ఒక మహిళ కారులో ప్రయాణిస్తుండగా టైర్ పంచర్ అవడంతో కారు ఆగిపోయింది. ఆమె వద్ద స్టెఫిని ఉంది, కానీ ఆమెకు దాన్ని మార్చడం రాదు. దాంతో ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తోంది. ఆ సమయంలో సెల్ ఫోన్ కూడా పని చేయడం లేదు. దాంతో ఆమె కారు పక్కనే నిలబడి పోయింది.
చాలా సమయం తర్వాత ఒక వ్యక్తి బైక్ పై అదే దారిలో వెళ్తూ వెనక్కి వచ్చి ఆమె దగ్గర ఆగాడు. అతన్ని చూసి ఆ మహిళా భయపడింది. ఆ వ్యక్తి ఒక మెకానిక్. సాయం చేయడానికి వచ్చాను అని చెప్పడంతో ఎంతో సంతోషపడింది. కారు డిక్కీలో నుండి కావలసిన సామాను తీసుకుని టైర్ మార్చాడు. అయితే తారు రోడ్డు వలన చేతులకు కొన్ని దెబ్బలు తగిలాయి.

representative image
ఆమె కొంత డబ్బులు ఇవ్వబోయింది. అయితే అతను డబ్బులు తీసుకోలేదు. మీకు సహాయం చేయాలనిపిస్తే కష్టాల్లో కనిపించిన వారికి నా పేరు చెప్పి సహాయం చేయండి అని చెప్పాడు. కొంత దూరం వెళ్లాక ఆకలి వేయడంతో హోటల్ కి వెళ్ళింది. అక్కడ ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది. అయితే ఆమెను చూసి ఎంతో బాధ కలిగింది.
అవసరం ఉంటే కానీ ఆమె పనిచేయదు కదా అని భావించి భోజనం అయ్యాక వెయ్యి రూపాయలు టేబుల్ పై పెట్టి వెళ్ళిపోయింది. మహిళ తిరిగి వచ్చి చూసేసరికి ఒక గ్లాసు కింద నాలుగు వెయ్యి నోట్లు తో పాటుగా ఒక కాగితం ఉంది. నీకు ఎంతో అవసరం ఉంటే కానీ ఈ విధంగా పని చేయవు కదా, నాకు ఒకరు సహాయం చేశారు దాన్ని తలుచుకుంటూ నేను నీకు సాయం చేసి ఆనందిస్తున్నాను. నువ్వు కూడా ఇదే విధంగా సహాయం చేయాలని కోరింది.

ఆ హోటల్ లో పని చేసే మహిళ ఇంటికి వెళ్లి, చేతులకు దెబ్బలు తగిలించుకున్న భర్త తో మన కష్టాలు తీరిపోయాయి, భగవంతుడు మనకు సాయం చేశారు అని చెప్పింది. అంటే మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎప్పటికీ వృధా అవ్వదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సాయం మనకు దక్కుతుంది.
NOTE: All the images used in this article are just for representative purpose only. But not the actual characters



















1. ప్రేమ పెళ్లి:
2. పెద్దలు కుదిర్చిన పెళ్లి:
ప్రేమించి వివాహం చేసుకున్నా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా కూడా ఆ బంధం అనేది నిలబడాలంటే అది ఆ భార్యా భర్తల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య ఉండే నమ్మకం, ప్రేమానురాగాలు పెళ్లి నిలబడడంలో కీలక పాత్రను పోషిస్తాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ క్రింది వీడియో చూడండి..



అయితే అదే టైమ్ కి , డిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ రూమ్లో నారాయణ్ ఆప్టే, నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే నిద్రలో ఉన్నారు. బిర్లా హౌజ్ లో గాంధీ అల్పాహారం చేసిన తరువాత, తనని కలిసేందుకు వచ్చిన ఓల్డ్ ఫ్రెండ్ రుస్తమ్ సోరాబజీతో కొంత సమయం మాట్లాడారు.ఆ తరువాత డిల్లీలో ముస్లిం నాయకులను కలిసి ‘మీ సమ్మతి లేకుండా వార్ధా వెళ్ళలేను’ తెలిపారు.
గాంధీజీని ఆయన సన్నిహితులు ప్యారేలాల్, సుధీర్ ఘోష్ లండన్ టైమ్స్లో ప్రచురించిన ‘నెహ్రూ, పటేల్ మధ్య అభిప్రాయబేధాలు’ అనే వార్త గురించి మాట్లాడమని కోరారు. అందుకు గాంధీజీ సాయంకాలం ఈ విషయం గురించి వారిద్దరి ముందు ప్రస్తావిస్తానని అన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో వల్లభాయ్ పటేల్, తన కుమార్తె మనుబెన్తో పాటు గాంధీని కలిసారు. వారు ప్రార్థనా టైమ్ 5 గంటల దాటే వరకూ సంభాషించారు. అయితే మరో వైపు బిర్లా హౌస్కి గాడ్సే, అతని స్నేహితులు టాంగాలో బయలుదేరారు. హౌస్కి 2 వందల గజాల దూరంలో టాంగా ఆపి, అక్కడే దిగారు.
ఎడమవైపున ఉన్న నాథూరామ్ గాడ్సే, గాంధీజీ వైపుకి చూసి వంగడంతో, ఆయన పాదాలకు గాడ్సే నమస్కరిస్తాడేమో మనుబెన్ భావించింది. కానీ గాడ్సే మనుని విసురుగా తోసుకుంటూ ముందుకి వెళ్ళాడు. దాంతో ఆమె చేతిలోని మాల, బుక్ కిందపడిపోయాయి. ఆమె వాటికోసం కిందకు వంగారు. సరిగ్గా ఆ సమయంలో గాడ్సే పిస్టల్ తీసి వరుసగా మూడు సార్లు గాంధీ ఛాతీ పైన, పొట్ట పైన కాల్చాడు. గాంధీజీ నోటి వెంట రామ్….రా…మ్” అనే మాటలు వచ్చాయి. మరుక్షణంలో గాంధీజీ శరీరం నేలకొరిగింది.