మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా మారిన వ్యక్తి. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి తర్వాత మెగాస్టార్ గా ఎదిగిన ఈ స్టార్ తన డాన్సులతో ఒక తరాన్ని ఉర్రూతలూగించాడు. కేవలం ఒక తరహా సినిమాలకు ఫిక్స్ అవ్వకుండా అన్ని రకాల క్యారెక్టర్లు నటించి మెప్పించాడు చిరంజీవి.

అయితే సినిమా కోసం సినిమాలో పాత్రలు డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా సిద్ధపడేవాడు చిరంజీవి.అందుకు ఉదాహరణగా ఈ సంఘటన చూద్దాం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 1997లో అంజి అనే సినిమాని ప్రారంభించారు నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి. అప్పట్లోనే ఈ సినిమాని భారీ బడ్జెట్లో ప్లాన్ చేశారు శ్యాంప్రసాద్ రెడ్డి. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ని చాలా అద్భుతంగా చూసేవారు ప్రేక్షకులు. ఆ రోజుల్లోనే 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 2004లో విడుదల అయింది.
సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ ని ఉపయోగించారు. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో చిరంజీవి మాసిపోయిన చొక్కాతో కనిపించాలి అయితే కేవలం క్లైమాక్స్ సీన్ తీయటానికి కోడి రామకృష్ణ కి రెండు సంవత్సరాలు పట్టింది. దీంతో చిరంజీవి రెండు సంవత్సరాలు ఉతకకుండా ఒకే షర్ట్ ని వేసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాసిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత అరుంధతి సినిమాతో కోలుకున్నారు అది వేరే విషయం కానీ ఒక సినిమా కోసం అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఒక చొక్కాని రెండేళ్లు వాడటం అనేది మామూలు విషయం కాదు. డెడికేషన్ అంటే అది అంటూ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజెన్స్.

నటుడు, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ, వాసుకీ ఆనంద్ సాయి లీడ్ రోల్స్ లో నటించిన ’90స్’ వెబ్ సిరీస్ జనవరి 4న ఈటీవీ విన్ లో రిలీజ్ అయ్యింది. మధ్యతరగతి జీవితాల పై తెరకెక్కిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నటించిన వారంతా తమ పాత్రలలో చక్కగా నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శివాజీ చిన్న కొడుకు ఆదిత్యగా నటించిన బాల నటుడికి మరింత గుర్తింపు లభించింది.
ఆ అబ్బాయి పేరు రోహన్ రాయ్. రోహన్ సీరియల్స్, సినిమాలలో నటిస్తున్నాడు. కళ్యాణ వైభోగమే సీరియల్ ద్వారా బిల్లితెర పై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ కోసం ఆడిషన్స్ కి తల్లితో పాటుగా వెళ్ళగా ‘చారు కేశ’ అనే పాత్రకు ఎంపిక అయ్యాడు. ఈ పాత్రలో నటించి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత టాలీవుడ్ కూడా అడుగుపెట్టాడు. అలా రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’మూవీలో కనిపించాడు.
రోహన్ రాయ్ సినిమాలు, సీరియళ్లలో నటిస్తూ బిజీగా మారాడు. ఇక ’90స్’ వెబ్ సిరీస్ తో డిజిటల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్ లో చదువు ఎక్కని ఆదిత్య క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. అమాయకత్వంతో కనిపిస్తూ, కామెడీతో నవ్విస్తూ, కొన్ని సీన్స్ లో కంటతడి పెట్టించాడు. రోహన్ పై ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతోన్న దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఆచార్య మూవీతో డిజాస్టర్ అందుకున్న కొరటాల ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. తాజాగా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
కొరటాల నుండి ఇప్పుటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ సోషల్ మెసేజ్ టైప్ లో ఉంటాయి. కానీ దేవర మాత్రమే మొత్తం మాస్ ఉంది. స్టోరీ చెప్పకుండా దేవర ప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేశారు. ఓడలతో పాటు రక్తంతో నిండిన సముద్రం, నెవ్వర్ బిఫోర్ అనే విధంగా మాస్ పాత్రలో ఎన్టీఆర్ ఊచకోత కోసాడు. ఓ షాట్ లో ఆఫ్ మూన్ ఉండగా, నెక్స్ట్ షాట్ లో ఇంకో హాఫ్ మూన్ బ్లడ్ తో కలిసి ఫుల్ మూన్ గా కనిపిస్తుంది. ఈ షాట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ యాక్టింగ్ రేంజ్ ఏంటో పాన్ ఇండియా లెవెల్ లో అందరికి తెలిసింది. ఇప్పుడు దేవరతో ఎన్టీఆర్ రేంజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు యంగ్ టైగర్ ట్యాగ్ తో ఉన్న ఎన్టీఆర్, ఈ మూవీతో “మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్” ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.






అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నా సామి రంగా’ జనవరి 14కి రిలీజ్ కానుంది. ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎక్కువగానే ఉంది. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీ అయలాన్ కూడా రిలీజ్ కానుంది. ఈ ఐదు సినిమాలు ఒకటి, రెండు రోజుల తేడాతో రిలీజ్ కానున్నాయి. ‘నా సామి రంగా’ రీమేక్ మూవీ అనే విషయం తెలిసిందే.
మూడేళ్ళ క్రితం మలయాళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఈ మూవీ యాంటీ క్లైమాక్స్ మూవీ. నాగార్జున ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకుని రిస్క్ చేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రీమేక్ అని తెలిసిన వెంటనే చాలామంది మలయాళ మూవీని చూశారు. ఇక మలయాళ మూవీ స్టోరీ, కథనం తెలుగుకి వర్కౌట్ కాదు. ఎందుకంటే మలయాళ మూవీలో హీరో పాత్ర చనిపోవడంతో సినిమా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఆ సీన్ ను ఏమైనా మార్చరా లేదంటే, తెలుగు ప్రేక్షకులు అలాంటి ముగింపును అంతగా ఇష్టపడరు. అలా వచ్చిన సినిమాలు ఎన్నో ప్లాప్ అయ్యాయి. గతంలో నాగార్జున నటించిన ‘స్నేహమంటే ఇదేరా’ మూవీ కూడా సాడ్ ఎండింగ్ ఉంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ అలా కాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన రీమేక్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో నాగార్జున ఇంత రిస్క్ చేయడం అవసరమా అంటున్నారు.



బిగ్ బాస్ షోకి ఎంత పాపులారిటీ క్రేజ్ ఉన్నప్పటికీ, షో చుట్టూ అదే స్థాయిలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే తరువాత చోటు చేసుకున్న ఘటనలు, రన్నర్ పై దాడి, విజేత అరెస్ట్ ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా సీజన్ 7లో పాల్గొనాలనే ఆశతో యాంకర్ స్వప్న చౌదరి డబ్బు ఇచ్చియానట్టు, కానీ తనకౌ ఛాన్స్ ఇవ్వలేదని ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె ” నా పేరు స్వప్న చౌదరి అమ్మినేని, యాంకర్ అండ్ యాక్టర్. మిస్టరీ, నమస్తే సేట్ జీ అనే సినిమాల ద్వారా ఇండస్ట్రీకి రావడం జరిగింది.
కొంతమందికి అయితే నేను తెలుసు యాంకర్ స్వప్న గా, యాక్టర్ స్వప్నగా చాలామందికి తెలుసు. నాకు బిగ్ బాస్కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నేను నిద్రపోయినప్పుడు కనే కలలో సైతం బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టే కలకంటాను. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకూ చాలా ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా పంపిస్తానని చెప్పి, నా దగ్గర నుండి రెండు లక్షల యాబై వేలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో వేసుకునే క్యాస్ట్యూమ్స్కి డబ్బులు కావాలి అని, తమ్మలి రాజు అనే వ్యక్తి రెండున్నర లక్షలు తీసుకున్నారు. అందుకు సంబంధించి బాండ్ పేపర్పై అగ్రిమెంట్ ఇచ్చారు. గత జూన్ లో డబ్బు ఇచ్చాను.
లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు కన్ఫామ్ అన్నారు. కానీ వేరే వాళ్ల నేను ట్రై చేస్తానని చెప్తే, అవసరం లేదు. నేనే పంపిస్తానని అన్నారు. డబ్బు ఎందుకని అడిగితే, పీఆర్ రేటింగ్ పెంచుకోవడం కోసం, కాస్ట్యూమ్స్ కి అని చెప్పాడు. డబ్బు తీసుకోవాడమే కాకుండా, నాతో ఫొటో షూట్ చేయించారు. అందుకు రూ. 25 వేల వరకు ఖర్చు అయ్యింది. జూన్లో డబ్బు ఇస్తే, ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నానంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఛాన్స్ రాలేదు కదమ్మా, సీజన్ 8లో పంపిస్తానని చెప్పి డబ్బు ఇవ్వలేదు. కానీ నాకు ఒక అగ్రిమెంట్ అయితే రాసి ఇచ్చారు.
ఇందులో సీజన్ 7 లో పంపలేకపోయాను. డబ్బు మాత్రం డిసెంబర్ వరకు ఇస్తానని రాయడం జరిగింది. ఇందుకోసం ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఇచ్చాను. జనవరి 6న ఇస్తానని చెప్పాడు. ఆ రోజున కాల్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో.. ప్రెస్ మీట్ పెడతావ పెట్టు అని మాట్లాడాడు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్లు ఇటువంటి చీడ పురుగుల్ని ఎంకరేజ్ చేయవద్దు. ఇలాంటి వ్యక్తులను గమనించండి. బిగ్ బాస్కి పంపిస్తాం అంటూ డబ్బులు తీసుకుని చీట్ చేస్తున్నారు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సీజన్ 8 లో అయినా నేను వెళ్ళాలి. నా అమౌంట్ నాకు రావాలి” అంటూ స్వప్న చౌదరి తన ఆవేదన వ్యక్తం చేసింది.