హిందూవులు ఎన్నో సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తుంటారు. వాటిలో మరణించినవారిని ఊరేగించడం అనేది ఎప్పటి నుండో ఉన్న సంప్రదాయం. శవయాత్ర నిర్వహిస్తున్న సమయంలో డప్పులు వాయిస్తూ, బాణాసంచా పేల్చుతూ ఘనంగా మరణించిన వారికి ఆఖరిసారిగా వీడ్కోలు పలుకుతుంటారు.
అది మాత్రమే కాకుండా చాలా మంది శవయాత్రకు ముందు డ్యాన్స్ చేస్తుంటారు. శవయాత్రలో భాగంగా మరణిచిన వారి పై మరమరాలు చల్లడం, పూలు చల్లడం, డబ్బులు చల్లడం కూడా చేస్తుంటారు. అయితే డబ్బులు శవం పై ఎందుకు చల్లుతారు అనే విషయం చాలామందికి తెలియదు. ఇదే ప్రశ్నని కోరాలో అడుగగా ఒక యూజర్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..
మరణించిన వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించినప్పటికీ, చనిపోయిన తరువాత వారు ఒక్క రూపాయిని కూడా తీసుకెళ్లలేరు అని చెప్పడానికే ఇలా డబ్బులు చల్లుతారు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే కాబట్టి న్యాయంగా, ధర్మంగా జీవించమని చెప్పడానికి కూడా ఇలా చేస్తారని కొందరు చెబుతారు. ఏ ప్రశ్నకైనా జవాబు దొరికే కోరాలో వెంకట రమణ సూరంపూడి అనే యూజర్ “చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు?” అనే ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు.
“చనిపోయినవారి అంతిమయాత్రలో డబ్బులు చల్లటం అనేది పది, పదిహేను సంవత్సరాల నుంచే చూస్తున్నాం. ఇలా చల్లిన డబ్బులను ఎక్కువగా యాచకులు, చిన్నపిల్లలు ఏరుకుంటారు. ఈ విధంగా చేస్తే, నిరుపేదలకు మరణించిన వారి పేరు మీదుగా సహాయం చేశామనే తృప్తి వారి కుటుంబసభ్యులకు వుంటుంది. శవ యాత్రలో పూలు, పేలాలు చల్లటం వంటివి చాలా కాలం నుండి వుంది.
పూలు చల్లడం అంటే మరణించిన వారిని గౌరవించడం, దేవునిగా భావించడం కావచ్చు. పేలాలు చల్లడం వల్ల పక్షులు, క్రిమి కీటకాలకు ఆహారం వేసినట్టు భావన. ఇవి మనుషులకు కాదు అనడానికి గుర్తుగా ‘ హాస్యబ్రహ్మ ‘ జంధ్యాల గారు ఓ సినిమాలో ” శవం మీద పేలాలు ఏరుకుని తినే మొహం” అంటూ ఓ తిట్టు చేర్చారు!” అని వెంకట్ రమణ సూరంపూడి తెలిపారు.
Also Read: “బేబీ” సినిమా గురించి… ఈ నెటిజన్ పోస్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!






















కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లాకు చెందిన ఒక మహిళ భర్త నుండి డైవర్స్ తీసుకుంది. అయితే తనకు వస్తున్న భరణంలో కోత పెట్టారని ఆ మహిళా పిటిషన్ వేసింది. ఇటీవల ఈ పిటిషన్ ను కర్ణాటక న్యాయమూర్తి అయిన రాజేంద్ర విచారించారు. ఈ క్రమంలో తీర్పు చెబుతూ, గతంలో జాబ్ చేసిన భార్యలు ఖాళీగా ఇంట్లో ఉండకూడదని, భర్త ఇచ్చే భరణం పైనే పూర్తిగా ఆధారపడకుండా ఆ మహిళ ఏదైనా జాబ్ చేసుకుంటూ బతకాలని కర్ణాటక హైకోర్టు సూచించింది.
సదరు మహిళ పిటిషన్ ను విచారించిన జడ్జి, మాజీ భర్త ఎందుకు తనకు అదనంగా భరణం ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు ఆ మహిళ సరైన సమాధానం చెప్పలేదు. భరణం అందుకోవడానికి ఆమె ఉన్న అవసరాలు ఏమిటో చెప్పాలని అడిగింది. వివాహనికి ముందు జాబ్ చేసావు మరి పెళ్లి అయిన తరువాత ఎందుకు జాబ్ చేయలేక పోయావని కోర్టు ప్రశ్నించింది.
