కొంత మంది నటులు అయితే, మరి కొంత మంది సినిమా రంగంలోనే మరికొన్ని విభాగాల్లో పని చేస్తున్నారు. అయితే, నటుల కొడుకు నటులు అవడం అనేది మనకి తెలిసిందే.
అలా ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ పేరుని సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మరొక జనరేషన్ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వస్తారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో కొంత మంది ఇప్పటికే పెద్ద వాళ్ళు కూడా అయిపోయారు.

అలా ఇటీవల ఒక హీరో కొడుకు పిక్చర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చింది. ఈ అబ్బాయిని చూశారా? ఒకవైపు నుండి ప్రభాస్ లాగా? మరొకవైపు నుండి మహేష్ బాబు లాగా ఉన్నాడు కదా? ఈ అబ్బాయిని మనం చిన్నప్పుడు చాలా సినిమాల్లో చూసాం. ఎవరో గుర్తుపట్టారా? ఈ అబ్బాయి సుధీర్ బాబు కొడుకు. సుధీర్ బాబుకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారా? ఇతను సుధీర్ బాబు పెద్ద కొడుకు. ఈ అబ్బాయి పేరు చరిత్ మానస్. ఈ అబ్బాయి భలే భలే మగాడివోయ్ సినిమాలో నాని చిన్నప్పటి పాత్రలో నటించాడు.

ఈ అబ్బాయి సర్కారు వారి పాట సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో కూడా నటించాడు. ఇటీవల చరిత్ మానస్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఈ ఫోటోలు చూసిన వాళ్ళు అందరూ కూడా హైట్ లో జూనియర్ ప్రభాస్, ఫేస్ ఫీచర్స్ లో జూనియర్ మహేష్ బాబులాగా ఉన్నాడు అని అంటున్నారు. అయితే మరో మూడు సంవత్సరాల తర్వాత చరిత్ మానస్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన చరిత్ మానస్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు. బయట ఈవెంట్స్ కి చాలా దూరంగా ఉంటారు. ఇలా ఎప్పుడైనా కనిపిస్తూ ఉంటారు.

1. ఉప్పెన:
2. వాల్తేరు వీరయ్య:
3. దేవర:
4. తండేల్:
5. ఓజీ: 
2000 సంవత్సరంలో మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ మూవీ ‘అరయన్నంగళ్ వీడు’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఆ తరువాత పరదేశి సినిమాకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డ్ అందుకున్నారు. మలయాళంలో సాధించిన విజయంతో ఆమెకు కన్నడ సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి.
ఇప్పటివరకు లక్ష్మి దాదాపు 40 మలయాళ చిత్రాల్లో నటించింది. మమ్ముట్టి, మోహన్లాల్, సురేశ్ గోపి, జయరామ్ వంటి సూపర్ స్టార్లందరితో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సైరా నరసింహ రెడ్డి మూవీలో కూడా నటించారు. ఆ తరువాత ఆమె టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, మలయాళ, తమిళ భాషలలో పలు సీరియల్స్ లో కూడా నటించారు. తెలుగులో 2014 లో ఇటీవీలో ప్రసారం అయిన శ్రీవేంకటేశ్వర కల్యాణం సీరియల్ లో శ్రీదేవిగా నటించారు. ఆమెకు నటనతో పాటు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ మూవీ జనవరి 12 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు అటు అభిమానుల నుండి ఇటు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ట్రైలర్ చూసిన చాలామంది మరో సినిమాతో పోలుస్తున్నారు. కొందరు కీర్తికిరీటాలు అనే నవలతో పోలుస్తున్నారు.
ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారంగా, వసుంధర (రమ్యకృష్ణ), ఆమె పెద్ద కుమారుడు రమణ (మహేశ్బాబు)ను చిన్నతనంలోనే విడిచిపెడుతుంది. వారిద్దరి మధ్య సంబంధాలు తెగిపోవడంతో రమణ అనాథగా పెరుగుతాడు. కొన్నేళ్ల అనంతరం ఊహించని పరిస్థితులలో తల్లి కొడుకులు కలుస్తారు. ఆమెకు ఎదురైన ప్రాబ్లమ్స్ ని రమణ తీరుస్తాడా? ఇద్దరికీ నిజం తెలిసిందా? అనేది కథ. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్తోనే 2005లో మలయాళ మూవీ రిలీజ్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా వచ్చిన మూవీ పేరు ‘రాజమాణిక్యం’. హీరో రాజమాణిక్యాన్ని తండ్రి చనిపోవడంతో చిన్నతనంలోనే, తల్లి ముత్తులక్ష్మి విడిచిపెడుతుంది.
బిజినెస్ మెన్ రాజారత్నం పిళ్లైని వివాహం చేసుకుంటుంది. అయితే తల్లిని వెతుకుతూ రాజమాణిక్యం రాజారత్నం ఇంటికి వెళ్తాడు. కానీ ముత్తు లక్ష్మి అతన్ని కొడుకుగా ఒప్పుకోదు. రాజారత్నంకు ఈ నిజం తెలియడంతో రాజమాణిక్యంను ఆదరస్తాడు. కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. 2008 దాకా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. గుంటూరు కారం ట్రైలర్ లో దాదాపు మమ్ముట్టి మూవీ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టోరీనేనా? కాదా అనేది తెలియాలి అంటే జనవరి 12 దాకా వేచి చూడాల్సిందే.

నటుడు, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ, వాసుకీ ఆనంద్ సాయి లీడ్ రోల్స్ లో నటించిన ’90స్’ వెబ్ సిరీస్ జనవరి 4న ఈటీవీ విన్ లో రిలీజ్ అయ్యింది. మధ్యతరగతి జీవితాల పై తెరకెక్కిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నటించిన వారంతా తమ పాత్రలలో చక్కగా నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శివాజీ చిన్న కొడుకు ఆదిత్యగా నటించిన బాల నటుడికి మరింత గుర్తింపు లభించింది.
ఆ అబ్బాయి పేరు రోహన్ రాయ్. రోహన్ సీరియల్స్, సినిమాలలో నటిస్తున్నాడు. కళ్యాణ వైభోగమే సీరియల్ ద్వారా బిల్లితెర పై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ కోసం ఆడిషన్స్ కి తల్లితో పాటుగా వెళ్ళగా ‘చారు కేశ’ అనే పాత్రకు ఎంపిక అయ్యాడు. ఈ పాత్రలో నటించి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత టాలీవుడ్ కూడా అడుగుపెట్టాడు. అలా రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’మూవీలో కనిపించాడు.
రోహన్ రాయ్ సినిమాలు, సీరియళ్లలో నటిస్తూ బిజీగా మారాడు. ఇక ’90స్’ వెబ్ సిరీస్ తో డిజిటల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్ లో చదువు ఎక్కని ఆదిత్య క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. అమాయకత్వంతో కనిపిస్తూ, కామెడీతో నవ్విస్తూ, కొన్ని సీన్స్ లో కంటతడి పెట్టించాడు. రోహన్ పై ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతోన్న దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఆచార్య మూవీతో డిజాస్టర్ అందుకున్న కొరటాల ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. తాజాగా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
కొరటాల నుండి ఇప్పుటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ సోషల్ మెసేజ్ టైప్ లో ఉంటాయి. కానీ దేవర మాత్రమే మొత్తం మాస్ ఉంది. స్టోరీ చెప్పకుండా దేవర ప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేశారు. ఓడలతో పాటు రక్తంతో నిండిన సముద్రం, నెవ్వర్ బిఫోర్ అనే విధంగా మాస్ పాత్రలో ఎన్టీఆర్ ఊచకోత కోసాడు. ఓ షాట్ లో ఆఫ్ మూన్ ఉండగా, నెక్స్ట్ షాట్ లో ఇంకో హాఫ్ మూన్ బ్లడ్ తో కలిసి ఫుల్ మూన్ గా కనిపిస్తుంది. ఈ షాట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ యాక్టింగ్ రేంజ్ ఏంటో పాన్ ఇండియా లెవెల్ లో అందరికి తెలిసింది. ఇప్పుడు దేవరతో ఎన్టీఆర్ రేంజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు యంగ్ టైగర్ ట్యాగ్ తో ఉన్న ఎన్టీఆర్, ఈ మూవీతో “మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్” ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.