కానీ సదరు మహిళ ఏం సమాధానం చెప్పలేకపోయింది. పెళ్ళికి ముందు జాబ్ చేసిన మహిళ వివాహం తర్వాత జాబ్ మానేసి పూర్తిగా భర్త సంపాదన పైనే ఆధారపడింది. భార్య లీగల్ గా బ్రతుకు దెరువు కోసం ఏదైనా ఉద్యోగం చేయాలని, భర్త నుండి కేవలం సపోర్టివ్ మెయింటెనెన్స్ తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది.


డెలివరీ తరువాత మహిళ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ లో మార్పులు వస్తాయి. శారీరక పెయిన్స్ ఉంటాయి. డెలివరీ నుండి కోలుకోవాలంటే మానసిక స్థైర్యం చాలా ముఖ్యం. సింపుల్ గా అనిపించినా ఇది ఎంతో ముఖ్యమైన విషయం. ఎందుకంటే మహిళల ఆలోచనలే వారి శరీరంలో హార్మోన్స్ మార్పులకు కూడా కారణం అవుతాయి. కాబట్టి డెలివరీ అయ్యక ఒత్తిడికి గురి కాకూడదు. స్థిమితంగా ఉండాలి.
నాకు మాత్రమే ఎందుకు ఈ సమస్య అనుకోవద్దు. నేను ఇలాగే పుట్టానని, అందరికి పిల్లలు పుట్టారని, వారు కూడా ఇలాగే పెరుగుతారని అనుకోవాలి. బేబీ కేర్ పై దృష్టి పెట్టాలి. అన్నిటికీ ఇంటర్నెట్ సహాయం తీసుకోవద్దు. ప్రతి దానికి భయపడకూడదు. అలా అని చెప్పి పిల్లల్ని బయట తిప్పకూడదు. సమయానికి పడుకోవాలి. అది కూడా బేబీ పడుకున్న సమయంలోనే పడుకోవాలి. లోకంలో అందరు ఇలానే ఉంటారని అనుకోవాలి.ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే బిడ్డ విషయంలో కాస్త దైర్యంగా ఉంటుంది. కాబట్టి డెలివరీ ముందు నుండే మానవ సంబంధాలు పెంచుకోవాలి.
అలా ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడే కొన్ని విషయాలలో నెమ్మది, మరి కొన్ని విషయాలలో సలహాలు, సూచనలు లభిస్తాయి. బిడ్డను ఎలా చూసుకోవాలనే విషయాలు కూడా అనుభవజ్ఞులైన వారు చెబుతూ ఉంటారు. డెలివరీ అయిన మహిళలకు భర్తతో పాటుగా, కుటుంబ సభ్యుల మద్ధతు కూడా దొరికినపుడే వారు ఈ సమస్యల నుండి త్వరగా బయటికి రాగలుగుతారు.
దాంతో క్రమంగా ముఖేష్ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఆఖరికి ముఖేష్ ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఇక ఈ యాడ్ చేయడం కోసం కొంతమంది ముఖేష్ దగ్గరికి వెళ్లి అడిగిన సమయంలో ముఖేష్ మాట్లాడే కండిషన్ లో లేడు. ఆఖరికి ప్రకటన చేయడానికి అంగీకరించాడు.
ముఖేష్ అతి కష్టం మీద గుట్కా తినకూడదని, గుట్కా తినకూడదని, మానేయమని తన కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు తనకు చెప్పారని,కొన్ని సందర్భాల్లో మా అమ్మ నన్ను కొట్టింది గుట్కా మానేయమని చెప్పింది. కానీ అప్పుడు ఎవరి మాట వినలేదు అని ముఖేష్ చెప్పడం జరిగింది. తాను ఆ విధంగా చెప్పడం వల్ల కొందరయినా మారుతారనే ఉద్దేశ్యంతో ముఖేష్ ఈ ప్రకటన చేయడానికి అంగీకరించాడట.
అతను 2009లో కన్నుమూశారు. అతను మరణించిన తరువాత 2011 నుండి ముఖేష్ యాడ్ ని ఉపయోగించడానికి ‘నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఏరాడికేషన్ సంస్థ’ అనుమతిని ఇచ్చింది. అప్పటి నుండి ప్రసారం అయిన ఈ యాడ్ 2013 దాకా కొనసాగించారు. తనలా మరొకరు మరకూడదు అనే మంచి ఉద్దేశ్యంతో మాట్లాడలేని స్థితి అయినప్పటికి ఈ ప్రకటన చేసిన ముఖేష్ ను చూసి అయినా ఇటువంటి చెడు అలవాట్లకు అందరు దూరంగా ఉంటే చాలా మంచిది.